ఏపీ: అమరారెడ్డినగర్ కాలనీ వాసుల పిటిషన్‌పై హైకోర్టులో విచారణ | AP High Court Hearing On Amara Reddy Nagar Colony Residents Petition | Sakshi
Sakshi News home page

ఏపీ: అమరారెడ్డినగర్ కాలనీ వాసుల పిటిషన్‌పై హైకోర్టులో విచారణ

Jul 23 2021 2:49 PM | Updated on Jul 23 2021 3:03 PM

AP High Court Hearing On Amara Reddy Nagar Colony Residents Petition - Sakshi

తాడేపల్లి అమరారెడ్డినగర్ కాలనీ వాసుల పిటిషన్‌పై హైకోర్టు శుక్రవారం విచారణ జరిపింది. 245 మందికి స్థలాలు కేటాయించామని హైకోర్టుకు ప్రభుత్వం తెలిపింది.

సాక్షి, అమరావతి: తాడేపల్లి అమరారెడ్డినగర్ కాలనీ వాసుల పిటిషన్‌పై ఏపీ హైకోర్టు శుక్రవారం విచారణ జరిపింది. 245 మందికి స్థలాలు కేటాయించామని హైకోర్టుకు ప్రభుత్వం తెలిపింది. లబ్ధిదారులకు నష్ట పరిహారం కూడా చెల్లించామని ప్రభుత్వం పేర్కొంది. ఇళ్లు ఖాళీ చేసేందుకు పిటిషనర్లు రెండు నెలలు సమయం కోరగా, వారి అభ్యర్థనను హైకోర్టు తిరస్కరించింది. రెండు వారాల్లో ఇళ్లు ఖాళీ చేయాలని హైకోర్టు ఆదేశించింది.

Advertisement
 
Advertisement
Advertisement