AP Govt: లాయర్ సిద్ధార్థ్‌ లూథ్రాకు రూ.2.86 కోట్లు చెల్లింపు | AP Govt Released Payment of Rs 2 86 crore to Siddharth Luthra | Sakshi
Sakshi News home page

AP Govt: లాయర్ సిద్ధార్థ్‌ లూథ్రాకు రూ.2.86 కోట్లు చెల్లింపు

Mar 28 2025 6:01 PM | Updated on Mar 28 2025 6:36 PM

AP Govt Released Payment of Rs 2 86 crore to Siddharth Luthra

విజయవాడఛ  కూటమి సర్కారు కేసులు వాదిస్తున్న అత్యంత ఖరీదైన సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది సిద్ధార్థ్‌ లూథ్రాకు ఏపీ ప్రభుత్వం రూ. 2.86 కోట్లు చెల్లించింది.  ఏపీ ప్రభుత్వం కేసులు వాదించిందుకు గాను ఈ మొత్తాన్ని చెల్లించింది. హైకోర్టులో నాలుగు కేసులు వాదించినందుకు రూ. 2.86 కోట్లను ప్రభుత్వం చెల్లించింది. 

ఈ మేరకు నిధులు విడుదల చేసింది ఏపీ ప్రభుత్వం. గతంలో అవినీతి కేసులను సిద్థార్థ్ లూథ్రా వాదించిన సంగతి తెలిసిందే. చంద్రబాబు స్కిల్ స్కామ్,  అమరావతి స్కామ్ కేసులు వాదించారు సిద్ధార్థ్ లూథ్రా..  చంద్రబాబు సీఎం అయ్యాక ప్రభుత్వం తరఫున కేసులకు ఆయన్ను నియమించుకుంది కూటమి సర్కారు.

సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది సిద్ధార్థ్‌ లూథ్రా ప్రస్తుతం ఆంధ్ర­ప్రదేశ్‌లో యావత్‌ రాష్ట్ర ప్రభుత్వ వ్య­వస్థకు సూపర్‌ బాస్‌గా అవతరించారు. గతంలో చంద్ర­బాబు స్కిల్‌ కేసులో అరెస్టు కాగానే ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో విజయవాడలో వాలి­పోయిన ఆ సీనియర్‌ న్యాయ­వాది వ్యవహారం అప్పట్లోనే తీవ్ర చర్చనీయాంశమైంది. రోజుకు రూ.కోటి ఫీజుతోపాటు అదనపు ఖర్చులు వసూలు చేసే లూథ్రా ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం తరఫున కేసులు వాదిస్తున్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement