విశ్రాంత ఐఏఎస్ ప్రేమ్‌ చంద్రారెడ్డి సర్వీసు పొడిగింపు | AP Govt Issued Orders Extending Retired IAS Officer Prem Chandrareddy Srvice | Sakshi
Sakshi News home page

విశ్రాంత ఐఏఎస్ ప్రేమ్‌ చంద్రారెడ్డి సర్వీసు పొడిగింపు

Dec 30 2020 6:51 PM | Updated on Dec 30 2020 7:26 PM

AP Govt Issued Orders Extending Retired IAS Officer Prem Chandrareddy Srvice - Sakshi

సాక్షి, అమరావతి : విశ్రాంత ఐఏఎస్ అధికారి ఎల్. ప్రేమ్ చంద్రారెడ్డి సర్వీసును మరో రెండేళ్లపాటు పొడిగిస్తూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు 2023  మార్చి 31 తేదీ వరకూ సాధారణ పరిపాలన శాఖలో ఎక్స్ అఫీషియో ముఖ్యకార్యదర్శిగా సర్వీసును పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. కాగా విశ్రాంత ఐఏఎస్ అధికారి ఎల్. ప్రేమ్ చంద్రారెడ్డి ఆంధ్రప్రదేశ్ పునర్విభజనలో భాగంగా రెండు రాష్ట్రాల మధ్య ఉద్యోగుల విభజన అంశాలను పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటికే ఆయన సర్వీసును మూడు దఫాలు ప్రభుత్వం పొడగించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement