‘మారిటైమ్‌ ఇండియా’‌ సదస్సులో పాల్గొన్న సీఎం జగన్‌  

AP CM YS Jagan Participated In Maritime India 2021 Conference - Sakshi

మారిటైమ్‌ ఇండియా-2021 సదస్సు ప్రారంభం

వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సదస్సును ప్రారంభించిన ప్రధాని మోదీ

వర్చువల్‌ ద్వారా పాల్గొన్న సీఎం వైఎస్‌ జగన్‌

సాక్షి, ఢిల్లీ: మారిటైమ్‌ ఇండియా-2021 సదస్సును ప్రధాని నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మంగళవారం ప్రారంభించారు. అనంతరం మారిటైమ్ ఇండియా విజన్-2030 ఈ-బుక్‌ను ప్రధాని ఆవిష్కరించారు. ప్రారంభోత్సవ సమావేశంలో వర్చువల్‌ ద్వారా  ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, గుజరాత్ సీఎం విజయ్ రూపాని,  ఫిక్కీ ప్రతినిధులు, వివిధ దేశాల ప్రతినిధులు ఈ సదస్సులో పాల్గొన్నారు. రష్యా, అమెరికా, డెన్మార్క్, అఫ్గానిస్తాన్, ఇరాన్, ఖతార్‌ తదితర దేశాలు ఈ సదస్సులో పాల్గొంటున్నాయి. నేటి నుంచి 4వ తేదీ వరకు మారిటైమ్ ఇండియా సదస్సు  జరగనుంది.

కాగా, సదస్సులో పాల్గొనేందుకు మంచి స్పందన కనిపిస్తోందని ఇప్పటి వరకు రూ.1.70 లక్షల రిజిస్ట్రేషన్లు నమోదైనట్టు కేంద్ర ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలిపింది.పోర్టులు, షిప్పింగ్, జల మార్గాల శాఖ రూ.3.39 లక్షల కోట్ల పెట్టుబడులకు సంబంధించి అవగాహన ఒప్పందాలను (ఎంవోయూలు) రూపొందించే పనిలో ఉందని కేంద్రం ఓ ప్రకటన విడుదల చేసింది.
చదవండి:
పోలవరం మరింత వేగంగా: సీఎం జగన్‌
టీడీపీ నేత.. ఎరువుల మేత!

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top