ఆధారాలుంటే చంద్రబాబు బయటపెట్టాలి: అంబటి

Ambati Rambabu Comments Of Chandrababu Naidu Break Down - Sakshi

సాక్షి, అమరావతి: పదవి కోసం ఎంతటి నీచానికైనా చంద్రబాబు వెనుకాడరని వైఎస్సార్‌ సీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. స్వభావరీత్యా జిత్తులమారి అయిన చంద్రబాబు నాడు మామ ఎన్టీఆర్‌ను, నేడు భార్యను అడ్డుపెట్టుకుని దుర్మార్గ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. శుక్ర వారం సచివాలయంలోని మీడియా పాయింట్‌ వద్ద మీడియాతో మాట్లాడుతూ.. ‘చంద్రబాబు అర్ధాంగి భువనేశ్వరిని ఏదో అన్నామని చెబుతున్నారు. ఆమెను నేను కానీ, మా పార్టీవాళ్లు కానీ ఏమీ అనలేదు.

చేతులు జోడించి నమస్కరించి చెబు తున్నాం. మహిళలను అనే స్వభావం మాది కాదు. చంద్రబాబు రాజకీయ లబ్ధి కోసమే ఇదంతా చేసు ్తన్నారు. నాడు ఎన్టీఆర్‌ను అడ్డం పెట్టుకుని రాజ కీయాల్లో ఎదిగి, ఆయనకు వెన్నుపోటు పొడిచి సీఎం అయ్యారు. ఈ రోజు భార్యను అడ్డు పెట్టు కుని సానుభూతి పొందాలని డ్రామాలు చేస్తున్నారు. భువనేశ్వరిని అన్నట్టు ఆధారాలుంటే బయట పెట్టండి. ఈ విషయంలో భువనేశ్వరి కూడా చంద్రబాబును నిలదీయాలి.

గతంలో సీఎం జగన్‌ను టీడీపీ ఆఫీసులో ప్రెస్‌మీట్‌ పెట్టించి తిట్టించారు. ఆ సందర్భంగా జగన్‌ తనను ఎవరు.. ఏమని దూషించారో బహిరంగంగానే చెప్పారు. అదే మీ గురించి, మీ కుటుంబ సభ్యుల గురించి మేం ఏదైనా తప్పు మాట్లాడితే అసెంబ్లీలో రికార్డ్స్‌ లో ఉంటాయి కదా? బయటపెట్టండి. వాస్తవాలను కప్పిపుచ్చుతూ, సానుభూతి కోసం దిగజారొద్దు. ఇప్పటికే తెలంగాణలో కనుమరుగైన టీడీపీ ఇప్పుడు ఏపీలోనూ కనిపించకుండా పోతోంది. అందుకే ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో గుడ్డకాల్చి మాపై వేస్తున్నారు’ అని విమర్శించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top