మే 3 నుంచి ఢిల్లీకి ఎయిరిండియా సర్వీస్‌ | Air India service to Delhi from May 3 | Sakshi
Sakshi News home page

మే 3 నుంచి ఢిల్లీకి ఎయిరిండియా సర్వీస్‌

Apr 25 2022 5:07 AM | Updated on Apr 25 2022 5:07 AM

Air India service to Delhi from May 3 - Sakshi

విమానాశ్రయం (గన్నవరం): సాంకేతిక కారణాల వల్ల 2 నెలలుగా నిలిచిపోయిన ఎయిరిండియా ఉదయం విమాన సర్వీస్‌ను మే 3వ తేదీ నుంచి పునరుద్ధరించనున్నారు. ఈ విమాన సర్వీస్‌కు సంబంధించి టికెట్ల బుకింగ్‌ను కూడా ఆ సంస్థ ప్రారంభించింది. ఈ విమానం ప్రతి మంగళ, బుధ, గురు, శుక్రవారాల్లో ఢిల్లీ నుంచి ఉదయం 6 గంటలకు బయలుదేరి 8.35 గంటలకు గన్నవరం చేరుకుంటుంది. తిరిగి 9.15 గంటలకు ఇక్కడి నుంచి బయలుదేరి 11.30 గంటలకు ఢిల్లీ చేరుతుంది. జూన్‌ నుంచి ఈ సర్వీస్‌ను వారానికి 7 రోజుల పాటు నడపనున్నారు.

ప్రయాణికుల రద్దీ అత్యంత ఎక్కువగా ఉండే న్యూఢిల్లీ–విజయవాడ మధ్య గతంలో రోజుకు 3 విమాన సర్వీస్‌లు నడిచేవి. కోవిడ్‌ ప్రభావం వల్ల సాయంత్రం విమాన సర్వీస్‌ను పూర్తిగా రద్దు చేశారు. 2 నెలలు క్రితం ఉదయం సర్వీస్‌ నిలిచిపోగా, ప్రస్తుతం రాత్రి సర్వీస్‌ మాత్రమే నడుస్తోంది. దీనివల్ల టికెట్ల రేట్లు గణనీయంగా పెరగడంతో పాటు ఇక్కడి నుంచి ఢిల్లీ మీదుగా విదేశాలకు రాకపోకలు సాగించే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ విషయమై మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి పౌర విమానయాన శాఖ మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో ఎయిరిండియా సంస్థ ఉదయం సర్వీస్‌ను పునరుద్ధరిస్తూ నిర్ణయం తీసుకుంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement