వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

75th Independence Day Celebrations At YSRCP Central Office - Sakshi

జాతీయ జెండా ఆవిష్కరించిన సజ్జల రామకృష్ణారెడ్డి

సాక్షి, అమరావతి: తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి జాతీయ జెండా ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ఈ రెండేళ్లలో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామని, సీఎం జగన్‌ చేస్తున్న మంచిని మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. మంచి చేస్తున్నాం కాబట్టే.. మొన్నటి ఎన్నికల్లో కూడా వైఎస్సార్‌సీపీకి పట్టం గట్టారని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.


 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top