తిరుమల: తిరుమలలో గురువారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. క్యూకాంప్లెక్స్లోని 25 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు.సర్వదర్శనానికి 15 గంటల సమయం పడుతోంది. బుధవారం అర్ధరాత్రి వరకు 73,035 మంది స్వామివారిని దర్శించుకోగా, 27,090 మంది తలనీలాలు సమర్పించారు. హూండీల రూపంలో స్వామివారికి రూ.4.48 కోట్లు సమకూరాయి.


