కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు తన కాంట్రాక్ట్ సంస్థ ఎస్ఆర్సీ ద్వారా బీటీపీ కాలువ పూర్తి చేస్తానని ప్రజలను మభ్యపెడుతూనే ఉన్నారు. 2018 నుంచి ఆయనే కాంట్రాక్టర్. ప్రభుత్వం నుంచి నిధులు తీసుకురావడంలో విఫలమయ్యారు. పనుల పునఃప్రారంభం పేరిట నాటకాలు ఆడుతున్నారు. మట్టి అమ్ముకునేందుకే అక్కడక్కడా కాలువ తవ్వి వదిలేస్తున్నారు. నేటికీ రైతులకు పరిహారం అందలేదు. మాయమాటలను ప్రజలు నమ్మే స్థితిలో లేరు.
– గోపాల్, సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి, కళ్యాణదుర్గం


