ఉరవకొండ: అధికారం ఉంది కదా అని ఏకంగా తన కాంప్లెక్స్ కనిపించకుండా చెట్లు అడ్డువస్తున్నాయని 30 నుంచి 40 చెట్లను ఓ టీడీపీ సీనియర్ నేత నరికించేశాడు. వివరాలు.. స్థానిక శ్రీకృష్ణదేవరాయుల విగ్రహం వద్ద ప్రధాన రోడ్డు డివైడర్ మధ్యలో పంచాయతీ అధికారులు గుంతకల్లు రోడ్డు నుంచి అనంతపురం బైపాస్ వరకూ మొక్కలు నాటారు. అవి ప్రస్తుతం పెద్ద చెట్లుగా మారాయి. అయితే చెట్టు పెరగడంతో తన కాంప్లెక్స్కు అడ్డంగా మారాయని గుర్తించి అటవీశాఖ అధికారులు, మేజర్ పంచాయతీ అధికారుల అనుమతులు తీసుకోకుండా దాదాపు 20 నుండి 30 చెట్లు నరికించాడు. ఈ ఘటనపై స్థానికులు మండిపడుతున్నారు.


