పంద్రాగస్టు వేడుకలకు సర్వం సిద్ధం
అనంతపురం అర్బన్: జిల్లా వ్యాప్తంగా 80వ స్వాతంత్య్ర వేడుకలు శనివారం ఘనంగా జరగనున్నాయి. ఊరూవాడా మువ్వన్నెల జెండా రెపరెపలాడనుంది. అనంతపురంలోని పోలీసు పరేడ్ మైదానంలో వేడుకలకు జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది. ఉదయం 9.02 గంటలకు జాతీయ పతాకాన్ని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ఆవిష్కరించనున్నారు. ఆ తరువాత సాయుధ బలగాల వందన సమర్పణను స్వీకరించనున్నారు. అనంతరం ప్రజలను ఉద్ధేశించి ప్రసంగించనున్నారు. విశిష్ట సేవలు అందించిన 315 మంది ఉద్యోగులు, ఎన్జీఓ సంస్థల ప్రతినిధులకు ప్రశంసాపత్రాలు ప్రదానం చేయనున్నారు. వేడుకలకు సంబంధించిన ఏర్పాట్లను జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్ శుక్రవారం పరిశీలించి అధికారులకు తగిన ఆదేశాలు ఇచ్చారు.
స్వాతంత్య్ర
స్ఫూర్తితో...
సచివాలయాల్లో సేవలు మృగ్యం
వైఎస్సార్సీపీ పాలనలో జిల్లాలో కీలక మార్పులు


