పాయకరావుపేట నియోజకవర్గంలో నియోజకవర్గ సమన్వయకర్త కంబాల జోగులు ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు ప్రారంభమయ్యాయి. పట్టణంలో గల వైఎస్సార్ విగ్ర హం వద్ద ఏర్పాటు చేసిన దీక్షను తొలుత వైఎస్సార్ విగ్రహానికి నివాళులర్పించి దీక్షా కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ దీక్షకు జిల్లా పార్టీ అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్, వైఎస్సార్సీపీ పార్టీ రాష్ట్ర కార్యదర్శి చిక్కాల రామారావు, మాజీ ఎమ్మెల్సీ డి.వి.సూర్యనారాయణరాజు సంఘీభావం తెలియజేశారు. దీక్షలో పాల్గొన్న యువజన, యూత్ విభాగం సభ్యులకు సమన్వయకర్త కంబాల జోగులు, మాజీ ఎమ్మెల్సీ డి.వి.సూర్యనారాయణరాజు దీక్షలో కూర్చున్న వారికి పూలదండలు వేసి దీక్షలు ప్రారంభించారు.


