‘తారకరామ’ నీరు విడుదల | - | Sakshi
Sakshi News home page

‘తారకరామ’ నీరు విడుదల

Aug 5 2026 12:54 AM | Updated on Aug 5 2026 12:54 AM

మాడుగుల: మండలంలోని తాటిపర్తి వద్ద తారకరామ జలాశయం నుంచి ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి మంగళవారం సాగునీరు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఏడాది వర్షాభావ పరిస్థితుల వల్ల జలాశయాల్లో నీరు తక్కువగా ఉందన్నారు. అవసరం మేరకు పొదుపుగా వాడుకోవాలన్నారు. ఈ సందర్భంగా కొబ్బరికాయ కొట్టి సాగునీరు విడుదల చేశారు. ప్రతి నీటి బొట్టు రైతులకు అందజేయడానికి కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ పుప్పాల అప్పలరాజు, పెద్దేరు నీటి సంఘం చైర్మన్‌ అద్దేపల్లి జగ్గారవు, పుప్పాల లక్ష్మీనారాయణ, ఆయకట్టు రైతులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement