స్కీం వర్కర్లపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. ఆందోళనకు వేలాదిగా స్కీం వర్కర్లు తరలివచ్చి కలెక్టరేట్ దగ్గర ఉదయం నుంచి చేపడుతున్న ధర్నా వద్దకు కనీసం సంబంధిత అధికారి కూడా రాకపోవడం బాధాకరం. అందుకే కలెక్టరేట్ ముట్టడి చేపట్టాం. పోలీసుల అడ్డగింపులో పలువురికి గాయాలయ్యాయి. ప్రభుత్వం ఇప్పటికై నా స్పందించి కనీస వేతనాలు అమలు చేయకపోతే ఆందోళనలు తీవ్రతరం చేస్తాం.
– మజ్జి నాగశేషు,
అంగన్వాడీ జిల్లా ప్రధాన కార్యదర్శి, అనకాపల్లి


