నేరడిగొండ: అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో బీఆర్ఎస్ శాసనసభాపక్ష సమావేశం ఆదివారం ఎర్రవెల్లిలో నిర్వహించారు. పార్టీ అధినేత కేసీఆర్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశానికి బోథ్ ఎమ్మెల్యే డాక్టర్ అనిల్ జాదవ్ హాజరయ్యారు. అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహం, ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం, రాష్ట్రంలో నెలకొన్న వివిధ సమస్యలపై చర్చించాల్సిన అంశాలపై సమావేశంలో చర్చించినట్లు తెలిపారు. ప్రతిపక్షంగా ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీసేలా సమష్టిగా ముందుకు సాగాలని బీఆర్ఎస్ ఎల్పీ నిర్ణయించినట్లు పేర్కొన్నారు.


