ఏజెన్సీ ప్రాంత ఆదివాసీ గిరిజనులకు మంజూరైన ఇందిరమ్మ ఇళ్లను అటవీ అధికారులు ఫారెస్ట్ నిబంధనల పేరిట కట్టుకోనివ్వడం లేదు. టైగర్జోన్, రిజర్వ్ పరిధిలో స్థలాలున్నట్లు చెబుతుండగా నిర్మాణాలు చేపట్టలేని పరిస్థితి ఉంది. కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లగా ప్రత్యామ్నాయ స్థలాలు కేటాయించేలా చర్యలు తీసుకుంటున్నారు. ఉట్నూర్ మండలం పులిమడుగులో ఎకరం కేటాయించేలా ప్రతిపాదించారు. ఇతర చోట్ల కూడా స్థలాలు కేటాయించి నిర్మాణాలు చేపట్టేలా చర్యలు తీసుకుంటాం.
– షాకీర్, హౌసింగ్ డీఈ, ఉట్నూర్


