భౌ..బోయ్!
ఆదిలాబాద్టౌన్: విశ్వాసానికి మారుపేరుగా నిలిచే గ్రామ సింహాలు ఇప్పుడు ప్రజలు, మూగజీవాల పాలిట మృత్యుపాశంగా మారుతున్నాయి. యథేచ్ఛగా దాడులకు పాల్పడుతూ జనాన్ని ఆస్పత్రి పా లు చేస్తున్నాయి. జిల్లాలో ఇటీవల వీటి బెడద ఎక్కువైంది. చిన్నా, పెద్ద అనే తేడా లేకుండా పిక్కలు పడుతూ తీవ్రంగా గాయపరుస్తున్నాయి. మూగజీ వాలను సైతం వదలడం లేదు. ఆదిలాబాద్రూరల్ మండలంలో ఇటీవల మేకలు, గొర్రెల మందపై శునకాలు దాడి చేయడంతో అవి మృతిచెందాయి. అలాగే జిల్లాకేంద్రంలో ఓ చిన్నారి ఇంటి బయట ఆడుకుంటున్న సమయంలో వీధికుక్కలు దాడి చేశాయి. ఆ సమయంలో స్థానికులు గమనించడంతో చిన్నారి ప్రాణాలతో బయట పడింది. అయితే కుక్కలు కరిచినప్పుడు ఇచ్చే యాంటీ రెబిస్ వ్యాక్సి న్ (ఏఆర్వీ) జిల్లాలోని పలు పీహెచ్సీల్లో అందుబాటులో లేదు. సోమవారం ‘సాక్షి’ జిల్లాలోని పలు ప్రాథమిక ఆస్పత్రులను విజిట్ చేసిన క్రమంలో ఈ విషయం తేటతెల్లమైంది.
కుక్కల స్వైర విహారం..
పల్లె పట్టణం తేడా లేకుండా వీధి కుక్కలు స్వైరవిహారం చేస్తున్నాయి. దీంతో ఇంటి నుంచి అడుగు పెట్టేందుకు జనం జంకుతున్నారు. రాత్రి వేళల్లో వీటి దాడులు అధికమవుతున్నాయి. పనుల నిమి త్తం ఇతర ప్రాంతాలకు వెళ్లే వారిపై దాడి చేసి పిక్కలు పీకేస్తున్నాయి. జిల్లాలోని ఆయా గ్రామాల్లో వీటి దాడిలో పలువురికి సంబంధించిన ఆవులు, గేదెలు, మేకలు, గొర్రెలు మృత్యువాత పడిన ఘటనలూ అనేకం చోటుచేసుకున్నాయి.
జిల్లాలో ఇదీ పరిస్థితి..
కాగా, ఈ విషయమై డీఎంహెచ్వో నరేందర్ రాథోడ్ను వివరణ కోరగా.. వ్యాక్సిన్ పూర్తిస్థాయిలో అందుబాటులో ఉందని, ఎక్కడైనా లేకపోతే డ్రగ్ స్టోరేజీ నుంచి తీసుకెళ్లాలని సిబ్బందికి సూచించామని పేర్కొన్నారు.


