youth arrested
-
అమానుషం: పేకాట ఆడుతున్న చిన్నారుల దుస్తులు ఊడదీసి..
అబిడ్స్: చిన్నారుల దుస్తులు ఊడదీసి వారిని తీవ్రంగా కొట్టిన సంఘటన మంగళ్హాట్ పోలీస్స్టేషన్ పరిధిలోని అల్లాబండ గుట్టపై చోటు చేసుకుంది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనపై పోలీసులు ముగ్గురిపై కేసులు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఇన్స్పెక్టర్ రవి కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. గత నెల 29న అల్లాబండ్డ పరిసర ప్రాంతాలకు చెందిన బాలలు కొందరు పేకాట ఆడుతున్నారు. దీనిని గుర్తించిన హరికిరణ్, అమోస్, రాహుల్ అనే యువకులు పేకాట ఆడుతున్న 10 మంది పిల్లల దుస్తులు ఊడదీసి బెదిరించడమేగాక, కర్రలతో బాదారు. దీనిని గుర్తు తెలియని వ్యక్తి వీడియో తీసి మంగళవారం సోషల్ మీడియా పోస్ట్ చేయడంతో వైరల్గా మారింది. దీనిపై సమాచారం అందడంతో మంగళ్హాట్ పోలీసులు బాధిత చిన్నారుల ఇంటికి వెళ్లి వివరాలు తెలుసుకున్నారు. 6మంది పిల్లల తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడంతో హరికిరణ్, అమోస్, రాహుల్లపై కేసులు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. (చదవండి: అంతా హ్యాపీ అనుకుంటున్న టైంలో.. నటి ఆత్మహత్య) -
Karnataka: అర్ధరాత్రి.. అడవిలో రేవ్ పార్టీలు
సాక్షి,బనశంకరి(కర్ణాటక): నగర శివారులోని బన్నేరుఘట్ట అటవీప్రాంతంలో గుట్టుగా నిర్వహిస్తున్న రేవ్ పార్టీపై శనివారం అర్ధరాత్రి బెంగళూరు రూరల్ పోలీసులు దాడిచేసి ఇద్దరిని అరెస్ట్ చేసి, 30 మంది యువతీ యువకులను అదుపులోకి తీసుకున్నారు. బన్నేరుఘట్ట, తమిళనాడు సరిహద్దు గల తమ్మనాయకనహళ్లి అటవీప్రాంతం సమీపంలో గల ముత్యాలమడుగు కాలువ వద్దనున్న రిసార్టు ఆధ్వర్యంలో రేవ్ పార్టీ జరిపారు. పెద్దసంఖ్యలో యువతీ యువకులు మత్తు పదార్థాలను సేవించి అశ్లీల నృత్యాలు చేస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు దాడి చేసి పార్టీని నిలిపేశారు. అదుపులోకి తీసుకున్న వారిలో చాలామంది కేరళకు చెందినవారు. వారిలో విద్యార్థులు, ప్రైవేటు ఉద్యోగులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. పార్టీలో 60 మందికి పైగా పాల్గొనగా పోలీసులను చూడగానే కొందరు పరారయ్యారు. అదుపులోకి తీసుకున్న 30 మందికి వైద్యపరీక్షలు నిర్వహించి, డ్రగ్స్ వాడారా లేదా అనేది నిర్ధారణకు రక్త నమూనా, వెంట్రుకల పరీక్షలు చేస్తున్నారు. మోడల్స్, డీజే హంగామా నగరానికి చెందిన అభిలాష్ అనే వ్యక్తి రేవ్పార్టీ నిర్వాహకుడు. ఒక యాప్ ద్వారా టికెట్లు బుక్ చేసుకున్నారు. మోడల్స్ను, డీజేలను పిలిపించారు. శనివారం రాత్రి 8 గంటలకు పార్టీ ప్రారంభం కాగా నిర్వాహకులు అర్ధరాత్రి డీజేతో హోరు పెంచారు. చుట్టూ అడవి ఉండడంతో పార్టీ సంగతి ఎవరికీ తెలియదు. ఘటనాస్థలంలో మద్యం బాటిల్స్ను స్వాధీనం చేసుకున్నారు. ఇక్కడి రిసార్టుకు ఎలాంటి అనుమతులు లేవని తెలిసింది. యువతీ యువకుల వాహనాల్ని, డీజే సామగ్రిని సీజ్ చేశారు. అడవిలో 30 మందికి పైగా ఉడాయించగా ఆనేకల్ పోలీసులు ఆదివారం గాలింపు చేపట్టారు. చదవండి: అమృత్ సర్ విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టివేత -
మత్తుకు బానిసలవుతున్న నేటి యువత
సాక్షి, పెద్దపల్లి : బంగారు కలలతో నగరంలో అడుగుపెడుతున్న యువత మత్తు పదార్ధాల కు బానిసలవుతున్నారు.. తల్లిదండ్రుల పర్యవేక్షణ లేకపోవడం.. పట్టించుకునే వారు అం దుబాటులో ఉండకపోవడంతో సరదాగా మొదలై తర్వాత వ్యసనపరులుగా మారుతున్నా రు. నిత్యం వాటిని తీసుకోకుండా బతలేని పరిస్థితికి దిగజారుతూ జల్సాలకు అలవాటుప డి వాటికి డబ్బులు సరిపోక నేరాల వైపు మొ గ్గుచూపుతున్నారు.. అక్రమార్కులు గం జాయిని యథేచ్ఛగా సాగు చేస్తూ రహస్యంగా నగరాలకు తరలిస్తున్నారు.. దీనికి యువత అ లవాటు పడడంతో వారి పంట పండుతోంది. ఇంకా ప్రమాదకరమైన విషయమేమిటంటే మైనర్ విద్యార్థులు కూడా గంజాయికి అలవాటు కావడం అందరిని కలవరపరిచే విష యం.. ఉమ్మడి కరీంనగర్, అదిలాబాద్ జిల్లా ల సరిహద్దు ప్రాంతాల్లోని అడవులను ఆనుకు ని ఉన్న గ్రామాల నుంచి గంజాయిని నగరా లకు సరఫరా చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాటుడుతున్నారు. జగిత్యాల, మం థని, సిరిసిల్ల, గోదావరిఖని, మంచి ర్యాల డి విజన్లలో గంజాయి సాగు చేస్తున్నారని తెలి సింది. వీటిని కొనుగోలు చేస్తున్న అక్రమార్కులు కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, సిరిసిల్ల, హుజూరాబాద్, గోదావరిఖని డి విజన్లలోని పలు ప్రాంతాలకు సరఫరా చేస్తున్నారు. అక్కడ ఉన్నవారు వాటిని చిన్నచిన్న ప్యాకెట్లుగా మార్చి అమ్మకాలు చేస్తున్నారు. హుక్కాకు అ లవాటు పడినవారు కూడా గం జాయికి త్వరగా అకర్శితులవుతున్నారు. దీని కి తోడు యు వత సరదాగా గంజాయిని అలవాటు చేసుకుని చివరకు బానిసలుగా మారుతున్నారు. జిల్లాలోని పలు ప్రాంతాల్లో గం జాయితో సిగరెట్లు తయారు చేసి పలు దు కాణాల్లో ఎవరికీ అనుమానం రాకుండా వారి వద్దకు రెగ్యులర్గా వచ్చే ఖాతాదారులకు పలు కోడ్ పేర్లతో అమ్మకాలు చేస్తున్నారని తెలిసింది. బానిసలుగా మారుతున్న మైనర్లు నగరంలోని పలు ప్రాంతాల్లో గంజాయి ఇప్పటికే విచ్చలవిడిగా విస్తరించిందని సమాచారం. తిరుమలనగర్, శేషామహల్, కమాన్ ప్రాంతం, హౌసింగ్బోర్డుకాలనీ, స్టేడియం చుట్టు పక్కల, డ్యాం పరిసరాల్లో, బైపాస్రోడ్డు, నగరానికి ఆనుకుని ఉన్న గ్రామాల్లో కొందరు వ్యక్తులు గంజాయి అమ్మకాలు చేస్తున్నారని సమాచారం. నగరంలో కొందరు వ్యక్తులు ముఠాగా ఏర్పడి ఇతర ప్రాంతాల నుంచి గంజాయి తీసుకువచ్చి నగరంలోనే ప్యాకెట్లుగా మార్చి అమ్మకాలు చేస్తున్నారని వీరి వలలో పలువురు విద్యార్థులు సైతం చిక్కుకున్నారు. ఇటీవల ఓ విద్యార్థి తరచు అనారోగ్యానికి గురికావడంతో అతడిని పరీక్షించగా గంజాయికి అలవాటు పడినట్లు తెలిసింది. అతడి మిత్రులు సుమారు 20 మంది వరకు నిత్యం గంజాయి సేవనంలో మునిగితేలుతూ ఉంటారని సదరు విద్యార్థి పేర్కొనడంతో వారి తల్లిదండ్రులు అవాక్కయినట్లు సమాచారం. ఇలాంటి బ్యాచ్లు నగరంలో సుమారు 60 నుంచి 80 వరకు ఉన్నట్లు సమాచారం. అక్రమార్కులు 100గ్రా. ప్యాకెట్కు రూ.5000 ధరతో అమ్మకాలు చేస్తుండగ నిత్యం సుమారు రూ.50 వేలకు పైగా గంజాయి వ్యాపారం చేస్తున్నారని తెలిసింది. గతంలో ప్రముఖ హోటల్లో కొందరు యువతీయువకులను అనుమానాస్పదస్థితిలో అదుపులోకి తీసుకున్నప్పుడు వారి వద్ద గంజాయి లభించింది. వీరు ఎక్కడి నుంచో వచ్చి సులభంగా గంజాయిని సంపాదించారంటే ఎంత విచ్చలవిడిగా అమ్మకాలు జరుగుతున్నాయో అర్థం చేసుకోవచ్చు. పోలీసుల దాడులు.. టాస్క్ఫోర్స్ ఏర్పాటు చేసిన నాటి నుంచి గం జాయి అమ్మకాలపై ఉక్కుపాదం మోపుతోం ది. గంజాయి అమ్మకాలు, రవాణ చేస్తున్న పలువురిని అరెస్టు చేసి రిమాండ్కు తరలిం చింది. అయితే చాలా వరకు కేసుల్లో మొదట గంజాయి అలవాటు పడి తర్వాత వారు అ మ్మకందారులుగా మారుతున్నారని అధికారులు పేర్కొంటున్నారు. గతంలో గంజాయి కొ నుగోలు చేసి బానిసలుగా మారడమే కా కుండా మరికొందరిని మార్చుతున్నారు. ఇది ఒక ఫ్యాషన్గా మారుతోంది. ఇలా పలువురి విద్యార్ధులను టాస్క్ఫోర్స్ అధికారులు అరె స్టు చేశారు. సుమారు 250 మంది విద్యార్ధులు గంజాయికి అలవాటుపడ్డారని గుర్తించి వారికి కౌన్సెలింగ్ నిర్వహించారు. తాజాగా వారం క్రితం 8, 9వ తరగతి విద్యార్థులు కూ డా గంజాయికి అలవాటు పడ్డారని గుర్తిం చారు. వీరికి వెంటనే కౌన్సెలింగ్ నిర్వహించి వారి తల్లిదండ్రులకు అప్పగించారు. మొదట గంజాయికి అలవాటు పడి తర్వాత అమ్మకందారుడిగా అవతారమెత్తిన ఇంటర్ విద్యార్థిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఒక పక్క టాస్క్ఫోర్స్ దాడులు చేస్తుండడంతో గంజాయికి అలవాటు పడినవారు ఇతర ప్రాంతాలకు వెళ్లి సేవిస్తున్నారని సమాచారం. దీనిపై దృష్టి సారించాల్సిన అవసరముంది. డ్రగ్స్ కూడా.. జిల్లాలో డ్రగ్స్ మూలాలు బయటపడడం ఒక్కసారిగా సంచలనం సృష్టించింది. నగరంలో 2012 ఆగస్టు 2 కొకైన్ సరఫరా చేస్తూ ముగ్గురు విద్యార్థులు దొరికిన సంఘటన తెలిసిందె. రాష్ట్ర రాజధానిలో పోలీసుల నిఘా పెరిగడంతో కరీంనగర్ కేంద్రంగా అమ్మకాలు చేసేందుకు డ్రగ్స్మాఫియా ప్రణాళికలు సిద్ధం చేసిందని సమాచారం. ఈ మధ్యకాలంలో హైదరాబాద్లో డ్రగ్స్ ముఠాలను ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు పట్టుకున్న వారిలో కొందరు కరీంనగర్కు చెందినవారు ఉన్నారని తెలిసింది. కొందరు ఉన్నత స్థాయి విద్యార్థులు డ్రగ్స్ కోసం ఉమ్మడి జిల్లా నుంచి హైదరాబాద్కు వెళ్తున్నారని ప్రచారంలో ఉంది. ప్రకటనకే పరిమితమైన అవగాహన గతంలో డ్రగ్స్ ఆనవాల్లు బయటపడినప్పుడు వీటిపై అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలన పలువురి వ్యాఖ్యలు కేవలం ప్రకటనకే పరిమతమైనాయి. కాలేజీల్లో పెడదోవ పడుతున్న వారిపై ప్రత్యేక నిఘా పెట్టి వారికి కౌన్సెలింగ్ ఏర్పాటు చేయాలని పలువురు తల్లిదండ్రులు కోరుతున్నారు. కాలేజీల్లోని పేరెంట్స్ కమిటీ, స్టూడెంట్ కమిటీలు కూడా వీటిలో పాలు పంచుకోవడంతో పాటు పోలీసులు డ్రగ్స్ దందాకు అడ్డుకట్ట వేసేందుకు కఠినంగా వ్యవహరించాలని ప్రజలు కోరుతున్నారు.గంజాయి రవాణ, అమ్మకాలు చేయడంపై 2018లో 42 మందిపై 14 కేసులు నమోదు చేశారు. 2019లో ఇప్పటి వరకూ 15 మందిపై 7 కేసులు నమోదయ్యాయి. -
మహిళలపై పెప్పర్ స్ర్పేతో దాడి..
-
చింతలపూడి అత్యాచార ఘటనపై జిల్లా కలెక్టర్ ఆగ్రహం
-
వరుస కాదు‘అ’న్నా వినడే..!
సాక్షి, బెంగళూరు: ప్రేమించిన యువతి సోదరి అవుతుందని పెద్దలు, పోలీసులు చెప్పినా ఆ యువకుడు పట్టించుకోలేదు. ఆ యువతితోనే తనకు వివాహం జరిపించాలని డిమాండ్ చేస్తూ పోలీస్స్టేషన్ ముందు ధర్నాకు దిగాడు. ఈ ఘటన కర్ణాటకలోని బాగల్కోటే పోలీస్స్టేషన్ వద్ద గురువారం చోటుచేసుకుంది. బాగల్కోటే తాలూకా నవనగర నివాసి సాగరసుగతేకర అనే యువకుడు ఇదే ప్రాంతానికి చెందిన ఓ యువతిని గత 12 నెలలుగా ప్రేమిస్తున్నాడు. ఈ విషయంపై యువతి కుటుంబ సభ్యులు ఆరా తీయగా అతడు అన్న వరుస అవుతాడని గుర్తించి వారి వివాహానికి నిరాకరించారు. అంతేగాక సాగరసుగతేరపై బాగల్కోటే పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. యువతికి దూరంగా ఉండాలని ఆ యువకుడిని పోలీసులు హెచ్చరించారు. ఈ విషయాన్ని జీర్ణించుకోలేని సాగరసుగతేకర గురువారం పోలీస్స్టేషన్ ముందు ధర్నాకు దిగాడు. తాను ప్రేమించిన అమ్మాయిని అప్పగించకపోతే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరింపులకు పాల్పడ్డాడు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు సాగరసుగతేకరను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. -
ప్లాన్ చేసి.. అందమైన యువతిని ఎరగా వేసి..!
బెంగళూరు: రోడ్డు మీద అందమైన యువతి కనిపించిందంటే చాలు.. అటుగా వెళ్లేవారి కళ్లన్నీ ఆమెపైనే ఉంటాయి. ఇక ఆ యువతి నవ్వడం.. తనను చూసి సైగలు చేస్తే ఇంకేమైనా ఉందా..! ఇదే బలహీనతను ఓ ముఠా ఆయుధంగా చేసుకుని దోపిడీకి తెరతీసింది. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు చాకచక్యంగా వారిని అరెస్ట్ చేశారు. కర్ణాటక బేగూరులోని ఏకే కాలనీకి చెందిన మోనిషా(20), పునీత్(18), మరో అపార్టుమెంటులో ఉండే ముత్తు(19), ఏడీ కాలనీకి చెందిన తులసీరాం(22), అరుణ్ యశ్రాజ్ (22), విఘ్నేష్, స్టీఫెన్, బబ్లూ, అలెక్స్, అమర్ అనే యువత ఒక ముఠాగా ఏర్పడింది. వీరు పథకం ప్రకారం ఆకట్టుకునే కురుచ దుస్తులతో మోనిషాను నైస్ రోడ్డులోని మైలసంద్ర వంతెనకు సమీపంలోని రోడ్డు పక్కన నిల్చోమని చెబుతారు. అటుగా బైక్లపై, కార్లలో వెళ్లేవారిని చూసి నవ్వటం, సైగలు చేయటం వంటివి చేస్తుంటుంది. ఎవరైనా ఆమె వద్దకు వస్తే.. వారిని ముగ్గులోకి దించి ముఠా సూచనల మేరకు సమీపంలోని పొదల వద్దకు తీసుకెళుతుంది. అక్కడికి వెళ్లిన వెంటనే కాచుకుని కూర్చున్న గ్రూపు సభ్యులు కత్తులు, కర్రలతో దాడి చేసి మోనిషాతో వచ్చిన యువకుడి వద్ద ఉన్న నగదు, మొబైల్, ఇతర వస్తువులను లాక్కొని పంపిస్తుంటారు. ఇలా చాలా మందిని భయపెట్టి దోచుకున్నారు. కొందరు బాధితులు ఎలక్ట్రానిక్ సిటీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు ఇటీవల పథకం పన్ని రాత్రి 10.30 గంటల సమయంలో మాటువేశారు. ఈ క్రమంలో అక్కడికి వచ్చిన గ్రూపు సభ్యులు నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రెండు మొబైల్ ఫోన్లు, రెండు చాకులు, ఒక ఇనుపరాడ్డు, కత్తి స్వాధీనం చేసుకున్నారు. సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతోనే ఇలా చేశామని పోలీసుల విచారణలో మోనిషా తెలిపింది. ప్రస్తుతం మోనిషా, పునీత్, ముత్తు, తులసీరాం, అరుణ్ యశ్రాజ్ పట్టుబడగా మిగతా వారు పరారీలో ఉన్నారు. త్వరలో మిగతా నిందితులను పట్టుకుంటామని పోలీసులు చెప్పారు. -
ఆలయంలో మహిళపై కత్తితో దాడి
కర్ణాటకలో దారుణం జరిగింది. ఆలయం ప్రాంగణంలోకి చొరబడిన ఓ ముసుగు వ్యక్తి.. పెద్ద కత్తి తీసుకుని ఆలయ అధికారిణిపై దాడికి తెగబడ్డాడు. ఆమె ప్రాణభయంతో అటూ ఇటూ పరుగులు పెడుతున్నా వదలకుండా వెంటపడి మరీ దాడి చేసేందుకు దూసుకొచ్చాడు. ఈ వ్యవహారం మొత్తం సీసీటీవీ కెమెరాలో రికార్డయింది. ఎట్టకేలకు కొందరు వ్యక్తులు అతడిని పట్టుకోవడంతో ఆమెకు ప్రాణాపాయం తప్పింది. కర్ణాటక రాజధాని బెంగళూరుకు 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న కోలార్ నగరంలోని కోటిలింగేశ్వరి ఆలయంలో అడ్మినిస్ట్రేటర్గా పనిచేస్తున్న కుమారి అనే మహిళపై ఈ దాడి జరిగింది. ఇందులో ఆమె తలకు తీవ్రగాయమైంది. దాడికి పాల్పడిన సంతోష్ (24) అనే యువకుడు కూడా ఇదే ఆలయంలో పనిచేస్తున్నాడు. ఆమె కారిడార్లో నిల్చుని ఉండగా వెనకవైపు నుంచి అతడు దాడి చేసినట్లు సీసీటీవీ వీడియోలో కనిపించింది. కుమారితో ఉన్న వ్యక్తిగత వివాదం వల్లే అతడు ఈ దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడిని అరెస్టు చేశారు. -
ఆలయంలో మహిళపై కత్తితో దాడి
-
స్నానం చేస్తున్న బాలికతో సెల్ఫీ: పలువురు అరెస్ట్
12 మంది అరెస్ట్ తిరువొత్తియూరు: కొడెకైనాల్లో జలపాతం వద్ద బాలికతో సెల్ఫీ తీసుకున్న 12 మందిని పోలీసులు అరెస్టు చేశారు. తిరుచ్చికి చెందిన ఓ కుటుంబం శుక్రవారం కొడెకైనాల్కు పర్యటనకు వచ్చారు. ఆ కుటుంబానికి చెందిన 12 ఏళ్ల బాలిక స్నానం చేస్తుండగా ఆ సమయంలో అక్కడికి వచ్చిన నాగర్కోవిల్కు చెందిన పర్యాటకులు బాలికతో తమ సెల్ఫోన్లో సెల్ఫీ తీసుకున్నారు. ఆ ప్రయత్నాన్ని అడ్డుకున్న ఆ బాలిక తల్లిదండ్రులపై వారు దాడి చేసినట్లు సమాచారం. ఈ సంఘటన స్థానికంగా సంచలనం కలిగించింది. దీనిపై సమాచారం అందుకున్న కొడెకైనాల్ పోలీసులు సంఘటన స్థలం వద్దకు చేరుకుని విచారణ చేపట్టారు. బాలికలో సెల్ఫీ తీసుకున్న 12 మందిని పోలీసులు అరెస్టు చేశారు. వారిని పోలీసులు విచారిస్తున్నారు. -
బీటెక్ పరీక్ష ఇంట్లో రాస్తూ.. దొరికేశాడు!
తుర్కయంజాల్: ఫెయిల్ అయిన పరీక్ష ఎలాగైనా పాస్ కావాలని నిర్ణయించుకున్న ఓ యువకుడు అందుకు వేసుకున్న పథకాన్ని ఎస్ఓటీ పోలీసులు చిత్తు చేయడంతో, సదరు యువకునితో పాటు అతనికి సహకరించిన మరో నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటన హయత్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలో సోమవారం చోటు చేసుకుంది. సీఐ నరేందర్గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.... గడ్డిఅన్నారం ప్రాంతానికి చెందిన వినీత్గౌడ్ అన్నమాచార్య ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ 4వ సంవత్సరం చదువుతున్నాడు. మూడో సంవత్సరంలో ఒక సబ్జెక్టు ఫెయిల్ అయ్యాడు. తిరిగి పరీక్ష రాసేందుకు పరీక్ష ఫీజు చెల్లించిన అతను సోమవారం ఇనాంగూడలోని నారాయణ కళాశాలలో పరీక్ష రాయాల్సి ఉంది. ఎలాగైనా పాస్ కావాలన్న దురుద్దేశంతో వినీత్గౌడ్ తన మిత్రుడైన భరత్కు విషయం చెప్పాడు. దీంతో అతను నారాయణ కళాశాలలో గతంలో పనిచేసి మానేసిన తన స్నేహితుడు విష్ణును సాయం కోరాడు. విష్ణు నారాయణ కాలేజీ వైస్ ప్రిన్సిపాల్ వెంకటకృష్ణకు రూ.10 వేలు లంచం ఇవ్వడంతో అతను సోమవారం జరగాల్సిన పరీక్ష ప్రశ్నాపత్రాన్ని వారికి అందజేశాడు. దీంతో వారు ఇనాంగూడలోని భరత్ ఇంట్లో పరీక్ష రాయడం మొదలుపెట్టారు. అయితే ఈ విషయం ఎలాగో పోలీసులకు తెలిసిపోయింది. పక్కా సమాచారం అందుకున్న ఎస్ఓటీ పోలీసులు.. దాడులు నిర్వహించి వినీత్గౌడ్ను రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఇతడికి సహకరించిన నలుగురిని కూడా అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. వీరి వద్ద నుంచి రూ. 7,500 నగదు, హాల్టికెట్, ఆన్సర్ బుక్లెట్, ఓఎంఆర్ షీటు, నామినల్ రోల్ షీటు, అటెండెన్స్ షీటు, క్వశ్చన్ పేపర్ను సీజ్ చేశారు. -
చిన్నారిపై హత్యాచారం: యువకుడు అరెస్ట్
కరీంనగర్ : అభం శుభం తెలియని చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడడమే కాకుండా ఆ పాపను కిరాతకంగా హత్య చేసిన నిందితుడిని పోలీసులు శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి... కరీంనగర్ జిల్లా కాటారం మండలం దామెరకుంట గ్రామానికి చెందిన జక్కు వెంకటస్వామి (24) అదే గ్రామానికి చెందిన ఐదేళ్ల చిన్నారిపై అత్యాచారం చేసి... ఆ తర్వాత అత్యంత కిరాతకంగా హతమార్చాడు. దీంతో మృతి చెందిన పాప తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అందులోభాగంగా నిందితుడు వెంకటస్వామి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఆ క్రమంలో శుక్రవారం తెల్లవారుజామున నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. -
బైక్ రేసింగ్ : పోలీసుల అదుపులో యువకులు
హైదరాబాద్ : మేడ్చల్లో బైక్ రేసింగ్లకు పాల్పడుతున్న14 మంది యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని పోలీస్ స్టేషన్కి తరలించారు. సదరు యువకుల తల్లిదండ్రులకు పోలీసులకు సమాచారం అందజేశారు. ఆ క్రమంలో యువకులకు.... వారి తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ నిర్వహించారు. ఆర్థరాత్రుళ్లు ఔటర్ రింగ్ రోడ్డుపై యువకులు బైక్ రేసింగ్లకు పాల్పడుతున్నట్లు గుర్తించామని పోలీసులు తెలిపారు. -
ఫేస్బుక్లో అమ్మాయిలకు వల..బ్లాక్మెయిల్.
-
ఫేస్ బుక్ మోసగాడు
-
మావోయిస్టులకు ఆయుధాలు: యువకుడి అరెస్టు
మావోయిస్టులకు ఆయుధాలు సరఫరా చేస్తున్నారన్న ఆరోపణలతో పశ్చిమగోదావరి జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో ఓ యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నెల్లూరు జిల్లాకు చెందిన శరత్ రెడ్డి అనే యువకుడు చెన్నైలో ఎంబీఏ చదివాడు. అతడి వద్ద తుపాకి తయారీకి సంబంధించిన సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పశ్చిమగోదావరి జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో మావోయిస్టుల కదలికలు ఇటీవలి కాలంలో అంతగా లేవు. తూర్పు ఏజెన్సీతో పాటు.. ఏవోబీ ప్రాంతంలో మాత్రం కొంతవరకు అలజడి ఉండేది. అలాంటిది ఇప్పుడు ఉన్నట్టుండి పశ్చిమ ఏజెన్సీలో కూడా మావోయిస్టులకు ఆయుధాల సరఫరా లాంటి ఘటనలు బయటపడటంతో ఉలిక్కిపడుతున్నారు. -
గూగుల్ మాజీ ఉద్యోగి సల్మాన్ అరెస్ట్
-
గూగుల్ మాజీ ఉద్యోగి సల్మాన్ అరెస్ట్
హైదరాబాద్ : ఇస్లామిక్ స్టేట్ ఏర్పాటు కోసం జిహాదీ గ్రూప్లతో చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్న ఓ యువకుడిని నగర పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ముషీరాబాద్కు చెందిన గూగుల్ మాజీ ఉద్యోగి సల్మాన్ను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఐఎస్ఐఎస్ ఉగ్రవాద సంస్థలో చేరేందుకు సల్మాన్ యత్నిస్తున్నట్లు పక్కా సమాచారంతో పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. గత కొన్నిరోజులుగా సల్మాన్ కదిలికలపై పోలీసులు నిఘా పెట్టారు. అలాగే సోషల్ నెట్ వర్కింగ్ సైట్లో అతడు జరుపుతున్న సంభాషణలపై కూడా ఆరా తీశారు. చివరికి అసలు విషయం నిర్ధారణ కావటంతో సల్మాన్ను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. కాగా ఇస్లామిక్ స్టేట్ ఏర్పాటు కోసం జిహాదీ శిక్షణ తీసుకోవడానికి ఇద్దరు యువకులు మహారాష్ట్ర నుంచి ముందుగా హైదరాబాద్ వచ్చి, పోలీసులకు పట్టుబడిన విషయం తెలిసిందే. -
రేవ్ పార్టీపై పోలీసులు దాడి
-
డబ్బు కోసం కిడ్నాప్ డ్రామా
సొంత తల్లిదండ్రుల నుంచే డబ్బు గుంజేందుకు కిడ్నాప్ డ్రామా ఆడిన 22 ఏళ్ల యువకుడిని పోలీసులు అరెస్టుచేశారు. న్యూఢిల్లీలోని కిషన్ విహార్ ప్రాంతానికి చెందిన సాగర్ కుమార్ ఓ ప్రైవేటు కంపెనీలో సేల్స్మన్గా పనిచేస్తుంటాడు. మోదీనగర్లో ఉన్న తమ సోదరికి డబ్బు ఇచ్చేందుకు వెళ్లిన అతడు కిడ్నాప్ అయ్యాడని అతడి సోదరుడు సతీష్ కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అతడిని విడిపించేందుకు కుటుంబ సభ్యులు కొంత డబ్బు చెల్లించినా, తిరిగి రాలేదు. అతడికున్న మూడు మొబైల్ ఫోన్లు స్విచాఫ్ చేసి ఉన్నాయి. నలుగురైదుగురు వ్యక్తులు వచ్చి తన కళ్లకు గంతలు కట్టి తన దగ్గరున్న డబ్బు, ఫోన్లు, ఏటీఎం కార్డు తీసుకెళ్లిపోయారని సాగర్ చెప్పాడు. తన స్టేట్ బ్యాంకు అకౌంట్లో రెండు లక్షలు డిపాజిట్ చేయాల్సిందిగా కుటుంబ సభ్యులకు చెప్పాలని, లేకపోతే తనను చంపేస్తామన్నారని అతడు చెప్పాడు. దాంతో కుటుంబ సభ్యులు మర్నాడే రెండు లక్షలు వేశారు. అయితే కిడ్నాపర్లు తన చేతిని నరికేశారంటూ సాగర్ నుంచి ఫోన్ వచ్చింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సాగర్ హరిద్వార్లో ఉన్నట్లు పోలీసులకు తెలిసింది. ఎంత గాలించినా దొరకని అతడు.. చివరకు ఏటీఎం వద్ద దొరికిపోయాడు. పోలీసులు గట్టిగా ప్రశ్నించేసరికి తానే డ్రామా ఆడినట్లు అంగీకరించేశాడు. అతడి హోటల్ గది నుంచి లక్షా పదిహేను వేల రూపాయలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. -
బెంగళూరులో మరో చిన్నారిపై అత్యాచారం
భారతీయ సిలికాన్ వ్యాలీగా పేరుపొందిన బెంగళూరులో మరో ఘోరం జరిగింది. నగర శివార్లలోని తన ఇంట్లో ఏడేళ్ల బాలికపై అత్యాచారం చేసిన యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. బాధితురాలి తల్లిదండ్రులు స్థానిక పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో ముందుగా శ్రీనివాస్ అనే ఆ యువకుడిని అదుపులోకి తీసుకుని విచారించామని, అనంతరం అతడిని అరెస్టు చేశామని డీసీపీ లభు రామ్ తెలిపారు. బాలిక తల్లి ఆమెను స్కూలు నుంచి తీసుకొచ్చి, శ్రీనివాస్ ఇంట్లో వదిలిపెట్టి బయటకు వెళ్లిన తర్వాత ఈ సంఘటన జరిగిందన్నారు. బాలికను ప్రభుత్వాస్పత్రిలో చేర్చి ఆమెకు వైద్యపరీక్షలు చేయిస్తున్నారు. ఇటీవలే నగరంలోని ఓ ప్రముఖ పాఠశాలలో ఇద్దరు జిమ్ ట్రైనర్లు అత్యాచారం చేసిన సంఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఆ సంఘటన ఇంకా మర్చిపోకముందే ఈ దారుణం బయటపడింది. -
నాలుగేళ్ల బాలికపై అత్యాచారం ఆపై హత్య
వైఎస్ఆర్ కడప జిల్లా రైల్వే కోడూరు మండలం శాంతినగర్లో గురువారం దారుణం చోటు చేసుకుంది. నాలుగేళ్ల బాలికపై పొట్టి చాంద్బాషా అనే వ్యక్తి అత్యాచారం చేశాడు. అనంతరం బాలికను హత్య చేశాడు. బాలిక తల్లితండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితుడు చాంద్బాషాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
తల్లిని చంపిన యువకుడి అరెస్టు
కన్నతల్లిని పీక పిసికి చంపేసిన ఓ యువకుడిని ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. అతడు తల్లి సుమిత్ర (50)ను చంపేసి, ఆమె మృతదేహాన్ని మంచానికి ఉన్న పెట్టెలో పెట్టేశాడు. పశ్చిమ ఢిల్లీలోని వికాస్పురి ప్రాంతంలోని ఓ ఇంటి మొదటి అంతస్థులో ఆమె మృతదేహం ఆదివారం మధ్యాహ్నం కనిపించింది. అదే ఇంట్లోని గ్రౌండ్ ఫ్లోర్లో నివసించే సుమిత్ర పెద్దకొడుకు ఆమె మృతదేహాన్ని ముందుగా చూశాడు. మృతురాలి చిన్నకొడుకు రోహిత్ ఆమెతోనే కలిసి ఉండేవాడు. కానీ అతడు కనిపించకపోవడంతో పోలీసులు అతడికోసం గాలింపు మొదలుపెట్టారు. ఆదివారం రాత్రి పశ్చిమ ఢిల్లీలోని సుభాష్ నగర్లో రోహిత్ను అరెస్టు చేశారు. తల్లి తనను తరచు కొట్టేదని, అందుకే భరించలేక ఆమెను పీకపిసికి చంపేశానని అతడు అంగీకరించాడు. -
'ప్రేమ కోసం పోలీస్ అవతారం'
హైదరాబాద్ : ప్రేమ కోసం ఓ యువకుడు పోలీస్ అవతారమెత్తాడు. సినిమాను తలపించిన ఈ ఘటన హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఎంబీఏ చదివిన శ్రీకాంత్ ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నాడు. అయినా తాను ఇష్టపడిన అమ్మాయికి నచ్చలేదు. దీంతో పోలీస్ గెటప్లో వెళితే, ఆమె ఫ్లాట్ అవుతుందనుకున్నాడు. అంతే రాయల్ ఎన్ఫీల్డ్ బైకుపై పోలీసులా పోజిస్తూ ... నెచ్చలి ఎదుట ప్రత్యక్షమైయ్యాడు. పోలీస్ బాస్ అయ్యానంటూ కబుర్లు చెప్పాడు. ఇదంతా ఆమె నమ్మిందో లేదోగానీ .. ఎర్రగడ్డలో ఈ నకిలీ పోలీస్ తతంగాన్ని చూసిన అసలు పోలీసులకు ఎందుకో అనుమానం వచ్చింది. విషయం ఏంటని ఆరా తీయగా ... అసలు విషయం బయటకొచ్చింది. దాంతో నకిలీ పోలీస్ని అరెస్ట్ కేసు నమోదు చేశారు. -
మైనర్ను వేధిస్తున్న యువకుడు అరెస్ట్
తనను ప్రేమించాలంటూ మైనర్ వెంట పడుతున్న ఓ వ్యక్తిని బంజారా హిల్స్ పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. నిందితుడిపై 354 (ఏ) నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం... నగరంలో బంజారా హిల్స్ ప్రాంతంలో మైనర్ సంతోషి తల్లితండ్రులతో కలసి నివసిస్తుంది. అయితే గత కొంత కాలంగా నిరంజన్ (21) అనే వ్యక్తి తనను ప్రేమించాలంటూ సంతోషి వెంటపడుతున్నాడు. దాంతో నిరంజన్ విషయాన్నిఆ బాలిక తల్లిదండ్రులకు వెల్లడించింది. దాంతో వారు బంజారాహిల్స్ పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు నిరంజన్పై కేసు నమోదు చేశారు. అతడి కోసం గాలించి నిందితుడిని అరెస్ట్ చేసి బంజారాహిల్స్ పోలీసు స్టేషన్కు తరలించారు. -
ఆరేళ్ల బాలికపై అత్యాచారం.. యువకుడి అరెస్టు
ఆరేళ్ల బాలికపై ఆమె ఇంట్లోనే అత్యాచారం చేసిన కేసులో ఓ యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. డిసెంబర్ 31 రాత్రి అందరూ కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ సంబరాలు చేసుకుంటున్న సమయంలో ఈ దారుణం జరిగింది. వలీ అనే వ్యక్తి తన స్నేహితులతో కలిసి పార్టీ చేసుకుని తిరిగి ఇంటికి వెళ్తుండగా ముగ్గరు పిల్లలు తమ ఇంట్లో పడుకుని ఉండగా చూశాడు. ఆ ఇంట్లో అప్పటికి పెద్దవాళ్లు ఎవరూ లేరు. దీంతో ఇంట్లోకి వెళ్లి ఆ బాలికపై అత్యాచారం చేసినట్లు అర్బన్ డీఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. సంఘటన జరిగే సమయానికి బాలిక తల్లిదండ్రులు ఆలయానికి వెళ్లారని ఆయన చెప్పారు. ఈ సంఘటనపై బాలిక తల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలిక తెలిపిన పోలికల ఆధారంగా పోలీసులు వలీని అరెస్టు చేశారు. నిర్భయ చట్టంతో పాటు పలు సెక్షన్ల కింద అతడిపై కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ చెప్పారు.