అభం శుభం తెలియని చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడడమే కాకుండా ఆ పాపను కిరాతకంగా హత్య చేసిన నిందితుడిని పోలీసులు శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు.
కరీంనగర్ : అభం శుభం తెలియని చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడడమే కాకుండా ఆ పాపను కిరాతకంగా హత్య చేసిన నిందితుడిని పోలీసులు శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి... కరీంనగర్ జిల్లా కాటారం మండలం దామెరకుంట గ్రామానికి చెందిన జక్కు వెంకటస్వామి (24) అదే గ్రామానికి చెందిన ఐదేళ్ల చిన్నారిపై అత్యాచారం చేసి... ఆ తర్వాత అత్యంత కిరాతకంగా హతమార్చాడు.
దీంతో మృతి చెందిన పాప తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అందులోభాగంగా నిందితుడు వెంకటస్వామి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఆ క్రమంలో శుక్రవారం తెల్లవారుజామున నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.