-
టెక్నాలజీ.. ఈసీ ఈజీ..
సాక్షి, హైదరాబాద్: ఎన్నికలను పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించే క్రమంలో కేంద్ర ఎన్నికల సంఘం సాంకేతికతకు పెద్దపీట వేస్తోంది. ఎన్నికల ప్రక్రియలో పౌరులకు అవసరమైన ప్రతి సమాచారాన్నీ, అవసరమైతే స్పందించే సౌకర్యాన్నీ అందుబాటులో ఉంచింది. ఆన్లైన్ ద్వారా ఎన్నికల ప్రక్రియలో పాల్గొనే అవకాశం కల్పించింది. అభ్యర్థుల గుణగణాలు తెలుసుకునేందుకు ‘కేవైసీ’, ఎన్నికల నియమావళి ఉల్లంఘనలపై ఫిర్యాదు చేసేందుకు ‘సీ విజిల్’, బరిలో నిలిచే అభ్యర్థులు నామినేషన్లు, ప్రచార అనుమతుల కోసం ‘సువిధ’.. ఇలా ఎన్నో యాప్లు, వైబ్సైట్లు. వీటి ద్వారా ఓటరు నమోదు నుంచి మొదలుపెడితే ఫిర్యాదులు, నామినేషన్లు, ప్రచార అనుమతులు, కౌంటింగ్, ఫలితాల వరకూ ప్రతీదీ ఇంట్లోనే కూర్చుని తెలుసుకునే వీలుండటం గమనార్హం. ఓటు నమోదు చేసుకోండి కొత్త ఓటు నమోదు, ఓటు బదిలీ, తప్పులు సరి చేసుకునేందుకు ‘ఓటర్ హెల్ప్లైన్’ఉపయోగపడుతుంది. ఓటరు గుర్తింపు కార్డును డౌన్లోడ్ చేసుకోవచ్చు. నియోజకవర్గాల వారీగా ఓటరు జాబితాలను పొందవచ్చు. అభ్యర్థులెవరో తెలుసుకోండి నో యువర్ క్యాండిడేట్ (కేవైసీ) ద్వారా ఏ నియోజకవర్గంలో ఎంతమంది అభ్యర్థులు బరిలో ఉన్నారో తెలుసుకోవచ్చు. అభ్యర్థుల పూర్తి వివరాలతో పాటు నామినేషన్ల సమయంలో అభ్యర్థులు దాఖలు చేసే అఫిడఫిట్లు ప్రజలకు అందుబాటులో ఉంచేందుకు కేంద్ర ఎన్నికల సంఘం దీన్ని రూపొందించింది. ఇందులో అభ్యర్థి విద్యార్హతలు, నేర చరిత్ర, స్థిరచరాస్తులు వంటి సమాచారం ఉంటుంది. ‘సువిధ’తో సులభం ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు నామినేషన్ వేయడం, ప్రచార అనుమతులు పొందడం ‘సువిధ’తో సులభతరం అవుతుంది. అభ్యర్థులు ఇంట్లో కూర్చొని తొలుత ఆన్లైన్లోనే నామినేషన్ పత్రాలను దాఖలు చేయవచ్చు. ఎన్నికల కమిషన్ సూచించిన పత్రాలు ఆన్లైన్లో పొందుపర్చాల్సి ఉంటుంది. ఆస్తుల ఆఫిడవిట్ పత్రాలు, నామినేషన్ను బలపరిచేందుకు పది మంది ఇతరుల వివరాలను నమోదు చేయాలి. కావాల్సిన పత్రాలు సమర్పించిన తర్వాత నామినేషన్ దాఖలు చేసేందుకు నిర్ణీత సమయంలో స్లాట్ బుక్ చేసుకోవాలి. ‘సక్షం’తో చేయూత పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటు వేయలేని వారు ‘సక్షం’యాప్లో తమ పేర్లను నమోదు చేసుకోవచ్చు. ఆయా ఓటర్ల వివరాలను అధికారులు పరిశీలించి పోలింగ్ కేంద్రానికి తీసుకొచ్చేందుకు రవాణా సదుపాయం కల్పిస్తారు. వారికి ప్రత్యేకంగా ఒక స్వచ్చంధ సహాయకుడిని కూడా అందుబాటులో ఉంచుతారు. దివ్యాంగులకు మూడు చక్రాల కుర్చీ వంటి సదుపాయాలను సమకూరుస్తారు. అబ్జర్వర్, ఈఎస్ఎంఎస్ పోలీసులు, వ్యయ పరిశీలకుల కోసం అభివృద్ధి చేసిన యాప్ ‘అబ్జర్వర్’. ఎన్నికల పరిశీలకులు నివేదికలు సమర్పించడానికి, నియోజకవర్గానికి సంబంధించిన సమాచారాన్ని యాక్సెస్ చేయడానికి ఇది వీలు కల్పిస్తుంది. సీ విజిల్ కేసులను రిపోర్ట్ చేయడానికి అనుమతిస్తుంది. ఎలక్షన్ సీజర్ మేనేజ్మెంట్ సిస్టమ్ (ఈఎస్ఎంఎస్) యాప్లో ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించిన కేసుల వివరాలు, సీజ్ చేసిన నగదు, మద్యం, ఇతరత్రా వస్తువుల డేటాను డిజిటల్ రూపంలో పొందవచ్చు. ఉల్లంఘనలపై ఫిర్యాదు చేయండి ఎన్నికల ప్రవర్తనా నియమావళి (మోడల్ కోడ్ ఆఫ్ కండాక్ట్) ఉల్లంఘనలపై ఫిర్యాదు చేసేందుకు సీ విజిల్ ఉపయోగపడుంది. పార్టీలకు అతీతంగా ఎవరు అవినీతికి పాల్పడినా ఈ యాప్లో ఫిర్యాదు చేయవచ్చు. ఎన్నికల ప్రవర్తనా నియమావళికి భిన్నంగా ఉన్న దేనిపైనైనా ఫిర్యాదు చేయవచ్చు. డబ్బు పంపకాలు, ఉచితాలు, బహుమతుల అందజేత, రెచ్చగొట్టే ప్రకటనలు, మద్యం, మత్తు పదార్థాల పంపిణీ, ఓటర్లను ప్రభావితం చేయడం, ఎన్నికల రోజున ఓటర్లను వాహనాలలో తరలించడం లాంటివి ఫొటో, వీడియో లేదా ఆడియో రూపంలో రికార్డ్ చేసి అప్లోడ్ చేయాలి. ఫిర్యాదు చేసిన 5 నిమిషాల్లో ఎన్నికల అధికారులు రంగంలోకి దిగుతారు. దీనిపై విచారణ చేపట్టి 100 నిమిషాల్లో సదరు ఫిర్యాదులపై కచ్చితమైన చర్యలు తీసుకుంటారు. ఎప్పటికప్పుడు ‘ఓటర్ టర్నౌట్’ కేంద్ర ఎన్నికల సంఘం అభివృద్ధి చేసిన యాప్లలో ఈ ‘ఓటర్ టర్నౌట్’కీలకమైంది. రియల్ టైం డేటా ఆధారంగా రాష్ట్రం, జిల్లా, నియోజకవర్గం వారీగా సుమారు ఓటింగ్ శాతాన్ని అంచనా వేస్తారు. ఈ డేటాను సోషల్ మీడియాలో పంచుకోవడానికి వినియోగదారులకు అనుమతి ఉంది. నిర్దిష్టమైన ప్రాంతంలో ఓటింగ్ శాతాన్ని అంచనా వేసే వీలుండటంతో ఇది అభ్యర్థులకు, మీడియా సంస్థలకు ఉపయుక్తకర సాధనం. అయితే ఇది కేవలం శాసనసభ, లోకసభ, ఉప ఎన్నికల సమయాలలో మాత్రమే యాక్టివేట్ అవుతుంది. ‘నోడల్’ మేడ్ ఈజీ ఎన్నికల సమయంలో నోడల్ అధికారులు అనుమతుల ప్రక్రియను సులభతరంగా, సమర్థవంతంగా నిర్వహించడానికి ‘ఎన్కోర్ నోడల్’యాప్ ఉపయోగపడుతుంది. ఈ యాప్ ద్వారా అభ్యర్థులు, రాజకీయ పార్టీల ప్రచారానికి సంబంధించి వివిధ కార్యకలాపాలను, ర్యాలీలు, బహిరంగ సభలు వంటి వాటికి సంబంధించిన అనుమతులు జారీ చేయవచ్చు. అభ్యంతరాలు తెలపొచ్చు. పెండింగ్లో ఉన్న దరఖాస్తుల స్థితిగతులు, సమర్పించాల్సిన పత్రాలకు సంబంధించి అభ్యర్థులకు నోటిఫికేషన్ పంపవచ్చు. -
ఈ లింక్పై క్లిక్ చేయవద్దు
సాక్షి, హైదరాబాద్: భారత వాయుసేనలో చేరాలని యువతలో చాలా కలలు కంటుంటారు. ఇలాంటి కలల్నే తమకు అనుకూలంగా మార్చుకుని సైబర్ నేరగాళ్లు అనేక మోసాలకు తెరదీస్తున్నారు. ఇటువంటి మోసగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని సైబర్ సెక్యూరిటీ నిపుణులు యువతను హెచ్చరిస్తున్నారు. భారత వాయుసేనలో చేరాలంటే తాము ఇచ్చే ప్రకటనలోని లింక్పై క్లిక్ చేసి వివరాలు నమోదు చేసుకోవాలంటూ సామాజిక మాధ్యమాౖలెన ఫేస్బుక్, ఇన్స్ట్రాగామ్, ఎక్స్ వంటి వాటిల్లో సైబర్ నేరగాళ్లు నకిలీ ప్రకటనలు ఇస్తున్నారు. ఇలా అభ్యర్థుల నుంచి వ్యక్తిగత బ్యాంకు ఖాతాల వివరాలు కూడా సేకరిస్తున్నారు. ఆ తర్వాత దరఖాస్తు కోసమని, వెరిఫికేషన్ చార్జీల పేరిట డబ్బులు వసూలు చేస్తున్నారని సైబర్ సెక్యూరిటీ నిపుణులు హెచ్చరించారు. ఇలాంటి మోసపూరిత ప్రకటనలు నమ్మవద్దని వారు సూచించారు. అధికారిక వెబ్సైట్లలో మాత్రమే వివరాలు తీసుకోవాలని పేర్కొన్నారు. -
Lok Sabha polls 2024: సోషల్ మీడియా... నయా యుద్ధరంగం
ఒకప్పుడు ఎన్నికల ప్రచారమంటే గోడలపై రాతలు, పోస్టర్లు, బ్యానర్లు. ఇప్పుడా రోజులు పోయాయి. అక్కడక్కడా ఫెక్సీలున్నా అవన్నీ బడా నేతల దృష్టిలో పడేందుకు చోటా, మోటా లీడర్ల ప్రయత్నాల్లో భాగమే. ఇప్పుడు ఎన్నికల ప్రచారంలో సోషల్ మీడియాది కీలక పాత్ర. వాట్సాప్, ఇన్స్టా, ఫేస్బుక్, ఎక్స్, యూట్యూబ్... రీల్స్, షార్ట్స్, మీమ్స్.. మాధ్య మమేదైనా సరే.. ఓటరు మానసిక స్థితిని ప్రభావితం చేసే మార్గాలే! అందుకే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లను వాడుకుంటూ ప్రచారంలో దూసుకుపోతున్నారు నేతలు. ఓటర్లను ఆకట్టుకోవడానికి, ప్రచారం కోసం వారిని ఆశ్రయిస్తున్నారు. పార్టీలు తమ విధానాలను బలంగా జనంలోకి తీసుకెళ్లేందుకు సోషల్ బాట పడుతున్నాయి... కరోనా తర్వాతి ప్రపంచంలో సమాచార సాధనంగా సోషల్ మీడియా పట్ల దృక్పథమే పూర్తిగా మారిపోయింది. డేటా–సేకరణ, విజువలైజేషన్ ప్లాట్ఫాం స్టాటిస్టికా ప్రకారం ఫేస్బుక్కు భారత్లో 36.7 కోట్ల యూజర్లున్నారు. వాట్సాప్కు 50 కోట్ల మంది యాక్టివ్ యూజర్లున్నారు. వారి అభిప్రాయాలను ప్రభావితం చేయడంలో వీటితో పాటు ఎక్స్, ఇన్స్టా, వాట్సప్ చానళ్లదీ కీలక పాత్రే. అందుకే పార్టీలు ప్రచారానికి సోషల్ ప్లాట్ఫాంలను ఎంచుకుంటున్నాయి. ఫేస్బుక్లో ప్రతి పార్టీకీ జాతీయ స్థాయి నుంచి రాష్ట్ర, నియోజకవర్గ, మండల, గ్రామ స్థాయి దాకా ఓ పేజ్ ఉంది. ప్రతి రాజకీయ నాయకుడికీ ఓ సైన్యమే ఉంది. ఇక వాట్సాప్ గ్రూప్లకైతే కొదవే లేదు. ఇవి కూడా జాతీయ స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు కులాలు, మతాలవారీగా ఎప్పుడో ఏర్పాటయ్యాయి. ఈ సోషల్ మీడియా ప్లాట్ఫాంలనే ఆయుధంగా చేసుకుని బీజేపీ 2014లో అధికారంలోకి వచి్చంది. ఎక్స్లో ప్రధాని మోదీకి ఏకంగా 9.7 కోట్ల ఫాలోయర్లున్నారు. రాహుల్కు 2.5 కోట్ల మంది ఉన్నారు. పర్సనల్ అప్రోచ్.. ఎన్నికలంటే ఇంటింటికీ వెళ్లి ఓట్లగడం పాత పద్ధతి. ఇప్పుడంతా పర్సనల్ అప్రోచ్. బీజేపీ ఇటీవల వాట్సాప్ ఉన్న వాళ్లందరికీ ‘ప్రధాని నుంచి లేఖ’ పంపింది. కేంద్రం ఇప్పటిదాకా ఏం చేసింది, ఇంకా ఏం చేస్తే బాగుంటుందో చెప్పాలని పౌరులను కోరింది. ‘మై ఫస్ట్ ఓట్ ఫర్ మోదీ’ అనే వెబ్సైట్నూ ప్రారంభించింది. మోదీకి ఎందుకు ఓటేయాలనుకుంటున్నదీ చెబుతూ వీడియో చేసి పెట్టడానికి వీలు కల్పించింది. సాధారణ పౌరుడిని ప్రధానే నేరుగా అభిప్రాయం కోరడం, ఓటేయడానికి కారణాన్ని అడిగి తెలుసుకోవడం కచి్చతంగా వారి అభిప్రాయాన్ని తమకు అనుకూలంగా మారుస్తుందన్నది బీజేపీ అంచనా. రాహుల్ గాంధీ వాట్సాప్ చానల్ను కాంగ్రెసే నిర్వహిస్తోంది. అందులో రాహుల్ ప్రజలతో సంభాíÙస్తారు. వారి ప్రశ్నలకు బదులిస్తారు. ఈ వాట్సాప్ సమాచారం సర్క్యులేషన్ను జిల్లా స్థాయిలో పర్యవేక్షిస్తారు. ఎక్కువ వాట్సాప్ గ్రూపుల ద్వారా మరింత ఎక్కువ మంది ఓటర్లతో వేగంగా, మెరుగ్గా అనుసంధానం కావచ్చన్నది కాంగ్రెస్ భావన. ప్రభావశీలతపై సందేహాలూ.. సోషల్ మీడియా ప్రభావంపై అనుమానాల్లేకపోయినా ఓటర్లుగా ఫలానా పార్టీకి ఓటేసేలా ప్రభావితం చేయడంలో వాటి శక్తిపై మాత్రం సందేహాలున్నాయి. వాటి ప్రచారం తటస్థ ఓటర్ల వైఖరిలో మార్పు తేవచ్చేమో గానీ సంప్రదాయ ఓటర్లు, పార్టీ మద్దతుదారుల అభిప్రాయాలను ప్రభావితం చేయబోదని విశ్లేషకుల అంచనా. ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ అభ్యర్థి కులం, స్థానిక అనుబంధం, పార్టీకి విధేయత వంటివే సంప్రదాయ ఓటర్లను ప్రభావితం చేస్తాయంటున్నారు. అభ్యర్థి చరిష్మా, విశ్వసనీయత, పార్టీకి ప్రజాదరణ కూడా ఓటర్లను కదిలిస్తాయని విశ్లేషిస్తున్నారు. కీలకంగా ఇన్ఫ్లుయెన్సర్లు... సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు. ఎక్కువమందిని ఆకర్షించగల, ప్రభావితం చేయగల వ్యక్తులు. రీల్స్, షార్ట్స్ ప్రాచుర్యంతో వీరి ప్రాబల్యం మరింతగా పెరిగింది. ఎన్నికల్లో కూడా కీలక ప్రచారకర్తలుగా మారారు. సామాజిక మాధ్యమాల్లో 10,000 మంది ఫాలోయర్స్ ఉన్నవారిని ‘నానో’ ఇన్ఫ్లూయెన్సర్లని, లక్ష దాకా ఉంటే మైక్రో ఇన్ఫ్లుయెన్సర్లు, 10 లక్షలుంటే మాక్రో ఇన్ఫ్లుయెన్సర్లు, అంతకు మించితే మెగా ఇన్ఫ్లుయెన్సర్లని అంటారు. గ్రామీణ ప్రాంతాల్లో మైక్రో ఇన్ఫ్లూయెన్సర్లు కీలకంగా మారారు. ముందున్న బీజేపీ.. 2024 సార్వత్రిక ఎన్నికల వేళ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లకు డిమాండ్ పెరిగింది. పార్టీలు వారికి ప్రధాన ఖాతాదారులుగా మారుతున్నాయి. ఈ విషయంలో బీజేపీ ముందుంది... ► ప్రభుత్వ పథకాలపై కంటెంట్ కోసం సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్స్తో కలిసి పని చేయడానికి నాలుగు ప్రైవేట్ ఏజెన్సీలను ఎంపిక చేసినట్టు కేంద్ర సమాచార, ప్రసార మంత్రి అనురాగ్ ఠాకూర్ పార్లమెంటుకు తెలిపారు. ఇదంతా బీజేపీకి లబ్ధి చేసేదే. ► వివిధ ప్రాంతాల్లో ఇన్ఫ్లుయెన్సర్లతో బీజేపీ 50కి పైగా సమావేశాలను ఏర్పాటు చేసింది. మోదీ నేతృత్వంలో మంత్రులు కూడా ప్రధాన చానళ్లకు బదులు పాడ్కాస్ట్ షోలు, యూట్యూబ్ చానళ్లలో కనిపిస్తున్నారు. ► ఎస్.జైశంకర్, స్మృతీ ఇరానీ, పీయూష్ గోయల్, రాజీవ్ చంద్రశేఖర్ వంటి కేంద్ర మంత్రులు యూట్యూబ్లో 70 లక్షలకు పైగా ఫాలోవర్లున్న పాడ్కాస్టర్ రణ్వీర్ అలహాబాదియాకు ఇంటర్వ్యూలిచ్చారు. కాంగ్రెస్దీ అదే బాట... ఇన్ఫ్లుయెన్సర్ల సేవలను వాడుకునే విషయంలో కాంగ్రెస్ కూడా ఏమీ వెనకబడి లేదు. భారత్ జోడో యాత్రలోనూ, తాజాగా ముగిసిన భారత్ జోడో న్యాయ్ యాత్రలోనూ వారిని బాగానే ఉపయోగించుకుంది... ► రెండు జోడో యాత్రల్లోనూ ప్రధాన మీడియా కంటే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లకే రాహుల్ ప్రాధాన్యమిచ్చారు. ► ‘అన్ ఫిల్టర్డ్ విత్ సమ్దీశ్’ యూ ట్యూబర్కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ► ట్రావెల్ అండ్ ఫుడ్ వీడియో పాడ్కాస్ట్ కర్లీ టేల్స్ వ్యవస్థాపకుడు కామియా జానీతో తన భోజనం తదితరాల గురించి పిచ్చాపాటీ మాట్లాడారు. ► రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ తన హయాంలో ‘జన్ సమ్మాన్’ వీడియో పోటీలు నిర్వహించారు. సంక్షేమ కార్యక్రమాలపై సోషల్ ప్లాట్ఫాంల్లో 30 నుంచి 120 సెకన్ల వీడియోలు షేర్ చేసిన వారిలో విజేతలకు నగదు బహుమతులిచ్చారు. దేశవ్యాప్తంగా ఇంటర్నెట్ వ్యాప్తి సగటున 40 శాతం ఉందని అంచనా. ఆ లెక్కన 2 లక్షల ఓటర్లుండే అసెంబ్లీ స్థానంలో సోషల్ మీడియా ద్వారా కనీసం 70 నుంచి 80 వేల మందిని ప్రభావితం చేసే వీలుంటుందని విశ్లేషకులు చెబుతున్నారు. చాలాసార్లు విజేతను తేల్చడంలో ఐదారు వేల ఓట్లు కూడా నిర్ణాయకంగా మారుతున్న నేపథ్యంలో ఇది చాలా పెద్ద సంఖ్యేనని పార్టీలు భావిస్తున్నాయి. అందుకే సోషల్ మీడియాను ఇప్పుడు ఏ పార్టీ కూడా తేలిగ్గా తీసుకోవడం లేదు. – అంకిత్ లాల్, అడ్వైజర్, పొలిటికో – సాక్షి, నేషనల్ డెస్క్ -
'ఫేక్ వెబ్సైట్స్' క్లిక్ చేశారో ఖతమే! వాటిని ఇలా గుర్తించండి!!
రాజన్న సిరిసిల్ల: సైబర్ మోసగాళ్లు రెచ్చిపోతున్నారు. ఫేక్ వెబ్సైట్స్ పేరుతో నగదు అపహరిస్తున్నారు. ఫర్నీచర్.. ఎలక్ట్రానిక్ వస్తువులపై భారీ ఆఫర్లు ఇస్తున్నామంటూ ఫేక్ వెబ్సైట్లతో బురిడీ కొట్టిస్తున్నా రు. నమ్మి వాటిపై క్లిక్ చేస్తే చాలు మన ఖాతాలోని డబ్బు మాయమవుతుంది. ఇటీవల జిల్లాలో సైబర్మోసాలు వరుసగా జరుగుతున్నాయి. సోషల్మీడియాలో వస్తున్న ఆఫర్లకు ఆకర్షితులై అమాయకులు డబ్బులు పోగొట్టుకుంటున్నారు. జిల్లాలో ఇటీవల జరిగిన సంఘటనలు! సిరిసిల్లటౌన్ పోలీస్స్టేషన్ పరిధిలో ఒకరికి క్రెడిట్కార్డ్ ప్రొటెక్షన్ ప్లాన్ గురించి ఓ కాల్ వచ్చింది. బాధితులు అతనితో క్రెడిట్కార్డ్ నంబర్, ఓటీపీ షేర్ చేసుకోవడంతో రూ.77వేలు నష్టపోయాడు. సిరిసిల్లటౌన్ పోలీస్స్టేషన్ పరిధిలో ఒకరు ఇన్స్ట్రాగామ్లో ఓ యాడ్ చూసి అందులోని లింక్పై క్లిక్ చేయడంతో వాట్సాప్కు కనెక్ట్ అయ్యింది. దీంతో బాధితుడు వారు చెప్పినట్లు కొన్ని టాస్క్లు చేయడంతో రూ.40వేలు నష్టపోయాడు. కోనరావుపేట్ ఠాణా పరిధిలో ఒకరికి తక్కువకే వజ్రాలు ఇస్తామంటూ ఓ కాల్ వచ్చింది. లోన్ ఇస్తామని చెప్పిన వారు ముందుగా చార్జీలు రూ.27వేలు చెల్లించాలనడంతో పంపాడు. తర్వాత తను మోసపోయానని గుర్తించాడు. సిరిసిల్లటౌన్ పోలీస్స్టేషన్ పరిధిలో ఒకరికి కొత్త నంబర్ నుంచి కాల్ వచ్చింది. వారి మాటలు నమ్మి డెబిట్కార్డ్ వివరాలు, ఓటీపీ షేర్ చేసుకోవడంతో రూ.లక్ష వరకు మోసపోయాడు. సిరిసిల్ల టౌన్ పోలీస్స్టేషన్ పరిధిలో ఒకరు నర్సరీ వ్యాపారం కోసం ఫేక్ కస్టమర్ కేర్ సర్వీస్ను సంప్రదించాడు. తర్వాత కొత్త నంబర్ నుంచి కాల్ రావడంతోపాటు ఒక పేమెంట్ స్కానర్ను పంపించారు. బాధితుడు దాన్ని స్కాన్ చేయడంతో రూ.లక్ష నష్టపోయాడు. సిరిసిల్ల టౌన్ పోలీస్స్టేషన్ పరిధిలో బిజినెస్ ఎమోషనల్ అని చెప్పి టెలిగ్రామ్లో ఒక లింక్ పంపించారు. అందులో భాగంగా కొన్ని టాస్క్ లు చేస్తే డబ్బు వస్తుందని నమ్మబలికారు. వారు చెప్పినట్లుగా కొన్ని టాస్క్లు చేయడంతో కొంత డబ్బు పంపించారు. ఇందులో భాగంగా బాధితుడు రూ.96వేలు నష్టపోయాడు. సిరిసిల్ల టౌన్ పోలీస్స్టేషన్ పరిధిలో బాధితుడు పార్ట్ టైం జాబ్ గురించి ఒక యాప్లో నమోదు చేసుకున్నాడు. ఇందులో భాగంగా వారు ఇచ్చిన వర్క్లో డాటా తప్పుగా ఎంటర్ చేశారని బెదిరించి బాధితుడి నుంచి రూ.55వేలు తీసుకున్నారు. తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. సోషల్మీడియాలో వచ్చే యాడ్స్ను నమ్మొద్దు. ఎస్బీఐ యోనో బ్లాక్ అయిందని, పాన్కార్డు అప్డేట్ చేయాలని వచ్చే మెస్సేజ్లను నమ్మొద్దు. ఆ మెస్సేజ్లలో వచ్చే లింక్స్పై అస్సలు క్లిక్ చేయొద్దు. సోషల్మీడియాలో వచ్చే ప్రకటనలు చూసి పెట్టుబడి పెట్టవద్దు. మీ ప్రమేయం లేకుండా మీ సెల్ఫోన్ నంబర్కు ఓటీపీ వస్తే దాన్ని ఎవరికీ చెప్పొద్దు. అది సైబర్ నేరగాళ్ల ఎత్తుగడగా గమనించాలి. అప్రమత్తతే అవసరం.. కొత్త ఫోన్ నంబర్ నుంచి కాల్ వస్తే ఎలాంటి వ్యక్తిగత వివరాలు చెప్పొద్దు. ఒకవేళ సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930కి కాల్చేస్తే తిరిగి డబ్బులు పొందే అవకాశం ఉంది. డెబిట్కార్డు, బ్యాంక్ ఖాతా వివరాలు ఎవరితో షేర్ చేసుకోవద్దు. – అఖిల్మహాజన్, రాజన్నసిరిసిల్ల ఎస్పీ ఇవి కూడా చదవండి: ఆన్లైన్ గేమ్స్తో జాగ్రత్త! లేదంటే ఇలా జరుగుతుందేమో!? -
సీసీఎల్ఏ భూమి సైట్లు బంద్
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల కోడ్ ముగిసి పదిరోజులు దాటినా రాష్ట్రంలో భూపరిపాలన గాడిలో పడడం లేదు. కోడ్ కారణంగా గతంలో నిలిపివేసిన నాలుగైదు వెబ్సైట్లను పునఃప్రారంభించకపోవడమే ఇందుకు కారణమని రెవెన్యూ వర్గాలంటున్నాయి. భూపరిపాలన ప్రధాన కమిషనర్ (సీసీఎల్ఏ) పరిధిలోకి వచ్చే ల్యాండ్ రెగ్యులరైజేషన్ మేనేజ్మెంట్ సిస్టం (ఎల్ఆర్ఎంఎస్), యూఎల్సీ రెగ్యులరైజేషన్, ఈల్యాండ్స్ టీఎస్, జీవో 58, 59ల ద్వారా ప్రభుత్వ భూముల్లోని కట్టడాల క్రమబద్ధీకరణకు సంబంధించిన వెబ్సైట్లతో సహా ఇతర భూపరిపాలన వెబ్సైట్లు పనిచేయకపోవడంతోనే ఈ పరిస్థితి తలెత్తిందని తెలుస్తోంది. వాస్తవానికి, రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత భూముల క్రమబద్ధీ కరణ నిలిచిపోయింది. ప్రభుత్వ భూముల్లో కబ్జా ఉండి నిర్మాణాలు చేసుకున్న వారికి ఆ భూములను క్రమబద్దీకరించుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఈ మేరకు లక్షలాది మంది జీవో 58, 59 ద్వారా భూముల క్రమబద్దీకరణకు దరఖాస్తు చేసుకోగా, అందులో 30–40 శాతం మాత్రమే దరఖాస్తులను పరిష్కరించారు. ఈ దరఖాస్తులను పరిష్కరించే అధికారం కలెక్టర్ల లాగిన్లకు మాత్రమే ఉండడంతో ఎన్నికల షెడ్యూల్ విడుదలకు ముందే చాలా చోట్ల ఈ దరఖాస్తుల పరిష్కార ప్రక్రియ నిలిచిపోయింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా దరఖాస్తుదారులు ఎన్ని కలు ముగిసిన తర్వాత క్రమబద్దీకరణ జరుగుతుందని భావించారు. ఈ ప్రక్రియ ద్వారా ప్రభుత్వానికి కూడా పెద్ద ఎత్తున ఆదాయం రానుండడంతో ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే ప్రారంభమవుతుందని రెవెన్యూ యంత్రాంగం భావించింది. కానీ, ఎన్నికలకు ముందు మూసేసిన వెబ్సైట్లను ఇప్పటివరకు ప్రారంభించకపోవడంతో రాష్ట్రంలో భూముల క్రమబద్దీకరణ పూర్తిస్థాయిలో నిలిచిపోయింది. దీనిపై రెవెన్యూ ఉన్నతాధికారులు మాట్లాడుతూ రాష్ట్రంలో పాలనా పగ్గాలు మారిన నేపథ్యంలో కొత్త ప్రభుత్వ నిర్ణయం కోసమే ఎదురుచూస్తున్నామని, ప్రభుత్వ విధానం ఎలా ఉంటుందోనన్న ఆలోచనతోనే తాత్కాలికంగా నిలిపివేశామని చెపుతున్నారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
టీమిండియా టీ20 వరల్డ్ కప్ జెర్సీ లీక్.. ఫోటోలు వైరల్
పాఠశాల నేపథ్యంలో వస్తోన్న సత్య.. ఆసక్తిగా ట్రైలర్!
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (06-05-2024)
Video: కేసీఆర్ బస్సును తనిఖీ చేసిన ఎన్నికల అధికారులు
'దేవర' షూటింగ్లో తేనెటీగల కలకలం.. 20 మందికి గాయాలు
ఎస్ఆర్హెచ్తో ముంబై కీలక పోరు.. కొత్త ప్లేయర్ ఎంట్రీ
వారితో భయంకరమైన అనుభవాలు ఎదుర్కొన్నా: హీరామండి నటి
కేజ్రీవాల్కు మరో షాక్.. ‘ఎల్జీ’ సంచలన నిర్ణయం
మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)
గాలివానలో చిక్కుకున్న హెలికాఫ్టర్.. నవీన్ పట్నాయక్కు తప్పిన ప్రమాదం
తప్పక చదవండి
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- సూపర్ మచ్చీ.. ఇలాంటి గ్రూపు డ్యాన్స్ మీరెపుడైనా చూశారా?
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- పూంచ్ ఉగ్రదాడి.. టెర్రరిస్టులపై రూ.20 లక్షల రివార్డు
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- ‘SRH కాదు.. పరుగుల విధ్వంసానికి మారు పేరు ఆ జట్టే’
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- అందుకేనా అమిత్ షా అలా మాట్లాడింది!
- AnjiBabu: జంపింగ్ జపాంగ్ పార్టీలు మారడంలో దిట్ట
Advertisement