-
'తెలియని దారుణాలు చాలానే.. బీసీసీఐ బయటపడనివ్వలేదు'
బీసీసీఐ(బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా).. పేరుకు భారత క్రికెట్ బోర్డు అయినప్పటికి.. ఐసీసీనీ కూడా శాసించే స్థాయికి ఎదిగింది. క్రికెట్లో అత్యంత ధనికవంతమైన బోర్డుగా బీసీసీఐకి పేరుంది. పురుషుల క్రికెట్.. మహిళల క్రికెట్ను సమానంగా చూస్తూ ఆటగాళ్లకు తగిన హోదా కల్పిస్తున్నాయి. అయితే ఇవన్నీ బయటకు మాత్రమే. అంతర్లీనంగా బీసీసీఐలో కొన్నేళ్ల క్రితం జరిగిన దారుణాలు తెలుసుకుంటే ఆశ్చర్యపోవడం ఖాయం. బీసీసీఐలో మనకు తెలియని దారుణాలు ఏం చోటుచేసుకున్నయనేది మాజీ కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్(కాగ్) వినోద్ రాయ్ వెల్లడించారు. వినోద్ రాయ్ను సూప్రీంకోర్టు.. 2017-19 మధ్య బీసీసీఐ స్పెషల్ కమిటి అడ్మినిస్ట్రేటర్గా నియమించింది. బీసీసీఐలో ఎన్నికలు జరిగే వరకు వినోద్ రాయ్ సహా రామచంద్ర గుహ, విక్రమ్ లిమాయే, భారత మాజీ కెప్టెన్ డయానా ఎడుల్జీలతో నలుగురు సభ్యుల బృంధాన్ని ఏర్పాటు చేసి బోర్డు అడ్మినిస్ట్రేషన్ నడిపించారు. కాగా ఈ 33 ఏళ్ల కాలంలో వినోద్ రాయ్ బీసీసీఐలో జరిగిన లోటుపాట్ల గురించి స్పష్టంగా తెలుసుకున్నారు. అయితే ఆయన ఏనాడు వాటిని బయటపెట్టలేదు. తాజాగా వినోద్ రాయ్ ..''నాట్ జస్ట్ ఏ నైట్ వాచ్మన్'' అనే బుక్ రాశారు. ఈ బుక్లో ముఖ్యంగా బీసీసీఐకి తాను అడ్మినిస్ట్రేటర్గా పనిచేసిన కాలంలో జరిగిన అనుభవాలను, జ్ఞాపకాలను రాసుకొచ్చారు. అందులోనే అంతర్లీనంగా మహిళా క్రికెటర్లు ఎదుర్కొన్న వివక్ష గురించి కూడా ప్రస్తావించారు. ఈ విషయాన్ని వినోద్ రాయ్ స్వయంగా ద వీక్ మ్యాగజైన్కు ఇచ్చిన ఇంటర్వ్వూలో వెల్లడించారు. ''బీసీసీఐ మహిళా క్రికెట్కు అంతగా ప్రాధాన్యం ఇవ్వలేదని నాకు అనిపిస్తుంది. 2006 వరకు మహిళా క్రికెటర్లపై వివక్ష దారుణంగా ఉండేది. వాళ్లు మ్యాచ్లు ఆడేది తక్కువ సంఖ్య కాబట్టి.. కొత్త జెర్సీలు ఎందకన్న కారణంతో... పురుషుల వాడిన జెర్సీలనే కట్ చేసి మళ్లీ కుట్టి వాటిని మహిళా క్రికెటర్లకు అందించేవారు. ఒక రకంగా వాడేసిన జెర్సీలను మహిళా క్రికెటర్లకు ఇచ్చారు. అయితే శరద్ పవార్ బీసీసీఐ అధ్యక్షుడిగా వచ్చాకా.. పరిస్థితి కొంత నయమైంది. ఆయన మెన్స్, వుమెన్స్ క్రికెట్ను ఒకే దగ్గరకు చేర్చాలనే కొత్త ఆలోచనతో వచ్చారు. దానివల్ల మహిళా క్రికెటర్ల బతుకులు చాలావరకు బాగుపడ్డాయి. సెంట్రల్ కాంట్రాక్ట్(క్రికెటర్లకు జీతాలిచ్చే బోర్డు) అనేది రావడం వల్ల వివక్ష కాస్త తగ్గింది. కానీ ఇప్పటికి ఎక్కడో ఒక చోట అది కొనసాగుతూనే ఉంది. 2017లో నేనే బీసీసీఐ అడ్మినిస్ట్రేటర్గా ఉన్నప్పుడు.. భారత మహిళల జట్టు 2017 వన్డే వరల్డ్కప్లో ఫైనల్ చేరింది. ఆ ప్రపంచకప్లో హర్మన్ప్రీత్ కౌర్ 171 పరుగుల నాకౌట్ ఇన్నింగ్స్ టీమిండియాను ఫైనల్లో అడుగుపెట్టేలా చేసింది. అయితే ఇంత మంచి ఇన్నింగ్స్ ఆడిన హర్మన్ ప్రీత్కౌర్కు మ్యాచ్కు ముందు సరైన ఫుడ్ ఇవ్వలేదంటే నమ్ముతారా. ఆ విషయం హర్మన్ స్వయంగా చెప్పింది. 171 పరుగుల నాకౌట్ ఇన్నింగ్స్ తర్వాత హర్మన్తో ఫోన్లో మాట్లాడా.''సార్.. పరిగత్తడానికి శక్తి లేక బలాన్ని కుంచించుకొని సిక్స్లతోనే ఇన్నింగ్స్ ఆడాను. దానికి కారణం మాకు సరైన ఫుడ్ లేకపోవడమే. మ్యాచ్ ప్రారంభానికి ముందు మేమున్న హోటల్ సిబ్బంది.. ఈరోజు మీకు బ్రేక్ఫాస్ట్ ఏం లేదని.. సమోసాలతోనే సరిపెడుతున్నామని చెప్పారు. ఆ ఒక్క సమోసాతోనే నా శక్తినంతా కుంగదీసుకొని ఇన్నింగ్స్ ఆడాను.'' అంటూ చెప్పుకొచ్చింది. దీన్నిబట్టే అర్థం చేసుకోవచ్చు.. బీసీసీఐ మహిళా క్రికెటర్లను సరైన దిశలో పట్టించుకోలేదని.. ఈ మధ్యకాలంలో నాకు తెలిసి పురుషులతో సమానంగా మహిళలు క్రికెట్ ఆడుతున్నారు. వాళ్లకు సరైన ట్రైనింగ్, కోచింగ్ అవసరాలు, ట్రావెల్ ఖర్చులు, క్రికెట్ కిట్, గేర్, చివరకు మ్యాచ్ ఫీజులు సక్రమంగా చెల్లిస్తే మరింత ముందుకెళ్లడం సాధ్యం. బీసీసీఐని కించపరచాలన్న ఉద్దేశం నాకు లేదు. అందులో ఉన్న లోపాలు మాత్రమే ఎత్తిచూపాను. ఇలాంటివి తొందరగా పరిష్కరించుకుంటే మేలు'' అంటూ ఆయన పేర్కొన్నారు. చదవండి: ఐపీఎల్ వ్యవస్థాపకుడి బయోపిక్ను తెరకెక్కించనున్న బాలయ్య నిర్మాత -
కల్యాణ్ జువెల్లర్స్ చైర్మన్గా మాజీ ‘కాగ్’ వినోద్ రాయ్
న్యూఢిల్లీ: మాజీ కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్(కాగ్) వినోద్ రాయ్ తమ సంస్థ చైర్మన్, స్వతంత్ర నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టరుగా నియమితులైనట్లు ఆభరణాల విక్రయ సంస్థ కల్యాణ్ జువెల్లర్స్ ఇండియా వెల్లడించింది. నియంత్రణ సంస్థ, షేర్హోల్డర్ల ఆమోదానికి లోబడి ఈ నియామకం ఉంటుందని పేర్కొంది. టీఎస్ కల్యాణరామన్ ఇకపైనా కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్గా కొనసాగుతారని వివరించింది. పారదర్శకమైన వ్యాపార విధానాలు, కార్పొరేట్ గవర్నెన్స్తో వినియోగదారుల విశ్వాసాన్ని చూరగొన్న కల్యాణ్ జువెల్లర్స్తో కలిసి పనిచేయనుండటం సంతోషంగా ఉందని ఈ సందర్భంగా వినోద్ రాయ్ తెలిపారు. వివిధ అంశాల్లో రాయ్ అపార అనుభవం తమ సంస్థ పురోగతికి తోడ్పడగలదని కల్యాణరామన్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఐక్యరాజ్యసమితి ఎక్స్టర్నల్ ఆడిటర్ల కమిటీకి చైర్మన్గా కూడా రాయ్ గతంలో వ్యవహరించారు. అలాగే కేంద్రం, రాష్ట్రాల ప్రభుత్వాల్లోనూ వివిధ హోదాల్లో కీలక బాధ్యతలు నిర్వర్తించారు. దేశీయంగా ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ రంగంలో సంస్కరణల కోసం ఏర్పాటైన బ్యాంక్స్ బోర్డ్ బ్యూరో చైర్మన్గా కూడా వ్యవహరించారు. దేశానికి అందించిన సేవలకు గాను ప్రతిష్టాత్మక పద్మభూషణ్ పురస్కారాన్ని అందుకున్నారు. (చదవండి: అంతర్జాతీయ మార్కెట్లలో జోరు.. దేశీ స్టాక్ మార్కెట్లలో లాభాల హోరు) -
కాగ్ వినోద్రాయ్.. ఇప్పుడు కళ్యాణ్ జ్యూయల్లర్స్లో
కాగ్ (కంప్ట్రోలర్ ఆడిట్ జనరల్ ఆఫ్ ఇండియా) మాజీ అధికారి వినోద్రాయ్కి కీలక బాధ్యలు అప్పగించింది కళ్యాణ్ జ్యూయల్లర్స్ యాజమాన్యం. కంపెనీ బోర్డులో చైర్మన్, ఇండిపెండెంట్ నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా నియమిస్తున్నట్టు ప్రకటించింది. అయితే ఈ నిర్ణయానికి సంబంధించి షేర్ హోల్డర్లు, రెగ్యులేటరీ అథారిటీ నుంచి అనుమతి రావాల్సి ఉంది. కాగ్ ఆడిటర్ జనరల్ పని చేయడంతో పాటు యూనెటైడ్ నేషనల్ ప్యానెల్ ఆఫ్ ఆడిటర్స్కి, బ్యాంక్ బోర్డ్స్ బ్యూరో తదితర సంస్థలకు కూడా గతంలో చైర్మన్గా వినోద్రాయ్ వ్యవహరించారు. కేంద్ర, పలు రాష్ట్రాల ప్రభుత్వాలు తీసుకొచ్చిన అనేక సంస్కరణల్లో వినోద్ రాయ్ కీలకంగా వ్యవహరించారు. కాగా మార్కెట్లో దూకుడుగా వెళ్తున్న కళ్యాణ్ జ్యూయల్లర్స్.. తాజాగా వినోద్రాయ్ వంటి సమర్థుడికి అనుభవజ్ఞుడికి బోర్డులో చోటు కల్పించింది. -
అప్పుడు కుంబ్లేను కోహ్లి వద్దన్నాడు.. ఇప్పుడైతే?
న్యూఢిల్లీ: దాదాపు రెండేళ్ల క్రితం టీమిండియా ప్రధాన కోచ్ పదవి నుంచి అనిల్ కుంబ్లే తప్పుకోవడానికి కారణాలను బీసీసీఐ కమిటీ పరిపాలక కమిటీ(సీఓఏ) మాజీ చీఫ్ వినోద్ రాయ్ వెల్లడించారు. ఆరోజు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లితో విభేదాలు కారణంగానే కుంబ్లే తన పదవిని అర్థాంతరంగా వదులుకోవాల్సి వచ్చిందన్నారు. బీసీసీఐ కొత్త అధ్యక్షుడిగా సౌరవ్ గంగూలీ పగ్గాలు చేపట్టడంతో సీఓఏ పదవీ కాలం ముగిసింది. ఈ మేరకు సీఓఏకు 33 నెలలుగా చీఫ్గా ఉన్న వినోద్ రాయ్ తన అనుభవాలను పంచుకున్నాడు. దీనిలో భాగంగా కోహ్లి-కుంబ్లేల వివాదాన్ని మరోసారి మీడియా ముఖంగా చెప్పుకొచ్చాడు. ‘ కుంబ్లే ఒక అద్భుతమైన కోచ్. అందులో ఎటువంటి సందేహం లేదు. ఒకవేళ నా పరిధిలో కుంబ్లే పదవి కాలాన్ని పొడిగించే అవకాశం ఉంటే దాన్ని కచ్చితంగా అమలు చేసేవాడ్ని. కుంబ్లే చాలా మర్యాదగల వ్యక్తి. కానీ కోహ్లితో విభేదాలు తర్వాత కుంబ్లేను కొనసాగించే అవకాశం నా చేతుల్లో లేదు. అది క్రికెట్ సలహా కమిటీ(సీఏసీ) నిర్ణయం. కుంబ్లేతో డ్రెస్సింగ్ రూమ్లో కోహ్లికి అభిప్రాయ బేధాలు తలెత్తడంతో ఉన్నపళంగా కోచ్ను మార్చాల్సి వచ్చింది. సీఏసీలో సభ్యులైన సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీలతో కోహ్లి సుదీర్ఘ చర్చల తర్వాత కోచ్ను మార్చాలని పట్టుబట్టడంతో కుంబ్లేకు ఉద్వాసన తప్పలేదు. ఇక్కడ విషయం చెప్పాలి. కోహ్లి వైఖరితో కుంబ్లేనే స్వచ్ఛందంగా తన పదవి నుంచి తప్పుకున్నాడు. వివాదాన్ని మరింత పెద్దది చేయకుండా కుంబ్లే చాలా గౌరవంగా తన పదవికి గుడ్ బై చెప్పాడు. ఆ సమయంలో కోహ్లి ముంబైలో ఉండగా, నేను హైదరాబాద్లో ఉన్నా. ఫోన్ ద్వారా కోహ్లి అంతరంగాన్ని తెలుసుకున్నా. ఇదే విషయాన్ని సచిన్కు చెప్పా. కుంబ్లేను కొనసాగించడానికి కోహ్లి ఆసక్తిగా లేడనే విషయాన్ని చెప్పా. అప్పుడు సచిన్, సౌరవ్లు కోహ్లితో మాట్లాడారు. ఆ క్రమంలోనే కుంబ్లే పదవి నుంచి తప్పుకున్నాడు. అటువంటి పరిస్థితుల్లో కుంబ్లేను కోచ్గా కొనసాగించే అవకాశం నా చేతుల్లో లేదు. ఒకవేళ ఉండి ఉంటే కచ్చితంగా కుంబ్లేను కోచ్గా కొనసాగించేవాడిని. అదే వివాదం ఈరోజు తలెత్తి ఉంటే పరిస్థితి మరొక రకంగా ఉండేది. కుంబ్లేను బలవంతంగానైనా ఆ పదవిలో గంగూలీ కొనసాగించే వాడు. ఈ తరహా వివాదమే టీమిండియా మహిళా క్రికెటర్ మిథాలీ రాజ్కు కోచ్గా పనిచేసిన రమేశ్ పవార్కు మధ్య జరిగింది. ఇవన్నీ ప్రజల్లో అపవాదను తెచ్చిపెట్టడమే కాకుండా మరింత వివాదాన్ని రాజేశాయి. బీసీసీఐ అధ్యక్షుడిగా గంగూలీ రావడంతో ఆనాటి పరిస్థితులు ఇక ఉండవనే అనుకుంటున్నా. గంగూలీ ఏ విషయాన్నైనా డీల్ చేయగల సమర్థుడు’ అని వినోద్ రాయ్ పేర్కొన్నారు. -
గంగూలీనే సరైనోడు...
న్యూఢిల్లీ: లోధా సంస్కరణల కోసమే తాత్కాలికంగా భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)లోకి ప్రవేశించినా సుదీర్ఘ కాలం పాటు పరిపాలక కమిటీ (సీఓఏ) పనిచేసింది. మొత్తానికి బుధవారం జరిగిన సర్వసభ్య సమావేశంతో సీఓఏ కథ ముగిసింది. ఈ నేపథ్యంలో సీఓఏ చీఫ్గా వినోద్ రాయ్ ఆఖరి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో సౌరవ్ గంగూలీ కంటే సమర్థుడైన అధ్యక్షుడు లేడని అభిప్రాయపడ్డారు. ఇంకా ఏమన్నారంటే... ఈ బాధ్యతలు తృప్తినిచ్చాయి... నాకు ఈ బాధ్యతలు సంతృప్తికర అనుభవాన్నిచ్చాయి. ఆటగాళ్ల సంఘాన్ని నియమించాం. అరకొర అయినా ఎట్టకేలకు మహిళల ఐపీఎల్ మ్యాచ్ల్నీ నిర్వహించాం. ప్రతీ అంశంలోనూ పారదర్శకంగా వ్యవహరించాం. వందకుపైగా జరిగిన సీఓఏ సమావేశాల తాలుకూ నివేదికల్ని బీసీసీఐ వెబ్సైట్లో పెట్టాం. లోధా సిఫార్సుల్ని ఎక్కడా నీరుగార్చలేదు. మొత్తమ్మీద నలుగురు మాజీల్ని బోర్డు ప్రధాన పదవుల్లో చూస్తుంటే ఆనందంగా ఉంది. అధ్యక్షుడిగా గంగూలీ, ఐపీఎల్ చైర్మన్గా బ్రిజేశ్ పటేల్, అపెక్స్ కౌన్సిల్లో అన్షుమన్ గైక్వాడ్, శాంతా రంగస్వామిలు బీసీసీఐ ముఖ్య పదవుల్లో ఉన్నారు. ‘దాదా’ అంటే గౌరవం... మాజీ కెప్టెన్ గంగూలీ అంటే నాకెంతో గౌరవం. అతను బెంగాల్ క్రికెట్ సంఘాన్ని నడిపించిన తీరు నన్ను బాగా ఆకట్టుకుంది. అలాగే బీసీసీఐని నడిపించే నాయకత్వ లక్షణాలు ఈ మాజీ కెప్టన్న్కు ఉన్నాయి. నా దృష్టిలో బోర్డు అధ్యక్షుడిగా అతనికన్నా సమర్థ నాయకుడు లేడు. వాటిని పట్టించుకోను.... సీఓఏలో పెద్దగా సవాళ్లేమీ లేవు. అనర్హతకు గురైన ఆ 70 మందితో నాకు అసలు పరిచయమే లేదు. వాళ్లు పోరాడింది కోర్టులోనే! ఇక విమర్శలంటారా... వాటిని నేను పట్టించుకోను. నిజం చెప్పాలంటే సంస్కరణలు ఇష్టం లేనివారే ఆరోపణలు చేశారు. నన్ను విమర్శించారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
- సుచరితకు హ్యాండిచ్చిన కాంగ్రెస్.. పూరీ బరిలో ఆయనే..
- AP: ఆ జిల్లాల్లో రెండు రోజుల పాటు వర్షాలు
- అబద్ధాల వసంతం.. గ్రూపు రాజకీయాలే ఆసాంతం
- Prajwal Revanna: ఏ గదిలో ఏం జరిగింది?
- మహిళలపై టీడీపీ అభ్యర్థి అనుచిత వ్యాఖ్యలు
- అవన్నీ అపోహలే
- జైళ్లకు భయపడను.. ప్రాణాలైనా బలిపెడతా: కేసీఆర్
- ఐరాసలో జగన్ విజన్
- బెంగళూరు గెలుపు ‘హ్యాట్రిక్’
- అనుపమా కెరీర్ ప్రస్తుతం నాన్స్టాప్గా... జెట్ స్పీడ్లో
Advertisement