breaking news
Sunjay Kapur
-
మూడు నెలల ముందే పదేళ్ల జీవితానికి ప్లాన్ : కానీ అంతలోనే!
జీవితం బుద్భుత ప్రాయం. ఎవరి ప్రాణాలు ఏ క్షణంలో గాల్లో కలిసిపోతాయో ఎవరికీ తెలియదు. కానీ అందమైన జీవితం కోసం ఎన్నో కలలు కంటాం. కీర్తి, ఆస్తి, పిల్లలు, వారి భవిష్యత్తు అంటూ.. రాత్రింబవళ్లు తిండి తిప్పలు కూడా మర్చిపోయి కష్ట పడతాం. కానీ కొన్ని విషాదాల గురించి తెలుసుకున్నపుడు మాత్రం ఒకలాంటి నిర్వేదం మన మనసుల్ని ముసురుకుంటుంది.ముఖ్యంగా ఇటీవలి కాలంలో విహార యాత్రలు విషాదంగా మారిపోయిన పహల్గాం ఉదంతం, బెంగళూరు తొక్కిసలాట, ఘోర విషాదాన్ని మిగిల్చిన విమాన ప్రమాదం లాంటి ఘటనలు చూసినపుడు మనసు మరింత భారమవుతుంది. దాదాపు ఇలాంటి గాథే వ్యాపార వేత్త సంజయ్ కపూర్ ఆకస్మిక మరణం.జూన్ 13న ఇంగ్లాండ్లో పోలో ఆటలో ప్రమాదవశాత్తు తేనెటీగను మింగి గుండెపోటుకు గురై 53 ఏళ్ల పారిశ్రామికవేత్త ప్రాణాలు కోల్పోతాడని అసలెవరైనా ఊహిస్తారా? 40వేల కోట్ల ఆస్తిపరుడు సంజయ్ కపూర్, చిన్న ప్రాణి తేనేటీగ మూలంగా కన్నుమూశాడు. ఆయన అకాల మరణం స్నేహితులు, కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషుల హృదయాల్లో తీవ్ర శూన్యతను మిగిల్చింది. అంతేకాదు రాబోయే పదేళ్ల కాలంలో ఎంతో సంతోషంగా, కుటుంబ సభ్యులతో కలిసి జీవించాలని కలలు కన్న ఆయన కలలు కల్లలుగానే మిగిలిపోవడం మరింత విషాదం. మూడు నెలల క్రితం, తన జీవితంలో ముఖ్యమైన విషయాలపై మరింత దృష్టి పెట్టాలనే ఆశతో పదేళ్ల తన జీవిత ప్రణాళికను ఒక సందర్భంలో పంచుకున్నాడు."నేను గొప్ప ప్రణాళికదారుడిని. అక్టోబర్లో, నేను నా కోసం పదేళ్ల ప్రణాళికను రాసుకున్నాను. ఏమి చేయాలి, ఏం చేయకూడదు అనేది చాలా స్పష్టంగా ప్లాన్ చేసుకున్నా. నా గేమ్ నాకు చాలా ముఖ్యం, ఆరోగ్యం , ఫిట్నెస్ నాకు చాలా ముఖ్యం. నేను యాక్టివ్గా , వీలైనంత ఎక్కువగా పోలో ఆడతాను. అంతకంటే ముఖ్యమైనది ఏమిటంటే నేను నా కుటుంబానికి సమయాన్ని ఇవ్వాలనుకుంటున్నా..నేను ఉమ్మడికుటుంబం నుంచి వచ్చాను. ఉమ్మడి కుటుంబాల్లో జీవితం అంత ఈజీకాదు. కానీ అదృష్టవశాత్తూ ఒకర్నొకరు ప్రేమించుకుంటూ ఆనందంగా గడిపాం. ఇపుడు కూడా భార్యతో జీవితాంతం అలాగే కొనసాగాలను కుంటున్నానని తెలిపారు. కానీ అంతలోనూ అనూహ్యంగా ఈ లోకాన్నించి శాశ్వతంగా సెలవు తీసుకోవడం విషాదం.కాగా సంజయ్ నలుగురు పిల్లల తండ్రి. సమైరా, సఫీరా, కియాన్, అజారియాస్. మాజీ భార్య బాలీవుడ్ నటి కరిష్మాతో కుమార్తె సమైరా, కుమారుడు కియాన్ ఉన్నారు. విడాకుల తరువాత కూడా కరిష్మా పిల్లలతో తన స్నేహపూర్వక సంబంధాన్ని కొనసాగించారు. మూడో భార్య, ప్రియా సచ్దేవ్ కుమారిడితో పాటు, మొదటిభర్త ద్వారా పుట్టిన కుమార్తె సఫీరాను కూడా తండ్రిలాగానే చూసుకునేవాడు. సంజయ్ కపూర్ అంత్యక్రియలకు కరిష్మా కపూర్, సైఫ్ అలీ ఖాన్,కరీనా కపూర్ హాజరైన సంగతి తెలిసిందే. నోట్ : జీవితాల్ని చిన్నాభిన్నం చేసే ఇలాంటి విషాదాల గురించి రోజూ వింటూనే ఉంటాం. నిట్టూరుస్తూనే ఉంటాం. ‘చివరికి మిగిలేది’ ఇదే కదా అని కూడా అనుకుంటాం. అలాగని జీవితం ఆగిపోదు. ‘జరిగేవన్నీ మంచికనీ అనుకోవడమే మనిషి పని’ అనుకుంటూ ముందుకు సాగాల్సిందే. -
సోనా కామ్స్టర్ ఛైర్మన్ మృతి
ప్రముఖ భారతీయ పారిశ్రామికవేత్త, నటి కరిష్మా కపూర్ మాజీ భర్త సుంజయ్ కపూర్(53) జూన్ 12, 2025న యూకేలో పోలో ఆడుతూ గుండెపోటుతో మరణించారు. ఆయన ఆకస్మిక మరణంపట్ల పరిశ్రమ వర్గాలు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నాయి. సోనా బీఎల్డబ్ల్యూ కామ్స్టర్ సంస్థ(ప్రస్తుతం మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.31,073 కోట్లు)కు ఛైర్మన్గా ఆటోమోటివ్ రంగంపై సుంజయ్ కపూర్ చెరగని ముద్ర వేశారు. ఎలక్ట్రిక్ వెహికల్ (ఈవీ) కాంపోనెంట్స్, డ్రైవ్లైన్ సిస్టమ్స్లో కీలక సంస్థగా సోనా కామ్స్టర్ను తీర్చిదిద్దారు. ఆయన తన నాయకత్వంతో కంపెనీని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లారు.గ్లోబల్గా విస్తరణసంజయ్ కపూర్ 2015లో తన తండ్రి సురీందర్ కపూర్ నుంచి కంపెనీ బాధ్యతలు స్వీకరించారు. తర్వాత సుంజయ్ వ్యూహాత్మకంగా సోనా కామ్స్టర్ సర్వీసులను అంతర్జాతీయంగా విస్తరించారు. ట్రాక్షన్ మోటార్లు, స్టార్టర్ మోటార్లు, అధునాతన డ్రైవ్లైన్ సొల్యూషన్లలో కంపెనీ స్థానాన్ని బలోపేతం చేశారు. అతని దూరదృష్టితో కంపెనీ ఎలక్ట్రిక్ వాహనాల కాంపోనెంట్స్ తయారు చేయడంలో కీలకంగా వ్యవహరించారు. దాంతో సంస్థ ప్రపంచ ఆటోమొబైల్ ఎకోసిస్టమ్లో ఒక ముఖ్యమైన సరఫరాదారుగా మారింది.తదుపరి తరం మొబిలిటీ పరిష్కారాలుసంజయ్ నాయకత్వంలో సోనా కామ్స్టార్ దేశ ఎలక్ట్రిక్ వాహనాల సరఫరా గొలుసును బలోపేతం చేయడమే కాకుండా యూరప్, ఉత్తర అమెరికా, ఆసియా అంతటా ప్రధాన ఆటోమోటివ్ తయారీదారులకు కీలక భాగస్వామిగా మారింది. సుస్థిరత, సాంకేతిక పురోగతి పట్ల ఆయన నిబద్ధత తదుపరి తరం మొబిలిటీ పరిష్కారాలను రూపొందించడంలో కీలక పాత్ర పోషించింది.ఇదీ చదవండి: ప్చ్.. బంగారం తులం లకారం.. హ్యాట్రిక్!పరిశ్రమ నాయకత్వానికి సహకారంభారత ఆటో కాంపోనెంట్ రంగానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆటోమోటివ్ కాంపోనెంట్ మాన్యుఫాక్చరర్స్ అసోసియేషన్ (ఏసీఎంఏ) అధ్యక్షుడిగా పని చేశారు. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ) మాన్యుఫాక్చరింగ్ కౌన్సిల్కు అధ్యక్షత వహించారు. సృజనాత్మకత, స్థానికీకరణ, ఎగుమతి వృద్ధిని ప్రోత్సహించడంపై దృష్టి సారించారు. తయారీదారులు, సరఫరాదారులకు ఒకే విధంగా ప్రయోజనం చేకూర్చేలా పని చేశారు. -
మాజీ భర్తతో డిన్నర్కు వెళ్లిన హీరోయిన్, వీడియో వైరల్
కొందరికి ఎన్ని సినిమాలు చేసినా అంతగా గుర్తింపు లభించదు. మరికొందరు మాత్రం ఫస్ట్ సినిమాతోనే క్లిక్ అవుతారు. ఆ జాబితాలోకే వస్తుంది హీరోయిన్ కరిష్మా కపూర్. మొదటి సినిమాతోనే అందరినీ ఆకర్షించిన ఆమె వరుసగా సినిమాలు చేసుకుంటూ పోయింది. 2012లో డేంజరస్ ఇష్క్ చిత్రంలో చివరిసారి పూర్తి స్థాయిలో నటించిన ఆమె ఆ తర్వాత బాంబే టాకీస్, జీరో సినిమాల్లో కొద్ది నిమిషాలే అతిథి పాత్రలో మెరిసింది. దాదాపు పదేళ్ల తర్వాత మర్డర్ ముబారక్ అనే సినిమా చేస్తోంది. మధ్యలో వెబ్సిరీస్లు, టీవీ షోలు కూడా చేసింది. మాజీ భర్తతో డిన్నర్.. ఇకపోతే గతంలో వ్యాపారవేత్త సంజయ్ కపూర్ను పెళ్లి చేసుకున్న ఆమె కొంతకాలానికి అతడికి విడాకులు ఇచ్చేసింది. ఈ క్రమంలో ఇద్దరూ ఒకరిపై ఒకరు తీవ్ర ఆరోపణలు కూడా చేసుకున్నారు. అక్కడితో ఆగకుండా కరిష్మా తన భర్త, అత్తలపై వరకట్న వేధింపుల కేసు కూడా పెట్టింది. ఆశ్చర్యంగా వాళ్లిద్దరూ ఇప్పుడు కలిసిపోయారు. ఆదివారం నాడు మాజీ భర్తతో కలిసి ముంబైలో రెస్టారెంట్కు వెళ్లింది కరిష్మా. ఇద్దరూ డిన్నర్ చేసి బయటకు వచ్చే సమయంలో అక్కడున్న కెమెరామన్లు వారి ఫోటోలను క్లిక్మనిపించడమే కాకుండా వీడియో తీసి సోషల్ మీడియాలో వదిలారు. దీంతో ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట వైరలవుతోంది. విడాకుల సమయంలో దుమ్మెత్తిపోసుకున్నారు, ఇప్పుడు ఇలా కలిసిపోయారేంటి? ఇది నిజమేనా? నటిస్తున్నారా? అంటూ కామెంట్లు చేస్తున్నారు. వీళ్లిద్దరూ ఇలా కలవడం ఇదే మొదటిసారి కాదు. గత మార్చిలోనూ కరిష్మా కొడుకు కిరణ్ రాజ్ బర్త్డేను కలిసే సెలబ్రేట్ చేశారు. సంజయ్ భార్య ప్రియ కూడా తన పిల్లలతో కలిసి ఈ వేడుకలో పాల్గొంది. కరిష్మా- సంజయ్ విడాకులు.. 2003లో ఢిల్లీ వ్యాపారవేత్త సంజయ్ను పెళ్లాడింది కరిష్మా. వీరికి సమీరా, కిరణ్ అని ఇద్దరు సంతానం. కొంతకాలానికి ఈ జంట మధ్య భేదాభిప్రాయాలు తలెత్తడంతో 2014లో విడాకులకు దరఖాస్తు చేశారు. ఆ సమయంలో ఇద్దరూ ఒకరిపై మరొకరు తీవ్ర ఆరోపణలు చేసుకున్నారు. 2016లో విడాకులు మంజూరు అవగా పిల్లల బాధ్యతను తల్లికే అప్పజెప్పింది న్యాయస్థానం. 2017లో ప్రియను పెళ్లాడాడు సంజయ్. ఇది ప్రియకు కూడా రెండో వివాహమే! View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) చదవండి: శర్వానంద్కు యాక్సిడెంట్ -
కరీష్మా కపూర్ రెండో పెళ్లికి గ్రీన్ సిగ్నల్
ముంబయి: ఒకప్పటి బాలీవుడ్ టాప్ హీరోయిన్ కరీష్మా కపూర్ పెళ్లి విషయంలో తన మాజీభర్త సంజయ్ కపూర్ను ఫాలో అవుతున్నట్లు కనిపిస్తోంది. ఆమె రెండోపెళ్లికి లైన్ క్లియర్ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రముఖ వ్యాపారవేత్త సందీప్ తోష్నివాల్ను ఆమె త్వరలోనే పెళ్లాడబోతుందట. ఈ వార్త ప్రస్తుతం బాలీవుడ్లో హల్చల్ చేస్తోంది. కరీష్మా మాజీభర్త సంజయ్ కపూర్ తన ప్రేయసి ప్రియా సచ్దేవ్ను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. తాజాగా కరీష్మా కూడా సందీప్ను వివాహం చేసుకోనున్నట్లు ఓ వెబ్సైట్ కథనం ప్రచురించింది. కాగా సందీప్ తోష్నివాల్కు అతడి భార్య అశ్రిత విడాకులు ఇచ్చేందుకు సుముఖంగా ఉండటంతో ఈ పెళ్లికి దాదాపు గ్రీన్ సిగ్నల్ పడినట్లే. గతంలో విడాకులు ఇచ్చేందుకు అశ్రిత ఇష్టపడలేదు. అయితే గత కొంతకాలంగా వీరు వేర్వేరుగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో అశ్రిత..తన భర్తకు డైవర్స్ ఇవ్వడానికి సిద్ధపడటంతో, అందుకు సంబంధించిన ఫార్మాలిటీస్ కూడా మొదలయ్యాయట. ఇందుకోసం ఆమె భారీగానే భరణం డిమాండ్ చేసిదంట. ఢిల్లీలో ఉన్న ఇంటితో పాటు అశ్రితకు రూ.రెండు కోట్లు, అలాగే ఇద్దరు పిల్లలకు చెరో రూ.3 కోట్లు ఇచ్చేందుకు సందీప్ తోష్నివాల్ అంగీకరించినట్లు సమాచారం. అలాగే ఇద్దరు కూతుళ్లు తల్లి కస్టడీలోనే ఉండనున్నారు. సందీప్ తోష్నివాల్తో అశ్రిత వివాహం 2013లో జరిగింది. అయితే భర్త ప్రవర్తనపై ఆమె తీవ్ర ఆరోపణలు చేయడంతో వారిద్దరి వివాహ బంధానికి బీటలు ఏర్పడ్డాయి. సందీప్ తరఫు న్యాయవాది మాత్రం అర్షిత మానసిక రుగ్మతతో బాధపడుతోందని, అందుకు సంబంధించిన ఆధారాలు తమ వద్ద ఉన్నాయన్నారు. అయితే చికిత్స తీసుకునేందుకు ఆమె నిరాకరించిందని, అశ్రితతో విడాకులు ఇప్పించాలని కోర్టును ఆశ్రయించినట్లు తెలిపారు. ఇక కరీష్మా, సందీప్ తోష్నివాల్ బంధం గురించి మీడియాలో ఇప్పటికే పెద్ద ఎత్తు వార్తలు కూడా వెలువడ్డాయి. ఇటీవలే కరీనా తన కొడుకు పుట్టిన సందర్భంగా ఇచ్చిన పార్టీలోనూ సందీప్ తోష్నివాల్ హడావుడి కూడా కనిపించింది. కరీష్మా కుటుంబం కూడా వీరి పెళ్లికి ఆమోదం తెలిపినట్లు తెలుస్తోంది. -
'డబ్బు కోసమే నన్ను పెళ్లి చేసుకుంది'
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరిష్మా కపూర్ విడాకుల వ్యవహారం మరోసారి చర్చకు వచ్చింది. ఇప్పటికే విడాకుల కోసం కోర్టు మెట్లెక్కిన ఈ జంట, ఇప్పుడు వ్యక్తిగత విమర్శలతో మరోసారి వార్తల్లో నిలిచింది. కరిష్మా కేవలం తన డబ్బు కోసమే తనను పెళ్లి చేసుకుందంటూ కోర్టులో ఫిర్యాదు చేశాడు ఆమె భర్త సంజయ్ కపూర్. అంతేకాదు ఆమె ప్రవర్తన పై కూడా పలు ఆరోపణలు చేశాడు. పెళ్లికి ముందు ఆమెకు అభిషేక్ బచ్చన్ తో సాన్నిహిత్యం ఉందని, తనతో విడిపోయాకే తనను పెళ్లాడిందని ఆరోపించాడు. ఎంతో సాంప్రదాయ బద్దంగా ఉండే తన కుటుంబాన్ని కూడా గ్లామర్ వరల్డ్ గా మార్చే ప్రయత్నం చేసిందని, తమ పిల్లలు తన తండ్రి దగ్గరకు వెళ్లడానికి కూడా అంగీకరించేది కాదని ఫిర్యాదులో పేర్కొన్నాడు. కేవలం భార్యగానే కాదు, ఒక కోడలిగా, తల్లిగా కూడా కరిష్మా విఫలమయ్యిందని, అందుకే తనకు విడాకులు కావాలని కోరుతున్నానని చెప్పాడు. కరిష్మా తరుపు లాయర్లు మాత్రం ఈ వాదనను ఖండిస్తున్నారు. కేవలం కరిష్మా ఇమేజ్ను పాడు చేయటం కోసం ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారన్నారు. -
కరిష్మా నుంచి పిల్లల్ని నాకు అప్పగించండి!
వేరువేరుగా ఉంటున్న బాలీవుడ్ నటి కరిష్మా కపూర్, ఆమె భర్త సంజయ్కపూర్ మధ్య విడాకుల గొడవ సద్దుమణుగకముందే.. మరో అంశం తెరపైకి వచ్చింది. ప్రస్తుతం కరిష్మా వద్ద ఉన్న పిల్లల్ని తన కస్టడీకి అప్పగించాలని కోరుతూ భర్త సంజయ్ కపూర్ ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించాడు. దూరంగా ఉంటున్న ఈ దంపతుల విడాకుల పిటిషన్ను గత నెలలో కోర్టు పరిష్కరించింది. విడాకుల కోసం గతంలో వీరు దాఖలు చేసిన ఉమ్మడి సమ్మతిని ఉపసంహరించుకోవడంతో కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో తమకు పుట్టిన సమీర, కియాన్రాజ్లను కరిష్మా నుంచి తన కస్టడీకి అప్పగించాలని కోరుతూ 15 రోజుల కిందట సంజయ్కపూర్ ఫామిలీ కోర్టులో దరఖాస్తు చేశారని ఆయన తరఫు లాయర్ తెలిపారు. గతంలోనూ సంజయ్కపూర్ ఇదే తరహా అప్లికేషన్ను కోర్టులో వేశారని, అయితే, అప్పట్లో విడాకుల కోసం ఇద్దరు ఉమ్మడి సమ్మతితో కోర్టును ఆశ్రయించడం, విడాకుల చట్టంలో పిల్లల సంరక్షణకు సంబంధించిన నిబంధనలు ఉండటంతో ఆయన తన దరఖాస్తును ఉపసంహరించుకున్నారని ఆయన వివరించారు. ఈ విషయమై స్పందించడానికి కరిష్మా తరఫు లాయర్ ముందుకురాలేదు.