'భర్త పోయాక మొదటి మ్యారేజ్ డే'.. ప్రముఖ నటి ఎమోషనల్ పోస్ట్ | Priya Sachdev kapur marks 1st anniversary after Sunjay Kapur death | Sakshi
Sakshi News home page

Priya Kapur: '7 జన్మలు కలిసి ఉండాలని చెప్పావ్'.. ప్రియా కపూర్ ఎమోషనల్ పోస్ట్

Apr 13 2026 9:13 PM | Updated on Apr 13 2026 9:16 PM

Priya Sachdev kapur marks 1st anniversary after Sunjay Kapur death

ప్రముఖ బాలీవుడ్ నటి ప్రియా కపూర్ తన తొమ్మిదవ వివాహ వార్షికోత్సవం సందర్భంగా ఎమోషనల్ పోస్ట్ చేసింది.  తన భర్త, వ్యాపారవేత్త సంజయ్ కపూర్‌ను గుర్తు చేసుకుంది. ఆయన మరణించిన తర్వాత వచ్చిన మొదటి వివాహా వార్షికోత్సవం కావడంతో భావోద్వేగానికి గురైంది. ఈ సందర్భంగా తన పెళ్లి ఫోటోలతో పాటు ఓ లేఖను ఆమె పంచుకున్నారు. తమ బంధం ఇప్పటికీ కూడా కొనసాగుతుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. పంజాబీ సాంప్రదాయంలో జరిగిన తమ వివాహానికి సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ ఆ సంతోషకరమైన రోజులను గుర్తు చేసుకున్నారు.

ప్రియా కపూర్ తన ఇన్‌స్టాలో రాస్తూ.. 'హ్యాపీ యానివర్సరీ జే . గతేడాది మన 8వ వార్షికోత్సవాన్ని నీ స్నేహితులతో కలిసి జరుపుకున్నాం. ఆ వేడుక చాలా సందడిగా, ఆత్మీయంగా, నవ్వులతో నిండిపోయింది. నువ్వు నా వైపు చూసి, మనం రాబోయే 7 జన్మల పాటు కలిసి ఉండాలని కోరుకుంటున్నానని చెప్పావు. ఆ మాటకు నేను కట్టుబడి ఉంటా. మన ఏడ వార్షికోత్సవం రోజు నువ్వు నా కోసం అందమైన లేఖ రాశావు. అత్యంత అమూల్యమైన బహుమతి. అందులోని ప్రతి పదాన్ని నేను నా హృదయంలో పదిలపరుచుకున్నా. నువ్వు కేవలం నా భర్తవి మాత్రమే కాదు. నువ్వు నా ఆత్మబంధువువి. నా హృదయ స్పందనవి. నిన్ను ప్రేమించడం అనేది నాకు తెలిసినంతలో అత్యంత సులభమైన విషయం. నువ్వు సాధారణమైనదాన్ని కూడా అద్భుతంగా మార్చావు.' అంటూ రాసుకొచ్చింది.

నటి ప్రియా సచ్‌దేవ్ కపూర్ తన లేఖను అత్యంత భావోద్వేగంగా రాసుకొచ్చారు. సంజయ్ కపూర్ కేవలం తన గతం మాత్రమే కాదని.. తన భవిష్యత్తులో కూడా ఒక భాగమని ఆమె తెలిపారు.  మా కథ ఇంకా ముగియలేదని.. మాబంధం శాశ్వతమైనదని కూడా ఆమె పేర్కొన్నారు. మనం అనేక జన్మల పాటు కలిసి ఉంటామని అతను ఇచ్చిన వాగ్దానాన్ని ప్రియా గుర్తుచేసుకున్నారు. ఆ క్షణాలన్నీ తిరిగి తీసుకువస్తే.. మళ్లీ నీతోనే జీవిస్తానని ఎమోషనల్ నోట్ రాసుకొచ్చారు.

కాగా.. జూన్ 12, 2025న, ఇంగ్లాండ్‌లో ఒక పోలో మ్యాచ్ ఆడుతుండగా సంజయ్ కపూర్ మరణించారు. ఆయన 2017లో ప్రియ కపూర్‌ను వివాహం చేసుకున్నారు. వీరికి అజారియస్ అనే కుమారుడు ఉన్నాడు. అంతకుముందు సంజయ్‌కు కరిష్మా కపూర్‌తో గతంలో జరిగిన వివాహం జరిగింది. వీరిద్దరికి సమైరా, కియాన్ అనే పిల్లలు ఉన్నారు.

 

 

 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement