-
IPL 2024: ఐపీఎల్ చరిత్రలో తొలిసారి ఇలా..!
ఇండియన్ ప్రీమియర్ లీగ్లో మరో ముందడుగు పడింది. క్యాష్ రిచ్ లీగ్ చరిత్రలో తొలిసారి చెవిటి, దృష్టి లోపం ఉన్న అభిమానుల కోసం సంకేత భాష మరియు వివరణాత్మక వ్యాఖ్యానాన్ని అందించనున్నారు. చెవిటి, దృష్టి లోపం ఉన్న అభిమానుల సౌకర్యార్దం స్టార్ స్పోర్ట్స్ ఛానల్ ఈ నూతన అధ్యాయానికి శ్రీకారం చుట్టింది. ఐపీఎల్ 2024 సీజన్ తొలి మ్యాచ్ నుంచి ఈ తరహా వ్యాఖ్యానం అమల్లోకి రానుంది. ఈ నూతన ఒరవడిని అమల్లో పెట్టేందుకు ఐపీఎల్ అధికారిక ప్రసారకర్త అయిన స్టార్ స్పోర్ట్స్ ఇండియా సైనింగ్ హ్యాండ్స్ (ISH) న్యూస్తో చేతులు కలిపింది. ఐఎస్హెడ్ నిపుణుల ఆధ్వర్యంలో ఫీడ్ను భారతీయ సంకేత భాషను ఉపయోగించి బాల్ టు బాల్ అప్డేట్స్ ఇస్తామని స్టార్ స్పోర్ట్స్ వెల్లడించింది. సంకేత బాష ఫీడ్తో పాటు సాధారణ వెర్బల్ స్కోర్ అప్డేట్స్ కూడా ఉంటాయని పేర్కొంది. ఈ వెసులుబాటుతో చెవిటి, దృష్టి లోపం ఉన్న క్రికెట్ అభిమానులు గేమ్లోని ప్రతి క్షణాన్ని ఆస్వాధిస్తారని విశ్వాసం వ్యక్తం చేసింది. ఇదిలా ఉంటే, ఇవాల్టి నుంచి ఐపీఎల్ 2024 సీజన్ ప్రారంభంకానున్న విషయం తెలిసిందే. చెన్నైలోని చెపాక్ వేదికగా జరిగే సీజన్ తొలి మ్యాచ్లో డిఫెండింగ్ ఛాంపియన్ సీఎస్కే.. ఆర్సీబీతో తలపడనుంది. ఈ మ్యాచ్ రాత్రి 7:30 గంటలకు ప్రారంభమవుతుంది. -
విరాట్ కోహ్లికి ఘోర అవమానం! మండిపడుతున్న ఫ్యాన్స్
టెస్ట్ క్రికెట్లో ఈ ఏడాది అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన ఆటగాళ్లతో కూడిన ప్లేయింగ్ ఎలెవన్ను స్టార్ స్పోర్ట్స్ ప్రకటించింది. దక్షిణాఫ్రికా-భారత్ మధ్య బాక్సింగ్ డే టెస్ట్ లంచ్ బ్రేక్ సందర్భంగా ఈ లిస్ట్ను స్టార్ స్పోర్ట్స్ విడుదల చేసింది. ఈ జాబితాలో ఓపెనర్లగా ఆసీస్ స్టార్ ఆటగాడు ఉస్మాన్ ఖావాజా, టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు చోటు దక్కింది. అదే విధంగా మూడు నాలుగు స్ధానాల్లో వరుసగా ఇంగ్లండ్ వెటరన్ జో రూట్, కివీస్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ను స్టార్స్పోర్ట్స్ ఎంపిక చేసింది. ఐదో స్ధానంలో ఆసీస్ విధ్వంసకర ఆటగాడు ట్రావిస్కు హెడ్కు అవకాశం దక్కింది. వికెట్ కీపర్గా ఇంగ్లండ్ ఆటగాడు జానీ బెయిర్ స్టో ఎంపికయ్యాడు. ఆల్రౌండర్ల కోటాలో టీమిండియా వెటరన్ ఆటగాళ్లు రవీంద్ర జడేజా, రవి అశ్విన్కు చోటిచ్చింది. ఇక ఫాస్ట్ బౌలర్ల కోటాలో ఆసీస్ స్పీడ్ స్టార్లు మిచెల్ స్టార్క్, ప్యాట్ కమ్మిన్స్, ఇంగ్లండ్ మాజీ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ ఉన్నారు. విరాట్ కోహ్లికి ఛాన్స్..? అయితే ఈ జట్టులో టీమిండియా స్టార్ ఆటగాడు, రన్మిషన్ విరాట్ కోహ్లికి చోటు దక్కకపోవడం గమనార్హం. దీంతో స్టార్స్పోర్ట్స్పై కింగ్ కోహ్లి అభిమానులు మండిపడుతున్నారు. ఈ ఏడాది టెస్టుల్లో మిడిలార్డర్లో అద్భుతంగా రాణిస్తున్న కోహ్లికి చోటు ఇవ్వడంపై అభిమానలుతో పాటు మాజీ క్రికెటర్ల సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. స్టార్ స్పోర్ట్ను అభిమానులు దారుణంగా ట్రోలు చేస్తున్నారు. ఇదే విషయంపై టీమిండియా మాజీ ఆల్రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ సైతం స్పందిచాడు. 'ఈ ఏడాది టెస్టుల్లో 55 బ్యాటింగ్ యావరేజ్ ఉన్న కోహ్లీకి ఇయర్ ఆఫ్ ది టీమ్లో చోటు దక్కకపోవడం షాకింగ్గా ఉందని' ఓ జాతీయ ఛానల్తో పేర్కొన్నాడు. కాగా ఈ ఏడాది 8 టెస్టులు ఆడిన విరాట్.. 54.09 సగటుతో 595 పరుగులు చేశాడు. అతడు ఇన్నింగ్స్లలో రెండు సెంచరీలు, ఒక హాఫ్ సెంచరీ ఉంది. స్టార్ స్పోర్ట్స్ టెస్ట్ టీమ్ ఆఫ్ ది ఇయర్: ఉస్మాన్ ఖవాజా, రోహిత్ శర్మ, జో రూట్, కేన్ విలియమ్సన్, ట్రావిస్ హెడ్, జానీ బెయిర్స్టో, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, మిచెల్ స్టార్క్, ప్యాట్ కమిన్స్, స్టువర్ట్ బ్రాడ్. Star Sports Test team of the year. pic.twitter.com/I0JqE9rCOc — Mufaddal Vohra (@mufaddal_vohra) December 26, 2023 Irfan Pathan said "Kohli has 55 Test average in 2023 & it's shocking that he is missing in the test team of the year" [Star Sports] pic.twitter.com/zYd467NA7x — Johns. (@CricCrazyJohns) December 26, 2023 -
India vs South Africa: సఫారీ ‘టెస్టు’ సవాల్
దక్షిణాఫ్రికా గడ్డపై ఎనిమిదిసార్లు పర్యటన... 23 టెస్టుల్లో బరిలోకి...4 టెస్టుల్లో విజయాలు ... 12 పరాజయాలు... సమంగా ముగిసిన మరో 7 మ్యాచ్లు... అయితే 31 ఏళ్లలో ఒక్క సిరీస్ కూడా భారత్ సొంతం కాలేదు... గతంలో ఎన్నడూ గెలవని ఆ్రస్టేలియా, న్యూజిలాండ్, వెస్టిండీస్ వేదికలపై కూడా ఈ మూడు దశాబ్దాల వ్యవధిలో తొలిసారి సిరీస్ విజయాలు సాధించి టీమిండియా లెక్క సరి చేసింది... కానీ ఇప్పటికి కొరకరాని కొయ్యలా మిగిలింది సఫారీ టూర్ మాత్రమే... ఇక్కడ మాత్రం మనకు ఇప్పటి వరకు సిరీస్ దక్కలేదు. ఈ రికార్డును చెరిపేసేందుకు రోహిత్ శర్మ నేతృత్వంలో టీమిండియా మరోసారి దక్షిణాఫ్రికా గడ్డపై అడుగు పెట్టింది. ఫామ్లో ఉన్న ఆటగాళ్లతో సత్తా చాటి భారత్ ఈసారి ఆ లోటును తీరుస్తుందా లేక స్వదేశంలో బలమైన సఫారీ సేన తమ ఆధిక్యాన్ని నిలబెట్టుకుంటుందా అనేది ఆసక్తికరం. సెంచూరియన్: టి20, వన్డేల తర్వాత భారత్, దక్షిణాఫ్రికా మధ్య రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్కు రంగం సిద్ధమైంది. ఇక్కడి సూపర్ స్పోర్ట్ పార్క్లో ఇరు జట్ల మధ్య నేటినుంచి తొలి టెస్టు జరుగుతుంది. కొంత విరామం తర్వాత రెండు టీమ్లూ టెస్టు మ్యాచ్ బరిలోకి దిగుతున్నాయి. భారత జట్టు ఆఖరిసారిగా గత జూలైలో వెస్టిండీస్ గడ్డపై సిరీస్ ఆడగా... దక్షిణాఫ్రికా స్వదేశంలో చివరిసారిగా గత మార్చిలో విండీస్తోనే తలపడింది. బలాబలాలను బట్టి చూస్తే ఇరు జట్లూ సమ ఉజ్జీలుగానే కనిపిస్తున్నాయి. రెండు టీమ్ల నుంచి కూడా టి20, వన్డే సిరీస్ల నుంచి విశ్రాంతి తీసుకున్న పలువురు అగ్రశ్రేణి ఆటగాళ్లు కొత్త ఉత్సాహంతో ఇప్పుడు టెస్టు సిరీస్కు సన్నద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో హోరాహోరీ సమరానికి అవకాశం ఉంది. ప్రసిధ్ కృష్ణకు అవకాశం... పుష్కర కాలం... భారత టెస్టు క్రికెట్ గొప్ప విజయాల్లో భాగంగా ఉన్న పుజారా, రహానే ఇద్దరూ తుది జట్టులో లేకుండా జట్టు విదేశీ గడ్డపై టెస్టు ఆడి 12 ఏళ్లు అయింది! 2012 జనవరిలో అడిలైడ్లో ఆసీస్తో మ్యాచ్ తర్వాత వీరిద్దరూ లేకుండా విదేశాల్లో టెస్టు ఆడని భారత జట్టు ఇప్పుడు కొత్తగా సిద్ధమైంది. వరల్డ్ కప్ ఫామ్ను బట్టి చూస్తే కెపె్టన్ రోహిత్, కోహ్లిల బ్యాటింగ్ భారత్కు కీలకం కానుంది. రాహుల్కు రెండు సిరీస్ల అనుభవం ఉండగా, గిల్ తొలిసారి దక్షిణాఫ్రికా గడ్డపై ఆడబోతున్నాడు. వీరితో పోలిస్తే శ్రేయస్, యశస్వి ఇంకా కొత్త ఆటగాళ్ల కిందే లెక్క. ఈ స్థితిలో రోహిత్, కోహ్లిల ప్రదర్శనపై జట్టు విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి. కఠినమైన ప్రత్యర్థి బౌలర్లను ఎదుర్కొని భారత టాప్–6 ఎన్ని పరుగులు సాధిస్తుందనేది చూడాలి. ఆల్రౌండర్గా జడేజా రాణించాల్సి ఉంది. పిచ్ను దృష్టిలో ఉంచుకొని చూస్తే అశ్విన్కంటే శార్దుల్కే చాన్స్ దక్కవచ్చు. బుమ్రా, సిరాజ్ ప్రధానంగా పేస్ బౌలింగ్ భారం మోస్తారు. వరల్డ్కప్లో అదరగొట్టిన షమీ లేకపోవడం జట్టుకు పెద్ద లోటే. అతని స్థానంలో మూడో పేసర్గా ప్రసిధ్, ముకేశ్లకు ఒకరికి చాన్స్ ఉంటుంది. పేస్ పదును... టి20, వన్డే సిరీస్లో దక్షిణాఫ్రికా బౌలింగ్ను చూస్తే ఆ జట్టును తక్కువగా అంచనా వేయడానికి లేదు. గాయాల నుంచి కోలుకున్న ప్రధాన పేసర్లు రబడ, ఎన్గిడి సమరోత్సాహంతో ఉన్నారు. వీరికి తోడుగా కొత్త స్టార్ కొయెట్జీ కూడా చెలరేగేందుకు సిద్ధంగా ఉన్నాడు. సొంతగడ్డపై ఈ త్రయం బౌలింగ్ భారత్కు పరీక్ష పెట్టవచ్చు. భిన్నమైన శైలి గల జాన్సెన్ కూడా జత కలిస్తే జట్టు బౌలింగ్ మరింత పదునెక్కుతుంది. కెరీర్కు ఘనమైన ముగింపు ఇవ్వాలని భావిస్తున్న సీనియర్ ఎల్గర్తో పాటు మార్క్రమ్, బవుమా బ్యాటింగ్లో కీలకం. కొత్త ఆటగాళ్లు జోర్జి, బెడింగామ్ కూడా ప్రభావం చూపగలరు. తుది జట్లు (అంచనా) భారత్: రోహిత్ (కెపె్టన్), యశస్వి, గిల్, కోహ్లి, రాహుల్, శ్రేయస్, జడేజా, శార్దుల్, బుమ్రా, ప్రసిధ్, సిరాజ్. దక్షిణాఫ్రికా: బవుమా (కెపె్టన్), ఎల్గర్, మార్క్రమ్, జోర్జి, బెడింగామ్, వెరీన్, జాన్సెన్, మహరాజ్, కొయెట్జీ, రబడ, ఎన్గిడి. పిచ్, వాతావరణం పేస్కు బాగా అనుకూలమైన పిచ్. తొలి రెండు రోజులు మ్యాచ్కు వర్షం అంతరాయం కలిగించవచ్చు. ఈ వేదికపై దక్షిణాఫ్రికా 28 టెస్టు మ్యాచ్లలో 22 గెలిచి, 3 మాత్రమే ఓడింది. -
IND Vs PAK: చలో చిరకాల సమరానికి.. నేడు భారత్,పాక్ల మధ్య వరల్డ్కప్ మ్యాచ్
ప్రపంచకప్లో 51 మ్యాచ్లు ఉన్నా, అందరూ ఎదురు చూసేది ‘ఈ’ మ్యాచ్ కోసమే... ఈ మ్యాచ్ కోసమే ప్రసారకర్తలు ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు సిద్ధం చేస్తారు... ఈ మ్యాచ్ కోసమే ఫ్లయిట్ టికెట్లు, ప్రకటనల రేట్లు ఆకాశానికి అంటుతాయి... ఈ మ్యాచ్ కోసమే అభిమానులు ఎన్ని కష్టాలకోర్చి అయినా మైదానంలోకి అడుగు పెట్టాలని ఆశపడతారు... ఈ మ్యాచ్ కోసమే ఆస్పత్రి మంచాలు కూడా హోటల్ బెడ్లుగా మారిపోతాయి... ఈ మ్యాచ్ కోసమే సినీ తారలతో ప్రత్యేక సంగీత కార్యక్రమం ఉంటుంది... ఈ మ్యాచ్ అంటే బీసీసీఐ, ఐసీసీ దృష్టిలో ‘నవరాత్రి’ సంబరం... చరిత్ర అంతా ఒక వైపే ఉండవచ్చు... వన్డే ప్రపంచకప్లో ఏడుసార్లు తలపడితే ప్రతీసారి భారత్నే విజయం వరించి ఉండవచ్చు... ప్రస్తుత బలాబలాలు, ఇటీవలి ప్రదర్శన చూస్తే మరో మాటకు తావు లేకుండా టీమిండియానే ఫేవరెట్ అనవచ్చు... అయినా సరే ఈ పోరుకు ఎక్కడ లేని ఆకర్షణ... సరిహద్దు ఉద్రిక్తతలు, రాజకీయాల కారణంగా ఇది ఆట మాత్రమే కాకుండా అంతకు మించిన భావోద్వేగ సమరం... ఆటగాళ్లు మాకు అన్ని మ్యాచ్లాగే ఇదీ ఒకటి అని పైకి చెప్పవచ్చు కానీ వారికీ తెలుసు... మైదానంలో దిగాక తమ గుండె చప్పుడు ఎలా ఉంటుందో... దాదాపు ఏడాది క్రితం అక్టోబర్ 23, 2022న టి20 ప్రపంచకప్లో రవూఫ్ బౌలింగ్లో కోహ్లి బాదిన రెండు వరుస సిక్సర్లు గుర్తుకొచ్చాయా... నాడు 90 వేల మంది సామర్థ్యం గల మెల్బోర్న్ స్టేడియం దద్దరిల్లింది. ఇప్పుడు 1,32,000 మంది ప్రేక్షకులతో నరేంద్ర మోదీ మైదానం మోతెక్కడం ఖాయం. ఈ రెండింటి మధ్య ఆసియా కప్లో తలపడినా వరల్డ్కప్ లెక్క వేరు... మన అభిమానులతో స్టాండ్లు ‘నీలి సముద్రం’గా మారబోతుండగా, ఏడేళ్ల తర్వాత భారత గడ్డపై భారత్ను ఎదుర్కొంటూ తమకు మద్దతిచ్చే ఒక్క అభిమానీ లేని పాక్ తట్టుకోగలదా అనేది ఆసక్తికరం. అహ్మదాబాద్: వరల్డ్కప్లో అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న మెగా సమరానికి రంగం సిద్ధమైంది. ఉత్కంఠ, భారీ అంచనాల నడుమ నేడు నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగే లీగ్ మ్యాచ్లో భారత్, పాకిస్తాన్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్లో గెలిస్తే పాక్పై వన్డే వరల్డ్కప్ మ్యాచ్లలో భారత్ ఆధిక్యం మరింత పెరుగుతుంది. మరోవైపు ఒక్కసారైనా టీమిండియాను ఓడించి పేలవ గణాంకాలకు ఫుల్స్టాప్ పెట్టాలని పాక్ భావిస్తోంది. టోర్నీలో తమ తొలి రెండు మ్యాచ్లలో ఆ్రస్టేలియా, అఫ్గానిస్తాన్లపై భారత్ భారీ విజయం సాధించగా... నెదర్లాండ్స్, శ్రీలంకలను ఓడించిన పాక్ ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతోంది. ఇటీవలి ఆసియా కప్ ప్రదర్శనను బట్టి చూస్తే అన్ని రంగాల్లో భారత్ ఆధిక్యం స్పష్టంగా కనిపిస్తోంది. అయితే అనూహ్యంగా ఆడే పాక్ను తక్కువగా అంచనా వేయడానికి వీల్లేదు. గిల్ బరిలో దిగుతాడా... భారత్ తుది జట్టు విషయంలో మామాలుగానైతే ఎలాంటి సమస్య లేదు. కానీ డెంగీ జ్వరం కారణంగా గత రెండు మ్యాచ్లు ఆడని శుబ్మన్ గిల్ బరిలోకి దిగడంపైనే ఉత్కంఠ నెలకొంది. అనారోగ్యం నుంచి కోలుకున్న అతను గురువారం స్వల్ప సమయం పాటు సాధన చేసినా... శుక్రవారం మాత్రం సుదీర్ఘంగా బ్యాటింగ్ చేశాడు. కెపె్టన్ రోహిత్ ‘గిల్ 99 శాతం ఫిట్గా ఉన్నాడు’ అని చెప్పడం అతను ఆడే అవకాశాలను మెరుగుపర్చింది. ఈ ఏడాది అద్భుత ఫామ్లో ఉండటంతో పాటు ఐపీఎల్లో ఇది అతని సొంత మైదానం కావడం కూడా మరో కారణం. అయితే ఆ ఒక్క శాతం పూర్తిగా కోలుకోకపోతేనే సమస్య. గిల్ లేకపోతే ఇషాన్ కిషన్ ఓపెనర్గా బరిలోకి దిగుతాడు. రోహిత్, కోహ్లి, కేఎల్ రాహుల్ల బ్యాటింగ్ ఫామ్ భారత్కు పెద్ద బలం. అఫ్గాన్పై సెంచరీతో రోహిత్ తన స్థాయిని చూపిస్తే కోహ్లి ప్రశాంతంగా రెండు అర్ధ సెంచరీలు సాధించాడు. 2015లో కోహ్లి, 2019లో రోహిత్ పాక్పై సెంచరీలతో చెలరేగారు. రాహుల్ కూడా తన విలువను ప్రదర్శిస్తుండగా, మిడిలార్డర్లో శ్రేయస్ అయ్యర్ మరింత మెరుగైన ప్రదర్శన ఇవ్వాల్సి ఉంది. పాండ్యా, జడేజా ఆల్రౌండ్ ప్రదర్శనకు సిద్ధం కాగా, కుల్దీప్, సొంతగడ్డపై ఆడనున్న బుమ్రా బౌలింగ్ను పాక్ ఎలా ఎదుర్కొంటుందో చూడాలి. ఎనిమిదో స్థానంలో శార్దుల్ ఠాకూర్ను తప్పించి అశ్విన్కు మళ్లీ అవకాశం ఇవ్వవచ్చు. అయితే రెండు సీజన్లుగా ఈ మైదానంలో ఉత్తమ రికార్డు ఉన్న షమీ కూడా పరిశీలనలో ఉన్నాడు. జోరు కొనసాగేనా... శ్రీలంక బౌలింగ్ బలమైనది కాకపోయినా సరే వరల్డ్కప్ మ్యాచ్లో 345 పరుగుల లక్ష్యఛేదన అంత సులువు కాదు. కానీ దీనిని సాధించడం కచ్చితంగా పాకిస్తాన్ జట్టులో ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. ఆ మ్యాచ్కు ముందు నెదర్లాండ్స్తో తడబడిన తీరుతో పోలిస్తే ఆ జట్టు పరిస్థితి మారింది. హైదరాబాద్లో ఆడిన తుది జట్టునే పాక్ ఇక్కడా కొనసాగించవచ్చు. రిజ్వాన్ ఫామ్లో ఉండగా, అబ్దుల్లా షఫీక్ రూపంలో దూకుడైన ఓపెనర్ వెలుగులోకి రావడం సానుకూలాంశం. మిడిలార్డర్లో షకీల్, ఇఫ్తికార్ తమ వంతు పాత్ర పోషించగలరు. అయితే ఇమామ్ పేలవ ఆటతో పాటు జట్టు నంబర్వన్ బ్యాటర్ బాబర్ ఆజమ్ విఫలం కావడమే టీమ్ను ఆందోళన పరుస్తోంది. గత ఐదు ఇన్నింగ్స్లలో కలిపి బాబర్ 71 పరుగులే చేశాడు. అతను తన స్థాయికి తగినట్లుగా ఆడితే జట్టుకు ప్రయోజనం కలుగుతుంది. బౌలింగ్లో ఇప్పటికీ ప్రధాన అస్త్రం షాహిన్ అఫ్రిదినే. తన పదునైన లెఫ్టార్మ్ పేస్తో ఆరంభ ఓవర్లలో అతను భారత బ్యాటర్లను నిలువరించాలని జట్టు కోరుకుంటోంది. ఆపై రవూఫ్ కూడా కీలకం కానున్నాడు. భారీగా పరుగులిచ్చే హసన్ అలీ స్థానంలో వసీమ్ ఆడే అవకాశం ఉంది. టీమ్లో ఒక ప్రధాన స్పిన్నర్ లేకపోవడం పాక్ జట్టు పెద్ద బలహీనత. షాదాబ్, నవాజ్లను భారత బ్యాటర్లు అలవోకగా ఎదుర్కోగలరు. పిచ్, వాతావరణం గత రెండేళ్లలో ఇక్కడ జరిగిన నాలుగు వన్డేల్లో 59.8 శాతం వికెట్లు తీసి పేసర్లు ఎక్కువ ప్రభావం చూపించారు. అయితే ఈ మ్యాచ్ కోసం నల్లరేగడి మట్టి ఉన్న పిచ్ను ఎంచుకున్నారు. అంటే పిచ్ నెమ్మదిగా మారిపోయి బ్యాటింగ్కు అనుకూలిస్తుంది. ప్రేక్షకుల కోణంలో పరుగుల వరద కోసమే నిర్వాహకులు సిద్ధమైనట్లు అర్థమవుతోంది. వేడి వాతావరణం, వర్ష సూచన లేదు. మూడో స్పిన్నర్ను ఆడించే విషయంపై ఇప్పుడే చెప్పలేను. పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకుంటాం. తుది జట్టులో అవసరమైతే ఒకటి రెండు మార్పులు చేస్తాం. గత నాలుగేళ్లలో నేనేమీ పెద్దగా మారలేదు. బ్యాటర్గా చూస్తే ప్రతీ మ్యాచ్కు ముందు నా లోపాలు సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తా. దాని వల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. సన్నద్ధతలో లోటు ఉండదు. ప్రతీ రోజు కొత్త సవాలే. అన్నింటికీ సిద్ధంగా ఉంటా. నా ఆటేంటో, జట్టుకు నా అవసరం ఏమిటో బాగా తెలుసు. కెప్టెన్గా ఈ మ్యాచ్ కోసం సహచరులకు ప్రత్యేక సూచనలేమీ చేయను. వరల్డ్కప్లో అన్ని మ్యాచ్లలాగే ఇదీ ఒకటి. –రోహిత్ శర్మ, భారత కెప్టెన్ సారథిగా నాపై ఎలాంటి ఒత్తిడీ లేదు. ఒక్క మ్యాచ్ వల్ల నాకు కెప్టెన్సీ రాలేదు. ఈ ఒక్క మ్యాచ్ వల్ల అది పోదు. దేవుడు ఎంత ఇస్తే అంతే దక్కుతుంది. భారీ సంఖ్యలో ఉన్న ప్రేక్షకుల మధ్య గతంలో ఎన్నోసార్లు ఆడాం కాబట్టి ఇదేమీ కొత్త కాదు. పాక్ అభిమానులను అనుమతిస్తే బాగుండేది. కానీ మద్దతు లేకపోయినా మేం దీనికి సిద్ధమయ్యే ఉన్నాం. చరిత్ర గురించి నేను పట్టించుకోను. రికార్డులు ఏదో ఒక రోజు బద్దలవుతాయి. 2021 టి20 ప్రపంచకప్లో మేం భారత్ను ఓడించాం. అంతకుముందు అదీ లేదు కదా. కాబట్టి దేనికైనా ఎక్కడో ఒక చోట ముగింపు తప్పదు. –బాబర్ ఆజమ్, పాకిస్తాన్ కెప్టెన్ తుది జట్లు (అంచనా) భారత్: రోహిత్ (కెప్టెన్), గిల్/ఇషాన్ కిషన్, కోహ్లి, శ్రేయస్, రాహుల్, పాండ్యా, జడేజా, అశ్విన్/షమీ, బుమ్రా, కుల్దీప్, సిరాజ్. పాకిస్తాన్: బాబర్ ఆజమ్ (కెప్టెన్), షఫీక్, ఇమా మ్, రిజ్వాన్, షకీల్, ఇఫ్తికార్, షాదాబ్, నవాజ్, షాహిన్ అఫ్రిది, హసన్/వసీమ్, రవూఫ్. -
Asia Cup 2023, India vs. Pakistan: నేడే ‘ఆసియా’ అసలు సమరం
పల్లెకెలె: వన్డే ప్రపంచకప్కు ఇంకొన్ని రోజులే ఉంది. మెగా ఈవెంట్కు ముందు క్రికెట్ ప్రపంచం ఒళ్లంతా కళ్లు చేసుకునే కీలక మ్యాచ్ నేడు జరుగనుంది. చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్తాన్ జట్లు సై అంటే సై అనే పోరుకు ఆసియా కప్ వన్డే టోర్నీ వేదికైంది. నంబర్వన్ పాక్, ఆసియా కప్ ఫేవరెట్ భారత్ మధ్య జరగబోయే ఈ పోరు టోర్నీకే హైలైట్గా నిలవడం ఈపాటికే ఖాయమైంది. కేవలం వన్డే ఫార్మాట్నే చూసుకుంటే గత వన్డే ప్రపంచకప్ తర్వాత ఇరు జట్లు తలపడే 50 ఓవర్ల పోటీ ఇదే! గతేడాది జరిగిన టి20 వరల్డ్కప్లో విరాట్ అద్భుత ప్రదర్శన తర్వాత ఇరు జట్లు ఇప్పుడు తలపడుతున్నాయి. మెల్బోర్న్ తరహాలో లంక గడ్డపై కూడా మరో హోరాహోరీ ఖాయం. కొత్త ఉత్సాహంతో రోహిత్ బృందం గత కొన్నాళ్లుగా స్వదేశంలో జరిగే ప్రపంచకప్ కోసం భారత్ చాలా ప్రయోగాలు చేసింది. రాహుల్, అయ్యర్, బుమ్రావంటి కీలక ఆటగాళ్ల గాయాల నేపథ్యంలో భారత టీమ్ మేనేజ్మెంట్ తగిన జాగ్రత్తలు తీసుకొని సీనియర్లు రోహిత్, కోహ్లిలకు బాగా విశ్రాంతినిస్తూ కాపాడుకుంటూ వచ్చింది. ఇక సమయం, సందర్భం రావడంతో టీమిండియా తురుపుముక్కలు బరిలోకి దిగుతున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఇది కచ్చితంగా ‘ప్రి ప్రపంచకప్’ పోటీనే! ఇందులో ఏ సందేహం లేదు. దాదాపు వరల్డ్కప్లో బరిలోకి దిగే జట్టును ఖాయం చేసేందుకు ఈ ఆసియా టోర్నీని జట్టు వాడుకుంటోంది. రోహిత్, కోహ్లిల ఫిట్నెస్, జట్టులోకి అనుభవజు్ఞడైన ఆల్రౌండర్ జడేజా పునరాగమనం, మరో ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా, బౌలింగ్ దళపతి బుమ్రా, ‘హైదరాబాద్ ఎక్స్ప్రెస్’ సిరాజ్ ఇలా చెప్పుకుంటూ పోతే భారత్ పూర్తి స్థాయి ప్రపంచకప్ సైన్యంతో రంగంలోకి దిగుతోంది. దీన్నిబట్టి చూస్తే పాక్ పనిపట్టేందుకు, ఆసియా కప్లో ఓడించేందుకు రోహిత్ సేనకు ఏమంత కష్టం కానేకాదు. పుంజుకున్న బలంతో పాక్ కొంత కాలంగా ఇంటాబయటా నిలకడైన విజయాలు, గట్టి ప్రత్యర్థులను ఓడించిన తీరుతో బాబర్ ఆజమ్ సేన మునుపటి కంటే పుంజుకుంది. బ్యాటింగ్లో ఫఖర్–ఇమామ్ ఓపెనింగ్ జోడీ నుంచి ఏడో నంబర్ షాదాబ్ ఖాన్ వరకు బ్యాటింగ్ చేసే సత్తా పాకిస్తాన్ పటిష్టంగా నిలుపుతోంది. బౌలింగ్లో పేస్ త్రయం షాహిన్ అఫ్రిది, నసీమ్ షా, రవూఫ్ ఆరంభంలో వికెట్లు పడగొట్టడంతో సఫలమవుతున్నారు. స్పిన్లో షాదాబ్, నవాజ్ సత్తా చాటుతుండటంతో పాకిస్తాన్ భారత్కు దీటుగా ఉంది. నంబర్వన్ హోదా అదనపు స్థైర్యాన్ని తెచ్చిపెట్టగా... రెట్టించిన ఉత్సాహంతో ప్రత్యర్థిని ఢీకొనేందుకు రెడీగా ఉంది. గత ఐదు వన్డేల్లో... భారత్, పాక్లు తలపడిన గత ఐదు వన్డేల్లో టీమిండియాదే 4–1తో పైచేయిగా ఉంది. 2017 చాంపియన్స్ట్రోఫీలో లీగ్ దశలో గెలిచి తుదిపోరులో భారత్ ఓడింది. 2018 ఆసియాకప్లో రెండుసార్లు టీమిండియా గెలిచింది. చివరిసారిగా గత వన్డే ప్రపంచకప్(2019)లోనూ భారత్దే గెలుపు. పిచ్–వాతావరణం ఇది కొత్త పిచ్. పక్కాగా దీనికే అనుకూలమని చెప్పలేం. లంక, బంగ్లా మధ్య జరిగినట్లే సీమర్లు, స్పిన్నర్లకు చక్కని చాన్స్! అయితే మ్యాచ్కు వాన ముప్పు పొంచివుంది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు వాన కురిసే అవకాశముండటంతో మ్యాచ్ మొదలయ్యేందుకు ఆలస్యం కావొచ్చు. తుది జట్లు (అంచనా) భారత్: రోహిత్ (కెప్టెన్ ), శుబ్మన్, కోహ్లి, అయ్యర్, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, జడేజా, శార్దుల్ /షమీ, కుల్దీప్, సిరాజ్, బుమ్రా. పాకిస్తాన్: బాబర్ ఆజమ్ (కెప్టెన్ ), ఫఖర్ జమాన్, ఇమామ్ ఉల్ హక్, రిజ్వాన్, ఆగా సల్మాన్, ఇఫ్తికార్, షాదాబ్ఖాన్, నవాజ్, షాహిన్ షా అఫ్రిది, నసీమ్ షా, రవూఫ్.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పురందేశ్వరి.. అది వారిని అవమానించడమే: విజయసాయిరెడ్డి
ప్రజలు జాగ్రత్త.. బాబుపై ద్వారంపూడి సెటైర్లు
దొంగలు దొరికారు
రాజకీయం కోసం ఎంత నీచానికైనా దిగజారతాడు..కన్నబాబు ఫైర్
ధోని జట్టులో అవసరమా?: ‘తలా’పై సంచలన వ్యాఖ్యలు
హిందూపురానికి బాలకృష్ణ చేసిందేమీ లేదు.. అందుకే ప్రజలు నాకు బ్రహ్మరథం పడుతున్నారు
జగనన్న సంక్షేమమే నన్ను గెలిపిస్తుంది..175/175 పక్కా
ప్రవీణ్తో బ్రేకప్.. తొలిసారి స్పందించిన ఫైమా
గోదారిలో గాలి కబుర్లే..!
బీఆర్ఎస్ శ్రేణుల్లో జోష్..
తప్పక చదవండి
- ‘ధనాధన్’ ధోని డకౌట్.. ప్రీతి జింటా రియాక్షన్ వైరల్
- MI Vs SRH: ఐపీఎల్లో నేడు (మే 6) మరో బిగ్ మ్యాచ్
- పొమ్మనలేక పొగ పెడుతున్నారా..!
- This Week In OTT: ఈ వారం ఓటీటీల్లో 17 సినిమాలు రిలీజ్.. ఏంటంటే?
- శ్రీలీలకి తెలుగులో ఛాన్సులు నిల్.. దీంతో ఏకంగా
- Cable Bridge: కేబుల్ బ్రిడ్జిపై పోలీసుల బర్త్ డే వేడుక
- అఖండ మెజార్టీతో గెలిపించండి: సీఎం వైఎస్ జగన్ సతీమణి భారతమ్మ
- పిఠాపురంలో గుట్టుచప్పడు కాకుండా జనసేన ‘గోకులం’ డ్రామా
- ఏ1 చంద్రబాబు, ఏ2 లోకేశ్
- మంచి మాట: నోరు మంచిదైతే...
Advertisement