-
పోలీసుల చిత్రహింసలు తప్పించుకునేందుకే...
న్యూఢిల్లీ: దర్యాప్తులో భాగంగా ఢిల్లీ పోలీసుల చిత్రహింసల నుంచి తప్పించుకునేందుకే స్పాట్ ఫిక్సింగ్కు పాల్పడినట్లు ఒప్పుకున్నానని... తాను మాత్రం ఏ తప్పూ చేయలేదని భారత మాజీ క్రికెటర్ శ్రీశాంత్ సుప్రీం కోర్టుకు తెలిపాడు. 2013 ఐపీఎల్లో ఫిక్సింగ్కు పాల్పడినట్లు తేలడంతో అతనిపై క్రికెట్ బోర్డు జీవితకాల నిషేధం విధించింది. దీనిపై కేరళకు చెందిన ఈ మాజీ పేసర్ న్యాయపోరాటం చేస్తున్నాడు. బుధవారం జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ కె.ఎం.జోసెఫ్లతో కూడిన ద్విసభ్య బెంచ్ ఈ కేసును విచారించింది. పోలీస్ టార్చర్ నుంచి తప్పించుకోవడానికే శ్రీశాంత్ నిందను మోశాడని అతని లాయర్ కోర్టుకు వివరించారు. శ్రీశాంత్ను బుకీలు సంప్రదించిన మాట నిజమేనని అయితే తను మాత్రం బుకీల బుట్టలో పడలేదని దీనికి సంబంధించి మలయాళంలో బుకీ–శ్రీశాంత్ల మధ్య జరిగిన సంభాషణను లాయర్ కోర్టుకు అందజేశాడు. మైదానంలో టవల్తో తుడుచుకోవడం, ఆడించడమనేది సహజమని, ఇలా అందరు క్రికెటర్లు చేస్తారని దీన్ని ఫిక్సింగ్కు సంజ్ఞగా భావించడం తగదని శ్రీశాంత్ తరఫు న్యాయవాది సల్మాన్ ఖుర్షీద్ వాదించారు. దీనిపై న్యాయమూర్తులు స్పందిస్తూ... బుకీలు ఫిక్సింగ్కు పాల్పడమని సంప్రదించినపుడు క్రికెటర్ ఆ విషయాన్ని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)కి ఎందుకు తెలపలేదని లాయర్ ఖుర్షీద్ను ప్రశ్నించారు. దీన్నిబట్టి శ్రీశాంత్ ప్రవర్తన ఎలాంటిదనే విషయం తేటతెల్లమవుతోందని బెంచ్ స్పష్టం చేసింది. -
స్పాట్ ఫిక్సింగ్లో అడ్డంగా దొరికిన క్రికెటర్
సాక్షి, న్యూఢిల్లీ: పాకిస్తాన్ క్రికెట్ ఆటగాళ్లు ఫిక్సింగ్లో కూరుకుపోయారు. స్పాట్ ఫిక్సింగ్కు పాల్పడి నిషేధానికి గురౌతున్నా ఆటగాళ్లు మాత్రం ఫిక్సింగ్లో దొరకుతూనే ఉన్నారు. సరిగ్గా మూడు నెలలక్రితం పాకిస్తాన్ సూపర్లీగ్లో స్పాట ఫిక్సింగ్కు పాల్పడుతున్నారనే ఆరోపణలతో పాక్ ఆల్రౌండర్ నవాజ్పై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు రెండు నెలలపాటు నిషేధం విధించిన సంఘటన మరవక ముందే మరొక ఆటగాడు ఫిక్సింగ్లో అడ్డంగా దొరికిపోయాడు. తాజాగా బుధవారం పాక్ ఓపెనర్ బ్యాట్మెన్ సార్జీల్ఖాన్పై పాకిస్తాన్ అవినీతి నిరోధక ట్రిబ్యునల్ 5ఏళ్లపాటు నిషేధం విధించింది. మంగళవారం పాకిస్తాన్ క్రికెట్ బోర్డు గత ఫిబ్రవరిలో దుబాయిలో నిర్వహించిన పాకిస్తాన్ సూపర్ లీగ్లో ఫిక్సింగ్కు పాల్పడ్డాడని సాక్ష్యాధారాలు సమర్పించడంతో ట్రిబ్యునల్ తుది తీర్పును వెలువరించింది. సార్జీల్ఖాన్ మ్యాచ్ ఫిక్సింగ్కు పాల్పతున్నారనే ఆరోపణలతో పాకిస్తాన్ సూపర్ లీగ్ ప్రారంభమైన రెండో రోజునే లీగ్ నుంచి వెనక్కి పంపించారు. స్పాట్ ఫిక్సింగ్లో దొరకడం పాక్ క్రికెటర్లకు కొత్తేం కాదు. గతంలో పాకిస్తాన్ మాజీ కెప్టెన్ సల్మాన్భట్, పేసర్ మహమ్మద్ అమీర్, ఆసిఫ్లు 2010 ఇంగ్లండ్ పర్యటనలో స్పాట్ ఫిక్సింగ్లో అడ్డంగా దొరికిపోయారు. 2012-13లో టెస్ట్ లెగ్ స్పిన్నర్ డానిష్ కనేరియా సైతం ఇంగ్లండ్ కౌంటీ క్రికెట్లో ఫిక్సింగ్కు పాల్పడ్డాడు. పాకిస్తాన్ సూపర్ లీగ్ ప్రారంభం అనంతరం ఈ ఫిక్సింగ్ భూతం మరింత విస్తరించింది. స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలతో ఆల్రౌండర్ మహ్మద్ నవాజ్పై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) మూడు నెలల క్రితం వేటు వేసింది. ఫిక్సింగ్ ఆరోపణలతో జంషెద్ అనే క్రికెటర్ కూడా గత ఫిబ్రవరిలో నిషేధాన్ని ఎదుర్కొన్నాడు. -
నిషేధం ఎత్తివేయం
శ్రీశాంత్కు తేల్చి చెప్పిన బీసీసీఐ న్యూఢిల్లీ: స్పాట్ ఫిక్సింగ్కు పాల్పడి జీవిత కాల నిషేధానికి గురైన పేసర్ శ్రీశాంత్ విషయంలో తమ వైఖరిలో ఎలాంటి మార్పూ లేదని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) స్పష్టం చేసింది. బీసీసీఐలో పరిపాలకుల కమిటీ (సీఓఏ) ఏర్పడిన తర్వాత తనపై నిషేధాన్ని తొలగించాలంటూ కొన్నాళ్ల క్రితం శ్రీ ప్రత్యేకంగా బోర్డుకు లేఖ రాశాడు. స్కాట్లాండ్లో లీగ్ మ్యాచ్లు ఆడుకునేందుకు అనుమతి ఇవ్వాలని కూడా కోరాడు. అయితే అతనిపై విధించిన నిషేధాన్ని తొలగించే ప్రశ్నే లేదని బీసీసీఐ స్పష్టం చేసింది. ఈ విషయాన్ని బోర్డు అధికారులు శ్రీశాంత్కు తెలియజేశారు. అవినీతిని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని బోర్డు తేల్చి చెప్పింది. ‘శ్రీశాంత్పై జీవిత కాలం నిషేధం కొనసాగుతుంది. అతను ఎలాంటి పోటీ క్రికెట్లోనూ పాల్గొనేందుకు అనుమతించం. ఇదే విషయాన్ని అతనికి తెలియజేశాం. ఫిక్సింగ్ విషయంలో శ్రీశాంత్ తప్పు లేదంటూ ఏ కోర్టు కూడా తీర్పు ఇవ్వలేదు’ అని బోర్డు ప్రతినిధి స్పష్టం చేశారు. -
శ్రీశాంత్కు బీసీసీఐ అనుమతి నిరాకరణ
స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలతో జీవిత కాల నిషేధం ఎదుర్కొంటున్న పేసర్ శ్రీశాంత్ పునరాగమన ఆశలపై బీసీసీఐ నీళ్లు జల్లింది. స్కాట్లాండ్ క్రికెట్ లీగ్లో ఆడాలని చూస్తున్న ఈ కేరళ స్పీడ్స్టర్కు నిరభ్యంతర పత్రం మంజూరు చేయడానికి బీసీసీఐ నిరాకరించింది. 2013 ఐపీఎల్లో స్పాట్ ఫిక్సింగ్కు పాల్పడినట్టు తమ విచారణలో తేలిందని, అందుకే అతడిపై జీవితకాల నిషేధం విధించామని బోర్డుకు చెందిన అధికారి తెలిపారు. 2015లో ఢిల్లీ కోర్టు నుంచి అతడికి క్లీన్చిట్ లభించినా నిషేధం ఎత్తివేసే విషయంలో తుది నిర్ణయం బీసీసీఐకే ఉంటుందన్నారు. -
అన్ని క్రికెట్ సంఘాలు అమలు చేయాల్సిందే..
లోధా ప్యానెల్ ప్రతిపాదనలపై సుప్రీం కోర్టు న్యూఢిల్లీ: దేశంలోని అన్ని క్రికెట్ సంఘాలు తప్పనిసరిగా జస్టిస్ ఆర్ఎం లోధా కమిటీ సూచించిన ప్రతిపాదనలు అమలు చేయాల్సిందేనని దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు తేల్చి చెప్పింది. ‘ఒకసారి బీసీసీఐ వీటిని అమలు చేస్తే ఇక అన్ని రాష్ట్ర సంఘాలు కూడా ఇదే పద్దతి అనుసరిస్తాయి. మ్యాచ్ ఫిక్సింగ్, స్పాట్ ఫిక్సింగ్ నేపథ్యంలో ఏర్పాటైన ఈ కమిటీని ఆషామాషీగా తీసుకోవాల్సిన అవసరం లేదు. అన్ని అంశాలను నిశితంగా గమనించి నిపుణు లైన కమిటీ సభ్యులు చేసిన సూచనలివి. వీటిని కేవలం ప్రతిపాదనలే అనే కోణంలో చూడకూడదు’ అని చీఫ్ జస్టిస్ టీఎస్ ఠాకూర్ స్పష్టం చేశారు. అంతకుముందు లోధా ప్యానెల్ సూచనలు ఆమోదయోగ్యం కాదని హర్యానా క్రికెట్ సంఘం చేసిన అభ్యంతరాలపై కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. మరోవైపు గరిష్ట వయస్సు ప్రతిపాదనపై కూడా కర్ణాటక క్రికెట్ సంఘం అభ్యంతరం వ్యక్తం చేసింది. ప్యానెల్ సూచనలు కొన్ని అమలు పరిచే విధంగానే ఉన్నా కొన్ని మాత్రం ఆమోదయోగ్యంగా లేవని పేర్కొంది.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
సేద్యంలో సేవలకు సలాం
అక్రమాల ప్రియ
ప్రజల మనిషి జగన్
ఫిల్ సాల్ట్ విధ్వంసం.. ఢిల్లీను చిత్తు చేసిన కేకేఆర్
ఆర్థిక కేటుగాళ్లకు టీడీపీ అడ్డా
రేణుక విజృంభణ... భారత్ శుభారంభం
దశాబ్దాల కల నెరవేరిన వేళ...
గంగపుత్రుల జీవితాల్లో మీన రాశులు
హామీలెవరూ నమ్మట్లేదు! గతంలో చెప్పినట్లు ఇవి కూడా అబద్ధాలనుకొని వెళ్లిపోతున్నార్సార్!
చేతులెత్తేసిన ఎల్లో గ్యాంగ్
తప్పక చదవండి
- సీఎం జగన్ ఎన్నికల ప్రచార సభల రేపటి షెడ్యూల్ ఇదే..
- మస్క్కు లైన్ క్లియర్?..చైనాలో టెస్లా సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు..
- ములాయం సింగ్ కుటుంబం అంటే బీజేపీకి భయం
- చేరిన మూడునెలలకే ఓలా క్యాబ్స్ సీఈవో రాజీనామా.. 200 మంది ఉద్యోగుల తొలగింపు
- కేజ్రీవాల్ కొత్త ఆదేశాలు: మీడియాతో వెల్లడించిన అతిషి
- సీఎం మమత సర్కార్కు సుప్రీం కోర్టులో ఊరట
- బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
- యూసీసీ వల్ల ప్రయోజనం లేదు: మమతా బెనర్జీ
- ‘కాపులను పవన్ కల్యాణ్ ఎదగనీయటం లేదు’
- కాంగ్రెస్ అనుకున్నదాన్ని జరగనివ్వను: ప్రధాని మోదీ
Advertisement