గురునాథ్ బెట్టింగ్తో ఆయనకి సంబంధం లేదు
తేల్చిన జస్టిస్ ముకుల్ ముద్గల్ కమిటీ!
ముంబై: ఐపీఎల్-6 స్పాట్ ఫిక్సింగ్, బెట్టింగ్ వివాదంలో అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) చైర్మన్ ఎన్.శ్రీనివాసన్కు జస్టిస్ ముకుల్ ముద్గల్ కమిటీ నివేదిక క్లీన్చిట్ ఇచ్చినట్టు సమాచారం. తమ తుది నివేదికను కమిటీ సోమవారం సుప్రీం కోర్టుకు అందజేసిన విషయం తెలిసిందే. తన అల్లుడు గురునాథ్ మెయ్యప్పన్ బెట్టింగ్ కార్యకలాపాల్లో శ్రీనివాసన్కు గల సంబంధాలపై ఎలాంటి సాక్ష్యాలు లభించలేవని కమిటీ తెలిపిందని ఓ జాతీయ న్యూస్ చానెల్ కథనం ప్రసారం చేసింది.
ఈనెల 10న ఈ కేసుకు సంబంధించి సుప్రీం కోర్టు విచారణ ప్రారంభించనుంది. మరోవైపు ఐపీఎల్ మ్యాచ్ల బెట్టింగ్పై గురునాథ్ దోషిగానే ఉన్నా స్పాట్ ఫిక్సింగ్లో మాత్రం అతడికి వ్యతిరేకంగా కమిటీ సాక్ష్యాలను సేకరించలేకపోయింది. ఒకవేళ సాక్ష్యాలు లభించి ఉంటే... గురునాథ్తో పాటు చెన్నై సూపర్కింగ్స్ జట్టు కూడా న్యాయపరంగా చిక్కుల్లో పడేది. గతంలో కమిటీ విచారణ పూర్తయ్యేదాకా శ్రీనివాసన్ను బీసీసీఐ అధ్యక్ష పదవికి దూరంగా ఉండాల్సిందిగా సుప్రీం కోర్టు ఆదేశించింది. ఇప్పుడు ఈ నివేదిక ఆయనకు గొప్ప ఊరటనిచ్చినట్టుగా భావించాల్సి ఉంటుంది.
బుకీతో భారత ఆటగాడికి సంబంధం
2011 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టులో ఓ ప్రముఖ ఆటగాడికి బుకీలతో పాటు మ్యాచ్ ఫిక్సర్లతో సంబంధాలున్నట్టు జస్టిస్ ముకుల్ ముద్గల్ కమిటీ తేల్చినట్టు సమాచారం. అయితే ఐపీఎల్లో వివాదాస్పద రాజస్థాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్లో అతడు సభ్యుడు కాదని, అలాగే తను ప్రస్తుత భారత జట్టులో ఆడడం లేదని కమిటీ తన నివేదికలో తెలిపింది. 2011 ప్రపంచకప్ కూడా ఫిక్స్ అయ్యిందని గతంలో ఆరోపణలు వచ్చాయి.
ముఖ్యంగా భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య జరిగిన సెమీస్ మ్యాచ్ ఫలితాన్ని చాలా మంది ప్రశ్నిస్తుంటారు. ఒకవేళ ముద్గల్ కమిటీ ఆ ఆటగాడి భాగస్వామ్యంపై సాక్ష్యాలు వెలికితీస్తే మరిన్ని వివరాలు వెలుగు చూసే అవకాశం ఉంది. ఇదిలావుండగా విచారణలో భాగంగా చాలామంది ప్రస్తుత భారత ఆటగాళ్లు కమిటీ ముందు హాజరయ్యారు. వీరిలో ఐపీఎల్లో చెన్నైకి ఆడే ఆటగాళ్లను గురునాథ్ పాత్ర గురించి ప్రశ్నించారు. బెట్టింగ్ వివాదంలో గురునాథ్ వాయిస్ శాంపిల్స్ కూడా సరిపోయినట్టు ఫోరెన్సిక్ ల్యాబ్ తేల్చింది.
శ్రీనివాసన్కు క్లీన్చిట్!
Published Wed, Nov 5 2014 12:26 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఓటీటీకి వచ్చేస్తోన్న మర్డర్ మిస్టరీ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
‘ప్రజ్వల్ రేవణ్ణ’ పై కల్వకుంట్ల కవిత కీలక వ్యాఖ్యలు
అమ్మానాన్న, ధర చెక్ చేయకుండానే కొనుక్కోవాలి : ఆటో డ్రైవర్ కుమార్తె ఘనత
నీ ముగ్గురు భార్యలను పరిచయం చెయ్యు పవన్ కళ్యాణ్ ను ఏకిపారేసిన ముద్రగడ
20 ఏళ్ల తర్వాత 'మన్మథుడు' హీరోయిన్ రీఎంట్రీ.. కాకపోతే!
ఓటేద్దాం.. ప్రజాస్వామ్యాన్ని కాపాడుదాం
27 ఏళ్లుగా ఆమె మహిళ..పెళ్లి కుదిరాక వెలుగులోకి షాకింగ్ విషయం..!
కన్నీళ్లు పెట్టుకున్న రోహిత్ శర్మ.. డ్రెస్సింగ్ రూంలో అలా!
మెట్ గాలాలో మెరిసిన ఆలియా.. ఆ చీరకు ఎందుకంత క్రేజ్ అంటే?
నష్టాల్లో ముగిసిన స్టాక్మార్కెట్ సూచీలు
తప్పక చదవండి
- అమ్మానాన్న, ధర చెక్ చేయకుండానే కొనుక్కోవాలి : ఆటో డ్రైవర్ కుమార్తె ఘనత
- Rekha Jhunjhunwala: ఒక్కరోజులోనే రూ.800 కోట్ల నష్టం
- 'పుష్ప' వల్ల నాకు ఎలాంటి లాభం లేదు: ఫహాద్
- జాంబియా ప్రీ వెడ్డింగ్ వేడుక : అమ్మాయి ఇలా చేయాల్సిందే!
- ‘ఒకవేళ బెయిల్ ఇస్తే’.. కేజ్రీవాల్కు కండీషన్ పెట్టిన సుప్రీంకోర్టు
- PK: అన్నయ్య ప్రచారం చేస్తే తప్ప గెలవలేడా?
- ప్లే ఆఫ్స్ రేసులో ఉన్నారా? హార్దిక్ సమాధానం ఇదే!
- వయనాడ్, రాయ్బరేలీ.. గెలిస్తే రాహుల్ దేనిని వదిలేస్తారు?
- వైజాగ్ మాల్యా.. వంశీ!
- LS Elections 3rd Phase: కొనసాగుతున్న మూడో విడత పోలింగ్
Advertisement