Shirisha
-
శిరీష కేసులో బిగ్ ట్విస్ట్.. స్వాతి, వినయ్ ప్లాన్ ప్రకారమే...
సాక్షి, హైదరాబాద్: నగరంలోని మలక్పేటలో జరిగిన వివాహిత శిరీష హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. శిరీషను భర్త, ఆమె ఆడపడుచు (భర్త సోదరి) స్వాతి కలిసి హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. ఈ క్రమంలో వినయ్, స్వాతిని బుధవారం ఉదయం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.ఈ ఘటనపై వివరాల ప్రకారం.. మలక్పేటకు చెందిన శిరీషను తన భర్త, ఆడపడుచు స్వాతి కలిసి హత్య చేసినట్టు పోలీసులు నిర్ధారించారు. స్వాతి ప్లాన్ ప్రకారం.. శిరీషకు మత్తుమందు ఇచ్చి, స్పృహ కోల్పోయిన తర్వాత ఊపిరాడకుండా చేసి చంపినట్లు పోలీసులు తేల్చారు. తన అక్క మాట వినకుండా ఎదురు తిరుగుతుందని కోపంతో వినయ్ హత్య చేసినట్టు చెప్పారు. హత్య విషయం తెలిసినప్పటికీ బయటపెట్టకుండా తన సోదరితో కలిసి శిరీష మృతదేహాన్ని భర్త వినయ్ మాయం చేయాలనుకున్నాడని వెల్లడించారు. మరోవైపు, ఊపిరాడకుండా చేయటంతోనే ఆమె మరణించినట్టు పోస్టుమార్టం నివేదికలో సైతం వెల్లడైంది.మెడ చుట్టూ గాయాలు..అంతకుముందు.. శిరీష మెడ చుట్టూ గాయాలను గుర్తించి.. మృతురాలి బంధువులు వినయ్ను నిలదీయగా, పొంతన లేని సమాధానాలు చెప్పినట్టు సమాచారం. ఛాతీ నొప్పితో కుప్పకూలినపుడు సీపీఆర్ చేశానని, ఆ సమయంలో చేతి గోళ్లు గీసుకుపోయాయంటూ ఒకసారి.. మృతదేహాన్ని తరలించేటప్పుడు కుదుపులకు గాయాలైనట్టు మరోసారి చెప్పాడు. దీంతో, శిరీషను అతడే హత్య చేసినట్టు బంధువులు ఆరోపించారు.భర్త వేధింపులు.. నాగర్కర్నూలు జిల్లా దోమలపెంటకు చెందిన వినయ్ను 2017లో శిరీష ప్రేమ వివాహం చేసుకుంది. దంపతులిద్దరూ మలక్పేటలోని జమున టవర్స్లో ఉంటున్నారు. ప్రైవేటు ఉద్యోగం చేసిన వినయ్ ప్రస్తుతం ఖాళీగా ఉంటున్నాడు. శిరీష ఓ ప్రైవేటు ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తోంది. 2019లో పాప జన్మించింది. పెళ్లయిన ఏడాది నుంచే భార్యపై అనుమానంతో వినయ్ నిత్యం గొడవ పడేవాడు. ఈ క్రమంలోనే మార్చి రెండో తేదీన ప్లాన్ చేసి ఆమెను హత్య చేశారు. అనంతరం, గుండెపోటుతో చనిపోయినట్టు ఆమె తల్లిదండ్రులకు ఫోన్ చేసి చెప్పాడు వినయ్.ఈ క్రమంలో వారు వచ్చేలోపే మృతదేహాన్ని అంబులెన్స్లో గ్రామానికి తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు. దీంతో, శిరీష కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. దోమలపెంటకు అంబులెన్సులో తరలిస్తుండగా సీసీ ఫుటేజ్ ద్వారా వాహనాన్ని గుర్తించి పోలీసులు మృతదేహన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియాకి తరలించారు. అనుమానాస్పద మృతిగా చాదర్ఘాట్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. -
చంద్రబాబు.. ఇంత నీచంగా వ్యవహరించాలా?: భూమన
సాక్షి, తిరుపతి: తిరుపతిలో మున్సిపల్ ఎన్నికల వేళ కూటమి నేతలు రెచ్చిపోయారు. వైఎస్సార్సీపీ కార్పొరేటర్లను భయభాంత్రులకు గురిచేశారు. ఓటింగ్ కోసం ఎస్వీ యూనివర్సిటీకి వెళ్తున్న సమయంలో కార్పొరేటర్ల బస్సుపై జనసేన, టీడీపీ మూకలు దాడులకు పాల్పడ్డాయి. ఈ నేపథ్యంలో కూటమి నేతలపై వైఎస్సార్సీపీ నాయకులు భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు ప్రభుత్వం ఇంత నీచంగా వ్యవహరించాలా? అని ప్రశ్నించారు.ఈ సందర్భంగా భూమన కరుణాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ..‘కూటమి నేతల బెదిరింపులకు భయపడేది లేదు. మెజారిటీ కార్పొరేటర్లు వైఎస్సార్సీపీ వైపే ఉన్నారు. ఒక్క కార్పొరేటర్ బలమే ఉన్న టీడీపీ నేతలు వైఎస్సార్సీపీ కార్పొరేటర్లపై బెదిరింపులకు పాల్పడుతున్నారు. కూటమి ప్రభుత్వం నాయకులు వైఎస్సార్సీపీ కార్పొరేటర్లపై దుర్మార్గంగా వ్యవహరించారు. కార్పొరేటర్లు వెళ్తున్న వాహనంపై దాడి చేయమేంటి?. చంద్రబాబు ప్రభుత్వం ఇంత నీచంగా వ్యవహరించాలా?. ఏపీలో ప్రజాస్వామ్యం ఉందా? అని ప్రశ్నించారు.అర్థరాత్రి పూట మహిళా కార్పొరేటర్లు ఉన్న గదికి వెళ్లి దౌర్జన్యం చేశారు. మహిళా కార్పొరేటర్లు ఉన్న గదుల్లోకి చొరబడి వారిని భయబ్రాంతులకు గురి చేశారు. ఇదేనా మీకు మహిళల పట్ల ఉన్న గౌరవం. అత్యంత దుర్మార్గంగా వ్యవహరించారు. కార్పొరేటర్ల ఆస్తులు విధ్వంసం చేశారు, బెదిరింపులకు పాల్పడ్డారు. కార్పొరేటర్ల బంధువులు, కుటుంబ సభ్యులకు అక్రమంగా బెదిరింపులకు పాల్పడుతున్నారు’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.అనంతరం తిరుపతి మేయర్ శిరీష మీడియాతో మాట్లాడుతూ..‘కూటమి నేతలకు పోలీసులు సహకరిస్తున్నారు. పోలీసులే రక్షించకపోతే మమ్మల్ని ఎవరు రక్షిస్తారు. మనం ప్రజాస్వామ్యంలోనే ఉన్నామా?. మహిళా కార్పొరేటర్ అని కూడా చూడకుండా దాడి చేశారు. మహిళా కార్పొరేటర్ల గాజులు పగలగొట్టారు. మా కార్పొరేటర్లను వెంటనే విడిచిపెట్టాలి. మా పార్టీ కార్పొరేటర్లు వచ్చే వరకు మేము ఓటింగ్లో పాల్గొనం’ అని కామెంట్స్ చేశారు. -
బిగ్ బాస్ కు బర్రెలక్క.. నిజమేనా ఫ్రెండ్స్...!
-
లోక్సభ ఎన్నికల బరిలో ‘బర్రెలక్క’.. నామినేషన్ దాఖలు
సాక్షి,కొల్లాపూర్ : గతేడాది జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన బర్రెలక్క అలియాస్ కర్నె శిరీష లోక్సభ ఎన్నికల బరిలోకి దిగారు. నాగర్ కర్నూల్ లోక్సభ స్వతంత్ర అభ్యర్ధిగా పోటీ చేస్తున్నారు. ఏప్రిల్ 23న (ఇవాళ) నాగర్ కర్నూల్ కలెక్టరేట్ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు. కుటుంబ సభ్యులు, సన్నిహితులతో కలిసి బర్రెలక్క నామినేషన్ వేసేందుకు తరలి వచ్చారు. డిగ్రీ చదివినా ఉద్యోగం రావడం లేదని డిగ్రీ చదివినా ఉద్యోగం రావడం లేదని, అందుకే బర్రెలు కాస్తూ బతుకుతున్నానంటూ పెట్టిన వీడియోతో శిరీష్ ఫేమస్ అయ్యారు. దీంతో ఆమె బర్రెలక్కగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత సోషల్ మీడియాలో నిరుద్యోగ సమస్యపై తనగొంతు వినిపించారు. గతేడాది జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నుంచి స్వతంత్ర అభ్యర్ధిగా నామినేషన్ వేసి అందరి దృష్టినీ ఆకర్షించారు. ఆ సమయంలో ఆమెకు నిరుద్యోగ యువత నుంచి భారీ మద్దతు వచ్చింది. పలువురు ప్రముఖులు ఆర్థిక సాయం చేయడంతో పాటు ప్రశంసలు కురిపించారు. నైతికంగా విజయం సాధించా ఇక ఆ అసెంబ్లీ ఎన్నికల్లో బర్రెలక్క ఓటమి పాలయినప్పటికీ నైతికంగా గెలిచారు. 5,754 ఓట్లు సాధించి నాలుగో స్థానంలో నిలిచారు. ఎన్నికల ఫలితా అనంతరం.. ఓటర్లు ఒక్క రూపాయి డబ్బు పంచకుండా నిజాయతీగా నాకు ఓట్లేశారు. నేను గెలిచానని భావిస్తున్నా. ప్రజా సమస్యలపైన పోరాటం చేస్తూనే ఉంటా. వచ్చే ఎంపీ ఎన్నికల్లో కూడా మళ్ళీ పోటీ చేస్తా అని బర్రెలక్క చెప్పారు. నాడు చెప్పినట్లుగా ఈసారి లోక్సభ ఎన్నికల్లో బరిలోకి దిగారు. లోక్సభ స్వతంత్ర అభ్యర్ధిగా బర్రెలక్క మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. నాగర్ కర్నూల్లో లోక్సభ అభ్యర్ధులు నాగర్కర్నూల్ లోక్సభ నుంచి పోటీకి మూడు ప్రధాన పార్టీలు తమ అభ్యర్థులను ఖరారు చేశాయి. కాంగ్రెస్ నుంచి సీనియర్ నేత, మాజీ ఎంపీ మల్లు రవి టికెట్ దక్కించుకోగా, బీజేపీలో చేరిన సిట్టింగ్ఎంపీ పోతుగంటి రాములు తన కొడుకు పోతుగంటి భరత్ప్రసాద్కు టికెట్ ఇప్పించుకోగలిగారు. బీఎస్పీ స్టేట్ చీఫ్హోదాలో ఉండి ఆ పార్టీకి రాజీనామా చేసిన మాజీ ఐపీఎస్ఆర్.ఎస్. ప్రవీణ్కుమార్బీఆర్ఎస్ లో చేరి ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేయనున్నారు. -
వివాహాబంధంలోకి అడుగుపెట్టిన బర్రెలక్క.. వీడియో చూశారా?
అసెంబ్లీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగి సంచలనం రేపిన యూట్యూబర్ బర్రెలక్క వివాహాబంధంలోకి అడుగుపెట్టింది. ఇటీవలే తన వీడియోలు షేర్ చేస్తూ గుడ్ న్యూస్ చెప్పిన కర్నె శిరీష ఇవాళ పెళ్లి చేసుకుంది. దీనికి సంబంధించిన వీడియోను తన ఇన్స్టాలో షేర్ చేసింది. ఇప్పటికే కాబోయే భర్తను పరిచయం చేసిన బర్రెలక్క.. తన భర్తతో మొదటి వీడియో అంటూ సోషల్ మీడియా ద్వారా పంచుకుంది. తెలంగాణకే చెందిన పెద్దకొత్తపల్లి మండలం మరికల్ గ్రామానికి చెందిన శిరీష.. వెంకటేశ్తో ఏడడుగులు వేసింది. కాగా.. నిరుద్యోగ సమస్యలపై ఇన్స్టగ్రామ్లో వీడియోలు చేస్తూ ఫేమ్ తెచ్చుకున్న శిరీషకు భారీగా ఫాలోవర్లు ఉన్నారు. ప్రస్తుతం బర్రెలక్క పెళ్లి వీడియో నెట్టింట తెగ వైరలవుతోంది. View this post on Instagram A post shared by Barrelakka Siri (@princes_siri_barrelakka) -
బర్రెలక్క పెళ్లి సందడి : ప్రీ-వెడ్డింగ్ వీడియో హల్చల్
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగి సంచలనం రేపిన యూట్యూబర్ బర్రెలక్క పెళ్లి కబురు ఇటీవల వార్తల్లో నిలుస్తోంది. తాజాగా తనకు కాబోయే భర్తను ఇన్స్టగ్రామ్ వేదికగా పరిచయం చేసింది బర్రెలక్క. దీంతో ఈ వీడియో ఇపుడు ఇంటర్నెట్లో హల్చల్ చేస్తోంది. బర్రెలక్క అలియాస్ శిరీష షేర్ చేసిన వీడియో ప్రకారం ఈ వేసవిలోనే బర్రెలక్క మూడుముళ్ల బంధంలోకి అడుగుపెట్టనుంది. వరుడు పేరు వెంకట్. అయితే అతడి వృత్తి ఎక్కడి వాడు అనే వివరాలు మాత్రం ఇంకా సస్పెన్సే. కాగా తెలంగాణంలోని పెద్దకొత్తపల్లి మండలం మరికల్ గ్రామానికి చెందిన శిరీష(బర్రెలక్క) నిరుద్యోగ సమస్యలపై ఇన్స్టగ్రామ్లో వీడియోలు చేస్తూ బర్రెలక్కగా పాపులర్ అయింది. భారీగా (781 వేలు) ఫాలోయర్లను సంపాదించుకుంది.ఆదాయాన్ని కూడా బాగానే ఆర్జించింది. గత ఏడాది డిసెంబరులో జరిగిన కొల్లాపూర్ అసెంబ్లీ ఎన్నికల్లో నామినేషన్ వేయడంతో సోషల్ మీడియా స్టార్ కాస్తా పొలిటికల్ స్టార్ అతరించింది. నిరుద్యోగ యువత, పలు నిరుద్యోగ సంఘాలు, ప్రజా సంఘాలునుంచి భారీ స్పందనతోపాటు, కొంతమంది రాజకీయ నాయకులు ఆమెకు మద్దతినిచ్చారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ, రానున్న లోక్సభ ఎన్నికల్లోనూ పోటీచేస్తానని ప్రకటించిన శిరీష ఇలా అనూహ్యంగా పెళ్లి పీటలెక్కుతుండటం ఫ్యాన్స్ను సర్ప్రైజ్ చేసింది. View this post on Instagram A post shared by Barrelakka Siri (@princes_siri_barrelakka) -
పెళ్లి తేదీతో పాటు కాబోయే భర్త ఎవరో చెప్పిన 'బర్రెలక్క'
బర్రెలక్క.. అసలు పేరు కర్నె శిరీష. తెలంగాణలోని పెద్దకొత్తపల్లి మండలం, మరికల్ గ్రామానికి చెందిన బర్రెలక్క సోషల్ మీడియా ఇన్ఫ్లుయన్సర్గా అందరికీ పరిచయమే. ఆమె ఇన్స్టాగ్రామ్ రీల్స్తో పాటు యువతను ఆలోచించే విధంగా పలు వ్యాఖ్యలు చేస్తూ వైరల్ అవుతూ ఉంటుంది. త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు ఆమె ప్రకటించింది. అప్పటి నుంచి ఆమె సోషల్ మీడియా ఖాతాలో తన భర్త వివరాల గురించి నెటిజన్లు ఆరా తీశారు. దీంతో ఆమె తాజాగా ఒక వీడియోను పోస్ట్ చేసింది. తన పెళ్లి ప్రకటన గురించి అధికారికంగా ప్రకటించిన శిరీష తన నిశ్చితార్థం వేడుకకు సంబంధించిన వీడియోను కూడా పంచుకుంది. తాజాగా తనకు కాబోయే భర్త ఫోటోలను కూడా ఆమె రివీల్ చేసింది. వారిద్దరూ కలిసి ఓక ఫోటో షూట్ కూడా చేశారు. ఆ వీడియోను కూడా శిరీష్ తన ఇన్స్టాలో పోస్ట్ చేసింది. దీంతో ఆమెకు నెటిజన్లు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. మార్చి 28న వెంకటేశ్ అనే అబ్బాయితో శిరీష వివాహం జరగబోతుంది. అతను ఎమ్మెస్సీ ఫిజిక్స్ పూర్తిచేశాడని తెలుస్తోంది. తెలంగాణలోని నాగర్ కర్నూలు జిల్లా పెద్ద కొత్తపల్లి గ్రామానికి చెందిన వ్యక్తి అని తెలుస్తోంది. మరికల్ గ్రామానికి చెందిన శిరీష ఆమె తల్లి రోజు కూలీ, ఇద్దరు తమ్ముళ్ళు ఉన్నారు, తండ్రి కుటుంబానికి దూరంగా ఉంటున్నాడు. ఆర్థిక ఇబ్బందుల వల్ల తల్లీకి సాయంగా ఉంటూ ఓపెన్ డిగ్రీ చదవుతున్నట్లు ఆమె గతంలో పంచుకుంది. తెలంగాణ ఎన్నికల సమయంలో కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీలో నిలిచి.. 5,754 ఓట్లతో అక్కడ నాలుగో స్థానంలో నిలిచింది. ప్రస్తుతం ఆమె ఎంపీగా కూడా పోటీ చేస్తానని చెప్పింది. తాను ఓడిపోయిన పర్వాలేదు అంటూనే తన పోటీ యువతను మేలుకొల్పేందుకే అని చెప్పింది. View this post on Instagram A post shared by Barrelakka Siri (@princes_siri_barrelakka) -
పెళ్లి వార్తను ప్రకటించిన 'బర్రెలక్క'
తెలంగాణ ఎన్నికల సమయంలో సామాజిక మాధ్యమాల్లో మార్మోగిన పేరు బర్రెలక్క.. అసలు పేరు కర్నె శిరీష. త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు ఆమె ప్రకటించింది. అందుకు సంబంధించిన పలు వీడియోల ద్వారా ఇన్స్టాగ్రామ్లో తెలిపింది. తెలంగాణ ఎన్నికల్లో కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీలో నిలిచి.. 5,754 ఓట్లతో అక్కడ నాలుగో స్థానంలో నిలిచింది. 2022 డిసెంబరులో ఈ యువతి బర్రెలను కాస్తూ సామాజిక మాధ్యమంలో ఓ వీడియోను పోస్టు చేసింది. ఉద్యోగాలు రావడం లేదని, అందుకే బర్రెలు కాస్తూ బతుకుతున్నానంటూ వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో ఆమె పేరు వైరల్ అయింది. అప్పటి నుంచి సోషల్ మీడియాలో రీల్స్ చేస్తూ రెండూ తెలుగు రాష్ట్రాల్లో గుర్తింపు పొందింది. గతంలో ఆమె పెళ్లి గురించి పలు వార్తలు సోషల్ మీడియాలో రావడం అందుకు ఆమె రియాక్ట్ కావడం జరిగింది. అవన్నీ కొట్టిపారేస్తూ.. తన పెళ్లి ప్రకటన గురించి అధికారికంగా ఆమె ప్రకటించింది. తనకు నిశ్చితార్థం జరిగినట్లు బర్రెలక్క తాజాగా తెలిపింది. తన ఎంగేజ్మెంట్ కార్యక్రమం సడెన్గా సెట్ కావడంతో ఎవరినీ పిలువలేకపోయానని ఆమె చెప్పింది. పెళ్లి కోసం షాపింగ్ చేసిన వీడియోలను కూడా ఆమె పంచుకుంది. కాబోయే భర్త ఎవరో మాత్రం రివీల్ చేయలేదు. ఇటీవల బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్ను పెళ్లి చేసుకోబోతుందంటూ నెట్టింట వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే. కానీ అవన్నీ అవాస్తవాలనీ ప్రశాంత్ తనకు అన్నయ్య లాంటి వ్యక్తి అని బర్రెలక్క కొట్టిపారేసింది. View this post on Instagram A post shared by Barrelakka Siri (@princes_siri_barrelakka) -
పల్లవి ప్రశాంత్తో పెళ్లి? క్లారిటీ ఇచ్చిన బర్రెలక్క!
పల్లవి ప్రశాంత్, బర్రెలక్క (శిరీష).. ఇటీవలి కాలంలో వీరిద్దరి పేర్లు సోషల్ మీడియాలో మార్మోగిపోయాయి. ఒకరేమో బిగ్బాస్ హౌస్లోకి రైతుబిడ్డగా అడుగుపెట్టి సెలబ్రిటీలను వెనక్కు నెట్టి షో విజేతగా నిలిచాడు. కానీ బయటకు వచ్చాక తెలిసీతెలియక చేసిన హంగామాతో జైలుపాలై అప్రతిష్ట మూటగట్టుకున్నాడు. మరొకరేమో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో నిరుద్యోగి గళాన్ని గట్టిగా వినిపిస్తూ పోటీ చేసింది. అయితే జనాల్లో తిరగడానికంటే కూడా సోషల్ మీడియా ప్రచారానికే ఎక్కువ ప్రాధాన్యతిచ్చి ఓటమి చవి చూసింది. అప్పుడు ప్రశాంత్కు సపోర్ట్ ప్రశాంత్.. బర్రెలక్క చుట్టాలేం కాదు. కానీ బిగ్బాస్ 7లో ఒక సామాన్యుడు అడుగుపెట్టాడని తెలిసి సపోర్ట్ చేసింది. ఇంకేముంది పలకరిస్తే చాలు తప్పుడు వరుసలు అంటగట్టేసే సమాజం వీరిద్దరికీ ఏదో ఉందని ముడిపెట్టింది. ప్రశాంత్, శిరీష పెళ్లి చేసుకోబోతున్నారని నెట్టింట ప్రచారం జరిగింది. కొందరైతే ఓ అడుగు ముందుకేసి వీరి పెళ్లయిపోయినట్లు మార్ఫింగ్ ఫోటోలు కూడా వదిలారు. యూట్యూబ్లో పెళ్లి చేశారు తాజాగా ఈ వ్యవహారంపై స్పందించింది బర్రెలక్క. ఆమె మాట్లాడుతూ.. 'నేను బిగ్బాస్ షో అసలు చూడను. అయితే ఏడో సీజన్లో ఒక రైతుబిడ్డ వెళ్లాడని తెలిసి రెండు, మూడు ఎపిసోడ్లు చూశాను. ఎమ్మెల్యేగా పోటీ చేసే హడావుడిలో పడి దాన్ని పక్కనపెట్టేశాను. మళ్లీ గ్రాండ్ ఫినాలే రోజు చూశాను. ఎప్పుడూ అతడికి ఫోన్ చేయలేదు. అలాంటిది.. నాకు తెలియకుండానే పల్లవి ప్రశాంత్ అన్నతో యూట్యూబ్లో నా పెళ్లి చేసేశారు. నా పెళ్లికి పెద్ద పెద్ద అతిథులు కూడా వచ్చారట. ఆ సంగతే నాకు తెలీదు. ఎవరి ఇజ్జత్ పోతే ఏంటి? వ్యూస్ కోసం ఇంతలా బరితెగిస్తారా? ఎవరు మట్టిలో కలిస్తే ఏంటి? ఎవరి ఇజ్జత్ పోతే ఏంటి? ఎవరి జీవితం నాశనమైతే ఏంటి? మాకు వ్యూస్ కావాలంతే అన్నట్లుగా ఫోటోలు మార్ఫింగ్ చేసి మరీ తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారు. చాలా వీడియోలలో నేను పల్లవి ప్రశాంత్ను అన్న అని పిలిచాను. ఎవరైనా అన్నను పెళ్లి చేసుకుంటారా? అతడితో వివాహం జరిగినట్లు ఫేక్ ప్రచారం చేస్తున్నారు' అని ఆగ్రహం వ్యక్తం చేసింది శిరీష. చదవండి: హీరోయిన్-డైరెక్టర్ మధ్య మాటల యుద్ధం.. అసలేం జరుగుతోంది? విజయకాంత్ కోసం ఆ పని చేస్తానని వాగ్ధానం.. అది గుర్తుపెట్టుకుని.. -
శిరీష(బర్రెలక్క)కు భద్రత కల్పించండి: తెలంగాణ హైకోర్టు
సాక్షి, కొల్లాపూర్: నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ స్వతంత్ర అభ్యర్థి కార్నె శిరీష(బర్రెలక్క)కు భద్రత కల్పించాలని తెలంగాణ హైకోర్టు రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని శుక్రవారం ఆదేశించింది. ఎన్నికలు పూర్తయ్యేదాకా ఒక గన్మెన్తో భద్రత కల్పించాలని, ఆమె హాజరు అయ్యే పబ్లిక్ మీటింగ్లకు సెక్యూరిటీ ఇవ్వాలని హైకోర్టు తెలిపింది. గుర్తింపు ఉన్న పార్టీల అభ్యర్థులకు మాత్రమే భద్రత ఇస్తే సరిపోదు. తమకు ముప్పు ఉందని అభ్యర్థించే అభ్యర్థులకు కూడా భద్రత కల్పించాలి. అభ్యర్థుల బాధ్యత ఎన్నికల కమిషన్దే. పోలీసులు కేవలం కార్లు చెక్ చేస్తాం అంటే కుదరదు అని హైకోర్టు తన ఆదేశాల్లో పేర్కొంది. తనపై రెండు రోజుల క్రితం గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడినందున 2ప్లస్2 గన్మెన్లతో భద్రత కల్పించాలని కోరుతూ కర్నె శిరీష (బర్రెలక్క) హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ మేరకు రాష్ట్ర హోంశాఖ ప్రధాన కార్యదర్శి, చీఫ్ ఎలక్షన్ కమిషనర్, రాష్ట్ర ఎన్నికల కమిషనర్కు ఆదేశాలు జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు. కొల్లాపూర్ పరిధిలోని పెద్దకొత్తపల్లి మండలం వెన్నచర్ల గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న సమయంలో కొందరు బర్రెలక్కతో పాటు ఆమె తమ్ముడిపై దాడి చేశారు. ఆమె తమ్ముడు తీవ్రంగా గాయపరిచారు. వెనక్కి తగ్గను.. ‘నేను ఓట్లు చీల్చుతాననే భయంతో కొందరు నాపై దాడులకు ప్రయత్నిస్తున్నారు. నా తమ్ముడిపై దాడికి పాల్పడింది ఎవరో.. వారు ఏ పార్టీ వారో కూడా తెలుసు. కానీ, నేను వారి పార్టీ పేరు వెల్లడించను. ప్రాణం పోయినా.. ఈ పోరాటంలో వెనకడుగు వేయను’అని నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్లో అసెంబ్లీ ఎన్నికల బరిలో స్వతంత్ర అభ్యర్థిగా నిలిచిన కర్నె శిరీష అలియాస్ బర్రెలక్క అన్నారు. ‘నాలుగైదు సార్లు గెలిచిన వాళ్లు, అధికార పార్టీ వాళ్లు నన్ను చూసి భయపడుతున్నారు. అందుకే రౌడీమూకలతో నాపై దాడులకు ప్రయత్నిస్తున్నారు. నాకు మద్దతుగా ప్రచారం చేస్తున్న మధు అనే అన్నను సాఫ్ట్వేర్ ఉద్యోగం నుంచి తొలగించారు. అండగా నిలుస్తున్న వారిని బెదిరిస్తున్నారు. అయినా నేను దేనికీ భయపడను. నేను ఇప్పుడు ఒక్క అడుగు వెనక్కి వేసినా.. భవిష్యత్లో వెయ్యి అడుగులు వెనక్కి వేసినదాన్ని అవుతా. యువతకు ఇది తప్పుడు సంకేతం ఇస్తుంది.’అని పేర్కొన్నారు. -
నేటి నుంచి తల్లిపాల వారోత్సవాలు..
భద్రాద్రి: ఆగస్టు 1 నుంచి 7 వరకు నిర్వహించే తల్లిపాల వారోత్సవాలను విజయవంతం చేయాలని కలెక్టర్ డాక్టర్ ప్రియాంక ఆల పిలుపునిచ్చారు. ఐడీఓసీలో సోమవారం నిర్వహించిన సమావేశంలో వారోత్సవాల వాల్పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తల్లిపాల ప్రాధాన్యతపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు కె.వెంకటేశ్వర్లు, మధుసూదన్రాజు, డీఎంహెచ్ఓ డాక్టర్ శిరీష, ఆస్పత్రుల సమన్వయ అధికారి రవిబాబు, మహిళా, శిశు సంక్షేమాధికారి సబిత, ఉపాధి కల్పన అధికారి విజేత పాల్గొన్నారు. వరద నష్టాల నివేదిక అందించాలి జిల్లాలో వరద నష్టాల నివేదికలను అందజేయాలని కలెక్టర్ ప్రియాంక అధికారులను ఆదేశించారు. ఐడీఓసీలో పలు శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. వరద సహాయక చర్యల్లో అధికారుల పనితీరును అభినందించారు. వర్షాలు, వరదలతో దెబ్బతిన్న పంటలు, పశువులు, ఇళ్లు, పిడుగుపాటు తదితర అంశాలపై సమగ్ర నివేదికలు రూపొందించాలని సూచించారు. ఆర్అండ్బీ శాఖ పరిధిలో నాలుగు వంతెనలు దెబ్బతిన్నాయని, పంచాయతీరాజ్ పరిధిలో 97 రహదారులు మరమ్మతులకు గురి కాగా 60 పనులు పూర్తి చేశామని తెలిపారు. 11 చోట్ల దెబ్బతిన్న పైపులైన్లకు మరమ్మతులు చేపట్టాలన్నారు. ప్రజావాణి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి ప్రజావాణి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ ప్రియాంక అధికారులను ఆదేశించారు. సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో జిల్లా నలుమూలల నుంచి వచ్చిన వారి నుంచి దరఖాస్తులు స్వీకరించి, సంబంధిత అధికారులకు ఎండార్స్ చేశారు. వచ్చిన దరఖాస్తులలో కొన్ని.. ► ఇల్లెందు సీఎస్పీ బస్తీకి చెందిన ఆదివాసీ వ్యవసాయదారులు.. తాము 1987 నుంచి పట్టా భూముల్లో వ్యవసాయం చేసుకుంటున్నామని సింగరేణి అధికారులు జేకే 5 ఓసీ ఏర్పాటుకు సర్వే నిర్వహించి ఏర్పాటు చేసిన హద్దుల ప్రకారం తమ భూములను కోల్పోతున్నామని, జీవనోపాధి కల్పించాలని దరఖాస్తు చేయగా రెవెన్యూ అధికారులకు ఎండార్స్ చేశారు. ►పాల్వంచ నవభారత్ రెసిడెన్షియల్ పాఠశాల, కళాశాలలో సౌకర్యాలు లేక విద్యార్థినులు ఇబ్బంది పడుతున్నారని, ప్రధానోపాధ్యాయులు, సిబ్బంది నిర్లక్ష్యంతో తప్పుదోవ పడుతున్నారని విద్యార్థి, యువజన సంఘాలు దరఖాస్తు చేయగా త్వరలో పరిశీలించి సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ►కొత్తగూడెం మున్సిపాలిటీ నాలుగో వార్డులో కాలువల నిర్మాణం మంజూరైనా ప్రారంభించ లేదని బీజేపీ పట్టణ అధ్యక్షుడు లక్ష్మణ్ అగర్వాల్, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు జోగు ప్రదీప్ తదితరులు ఫిర్యాదు చేయగా కమిషనర్ను పిలిచి సమస్యపై ఆరా తీశారు. సంబంధిత వార్డు కౌన్సిలర్, చైర్పర్సన్ను ఆహ్వానించి పనులు ప్రారంభించాలని ఆదేశించారు. -
AP: హరగోపాల్ భార్య శిరీష అరెస్టు
సాక్షి, అమరావతి: కుల నిర్మూలన పోరాట సమితి నేత దుడ్డు ప్రభాకర్తో పాటు దివంగత మావోయిస్టు అగ్రనేత అక్కిరాజు హరగోపాల్(ఆర్కే) భార్య కందుల శిరీష అలియాస్ పద్మక్కను కూడా అరెస్టు చేసినట్లు ఎన్ఐఏ శనివారం ఒక ప్రకటనలో తెలిపింది. 2019లో ఛత్తీస్గఢ్లోని ట్రియ గ్రామంలో భద్రతా దళాలపై మావోయిస్టులు జరిపిన దాడి కేసులో వారిద్దరినీ అరెస్టు చేసినట్టు వెల్లడించింది. దీనిని ఆర్కే డైరీ కేసుగా ఎన్ఐఏ పరిగణిస్తోంది. శిరీష, దుడ్డు ప్రభాకర్తో పాటు ఈ కేసులో ఇప్పటివరకు ఆరుగురిని ఎన్ఐఏ అరెస్టు చేసింది. శిరీషను ప్రకాశం జిల్లా ఆలకూరపాడులోని ఆమె నివాసంలో, ప్రభాకర్ను విజయవాడలో ఆయన నివాసంలో ఎన్ఐఏ అధికారులు శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. మావోయిస్టుల నుంచి నిధులు పొందుతూ.. ఆ పార్టీ భావజాలాన్ని వ్యాప్తి చేసేందుకు వీరిద్దరూ క్రియాశీలంగా వ్యవహరిస్తున్నారని ఎన్ఐఏ తెలిపింది. మావోయిస్టు పార్టీ అనుబంధ విభాగాల పటిష్టత కోసం పనిచేస్తున్నారని పేర్కొంది. ఇది కూడా చదవండి: ఆంధ్రజ్యోతికి హైకోర్టులో చుక్కెదురు -
కొడుకుకు ఉరేసి.. ఆపై ఉరేసుకొని
బంజారాహిల్స్: మూడేళ్ల బిడ్డ ఆలనాపాలన ఓవైపు... కడుపున పెరుగుతున్న శిశువు ఎదుగుదలను చూసుకోవాల్సిన బాధ్యత మరోవైపు. ఈ క్రమంలో అత్తింటి వారి వేధింపులు రోజురోజుకూ ఎక్కువ కావడంతో ఆ తల్లి తట్టుకోలేకపోయింది. మరణమే శరణ్యమని భావించింది. ‘అమ్మా... మా అత్త నన్ను చితకబాదింది... ఏం చేస్తారో అని భయమేస్తోంది... చచ్చిపోవాలనిపిస్తోంది’అంటూ రోదిస్తూ తల్లికి ఫోన్ చేసిన 12 గంటల వ్యవధిలోనే బలవన్మరణానికి పాల్పడింది. తన ఒడిలో పడుకున్న బిడ్డకు ముందుగా ఉరేసి ఆ తర్వాత కడుపున ఉన్న బిడ్డతో సహా తనువు చాలించింది. ఈ హృదయ విదారక ఘటన హైదరాబాద్ ఫిలింనగర్లోని వినాయకనగర్ బస్తీలో చోటుచేసుకుంది. పెళ్లయిన నెల నుంచే వేధింపులు... మేడిపల్లికి చెందిన శిరీష (23) వివాహం ఫిలింనగర్లోని వినాయకనగర్ బస్తీకి చెందిన కారు డ్రైవర్ కావటి విశ్వనాథ్ (32)తో 2019 జూన్ 9న జరిగింది. వివాహ సమయంలో రూ. 8 లక్షల కట్నంతోపాటు 15 తులాల బంగారం ఇచ్చారు. పెళ్లి జరిగిన నెల రోజులకే అత్త బసవమ్మ, భర్త విశ్వనాథ్ విశ్వరూపం చూపించారు. రోజూ కొట్టడంతోపాటు, అదనపు కట్నం తెమ్మంటూ పుట్టింటికి తరచూ పంపేవారు. పుట్టింటికి వచ్చిన శిరీషకు తల్లి లక్ష్మి అప్పుచేసి ఒక్కోసారి రూ. లక్ష చొప్పున అయిదుసార్లు డబ్బులు ఇచ్చి పంపింది. అయినాసరే కూతురు కాపురం బాగుపడకపోగా రోజురోజుకూ వేధింపులు పెరిగిపోయి అత్తతోపాటు భర్త విశ్వనాథ్ తీవ్రంగా కొట్టేవాడు. ఈ నెల 9న పెళ్లి రోజున కూడా ఆమెను చితకబాదాడు. అదనపు కట్నం తేవాలంటూ పుట్టింటికి పంపించేందుకు యత్నించగా ఈసారి ఆమె కాళ్లావేళ్లాపడింది. అయినాసరే ఆ కర్కశ హృదయాలు కరగలేదు. శుక్రవారం ఉదయం 12 గంటలకు తల్లికి ఫోన్ చేసి అత్త కొట్టిందంటూ చెప్పి భోరుమంది. వాళ్ల కదలికలు చూస్తుంటే తనను ఏదో చేసేలా ఉన్నారంటూ ఫోన్ కట్ చేసింది. ఆ తర్వాత తల్లి లక్ష్మి ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్విచ్చాఫ్ అని వచ్చింది. రాత్రి 11 గంటల సమయంలో అల్లుడు విశ్వనాథ్ అత్త లక్ష్మికి ఫోన్ చేసి మీ కూతురు ఉరేసుకుందంటూ చెప్పాడు. కన్నీరుమున్నీరైన మృతురాలి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు బస్తీకి పరిగెత్తుకొచ్చారు. కుమార్తెతోపాటు పక్కనే చిన్నారి మనీష్ విగతజీవిగా కనిపించడంతో గుండెలవిసేలా రోదించారు. తన కూతురు వరకట్న వేధింపులతోనే చనిపోయిందని... ఆమె మృతిపై విచారణ జరపాలని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు భర్త విశ్వనాథ్పై ఐపీసీ సెక్షన్ 304 (బీ), 498 (ఏ), 3, 4, వరకట్న నిషేధిత చట్టం, రెడ్విత్ 109 కింద కేసులు నమోదు చేసి అరెస్ట్ చేశారు. అత్త బసవమ్మ, మామ రమే‹Ùలను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. -
కొలిక్కి వచ్చిన వికారాబాద్ శిరీష మృతి కేసు.. ఆ ఇద్దరే హంతకులు!
సాక్షి, వికారాబాద్: నర్సింగ్ విద్యార్థిని శిరీష అనుమానాస్పద కేసును పోలీసులు చేధించారు. శిరీషను హత్య చేసింది ఆమె బావ అనిల్, అతని స్నేహితుడు రాజుగా పోలీసులు తేల్చారు. మద్యం మత్తులో శిరీష బావ, అతని ఫ్రెండ్ ఇద్దరూ కలిసి ఈ దారుణానికి పాల్పడినట్లు నిర్ధారించారు. కాగా మొదటి నుండి బావ చుట్టే కేసు తిరుగుతున్నప్పటికీ గత మూడు రోజులుగా అనిల్ పోలీసుల ఎదుట నోరు మెదపలేదు. చివరికి అనిల్ కాల్ డేటా ఆధారంగా విచారణ జరిపిన పోలీసులు అతని స్నేహితుడినిసైతం అదుపులోకి తీసుకొని విచారించారు. ఈ ఇద్దరిని పోలీసులు తమదైన శైలిలో విచారించగా విస్తుపోయే విషయాలు వెలుగుచూశాయి. బావ అనిల్, అతని స్నేహితుడు కలిసి శిరీషను అత్యంత దారుణంగా హతమార్చినట్లు తెలిసింది. చెప్పిన మాట వినడం లేదని.. ఎప్పుడూ ఫోన్ చూస్తూ ఉంటుందని శిరీషతో బావ అనిల్ వాగ్వాదం జరిగినట్లు పోలీసులు గుర్తించారు. అదే సమయంలో మరో రూంలోకి వెళ్ళి శిరీష ఆత్మహత్యాయత్నం చేయగా.. గది గడియ విరగొట్టి శిరీషను బయటకు తీసుకొచ్చిన అనిల్.. ఆమెపై చెయ్యి చేసుకున్నట్లు సమాచారం. అనంతరం ఆమె బావ పరిగి వెళ్ళిపోయాడు. మనస్థాపానికి గురైన యువతి ఇంటి నుంచి బయటకు వెళ్లింది. శిరీష ఇంట్లో నుంచి వెళ్ళిపోయిందని ఆమె సోదరుడు శ్రీను.. అనిల్కు ఫోన్ చేసి చెప్పాడు. అప్పటికే తన మిత్రుడితో కలిసి ఫుల్గా మద్యం సేవించిన అనిల్.. మరో బీరు తీసుకొని ఫ్రెండ్తో కలిసి కాడ్లాపూర్ బయలుదేరాడు. ఊరు శివారులో ఉన్న మైసమ్మ గుడి దగ్గర శిరీష కనిపించడంతో ఆగ్రహంతో ఆమెపై అనిల్ చెయ్యి చేసుకున్నాడు. అంతేగాక అతని ఫ్రెండ్ రాజు, శిరీషను అక్కడే ఉన్న కుంటవైపు లాకెళ్ళి వెంటతెచ్చుకున్న బీరు బాటిల్తో తల పగల గొట్టి కళ్ళల్లో గుచ్చినట్లు సమాచారం. తనను వదిలేయండి అంటూ శిరీష ఎంత ప్రదేయపడ్డా క్రూరులు వదల్లేదని, మోకాలు లోతు నీళ్ళున్న కుంటలో ఆమెను ఇద్దరు కలిసి విసిరేసినట్లు తెలిసింది. శిరీష చనిపోయే వరకు ఆమె దేహంపై అనిల్ ఫ్రెండ్ నిలుచున్నట్లు తెలుస్తోంది. చనిపోయిందని నిర్దారించుకొని అక్కడ ఆనవాళ్ళను మాయం చేసి ఎవరి దారిన వారు వెళ్లి మళ్ళీ శిరీష కోసం వెతికినట్లు నాటకం ఆడారు. కాగా ఇద్దరు నిందితులు ఇంకా పోలీసుల కస్టడీలోనే ఉన్నారు. మరి కొన్ని గంటల్లో పోలీసులు దీనికి సంబంధించి అధికారికంగా పూర్తి సమాచారాన్ని వెల్లడించనున్నారు. చదవండి: లండన్లో హైదరాబాద్ యువతి దారుణ హత్య -
శిరీషది హత్యా.. ఆత్మహత్యా?.. తెలంగాణ డీజీపీకి మహిళా కమిషన్ ఆదేశం
పరిగి, సాక్షి న్యూఢిల్లీ: పారా మెడికల్ విద్యార్థి శిరీష మృతిపై మిస్టరీ వీడలేదు. యువతిది హత్యా.. ఆత్మహత్యా.. అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. కాళ్లాపూర్ శివారులోని నీటి కుంటలో ఆదివారం మధ్యాహ్నం శిరీష (19) మృతదేహం లభ్యమైంది. ఒంటిపై పలు చోట్ల గాయాలు ఉండటం, రెండు కళ్లనూ పొడిచి ఉండటంపై గ్రామస్తులు అనుమానాలు వ్యక్తం చేసిన విషయం విదితమే. పలువురు కుటుంబ సభ్యులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వివరాలు ఆరా తీసే ప్రయత్నం చేశారు. ఇదిలా ఉండగా సోమవారం గ్రామానికి చేరుకున్న వైద్యులు శిరీష మృతదేహానికి రీ పోస్ట్మార్టం నిర్వహించారు. యువతి శరీరంపై గాయాలు ఉన్నట్లు ధ్రువీకరించారు. ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ వచ్చిన తర్వాతే పూర్తి వివరాలు తెలుస్తాయని వెల్లడించారు. శిరీషది ముమ్మాటికీ హత్యేనని, దీనిపై సమగ్ర విచారణ చేపట్టాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. మృతురాలి తండ్రి జంగయ్య, బావ అనిల్పై వారు మండిపడ్డారు. శిరీష మృతికి వారే కారణమంటూ వాగ్వాదానికి దిగారు. దీంతో పోలీసులు కల్పించుకుని త్వరలోనే పూర్తి వాస్తవాలు తెలుస్తాయని, అప్పటివరకు ఓపిక పట్టాలని ఆందోళనకారులకు నచ్చజెప్పారు. తన చెల్లిని చంపిన వారు ఎవరైనా సరే కఠినంగా శిక్షించాలని మృతురాలి తమ్ముడు శ్రీకాంత్ కోరాడు. పోలీసుల అదుపులో మరో ఇద్దరు శిరీష అంత్యక్రియలు ముగిసిన తర్వాత తండ్రి జంగయ్య, బావ అనిల్ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. యువతి తండ్రి జగయ్యను పోలీసులు వదిలేయగా.. బావ అనిల్ను విచారిస్తున్నారు. కాల్ డేటా ఆధారంగా గ్రామానికి చెందిన మరో ఇద్దరు యువకులను కూడా అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. ఈ విషయంపై పోలీసులను వివరణ కోరగా.. కేసు దర్యాప్తులో ఉందని, ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ వస్తే అన్ని విషయాలు తెలుస్తాయని అన్నారు. మూడు రోజుల్లో రిపోర్టు పంపండి: తెలంగాణ డీజీపీకి మహిళా కమిషన్ ఆదేశం శిరీష దారుణ హత్యను జాతీయ మహిళా కమిషన్ సుమోటో కేసుగా స్వీకరించింది. స్క్రూ డ్రైవర్తో బాలిక కళ్లు పీకి, బ్లేడ్తో గొంతు కోసి దారుణంగా హత్య చేసిన ఘటనపై ఢిల్లీలోని ఎన్సీడబ్ల్యూ సోమవారం ఆందోళన వ్యక్తం చేసింది. ఈ ఘటనపై తక్షణమే ఎఫ్ఐఆర్ నమోదు చేసి నిందితులను అరెస్టు చేయాలని తెలంగాణ పోలీసులను ఆదేశించింది. అంతేగాక మూడు రోజుల్లోగా యాక్షన్ టేకెన్ రిపోర్ట్ను పంపించాలని తెలంగాణ డీజీపీకి సూచించింది. తెలంగాణలో బాలికలు, యువతులు, మహిళలపై పెరిగిపోతున్న నేరాలపై జాతీయ మహిళా కమిషన్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. -
వికారాబాద్లో దారుణం.. పాపం శిరీష..
సాక్షి, పరిగి: వికారాబాద్ జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ యువతి దారుణ హత్యకు గురైంది. నిన్నటి నుంచి కనిపించని యువతి శిరీష(19) హత్యకు గురై నీటికుంటలో రక్తపు మరకలతో మృతదేహం కనిపించింది. గుర్తు తెలియని దుండగులు యువతి కనుగుడ్డుపై బలమైన ఆయుధంతో దాడి చేసి, కాళ్లు, చేతి నరాలను కత్తితో కోశారు. వివరాల ప్రకారం.. పరిగి మండలం కాలాపూర్ గ్రామంలో శిరీష దారుణ హత్యకు గురైంది. శనివారం రాత్రి ఇంటి నుంచి బయటకు వెళ్లిన శిరీష తిరిగి ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు టెన్షన్ పడ్డారు. ఈ క్రమంలో పోలీసులను ఆశ్రయించారు. దీంతో, పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అనంతరం.. ఆదివారం ఉదయం గ్రామ సమీపంలోని నీటికుంటలో రక్తపు మరకలతో శిరీష మృతదేహం కనిపించింది. కాగా, గుర్తు తెలియని దుండగులు శిరీషను దారుణంగా హత్య చేశారు. ఆమె కనుగుడ్డుపై బలమైన ఆయుధంతో దాడి చేసి, కాళ్లు, చేతి నరాలను కత్తితో కోశారు. దుండగలు యువతిని హత్య చేసి నీటికుంటలో పడేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఇక, శిరీష ఇంటర్మీడియట్ పూర్తి చేసి వికారాబాద్లోని ఓ ప్రైవేటు కళాశాలలో నర్సింగ్ శిక్షణ తీసుకుంటోంది. ఇటీవల బాలిక తల్లికి గుండెపోటు రావడంతో హైదరాబాద్లోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. తల్లి అనారోగ్య సమస్య కారణంగా శిరీష రెండు నెలల క్రితం చదువు మానేసింది. ఈ క్రమంలో ఇలా దారుణ హత్యకు గురికావడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. మరోవైపు.. ఈ హత్య కేసులో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. నిన్న శిరీషపై ఆమె అక్క భర్త అనిల్ చేయిచేసుకున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. దీంతో, పోలీసులు అనిల్ను అదుపులోకి తీసుకున్నారు. ఇదిలా ఉండగా.. శిరీష గొంతుపై పోలీసులు గాట్లను గుర్తించారు. శిరీష తండ్రి, తమ్ముడికి కూడా పోలీసులు ప్రశ్నిస్తున్నారు. కాగా, శిరీషను అక్క భర్త అనిల్ కొట్టడం వల్లే మనస్తాపానికి గురైనట్టు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇది కూడా చదవండి: బిగ్ ట్విస్ట్.. అప్సరకు గతంలోనే వివాహం?..పెళ్లి ఫోటోలు వైరల్.. -
‘వుయ్ కేన్’ కార్యక్రమంలో ఫెమినా మిస్ ఇండియా- 2020 మానస వారణాసి
-
నమ్మశక్యం కాని అనుభవం
హ్యూస్టన్: అంతరిక్షం నుంచి భూగోళాన్ని వీక్షించడం నమ్మశక్యం కాని, జీవితాన్ని మార్చే గొప్ప అనుభవమని ఇండియన్ అమెరికన్, తెలుగు బిడ్డ శిరీష బండ్ల పేర్కొన్నారు. వర్జిన్ గెలాక్టిక్ సంస్థకు చెందిన వీఎస్ఎస్ యూనిటీ–22 స్పేస్షిప్లో రిచర్డ్ బ్రాన్సన్, మరో నలుగురితో కలిసి ఆమె ఆదివారం అంతరిక్షంలోకి వెళ్లి వచ్చిన సంగతి తెలిసిందే. రోదసిలో తనకు ఎదురైన అనుభవాన్ని శిరీష సోమవారం ఓ మీడియా సంస్థ ఇంటర్వ్యూలో వెల్లడించారు. స్పేష్షిప్లో అంతరిక్షంలోకి వెళ్లడం, క్షేమంగా భూమిపైకి తిరిగి రావడం.. మొత్తం ప్రయాణం ఒక అద్భుతమన్నారు. తన అనుభవాన్ని వర్ణించడానికి ‘నమ్మశక్యం కాని’ కంటే మరో ఉత్తమమైన పదం కోసం వెతుకుతున్నానని, ప్రస్తుతానికి ఆ పదమే తన మదిలో మెదులుతోందని అన్నారు. రోదసి నుంచి మన భూమిని వీక్షించడం ఎప్పటికీ మర్చిపోలేనని చెప్పారు. రోదసిలోకి వెళ్లాలన్నది తన కల అని, అదిప్పుడు సాకారమయ్యిందని ఆనందం వ్యక్తం చేశారు. వ్యోమగామి కావడం చిన్నప్పటి నుంచి తన లక్ష్యమని చెప్పారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
అల అంతరిక్షంలో..
-
శిరీషకు శుభాకాంక్షలు తెలిపిన ఆంధ్ర ప్రదేశ్ సీఎం జగన్
-
బండ్ల శిరీష తాతయ్య ఇంట సంబరాలు
తెనాలి: తెలుగువారి చరిత్రలో తొలిసారి అంతరిక్షయానం చేసి రికార్డు సృష్టించిన గుంటూరు జిల్లా తెనాలి అమ్మాయి బండ్ల శిరీష విజయాన్ని ఆమె బంధువులు పండుగలా చేసుకున్నారు. వర్జిన్ గెలాక్టిక్ సంస్థ చేపట్టిన అంతరిక్ష ప్రయాణంలో వ్యవస్థాపకుడు రిచర్డ్ బ్రాన్సన్ సహా ఆరుగురు పాల్గొన్న విషయం తెలిసిందే. న్యూ మెక్సికో నుంచి ఆదివారం రాత్రి 8 గంటలకు ఆరంభమైన అంతరిక్షయాత్ర 90 నిమిషాల తర్వాత విజయవంతంగా తిరిగి అక్కడకే చేరుకుంది. తెనాలికి చెందిన మాజీ మున్సిపల్ చైర్మన్ బండ్ల పుల్లయ్య మునిమనుమరాలైన శిరీష తాతయ్య రాపర్ల వెంకటనరసయ్య, అమ్మమ్మ రమాదేవి ఇక్కడి బోసురోడ్డులోని అపార్టుమెంట్లో నివసిస్తున్నారు. వీరితో పాటు బంధువులు రామకృష్ణబాబు కలిసి వర్జిన్ గెలాక్టిక్ అంతరిక్షయాత్ర ప్రత్యక్ష ప్రసారాన్ని టీవీ చానళ్లలో చూశారు. చిన్ననాటి కలను నెరవేర్చుకుని రోదసీలోకి వెళ్లిన తమ మనుమరాలు శిరీష క్షేమంగా తిరిగి వచ్చినందుకు వెంకటనరసయ్య, రమాదేవి ఆనందం వ్యక్తం చేశారు. తెనాలికి చెందిన ప్రవాస భారతీయుడు, మాజీ అంతరిక్ష శాస్త్రవేత్త చందు సాంబశివరావు ఇక్కడికి వచ్చి శిరీష తాతయ్య, అమ్మమ్మలను సత్కరించి, స్వీట్లు తినిపించారు. -
రోదసిలో తెలుగు ఖ్యాతి
హ్యూస్టన్: వర్జిన్ అట్లాంటిక్ ఎయిర్వేస్, వర్జిన్ గెలాక్టిక్ స్పేస్ టూరిజం కంపెనీ వ్యవస్థాపకుడు, బిలియనీర్ రిచర్డ్ బ్రాన్సన్ లేటు వయసులో అపూర్వమైన సాహస యాత్ర విజయవంతంగా పూర్తిచేశారు. అంతరిక్ష పర్యాటకానికి బాటలు వేస్తూ సొంత స్పేస్షిప్లో రోదసిలోకి ప్రయాణించి క్షేమంగా తిరిగి వచ్చారు. ఈ యాత్రలో 71 ఏళ్ల బ్రాస్నన్తోపాటు తెలుగు బిడ్డ శిరీష బండ్లతో సహా ఐదుగురు పాలుపంచుకున్నారు. వర్జిన్ గెలాక్టిక్ సంస్థకు చెందిన స్పేస్షిప్ ‘వీఎస్ఎస్ యూనిటీ–22’తో కూడిన ట్విన్ ఫ్యూజ్లేజ్ ఎయిర్క్రాఫ్ట్ ఆదివారం అమెరికాలోని న్యూమెక్సికో రాష్ట్రంలో ఎడారిలో ఏర్పాటు చేసిన ‘స్పేస్పోర్టు అమెరికా’ నుంచి ఆదివారం ఉదయం 10.40 గంటలకు నింగిలోకి దూసుకెళ్లింది. వాతావరణం అనుకూలించకపోవడంతో 90 నిమిషాలు ఆలస్యంగా ఈ యాత్ర ప్రారంభమయ్యింది. బ్రాన్సన్ భార్య, కుటుంబ సభ్యులతో సహా 500 మందికిపైగా జనం ఈ దృశ్యాన్ని ప్రత్యక్షంగా వీక్షించారు. 8.5 కిలోమీటర్లు(13 కిలోమీటర్లు) ప్రయాణించాక ఫ్యూజ్లేజ్ ఎయిర్క్రాఫ్ట్ నుంచి ‘వీఎస్ఎస్ యూనిటీ–22’ విడిపోయింది. వెంటనే అందులోని రాకెట్ ఇంజన్ ప్రజ్వరిల్లింది. బ్రాన్సన్తోపాటు మరో ఐదుగురు ప్రయాణిస్తున్న ఈ సబ్ ఆర్బిటాల్ టెస్టుఫ్టైట్ భూమి నుంచి 55 మైళ్లు (88 కిలోమీటర్లు) నింగిలో ప్రయాణించి, రోదసిలోకి ప్రవేశించింది. అందులోని ఆరుగురు (ఇద్దరు పైలట్లు, నలుగురు ప్రయాణికులు) కొన్ని నిమిషాలపాటు భారరహిత స్థితిని అనుభూతి చెందారు. అనంతరం స్పేస్షిప్ తిరుగుప్రయాణం మొదలుపెట్టింది. భూవాతావరణంలోకి ప్రవేశించి, తన చుక్కానులను గ్లైడింగ్లుగా మార్చుకొని భూమిపైకి అడుగుపెట్టింది. రన్వేపై సురక్షితంగా ల్యాండయ్యింది. మొత్తం గంటన్నరలో ఈ ప్రక్రియ పూర్తయ్యింది. బెజోస్ కంటే ముందే.. రోదసిలోకి వెళ్లడానికి ఇదొక అందమైన రోజు అంటూ ఆదివారం ఉదయం బ్రాన్సన్ ట్వీట్ చేశారు. స్పేస్ టూరిజంలో తన ప్రత్యర్థి అయిన ఎలాన్ మస్క్తో కలిసి దిగిన ఫొటోను పోస్టు చేశారు. వచ్చే ఏడాది నుంచి రోదసి పర్యాటక యాత్రలకు శ్రీకారం చుట్టాలని వర్జిన్ గెలాక్టిక్ కంపెనీ నిర్ణయించింది. ఇందులో భాగంగా ఔత్సాహికుల నుంచి తగిన రుసుము వసూలు చేసి, రోదసిలోకి తీసుకెళ్లి, క్షేమంగా వెనక్కి తీసుకొస్తారు. ఇందులో భాగంగా ‘వీఎస్ఎస్ యూనిటీ–22’లో యాత్ర చేపట్టారు. కేవలం గంటన్నరలో రోదసిలోకి వెళ్లి రావొచ్చని వర్జిన్ గెలాక్టిక్ సంస్థ నిరూపించింది. అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ సైతం స్పేస్ టూరిజం దిశగా అడుగులు వేస్తున్నారు. ఆయన ఈ నెల 20న సొంత రాకెట్ షిప్లో రోదసి యాత్ర చేపట్టనున్నారు. బెజోస్ కంటే ముందే రోదసిలోకి వెళ్లాలన్న సంకల్పమే బ్రాన్సన్ను ఈ యాత్రకు పురికొల్పినట్లు సమాచారం. బ్రాన్సన్ వర్జిన్ గెలాక్టిక్ కంపెనీని 2004 నెలకొల్పారు. రోదసి యాత్ర కోసం ఇప్పటికే 600 మందికిపైగా ఔత్సాహికులు ఈ కంపెనీ వద్ద రిజర్వేషన్లు చేసుకోవడం గమనార్హం. ఒక్కొక్కరు 2,50,000 డాలర్ల (రూ.1.86 కోట్లు) చొప్పున చెల్లించారు. మొదట టిక్కెట్ బుక్ చేసుకున్నవారిని వచ్చే ఏడాది ప్రారంభంలో రోదసిలోకి తీసుకెళ్లే అవకాశం ఉంది. 17 సంవత్సరాల కఠోర శ్రమ తమను ఇంతదూరం తీసుకొచ్చిందని బ్రాన్సన్ పేర్కొన్నారు. యాత్ర అనంతరం ఆయన తన బృంద సభ్యులకు అభినందనలు తెలిపారు. సొంత స్పేస్షిప్లో రోదసి యాత్ర చేసిన తొలి వ్యక్తిగా ఆయన చరిత్ర సృష్టించారు. 70 ఏళ్లు దాటిన తర్వాత రోదసిలోకి వెళ్లిన రెండో వ్యక్తిగా మరో రికార్డు నెలకొల్పారు. 1998లో 77 ఏళ్లు జాన్ గ్లెన్ రోదసి యాత్ర చేశారు.. శిరీష అంతరిక్షయాత్ర రాష్ట్రానికి గర్వకారణం ఏపీ గవర్నర్, ఏపీ సీఎం ప్రశంసలు సాక్షి, అమరావతి: గుంటూరులో జన్మించిన బండ్ల శిరీష అంతరిక్షయాత్రను విజయవంతంగా పూర్తిచేసుకోవడంపై ఏపీ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వేర్వేరు ప్రకటనల్లో శుభాకాంక్షలు తెలిపారు. ఆమె అంతరిక్షయాత్ర రాష్ట్రానికి గర్వకారణమని సీఎం పేర్కొన్నారు. ఆమె భవిష్యత్లో మరింత ఉన్నతస్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. మన శిరీష రికార్డు ఏరోనాటికల్ ఇంజనీర్ శిరీష బండ్ల(34) రోదసిలో ప్రయాణించిన మూడో భారత సంతతి మహిళగా రికార్డు సృష్టించారు. ఈ యాత్రలో తాను భాగస్వామి కావడం గొప్ప గౌరవంగా భావిస్తున్నట్లు చెప్పారు. ఈ మేరకు ఆమె జూలై 6న ట్వీట్ చేశారు. రోదసి యాత్రను ప్రజలకు సైతం అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్న వర్జిన్ గెలాక్టిక్ కంపెనీలో పని చేస్తుండడం తనకు గర్వకారణమని పేర్కొన్నారు. శిరీష బండ్ల ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లాలో జన్మించారు. ఆమెకు నాలుగేళ్లు ఉన్నప్పుడు తల్లిదండ్రులు అమెరికా వెళ్లి, స్థిరపడ్డారు. శిరీష హ్యూస్టన్లో పెరిగారు. భారత సంతతికి చెందిన కల్పనా చావ్లా, సునీతా విలియమ్స్ గతంలో అంతరిక్ష యాత్ర చేసిన సంగతి తెలిసిందే. ఇండియన్ ఎయిర్ఫోర్స్కు చెందిన వింగ్ కమాండర్ రాకేశ్ శర్మ ఇప్పటిదాకా అంతరిక్షంలోకి వెళ్లిన ఏకైక భారతీయుడిగా రికార్డుకెక్కారు. -
శిరీషకు శుభాకాంక్షలు తెలిపిన సీఎం జగన్
హూస్టన్: వర్జిన్ గెలాక్టిక్ చేపట్టిన అంతరిక్ష యాత్ర విజయవంతమైంది. అంతరిక్షంలో చక్కర్లు కొట్టి తిరిగి భూమిని చేరుకుంది, రోదసీలోకి వెళ్లి వచ్చిన నాలుగో భారతీయరాలుగా శిరిష రికార్డు సృష్టించింది. గతంలో కల్పనా చావ్లా, సునీతా విలియమ్స్ స్పేస్లో ప్రయాణించారు. వర్జిన్ గెలాక్టిక్ స్పేస్ షిప్లో ఆ సంస్థ అధిపతి రిచర్బ్ బ్రాన్సన్తో 5గురు సభ్యులతో కలిసి శిరీష అంతరిక్ష ప్రయాణం చేసింది. ఈ ప్రయోగం 90 నిమిషాల పాటు సాగింది. ఈ షిప్లో భాగస్వామి కావడం తనకెంతో గౌరవకారణమని శిరీష ట్వీట్ చేశారు. వర్జిన్ గెలాక్టిక్ అంతరిక్ష యాత్రకు సంబంధించిన లైవ్ను యూట్యూబ్లో షేర్ చేసింది. శిరీషకు శుభాకాంక్షలు తెలిపిన సీఎం జగన్ అంతరిక్ష యాత్రను విజయవంతం చేసుకున్న శిరీషకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. గుంటూరులో జన్మించిన బండ్ల శిరీష అంతరిక్ష యాత్రను విజయవంతంగా పూర్తి చేసుకొని రావడం రాష్ట్రానికి గర్వించదగ్గ క్షణమని సీఎం జగన్ పేర్కొన్నారు. Hon'ble CM Sri @ysjagan conveyed his best wishes to Guntur born aeronautical engineer Bandla Sirisha, flying on space flight Virgin Gailactic Unity 22. The CM said that it is a proud moment for the state and wished her good luck for the success of space mission. — CMO Andhra Pradesh (@AndhraPradeshCM) July 11, 2021 -
అంతరిక్షంలోకి తెలుగు అతివ
-
నేడే అంతరిక్షంలోకి తెలుగు అతివ
హూస్టన్: భారతీయ సంతతికి చెందిన బండ్ల శిరీష ఆదివారం అంతరిక్షయానానికి సిద్ధమైంది. అంతరిక్ష యాత్ర విజయవంతమైతే ఈ ఘనత సాధించిన మూడో భారతీయ సంతతి మహిళగా శిరీష నిలుస్తుంది. గతంలో కల్పనా చావ్లా, సునీతా విలియమ్స్ స్పేస్లో ప్రయాణించారు. వర్జిన్ గెలాక్టిక్ స్పేస్ షిప్లో ఆ సంస్థ అధిపతి రిచర్బ్ బ్రాన్సన్తో మరియు 5గురు సభ్యులతో కలిసి శిరీష అంతరిక్ష ప్రయాణం చేయనుంది. ఈ షిప్లో భాగస్వామి కావడం తనకెంతో గౌరవకారణమని శిరీషట్వీట్ చేశారు. షిప్లో ఆమె రిసెర్చర్ ఎక్స్పీరియన్స్ బాధ్యతలు చేపట్టనుంది. తనకు ఈ అవకాశం దక్కినట్లు తెలియగానే మాటలు రాలేదంటూ వర్జిన్ గెలాక్టిక్ ట్విట్టర్లో ఒక వీడియో పోస్టు చేశారు. అమెరికాలోని ప్యూర్డ్యూ యూనివర్సిటీలో ఆమె విద్యాభ్యాసం చేశారు. ఈ సందర్భంగా తాను చదివిన యూనివర్సిటీని గుర్తు చేసుకున్నారు. 2015లో వర్జిన్ గలాక్టిక్లో ప్రభుత్వ వ్యవహారాల విభాగ మేనేజరుగా చేరారు. ప్రస్తుతం కంపెనీ గవర్నమెంట్ ఎఫైర్స్ అండ్ రీసెర్చ్ ఆపరేషన్స్ విభాగం ఉపాధ్యక్షురాలిగా కొనసాగుతున్నారు. -
అంతరిక్షంలో తెలుగు ధీర
అంతరిక్షం అచ్చ తెలుగులో ‘నమస్కారం’ అనే పలకరింపు విననుంది. కోట్లాదిమంది తెలుగువారి చారిత్రక, జీవన పరంపరకు ప్రతినిధిగా ఒకరు తన వద్దకు వచ్చినందుకు అది విస్మయపు ముచ్చటపడనుంది. యుగాలుగా తల ఎత్తి తెలుగువారు దిగంతాలలో చూపు గుచ్చి ఉంటారు. ఇవాళ పై నుంచి ఒక తెలుగమ్మాయి మనకు చేయి ఊపి హాయ్ చెప్పనుంది. అవును. చరిత్రలో తొలిసారిగా తెలుగు ధీర శిరీష బండ్ల అంతరిక్ష ప్రయాణం కట్టనుంది. అంతరిక్షయానం చేయాలని అందరికీ ఉంటుంది. అయితే ఇది సామాన్యుల ఊహకు అందేది కాదు. శ్రీమంతులు అందుకోగల ఆలోచనా కాదు. అంతరిక్ష శాస్త్రవేత్తలు, సాంకేతిక నిపుణులకు మాత్రమే సాధ్యమయ్యే ఈ జాబితాలో ‘కమర్షియల్ స్పేస్క్రాఫ్ట్’ ద్వారా ఇటీవల అత్యంత సంపన్నులు చేరుతున్నారు. టెస్లా సి.ఇ.ఓ ఎలాన్ మస్క్ నుంచి అమెజాన్ వ్యవస్థాపకులు జెఫ్ బెజోస్ వరకూ అంతరిక్షం అంచులు తాకాలనువారు ఈ రేస్లో ఉన్నారు. అటువంటిది– ఈ అద్భుత ప్రయాణం చేసే అవకాశం మన తెలుగింటి అమ్మాయి బండ్ల శిరీషకు దక్కింది. ఇది ఒక చరిత్రాత్మక అవకాశం. తెలుగువారి చరిత్రలో తొలి అంతరిక్ష యానం చేసిన వ్యక్తిగా/మహిళగా బండ్ల శిరీష ఎప్పటికీ నిలిచిపోతుంది. వర్జిన్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అధినేత రిచర్డ్ బ్రాన్సన్తో కలిసి మరో తొమ్మిదిరోజుల్లో శిరీష రోదసిలో అడుగుపెట్టబోతోంది. చీరాలలో పుట్టింది గుంటూరు జిల్లా తెనాలికి చెందిన రాపర్ల వెంకట నరసయ్య, రమాదేవిల కుమార్తె అనూరాధ సంతానం శిరీష. అనురాధ భర్త డాక్టర్ బండ్ల మురళీధర్ ఒక్లహామా స్టేట్ యూనివర్సిటీలో ప్లాంట్ వైరాలజీలో పీహెచ్డీ చేసి అమెరికాలో స్థిరపడడంతో చీరాలలో పుట్టిన శిరీష నాలుగేళ్ల వయసులో తన అక్క ప్రత్యూషతో అమెరికా వెళ్లింది. శిరీష విద్యాభ్యాసం అంతా అక్కడే జరిగింది. చిన్నప్పటి నుంచి స్పేస్సైన్స్ను అమితంగా ఇష్టపడే శిరీష పర్డ్యూ యూనివర్సిటిలో ఏరోనాటికల్ అండ్ అస్ట్రోనాటికల్ ఇంజనీరింగ్ డిగ్రీ అయ్యాక కమర్షియల్ స్పేస్ఫ్లైట్ ఫెడరేషన్ (సీఎస్ఎఫ్)లో ఏరోస్పేస్ ఇంజినీర్గా పనిచేస్తూ అధునాతన విమాన విడిభాగాలను రూపొందించేది. మరోపక్క జార్జ్ వాషింగ్టన్ యూనివర్సిటీలో ఎంబీఏ పూర్తి చేసింది.‡ఈ క్రమంలోనే 2015లో రిచర్డ్ బాన్సన్ ‘స్పేస్ఫ్లైట్’ సంస్థ ‘వర్జిన్ గెలాక్టిక్’ లో ప్రభుత్వ వ్యవహారాల మేనేజర్గా చేరిన అంచెలంచెలుగా ఎదిగి పరిశోధనా విభాగంలో వైస్ప్రెసిడెంట్ బాధ్యతలు నిర్వహిస్తోంది. వాషింగ్టన్ కేంద్రంగా పనిచేస్తో్తన్న వర్జిన్ ఆర్బిట్ వ్యహారాలను చూస్తూ, మరోపక్క అమెరికన్ ఆస్ట్రోనాటికల్ అండ్ ఫ్యూచర్ స్పేస్ లీడర్స్ ఫౌండేషన్ బోర్డు డైరెక్టర్లలో సభ్యురాలిగా, పర్డ్యూ యూనివర్సిటీ యంగ్ ప్రొఫెషనల్ అడ్వైజరీ కౌన్సిల్ సభ్యురాలిగా ఉంది. ఫలితంగా ఆమెకు అంతరిక్షయానం అవకాశం దక్కింది. బ్రాన్సన్తో కలిసి వర్జిన్ గెలాక్టిక్ నిర్వహించనున్న నాలుగో స్పేస్ ట్రిప్పులో వర్జిన్ వ్యవస్థాపకుడు రిచర్డ్ బ్రాన్సన్ తనతో కలిపి మొత్తం ఆరుగురు టీమ్తో పాల్గొననున్నాడు. మిగిలిన ఐదుగురిలో ఇద్దరు పైలట్లు, ముగ్గురు స్పేస్ స్పెషలిస్టులు ఉన్నారు. శిరీష ఈ స్పేస్ స్పెషలిస్టుల్లో ఉంది. ఈ నెల 11వ తేదీన తెల్లవారుజామున వీరి స్పేస్క్రాఫ్ట్ న్యూమెక్సికో నుంచి నింగిలోకి దూసుకెళ్లనుంది. దీనితో అంతరిక్షంలో అడుగుపెట్టిన తొలి ప్రైవేటు ధనిక వ్యక్తిగా రిచర్డ్ బ్రాన్సన్, స్పేస్లో అడుగుపెట్టిన తొట్టతొలి తెలుగమ్మాయిగా శిరీషలు చరిత్ర సృష్టించనున్నారు. కల్పనా చావ్లా తర్వాత భారత్లో పుట్టి స్పేస్లో అడుగుపెట్టబోతున్న రెండో మహిళగానూ, రాకేష్ శర్మ, కల్పనా చావ్లా, సునీతా విలియమ్స్ తరువాత భారత సంతతి నుంచి అంతరిక్షంలోకి వెళ్లనున్న నాలుగో వ్యోమగామిగా శిరీష నిలవడమే గాక ఈ మిషన్లో వెన్నెముకగా పనిచేయనుంది. ఈ క్రూ టీమ్లో శిరీషతోపాటు బెత్ మోసెస్ అనే మరో మహిళ కూడా ఉన్నారు. నా మనసంతా అంతరిక్షమే ‘‘నేను చిన్నప్పటి నుంచి వ్యోమగామి అయి అంతరిక్షంలోకి వెళ్లాలని అనుకునేదాన్ని. ఎప్పుడూ అందుకు సంబంధించిన ఆలోచనలతో నా మనసు నిండిపోయి ఉండేది. హ్యూస్టన్లో మా ఇంటికి దగ్గర్లో జాన్సన్ స్పేస్ సెంటర్ ఉండేది. ఆ సెంటర్ను సందర్శించినప్పుడల్లా నా కోరిక మరింత బలపడేది. ముందు పైలట్ అవ్వాలి ఆ తర్వాత నాసాలో వ్యోమగామి అవ్వాలి అనుకుని ఆ దిశగా అడుగులు వేద్దామనుకున్నాను. కానీ స్కూల్లో ఉన్నప్పుడే నా కంటి చూపు సరిగా ఉండేది కాదు. దీంతో పైలట్టే కాదు ... ఆస్ట్రోనాట్ కూడా కాలేను అనుకున్నాను. అయితే 2004లో తొలి ప్రైవేటు వాహనం అంతరిక్షంలోకి వెళ్లిందని తెలిసి నాసా ద్వారానే కాదు వ్యోమగామి అయ్యేందుకు మరో మార్గం ఉందనిపించింది. దీంతో అప్పుడు ఏరో స్పేస్ ఇంజినీర్ అయ్యి వాణిజ్య స్పేస్ సెక్టార్లో పని చేయవచ్చని అనుకున్నాను. ఏరోస్పేస్ ఇంజినీరింగ్ చదివేటప్పుడు మైక్రో గ్రావిటీ గురించి పూర్తిగా తెలుసుకున్నాను. ఆ తరువాత నేను సీఎస్ఎఫ్లో చేసిన ఉద్యోగానుభవం నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చింది. నా చిన్ననాటి కల ఈరోజు తీరనున్నందుకు చాలా ఆనందంగా ఉంది’ శిరీష గతంల ఒక ఇంటర్వ్యూలో చెప్పింది. తాతయ్య మాట ‘శిరీషకు ఊహ తెలిసినప్పటి నుంచి అంతరిక్షంపై ఆసక్తి కనపరిచేది. వయసుతోపాటు, ఆకాశం, విమానాలు, రాకెట్లపై ఆసక్తి పెరుగుతూనే వచ్చింది. నాలుగేళ్ల వయసులో ఓ రోజు ఇంట్లో కరెంటు పోతే ఒంటరిగా భయపడుతోన్న అమ్మమ్మకు ధైర్యం చెప్పింది’ అని తాతయ్య నరసయ్య సాక్షితో చెప్పారు. ‘2016లో మా వివాహ స్వర్ణోత్సవానికి తల్లిదండ్రులతో కలిసి శిరీష ఇక్కడకు వచ్చింది. చదువు, ఉద్యోగంతో ఎంత బిజీగా ఉన్నా తరచూ ఫోనులో మా యోగక్షేమాలు తెలుసుకునేది. చిన్నపిల్లగానే మాకు తెలిసిన శిరీష ఇప్పుడు అంతరిక్షంలోకి వెళ్లనుందని చెబుతుంటే ఆశ్చర్యంగా, అంతకుమించిన సంతోషంగా ఉంది’ అన్నారు. – పి.విజయ, సాక్షి ఫీచర్స్ డెస్క్ ఇన్పుట్స్: బి.ఎల్. నారాయణ, సాక్షి, తెనాలి -
మహిళా ఎస్సైపై డీజీపీ ప్రశంసలు
సాక్షి, శ్రీకాకుళం: ముక్కూమొహం తెలియని ఓ మృతదేహాన్ని భుజాల మీద మోసి అందరికీ ఆదర్శంగా నిలిచిన మహిళా ఎస్సై శిరీషను డీజీపీ గౌతమ్ సవాంగ్ అభినందించారు. ఆపదలో నేనున్నానంటూ వారికి బాసటగా నిలబడిన ఆమెకు ప్రశంసా పత్రాన్ని అందజేయనున్నారు. హోం మంత్రి మేకతోటి సుచరిత సైతం సదరు పోలీసు అధికారిణిని మెచ్చుకున్నారు. శ్రీకాకుళంలో అడవికొత్తూరు గ్రామ పొలాల్లో గుర్తు తెలియని వృద్ధుడు మృతదేహం లభ్యమైంది. ఆ మృతదేహాన్ని మోసేందుకు స్థానికులు నిరాకరించారు. ఈ విషయం తెలుసుకున్న కాశీబుగ్గ మహిళా ఎస్సై శిరీష తానే రెండు కిలోమీటర్లు మోసుకుంటూ వెళ్లి లలితా చారిటబుల్ ట్రస్ట్తో కలిసి అంత్యక్రియలు జరిపించిన విషయం తెలిసిందే. (చదవండి: మృతదేహాన్ని భుజాలపై మోసుకెళ్లిన మహిళా ఎస్సై) (చదవండి: డబ్బు.. మద్యం పంపిణీకి చెక్ పెట్టేలా..) Women SI of @POLICESRIKAKULM Carries Homeless Man's Dead Body For 2 kilometres After Villagers Refused to Help in Srikakulam District. Appreciating the humanitarian gesture of Sub inspector Kotturu Sirisha of Kasibugga police station. 👏🏻 pic.twitter.com/53udc8bxoO — Mekathoti Sucharitha (@SucharitaYSRCP) February 1, 2021 -
కరెంట్ పోల్ ఎక్కుతున్న బబ్బురి శిరీష
-
ఇట్లు... ఓ రైతు
ఓ యువ రైతు తన గ్రామంలోని రైతులకు నాణ్యమైన విత్తనాలు అందిస్తూ ఆదర్శవంతమైన జీవితం గడుపుతుంటాడు. ఓ అమ్మాయిని ప్రేమించి, పెళ్లాడి జీవితంలో సెటిల్ అవ్వాలనుకుంటాడు. ఇంతలో అతను హత్య కేసులో ఎందుకు ఇరుక్కున్నాడు? అనే కథాంశంతో తెరకెక్కుతోన్న చిత్రం ‘ఇట్లు’. అమీర్ హీరోగా, శిరీష, అశ్విత హీరోయిన్లుగా రోశిరెడ్డి పందిళ్ళపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతోంది. రాజగౌడ్ పుదారీ, మెట్టయ్య వుప్పల, డా. రఘు, డా. శ్రీరాములు నిర్మిస్తున్న ఈ చిత్రం హైదరాబాద్లో ప్రారంభమైంది. ముహూర్తపు షాట్కి వాణి (ఎంఎఫ్టిఐ) కెమెరా స్విచ్చాన్ చేయగా, నటుడు నారాయణరావు క్లాప్ ఇచ్చారు. మద్దూరి వెంకట కృష్ణమోహన్ గౌరవ దర్శకత్వం వహించారు. రోశిరెడ్డి మాట్లాడుతూ– ‘‘మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో దర్శకత్వ శాఖలో శిక్షణ తీసుకున్నాను. రెండు, మూడు లఘు చిత్రాలను రూపొందించి, ‘ఇట్లు’ సినిమాతో దర్శకుడిగా మారుతున్నా. యాక్షన్, థ్రిల్లర్, రొమాన్స్, కామెడీ అంశాలు ఉంటాయి’’ అన్నారు. ‘‘రోశిరెడ్డి గత 12 ఏళ్లు్లగా తెలుసు. ‘ఇట్లు’ కథ నచ్చి ఈ సినిమా నిర్మిస్తున్నాం’’ అన్నారు రాజగౌడ్. -
టీడీపీ జిల్లా అధ్యక్షురాలు శిరీషకు రెండు చోట్ల ఓటు
శ్రీకాకుళం , కాశీబుగ్గ : సమావేశాల్లో నీతులు దంచే అధికార పార్టీ నాయకుల అసలు రంగు బయటపడుతోంది. సభల్లో సామాన్యుల కంటే తామేదో గొప్పవారమని చెప్పుకునే నేతల మేడిపండు విషయాలు రానురాను జనాలకు తెలుస్తున్నాయి. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను అక్రమంగా తొలగిస్తూ, ఆ తప్పును ప్రతిపక్షంపైకి నెట్టేస్తున్న సమయంలో టీడీపీ జిల్లా అధ్యక్షురాలి అసలు గుట్టు బయటపడింది. టీడీపీ జిల్లా అధ్యక్షురాలు, పలాస ఎమ్మెల్యే గౌతు శ్యామసుందర శివాజీ కుమార్తె గౌతు శిరీషరెండు చోట్ల ఓట్లు కలిగి ఉన్నారు. మొదటి ఓటు : శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గంలో మందస మండలం భిన్నాల గ్రామంలో పోలిం గ్ బూత్ నంబర్ 139లో ఎపిక్ నంబర్ యుఈజె1512607 నంబర్తో శిరీష గౌతు తండ్రి గౌతుశ్యామ సుందర శివాజీ అని ఓటు హక్కు కలిగి ఉంది. రెండో ఓటు: విశాఖపట్నం జిల్లా తూర్పులో ఆంధ్రా యూనివర్సిటీ పాఠశాల ఆవరణంలో బూత్ నంబర్ 173లో శిరీషా యార్లగడ్డ (42 సంవత్సరాలు) భర్త వెంకన్నచౌదరి యార్లగడ్డ పేరుతో ఎపిక్ నంబర్ ఐడివై1048669తో ఓటు హక్కు కలిగి ఉన్నారు. అల్లుడికీ రెండు చోట్ల.. పలాస ఎమ్మెల్యే శివాజీ అల్లుడు, శిరీష భర్త, పలాస టీడీపీ సమన్వయకర్త వెంకన్న చౌదరి కూడా రెండు చోట్ల ఓటు హక్కు కలిగి ఉన్నారు. మొదటి ఓటు : శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గంలో పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలో ఉన్న పురుషోత్తపురంలో పోలింగ్ బూత్ నంబర్ 64లో ఎపిక్ నంబర్ యుఈజె0982059తో వెంకన్న చౌదరి యార్లగడ్డ (45 ఏళ్లు) తండ్రి కృష్ణమూర్తి యార్లగడ్డ పేరున ఓటు హక్కు ఉంది. రెండో ఓటు: విశాఖపట్నం జిల్లాలో తూర్పు నియోజకవర్గంలో బూత్ నంబర్ 173లో సీరియల్ నంబర్ 516 లో ఆంధ్రాయూనివర్సిటీ పాఠశాలలో ఎపిక్ నంబర్ ఐడీవై0548941 నంబర్తో వెంకన్న చౌదరి యార్లగడ్డ తండ్రి కృష్ణమూర్తి పేరుతో ఓటు హక్కు కలిగి ఉన్నారు.జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్కు రెండు చోట్లపలాస ఎమ్మెల్యే ప్రధాన అనుచరుడు, జిల్లా గ్రం థాలయ సంస్థ అభివృద్ధి కమిటీ చైర్మన్ పీరుకట్ల విఠల్రావుకు రెండు చోట్లు ఓటు హక్కు కలిగి ఉన్నారు. మొదటి ఓటు : శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గం పలాస మండలం పెదంచల పంచాయతీలో బూత్నంబర్ 51లో సీరియల్ నంబర్ 528లో ఎపిక్ నంబర్ ఎపి010020366036 నంబర్తో పీరుకట్ల విఠలరావు ఓటు హక్కు కలిగి ఉన్నారు. ఈ గ్రామానికి సుమారు 9కిలో మీటర్లు దూరంలో ఉన్న పలాస–కాశీబుగ్గ జంటపట్టణంలో కాశీబుగ్గ బూత్ నంబర్ 11లో ఎపిక్ నంబర్ యుఈజె0973868 నంబర్తో విఠల్రావు పీరుకట్ల పేరుతో ఓటు పొంది ఉన్నారు. కుమారుడు కూడా.. గౌతు శిరీష కుమారుడు శ్రవణ శ్రీహర్షకు పలాస మండలం కేదారిపురంలో (ఎపిక్ యుఈజె1517077), విశాఖలో (ఎపిక్ నంబర్ ఐడివై2903557)తో రెండు చోట్ల ఓటు కలిగి ఉన్నారు. అత్తమ్మ–మామ శిరీష అత్తమ్మ విజయలక్ష్మియార్ల గడ్డకు విశాఖ, పలాసలో రెండు చోట్ల యుఈజె1517069 ఓటు, ఐడీవై 2293058 నంబర్తో ఓటు హక్కు ఉంది. అలాగే శిరీష మామ కృష్ణమూర్తి విశాఖ–పలాసలో ఎపిక్ నంబర్ యుఈజె1512607, ఐడివై2905206 నంబర్తో ఓటు హక్కు కలిగి ఉన్నారు. -
రాష్ట్రానికి ‘చంద్ర’గ్రహణం పట్టింది
సైదాపురం నెల్లూరు: రాష్ట్రానికి చంద్రగ్రహణం పట్టిందని తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గ జిల్లా మహిళ అధ్యక్షురాలు, జెడ్పీ వైస్ చైర్పర్సన్ పొట్టేళ్ల శిరీష అన్నారు. మండలంలోని తురిమెర్ల గ్రామంలోని ఆమె స్వగృహంలో శుక్రవారం విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ ఆంధ్ర ప్రదేశ్లో శుక్రవారం రోజున చంద్రగ్రహణమని ఎటువంటి శని నివారణ పూజలు, హోమాలు చేయనవసరం లేదన్నారు. ఆంధ్రప్రదేశ్కు చంద్రగ్రహణం నాలుగేళ్ల క్రితమే పట్టిందని ఆమె అన్నారు. రాష్ట్రానికి పట్టిన ఆ చంద్రగ్రహణం దెబ్బకు రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు లేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్నారు. మరో వైపు చదువుకున్న నిరుద్యోగులకు ఉపాధి లేక సమాజంలో మహిళలకు రక్షణ లేకుండాపోయిందన్నారు. ప్రపంచానికి చంద్ర గ్రహణం 5గంటలు మాత్రమే కానీ ఆంధ్రప్రదేశ్కు 5ఏళ్లు ఉందన్నారు. రాష్ట్రానికి పట్టిన చంద్రగ్రహాణన్ని వదిలించడం ఒక్క వైఎస్ జగన్మోహన్రెడ్డికి మాత్రమే సాధ్యమన్నారు. అదే విధంగా మద్యం దుకాణాలు లేకుండా చేస్తామని జగన్మోహన్రెడ్డి ప్రకటించడం జరిగిందన్నారు. ఈ ప్రకటన ఆంధ్రప్రదేశ్లోని మహిళా లోకం అంతా స్వాగతించదగ్గ విషయమన్నారు. -
పెళ్లికి నిరాకరించాడని..
మారేడుపల్లి : ప్రేమ పేరుతో నమ్మించి మోసం చేయడమేగాక పెళ్లికి నిరాకరించిన ప్రియుడి ఇంటిముందు ఓ యువతి ఆమరణ నిరాహార దీక్ష చేపట్టింది. వివరాల్లోకి వెళితే... కొండాపూర్కు చెందిన శిరీషారాణి (24) ఎంబీఏ పూర్తిచేసింది. గత ఏడాది వాట్సాప్లో మారేడుపల్లి శేషాచలం కాలనీకి చెందిన నక్కా నితిన్యాదవ్ ఫోన్కు ఆమె ఫోన్ నుంచి రాంగ్కాల్ వెళ్లింది. ఇలా ఏర్పడిన పరిచయం ప్రేమకు దారితీసింది. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇద్దరూ కలిసి తిరిగారు. మూడు నెలల క్రితం ఆమె పెళ్లి ప్రస్తావన తేగా నితిన్యాదవ్ అందుకు నిరాకరించాడు. దీంతో ఆమె తన కుటుంబ సభ్యులతో కలిసి మారేడుపల్లిలోని నితిన్యాదవ్ ఇంటికి వచ్చి పెళ్లి చేసుకోవాలని కోరారు. అయినా నితిన్యాదవ్, అతని కుటుంబసభ్యులు పెళ్లికి నిరాకరించడంతో మార్చి 14న మారేడుపల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు కౌన్సెలింగ్ నిర్వహించినా అతనిలో మార్పురాకపోవడంతో గత నెల 15న అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. బెయిల్పై బయటికి వచ్చిన నితిన్తో తనకు వివాహం జరిపించాలని కోరుతూ బాధితురాలి బుధవారం రాత్రి నుంచి అతని ఇంటి వద్ద ఆమరణ నిరాహారదీక్షకు పూనుకుంది. గురువారం పలు మహిళాసంఘాల నేతలు ఆమెకు సంఘీభావం తెలిపారు. నితిన్యాదవ్ ఇంటికి తాళంవేసి ఉండడంతో ఇంటివద్దనే టెంటువేసుకుని దీక్షను కొనసాగిస్తుంది. ఎన్నిరోజులైనా దీక్షను కొనసాగిస్తానని, అతనితోనే జీవితాంతం కలిసి ఉంటానని ఆమె పేర్కొంటుంది. -
ఒకే సంవత్సరంలో 4 ప్రభుత్వ ఉద్యోగాలు
చిత్తూరు, మదనపల్లె:మండలంలోని సీటీఎం పంచాయతీ మిట్టపల్లెకు చెందిన రమణ, సావిత్రి దంపతులకు శిరీషా, జ్యోత్స ఇద్దరు కుమార్తెలు. రమణ వ్యవసాయం చేస్తుండగా, సావిత్రి నిమ్మనపల్లెలో ఏఎన్ఎంగా పనిచేస్తోంది. పెద్ద కుమార్తె శిరీషా. చిన్నప్పటి నుంచి ఈమె చదువులో మెరిక. ఈ క్రమంలో ఎంటెక్ పూర్తి చేసింది. అదే ఏడాది ఏపీపీఎస్సీ పరీక్షలు రాసి, ఉద్యో గం సాధించింది. మదనపల్లె మున్సిపాలిటీలో ఎన్విరాన్మెంటల్ ఇంజినీరింగ్ విభాగంలో ఏఈగా పనిచేస్తోంది. నాలుగు ప్రభుత్వ ఉద్యోగాలు 2017లో ఏపీపీఎస్సీ విడుదల చేసిన అన్ని ఉ ద్యోగ ప్రకటనలకు దరఖాస్తు చేసింది. ఫిబ్రవ రి, ఏప్రిల్లో రాసిన పరీక్షల్లో గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్, డిస్ట్రిక్ట్ హైడ్రాలజిస్ట్, ఎన్విరాన్మెంట్ విభాగాల్లో ఏఈ పోస్టులు, జెన్కో ఏఈ గా నాలుగు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించింది. తాజాగా 2018 జనవరిలో జరిగిన గ్రూప్స్ ప్రిలిమినరీ, మెయిన్స్లో ఉత్తీర్ణత సాధించింది. జన్మభూమిపై మమకారంతో.. కడప గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్లో జిల్లా అధికారిగా నెలపాటు ఉద్యోగం చేసిన శిరీషా జన్మభూమిపై మమకారంతో ఆ ఉద్యోగాన్ని వ దులుకుని, మదనపల్లె మున్సిపాలిటీలో ఎన్వి రాన్మెంట్ ఏఈగా పనిచేస్తోంది. మా నాన్నే నాకు స్ఫూర్తి.... ఆడపిల్లల చదువులకు ఎందుకు అన్న బంధువులు మాటలు వినకుండా, పిల్లలే నా సర్వస్వం అనుకున్నాడు మా నాన్న. మా ఉన్నతి చూసి మురిసిపోయిన మా నాన్నే నాకు స్ఫూర్తి. – శిరిషా -
అడవిలో ఏం జరిగింది?
సాయి సంహిత క్రియేషన్స్ పతాకంపై యస్వీ రయణ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిస్తోన్న చిత్రం ‘మన్యం’. రఘువీర్, శిరీష దాసరి, ‘బాహుబలి’ ప్రభాకర్, వర్ష ముఖ్య తారలు. హైదరాబాద్లో ఈ చిత్రం ఆడియో వేడుక జరిగింది. ఆడియో సీడీని దర్శక–నిర్మాత వైవీయస్ చౌదరి విడుదల చేసి మొదటి సీడీని పాటల రచయిత చంద్రబోస్కి అందించారు. హీరో రఘువీర్ మాట్లాడుతూ – ‘‘ఆయుర్వేదిక్ మెడిసన్ చదివే మెడికోలు ఎప్పుడూ ఏదో ఒక మందు కనుక్కోవాలి. అలా కనుక్కొని సమాజానికి ఎంతో కొంత ఉపయోగపడాలి. అలాంటి పాత్రను ఇందులో చేస్తున్నాను. ఆ మందు కనిపెట్టే ప్రాసెస్లో నా స్నేహితులతో కలిసి అడవిలోకి వెళ్లినప్పుడు ఏం జరిగింది? దెయ్యం రూపంలో మాకు ప్రమాదం సంభవిస్తే ఎన్ని కష్టాలు వచ్చాయి? ఆ కష్టాల నుండి ఎంతమంది బయటపడ్డాం? ఎంతమంది చనిపోయారు. అసలు దెయ్యం ఉందా, లేదా?’’ అనేది కాన్సెప్ట్’’ అన్నారు. ‘‘రమణ చాలా నిబద్ధత కలిగిన దర్శకుడు. హీరో రఘువీర్కు మంచి భవిష్యత్ ఉంది’’ అన్నారు వైవీయస్ చౌదరి. చంద్రబోస్ మాట్లాడుతూ – ‘‘నా కెరీర్లో మొదటిసారి ఈ సినిమాలో ‘చినుకల్లే కురిసింది’ అనే పాట పాడాను. ఈ పాట నేనే రాశాను’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: సదాచంద్ర, ఎగ్జిక్యూటివ్ నిర్మాతలు: పి.కోమలీదేవి, మేముల సత్యనారాయణ. -
విధిరాతను తిరగరాసి..
చిన్నపాటి సమస్యకే డీలా పడిపోతారు..జీవితమే ముగిసిపోయినట్లు కుంగిపోతారు. నిరాశలో కాలం వెళ్లదీస్తారు. కానీ శిరీషను చూస్తే నిరాశకే నిరాశ పుట్టకమానదు..విధిరాతను తిరగరాసింది. పుట్టుకతో వచ్చిన శారీరక వైకల్యానికి మనోధైర్యంతో ..పట్టుదలతో సమాధానం చెప్పింది. లక్షమందిలో ఒకరికి వచ్చే జబ్బు తనకే వచ్చినా అమ్మానాన్నల ప్రోత్సాహం శిరీషలో ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసింది. ఈ లక్షణాలే ఆదివారం బెంగళూరులో రాష్ట్రపతి చేతుల మీదుగా మూడు చక్రాల కుర్చీలో కూర్చుని పురస్కామందుకునేలా చేస్తున్నాయి. చిత్తూరు అర్బన్: ఎప్పుడైనా కాస్త నిరాశ కలిగితే చిత్తూరులోని కొంగారెడ్డిపల్లెకు చెందిన శిరీష గురించి తెలుసుకోండి.. నిరాశ పటాపంచలవుతుంది. విజయకుమార్, సుజాత రెండో సంతా నంగా శిరీష 1987లో పుట్టింది. పుట్టుకతోనే అస్టోజెనిసిస్ ఇంపెర్ఫెక్టా జెనటిక్ డిజార్డర్ అనే వ్యాధి సోకింది. దీనికారణంగా శరీరంలోని కాళ్లు, చేతులు, వెన్నెముకతో పాటు అన్ని అవయవాలు సరిగా పనిచేయటం మానేశాయి. ఈ బిడ్డ పుట్టిన నాలుగేళ్లకు వైమానికదళంలో ఉద్యోగం మానేసిన విజయకుమార్ ఎన్నో ఆసుపత్రుల చుట్టూ తిరిగారు. అయినా ఫలితంలేదు. లక్ష మందిలో చాలా కొద్ది మందికి మాత్రమే వచ్చే లోపమని వైద్యులు చేతులెత్తేశారు. నడవలేని చిన్నారికి తామే కాళ్లయ్యారు విజయకుమార్, సుజాత దంపతులు. విజయకుమార్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకులో చేస్తున్నారు. తల్లి ఇంట్లో శిరీషకు అన్నీ తానై చేదోడుగా నిలిచారు. ఇంట్లోనే ట్యూటర్ను పెట్టి పాఠాలు చెప్పించారు. ఎక్కడికి కదలాలన్నా మూ డు చక్రాల సైకిలే ఆధారం. ఏం చేయాలన్నా ఎవరో ఒకరు సాయపడేవారు. ఏడో తరగతి పాసైన తరువాత చిత్తూరు షర్మన్ బాలికల పాఠశాలలో రెగ్యులర్గా చదివి పదో తరగతి, విజేత కళాశాలలో ఇంటర్, ఎస్వీ రాజు కళాశాలలో బీకాం కంప్యూటర్స్ ఉత్తీర్ణత సాధించారు. ఆశావాదంతో అడుగులు డిగ్రీ పూర్తయిన తర్వాత బ్యాంకు ఉద్యోగాలపై శిరీష దృష్టి సారించారు. తండ్రి నేర్పిన మెలకువలతో ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాకింగ్ పర్సనల్ సెలెక్షన్ (ఐబీపీఎస్) పరీక్షలకు ప్రిపేరయ్యారు. తొలిసారే శిరీష ఈ పరీక్షల్లో అర్హత సాధించినా వైకల్యం కారణంగా ఉద్యోగం రాలేదు. తరువాత గ్రామీణ బ్యాంకు పరీక్షల్లో రాణించి అర్హత సాధించారు. ఇక్కడా అదే కారణం చూపారు.. కానీ ఉద్యోగం చేయాలనే ఆశయం ఈమెను బెంగళూరు వరకు తీసుకెళ్లింది. అక్కడ తొలుత డేటా ఎంట్రీ ఆపరేటర్గా చేరింది. మరింత ఆత్మవిశ్వాసం పెరిగింది. నెలకు రూ.7 వేలు జీతం. సహాయకురాలికి, ఇంటి అద్దె, ఇతర ఖర్చులకు రూ.15 వేలయ్యేవి. తండ్రి సహకరించడంతో ఆర్థిక ఇబ్బందులుండేవి కావు. అనంతరం వీడియోకాన్ సంస్థలో కస్టమర్కేర్లో పనిచేస్తూ ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ బ్యాంకు పరీక్షల్లో ప్రతిభ చాటి జూనియర్ ఆఫీసర్గా ఉద్యోగం సం పాదించారు శిరీష. అయినా చదువుపై మక్కువతో ఎంబీఏ చేస్తున్నారు. నేడు కోవింద్ చేతుల మీదుగా పురస్కారం.. ఏటా ప్రత్యేక ప్రతిభావంతులుగా స్ఫూర్తిదాయకంగా నిలిచేవారికి భారత ప్రభుత్వం పురస్కారాలు అందజేస్తుంది. వైకల్యం వెక్కిరించినా తన కెరీర్ను చక్కగా మలుచుకుని రాణిస్తున్న శిరీష ఈ ఏడాది ఇలా ఎంపికైన జాబితాలో చోటు సంపాదించింది. మన జిల్లా నుంచి ఇలా ఎంపికైంది ఈమె ఒక్కరే. ఆదివారం ఢిల్లీలో జరిగే కార్యక్రమంలో రాష్ట్రపతి రామనాథ్ కోవింద్ చేతుల మీదుగా అవార్డు అందుకోనున్నారు. ఇప్పటికే శిరీష కుటుంబ సభ్యులు ఢిల్లీకి చేరుకున్నారు. -
సీనియర్ నటుడు చిన్నా భార్య కన్నుమూత
సాక్షి, హైదరాబాద్: టాలీవుడ్ సీనియర్ నటుడు చిన్నా(శివ ఫేం) భార్య శిరీష (42) కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె సోమవారం అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారని చిన్నా మీడియాకు వెల్లడించారు. దీంతో ఆయన కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. చిన్నా, శిరీష దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కాగా రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన శివ సినిమాలోని చిన్నా పాత్రతో అలరించిన జితేంద్ర రెడ్డి ఆ పేరుతోనే గుర్తింపు పొందారు.. అనంతరం 'మనీ' సిరీస్లో హీరోగా నటించిన చిన్నా ఒక హారర్ చిత్రం 'ఆ ఇంట్లో’ చిత్రానికి దర్శకత్వం కూడా వహించారు. -
శిరీష మృతి కేసు : రాత్రంతా సాగిన హైడ్రామా
హైదరాబాద్ : బ్యూటీషియన్ శిరీష మృతికేసులో మంగళవారం రాత్రి నుంచి బుధవారం తెల్లవారుజాము వరకు హైడ్రామా సాగింది. అర్థరాత్రి 12:30 గంటల తర్వాత నిందితులు రాజీవ్, శ్రావణ్లను బంజారాహిల్స్ పీఎస్ నుంచి ఉస్మానియా ఆస్పత్రికి పోలీసులు తీసుకువెళ్లారు. రాత్రి 1:20 గంటలకు ఉస్మానియాలో రాజీవ్, శ్రావణ్లకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఉస్మానియా వద్ద మీడియా కళ్లుగప్పి కుకునూర్పల్లి తీసుకువెళ్లారు. తెల్లవారుజామున 3:30 గంటలకు కుకునూర్పల్లి చేరుకున్నారు. పోలీసులు మీడియాను చూసి కుకునూర్పల్లి పీఎస్కు వెళ్లకుండా సిద్దీపేట వైపు 25 కి.మీ వెళ్లారు. కుకునూర్పల్లి రోడ్డుపై 45 నిమిషాలసేపు రాజీవ్, శ్రావణ్లను పోలీసులు తిప్పారు. ఉదయం 4:15 గంటలకు తిరిగి హైదరాబాద్ వైపు రాజీవ్, శ్రావణ్లను తరలించారు. ఉ.5:30కి రాజీవ్, శ్రావణ్ను బంజారాహిల్స్ పీఎస్కు తీసుకువచ్చారు. బుధవారం ఏ క్షణంలోనైనా రాజీవ్, శ్రావణ్లను కుకునూర్పల్లి తీసుకువెళ్లే అవకాశం ఉన్నట్టు సమాచారం. ఎస్ఐ ప్రభాకర్ రెడ్డి క్వార్టర్స్లో ఏం జరిగిందో నమోదు చేయనున్నారు. రాజీవ్, శ్రావణ్లను రెండ్రోజులు పోలీసులు విచారించారు. రాజీవ్, శ్రావణ్లు చెప్పిన వివరాలపై కేసును రీ కన్స్ట్రక్షన్ చేసేపనిలో పోలీసులు ఉన్నారు. -
శిరీష దుస్తులపై మరకలు దేనికి సంకేతం?
- అత్యాచారం జరిగిఉంటుందని పోలీసుల అనుమానం - రిమాండ్ డైరీలో సంచలన అంశాలు హైదరాబాద్: బ్యుటీషియన్ శిరీష ఆత్మహత్య కేసులో మరో సంచలన అంశం వెలుగులోకి వచ్చింది. మరణించిన సమయంలో ఆమె ధరించిన లోదుస్తులపై మరకలను గుర్తించినట్లు పోలీసులు పేర్కొన్నారు. దీంతో ఆమెపై అత్యాచారం జరిగి ఉంటుందనే కోణంలో దర్యాప్తును వేగవంతం చేశారు. కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్టులో పోలీసులు.. శిరీష లోదుస్తులపై మరకలు ఉన్నట్లు పేర్కొన్నారు. అయితే, ఫోరెన్సిక్ రిపోర్టులు ఇంకా రావాల్సిఉందని, ఆ తర్వాతే అత్యాచారంపై పూర్తి నిర్ధారణకు వస్తామని తెలిపారు. శిరీష ఆత్మహత్య కేసులో నిందితులైన శ్రవణ్, రాజీవ్లు ప్రస్తుతం జ్యుడీషియల్ రిమాండ్లో ఉన్న సంగతి తెలిసిందే. ఈనెల 12న అర్ధరాత్రి కుకునూర్పల్లి పోలీస్ క్వార్టర్లో చోటుచేసుకున్న విషయాలను సైతం పోలీసులు రిమాండ్ డైరీలో కోర్టుకు వివరించారు. శిరీష కేసులో ఏ1 శ్రవణ్.. గతంలో పలుమార్లు ఎస్సై ప్రభాకర్రెడ్డికి అమ్మాయిలను పంపేవాడని, సమస్య పరిష్కారం పేరుతో శిరీషను కుకునూర్పల్లికి తీసుకెళ్లకముందే ఆమె ఫోటోలను ఎస్సైకి వాట్సాప్లో పంపాడని రిమాండ్ డైరీలో పేర్కొన్నారు. అంతకముందు జరిగిన ఫోన్ సంభాషణల్లోనూ శిరీష అందం గురించి ఎస్సై ప్రభాకర్రెడ్డితో శ్రవణ్ మాట్లాడాడని వెల్లడైంది. ‘సెక్స్వర్కర్ల దగ్గరికి వెళ్లాలని ఎస్సై ప్రభాకర్రెడ్డి.. రాజీవ్, శ్రవణ్లను క్వార్టర్స్నుంచి బయటికే పంపే ప్రయత్నం చేశాడు. అందుకు రాజీవ్ ఆసక్తిప్రదర్శించాడు. దీంతో శ్రవణ్.. సిగరేట్ నెపంతో రాజీవ్ను బయటికి తీసుకొచ్చాడు. గదిలో ఒంటరిగా చిక్కిన శిరీషను ప్రభాకర్రెడ్డి దగ్గరకు తీసుకునే ప్రయత్నం చేయగా ఆమె ప్రతిఘటించింది. ‘సాయం కోసం వస్తే ఇలా చేస్తున్నారేమిట’ని నిలదీసింది. ‘నేను అలాంటిదాన్ని కాదం’టూ ఎస్సైని వెనక్కి నెట్టేసింది. అయినాసరే ప్రభాకర్రెడ్డి వినకుండా మళ్లీ దగ్గరకు వెళ్లడంతో శిరీష బిగ్గరగా కేకలు వేసింది’ అని రిమాండ్ డైరీలో పోలీసులు పేర్కొన్నారు. శిరీష విషయంలో తప్పంతా రాజీవ్దే: ఏ1 శ్రవణ్ -
శిరీషను హత్య చేసింది ఎవరు?
హైదరాబాద్: గత మూడు రోజుల ఉత్కంఠ ముగిసింది. బ్యూటీషియన్ శిరీషది ఆత్మహత్య కాదు హత్యే అనే పోలీసులు నిర్ధారించారు. అయితే, ఆమెను ఎవరు హత్య చేశారు? హత్య చేయడానికి గల కారణాలు ఏమిటి? ఒకరు చేశారా? లేక ఇద్దరు కలిసి చేశారా? మరో వ్యక్తి ప్రోద్భలం ఇందులో ఉందా? అనే కోణంలో మరింత ఉత్కంఠ నెలకొంది. ఈ రోజు మధ్యాహ్నం 2గంటలకు జరగబోయే మీడియా సమావేశంలో ఈ వివరాలన్నింటిని కూడా సీపీ మహేందర్ రెడ్డి వెల్లడించనున్నారు. విషయం బయటకొచ్చేందుకు కొద్ది గంటలే ఉన్నప్పటికీ ఎవరు ఈ హత్య చేసి ఉంటారనే విషయంపై మాత్రం జోరుగా ఇప్పుడు చర్చ జరుగుతోంది. ముందునుంచే బ్యూటిషియన్ శిరీష మృతి కేసు అడుగడుగునా అనుమానాస్పదంగానే కనిపిస్తోంది. సోమవారం ఉదయమే శిరీష స్టూడియోకు రాగా శ్రవణ్, రాజీవ్లు మధ్యాహ్నం అక్కడికి వచ్చారు. వారంతా కలసి రాత్రి 9.30 గంటల సమయంలో రాజీవ్కు చెందిన ఎండీవర్ కారులో కుకునూర్పల్లికి వెళ్లారు. నేరుగా ప్రభాకర్రెడ్డి పోలీస్ క్వార్టర్స్కు చేరుకున్నారు. వెళ్లేముందు రాత్రి 8.40 గంటల సమయంలో తన భర్తకు ఫోన్ చేసిన శిరీష.. ఆలస్యంగా ఇంటికి వస్తానని చెప్పింది. అర్ధరాత్రి వరకు ప్రభాకర్రెడ్డి నేతృత్వంలో పంచాయితీ జరిగాక.. సుమారు ఒంటిగంట సమయంలో హైదరాబాద్కు తిరుగు ప్రయాణమయ్యారు. 1.40 గంటలకు శిరీష తాను శామీర్పేట ప్రాంతంలో ఉన్నట్లుగా తన భర్త సతీశ్చంద్రకు వాట్సాప్ ద్వారా లోకేషన్ పంపింది. ఆ వెంటనే సతీశ్ ఫోన్ చేసినా స్పందించలేదు. తెల్లవారుజామున 4.30 గంటలకు మరోసారి ఫోన్ చేసినా స్పందన రాలేదు. తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఆ ముగ్గురూ స్టూడియో వద్దకు చేరుకున్నట్లు ఇప్పటి వరకు వారు చెప్పిన సమాచారం. అయితే, ఈ క్రమంలో మార్గమధ్యంలో వారి మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం జరిగి శిరీష కారు కూడా దిగి వెళ్లినట్లు తెలిసింది. ఆ సమయంలోనే వారు కారులోకి బలవంతంగా ఎక్కించి ఏదో ఒకటి చేసి ఉండొచ్చని అనుమానం కలుగుతోంది. కారులో మార్గం మధ్యలోనే హత్య చేశారా? లేక స్టూడియోకు వచ్చిన తర్వాత ఆ పనిచేశారా? ఇంతకీ హత్య చేసిన వ్యక్తులు ఈ కేసులో ముందు నుంచి నిందితులుగా పేర్కొంటున్న వారేనా? లేక కొత్త వ్యక్తులు ఉన్నారా అనే విషయం తెలియాలంటే మరికొన్ని గంటలు ఆగాల్సిందే. -
శిరీష కేసును ఛేదించిన పోలీసులు
హైదరాబాద్: ఎస్సై ప్రభాకర్రెడ్డి ఆత్మహత్య ఘటనతో తెరపైకి వచ్చిన బ్యూటీషియన్ అరుమిల్లి విజయలక్ష్మి అలియాస్ శిరీష మృతిపై సందేహాలు పటాపంచలయ్యాయి. ఎట్టకేలకు శిరీష మృతి కేసును పోలీసులు ఛేదించారు. తొలుత ఆత్మహత్యగా.. అనంతరం అనుమానాస్పద మృతిగా మారిన ఈ కేసుపై వివరాలు మరి కొద్ది గంటల్లో వెల్లడికానున్నాయి. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను ఈ రోజు(శుక్రవారం) మధ్యాహ్నం 2గంటలకు సీపీ మహేందర్ రెడ్డి వెల్లడించనున్నారు. నిందితులను కూడా మీడియా ముందు ఉంచనున్నారు. గత మూడు రోజులుగా ఈ కేసు తీవ్ర ఉత్కంఠను రేపిన విషయం తెలిసిందే. మరోవైపు ఎస్సై ప్రభాకర్ రెడ్డి మృతిపై కూడా హత్యనా లేక ఆత్మహత్యనా అనే కేసును విచారిస్తున్నారు. హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ ఆర్జే ఫొటోగ్రఫీ స్టూడియోలో శిరీష అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన విషయం తెలిసిందే. గురువారం రాత్రి వరకు చేపట్టిన దర్యాప్తులో ఆమెది ఆత్మహత్య అన్న దిశగా పోలీసులకు ప్రాథమిక ఆధారాలు లభించగా.. పోస్టుమార్టంలో మాత్రం ఆమె శరీరంపై గాయాలు ఉన్నట్లు వెల్లడైంది. దీంతో ఆమెది హత్య అన్న కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఘటనపై సందేహాలు నివృత్తి చేసుకోవడానికి రాజీవ్, శ్రవణ్లను గురువారం రాత్రి ఘటనాస్థలానికి తీసుకెళ్లి విచారించారు. సేకరించిన ఆధారాలు, విచారణలో తేలిన అంశాలు, ఫోరెన్సిక్ నివేదిక ఆధారంగా ముగింపునకు వచ్చిన పోలీసులు మరికొద్ది గంటల్లో వివరాలు తెలపనున్నారు. -
హత్యా.. ఆత్మహత్యా?
బ్యూటీషియన్ శిరీష మరణంపై అనుమానాలు - ఆత్మహత్య చేసుకుందని తొలుత భావించిన పోలీసులు - పోస్టుమార్టం పరీక్షల్లో దేహంపై గాయాల గుర్తింపు - కమిలిపోయిన కుడికన్ను, పెదవులు.. తల వెనుక భాగంలో గాయాలు.. దీంతో హత్య కోణంలో పోలీసుల విచారణ - ఘటనా స్థలంలో ఆధారాలు సేకరించిన ఫోరెన్సిక్ నిపుణులు సాక్షి, హైదరాబాద్: ఎస్సై ప్రభాకర్రెడ్డి ఆత్మహత్య ఘటనతో తెరపైకి వచ్చిన బ్యూటీషియన్ అరుమిల్లి విజయలక్ష్మి అలియాస్ శిరీష మృతిపై సందేహాలు తలెత్తుతున్నాయి. ఆమెను హత్య చేసి ఉండవచ్చనే అనుమానాలు వస్తున్నాయి. హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ ఆర్జే ఫొటోగ్రఫీ స్టూడియోలో శిరీష అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన విషయం తెలిసిందే. గురువారం రాత్రి వరకు చేపట్టిన దర్యాప్తులో ఆమెది ఆత్మహత్య అన్న దిశగా పోలీసులకు ప్రాథమిక ఆధారాలు లభించగా.. పోస్టుమార్టంలో మాత్రం ఆమె శరీరంపై గాయాలు ఉన్నట్లు వెల్లడైంది. దీంతో ఆమెది హత్య అన్న కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఘటనపై సందేహాలు నివృత్తి చేసుకోవడానికి రాజీవ్, శ్రవణ్లను గురువారం రాత్రి ఘటనాస్థలానికి తీసుకెళ్లి విచారించారు. కుకునూర్పల్లి నుంచే మొదలైన ఘర్షణ! స్టూడియో యజమాని రాజీవ్ వల్లభనేని–శిరీష మధ్య నెలకొన్న వివాదాన్ని పరిష్కరించుకోవడానికి సోమవారం రాత్రి రాజీవ్, శ్రవణ్, శిరీషలు కుకునూర్పల్లి వెళ్లారు. అక్కడ ఎస్సై ప్రభాకర్రెడ్డి సమక్షంలో ఆయన క్వార్టర్లోనే పంచాయితీ జరుగుతున్న సమయంలోనే ఘర్షణ ప్రారంభమైనట్లు తెలుస్తోంది. శిరీష–ప్రభాకర్రెడ్డి మధ్య వాగ్వాదం జరిగి తీవ్రస్థాయికి చేరుకుందని.. దాంతో వారిని వెళ్లిపోవాలంటూ ప్రభాకర్రెడ్డి పంపిచేశారని సమాచారం. కారులో దాడి చేసిన రాజీవ్, శ్రవణ్ ఈ ముగ్గురూ మంగళవారం తెల్లవారుజామున 2.20 గంటల సమయంలో కుకునూర్పల్లి నుంచి హైదరాబాద్కు బయలుదేరారు. ఆ సమయంలోనే శిరీష తన భర్తకు వాట్సాప్ ద్వారా లొకేషన్ను షేర్ చేసింది. అయితే వాహనంలో ప్రయాణిస్తున్న సమయంలో రాజీవ్, శిరీష మధ్య వాగ్వాదం జరిగిందని, దీంతో తీవ్ర ఆగ్రహానికి లోనైన రాజీవ్ శిరీషపై చేయి చేసుకున్నాడని తెలిసింది. ఓ దశలో శ్రవణ్ కూడా చేయి చేసుకున్నట్లు సమాచారం. దీంతో కారు దిగిపోవడానికి శిరీష రెండుసార్లు ప్రయత్నించగా వారు ఆపారు. కొంతసేపటికి పరిస్థితి చల్లబడింది. అనంతరం వారు నేరుగా ఆర్జే స్టూడియోకు వచ్చేశారు. వాహనం తెచ్చుకుంటానని చెప్పి.. కుకునూర్పల్లి వెళ్లేముందు శిరీష తన వాహనాన్ని స్టూడియో వద్దే వదిలేసింది. తిరిగొచ్చాక తన వాహనాన్ని తెచ్చుకుంటానంటూ స్టూడియోలోకి వెళ్లింది. మరోవైపు శ్రవణ్ తన స్వస్థలమైన మాల్కు వెళ్లాల్సి ఉండటంతో.. రాజీవ్ బస్టాండ్ వరకు క్యాబ్ బుక్ చేసిన అతడిని పంపేశాడు. అప్పటికే శిరీష స్టూడియోలోకి వెళ్లి పది నిమిషాలు కావడం, లోపల లైటు వెలుగుతుండటంతో కొద్దిసేపు బయటే ఎదురుచూశానని రాజీవ్ పోలీసులకు వెల్లడించినట్లు తెలిసింది. శిరీష తిరిగి రాకపోవడంతో పైకి వెళ్లిచూడగా.. అప్పటికే చున్నీతో ఉరి వేసుకుని కనిపించిందని... ఆమెను కిందకు దింపి పోలీసులకు సమాచారమిచ్చానని చెప్పినట్లు సమాచారం. శిరీష దేహంపై గాయాలు శిరీష మృతదేహానికి మంగళవారం ఉస్మానియా ఆస్పత్రిలో పోస్టుమార్టం చేయగా.. ఫోరెన్సిక్ వైద్యులు గురువారం ప్రాథమిక నివేదిక ఇచ్చినట్లు తెలిసింది. శిరీష శరీరంపై గాయాలు ఉన్నాయని.. మెడపై ఒత్తిడి పడడంతో ఊపిరాడక మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఆమె కుడి కన్ను కమిలిపోయి ఉండటంతో పాటు రెండు పెదవులపైనా గాయాలు ఉన్నాయని, తల వెనుకభాగంలోనూ గాయాలున్నాయని వెల్లడించినట్లు సమాచారం. దీంతో హత్య చేసి ఉంటారా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఇందులో భాగంగా రాజీవ్, శ్రవణ్లను గురువారం రాత్రి స్టూడియోకు తీసుకువెళ్లి పలు కోణాల్లో విచారించారు. ఘటనాస్థలంలో ఫోరెన్సిక్ పరిశీలన ఉస్మానియా ఆస్పత్రి ఫోరెన్సిక్ బృందం శిరీష మృతిచెందిన స్థలాన్ని గురువారం పరిశీలించి ఆధారాలు సేకరించింది. పోలీసుల అదుపులో ఉన్న రాజీవ్, శ్రవణ్ చెప్పిన వివరాలకు ఇక్కడ సేకరించిన ఆధారాలకు ఎంతవరకు లింకు ఏర్పడుతోందన్న దిశగా పోలీసులు ఆరా తీశారు. 13వ తేదీ తెల్లవారుజామున స్టుడియోకు వచ్చిన శిరీష.. 3.45 గంటల సమయంలో గదిలోకి వెళ్లినట్టు బయోమెట్రిక్ ఆధారంగా గుర్తించారు. పాదముద్రల ఆధారంగా ఆమె నడుచుకుంటూ వెళ్లిందని, అంటే గదిలోకి వెళ్లేముందు శిరీష ప్రాణాలతోనే ఉందని తేల్చారు. ఇక 3.55 గంటలకు రాజీవ్ బయోమెట్రిక్ ప్రెస్ చేయగా తెరుచుకోకపోవడంతో.. కిందకు వెళ్లి పది నిమిషాల తర్వాత వచ్చినట్టు భావిస్తున్నారు. ఇక అపార్ట్మెంట్లో సీసీ కెమెరాలు చాలా రోజులుగా పనిచేయడం లేదని వెల్లడైంది. శిరీష ఘటనతో లింకుపై దర్యాప్తు – కుకునూర్పల్లికి రాజీవ్, శ్రవణ్, తేజస్విని! ఎస్సై ప్రభాకర్రెడ్డి ఆత్మహత్యకు, హైదరాబాద్లో మేకప్ ఆర్టిస్ట్ శిరీష మృతి ఘటనకు లింకుపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఎస్సై ఆత్మహత్య ఘటనకు నాలుగు రోజుల ముందు నుంచీ జరిగిన పరిణామాలపై దృష్టి కేంద్రీకరించారు. సంగారెడ్డి డీఎస్పీ తిరుపతన్న శిరీష ఘటనతో ప్రమేయమున్న రాజీవ్, శ్రవణ్, తేజస్వినిలను కుకునూర్పల్లి పోలీస్ క్వార్టర్స్కు తీసుకువచ్చి విచారించినట్లు తెలిసింది. ఎస్సై క్వార్టర్లో 12వ తేదీ రాత్రి ఏం జరిగింది, ఏం మాట్లాడారనే అంశాలపై ప్రశ్నించినట్లు సమాచారం. -
ఇద్దరు అమ్మాయిల ప్రేమకి అడ్డు చెప్పడంతో..
కమాన్పూర్(కరీంనగర్): ఇద్దరు యువతులు వివాహం చేసుకునేందుకు యత్నించారు. పెద్దలు అంగీకరించకపోవటంతో చెప్పాపెట్టకుండా ఇద్దరు కలిసి వెళ్లిపోయారు. కరీంనగర్ జిల్లా కమాన్పూర్ మండలం జూలపల్లిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన వివరాలివీ..గ్రామానికి చెందిన శిరీష, రామగిరి మండలం సెంటనరీకాలనీకి చెందిన సింధు గతకొద్ది రోజులుగా చనువుగా ఉంటున్నారు. ఇటీవల వారిద్దరూ కనిపించకుండాపోయారు. దీనిపై రెండు కుటుంబాల వారు కమాన్పూర్, రామగిరి పోలీస్స్టేషన్లో వేరువేరుగా ఫిర్యాదు చేశారు. ఈ మేరకు రెండు ఠాణాల పోలీసులు విచారణ నిర్వహించగా సింధు, శీరీషలు కలిసి వెళ్లినట్లు తేలింది. రెండు నెలల క్రితం సింధు శిరీషలు వివాహం చేసుకునేందుకు హైదరాబాద్లోని ఓ తెలుగు టీవీ చానల్ కేంద్రానికి వెళ్లారు. ఆ చానల్ నిర్వహకులు ఇద్దరి యువవతుల కుటుంబ సభ్యుల సమక్షంలో కౌన్సెలింగ్ చేసి, ఇంటికి పంపించారు. అయితే, ఈ నెల 5న శిరీష, సింధు ఇద్దరు కలిసి వారి ఇళ్ల నుంచి వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలో రెండు కుటుంబాల సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ చేపట్టారు. -
ఆర్కేకు గాయాలు.. అయినా సురక్షితమే
⇒ హైకోర్టుకు నివేదించిన రామకృష్ణ సతీమణి శిరీష ⇒ నిర్దిష్ట సమాచారం అందిందని వెల్లడి ⇒ పిటిషన్ ఉపసంహరణకు అనుమతినివ్వాలని విజ్ఞప్తి ⇒ ఈ విషయాలన్నీ రాతపూర్వకంగా మా ముందుంచండి: ధర్మాసనం ⇒ విచారణ సోమవారానికి వాయిదా సాక్షి, హైదరాబాద్: మావోయిస్టు పార్టీ అగ్రనేత అక్కిరాజు హరగోపాల్ అలియాస్ రామకృష్ణ అలియాస్ ఆర్కే క్షేమంగా ఉన్నారని ఆయన భార్య శిరీష శుక్రవారం హైకోర్టుకు నివేదించారు. ఎన్కౌంటర్ సందర్భంగా పోలీసుల కాల్పుల్లో ఆర్కే గాయపడ్డారని, అయినప్పటికీ సురక్షితంగానే ఉన్నారని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఆయనను కోర్టు ముందు హాజరుపరిచేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ తాను దాఖలు చేసిన హెబియస్ కార్పస్ పిటిషన్ను ఉపసంహరించుకుంటానని, అందుకు అనుమతి ఇవ్వాలని హైకోర్టును కోరారు. అయితే, ఈ విషయాలన్నింటినీ రాతపూర్వకంగా న్యాయస్థానం ముందుంచాలని శిరీషకు హైకోర్టు స్పష్టం చేసింది. తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ సి.వి.నాగార్జునరెడ్డి, జస్టిస్ ఎం.ఎస్.కె.జైశ్వాల్లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. ఏవోబీలో జరిగిన ఎన్కౌంటర్లో తన భర్త ఆర్కే గాయపడ్డారని, ఆయనను పోలీసులు అక్రమంగా నిర్బంధించారని, వెంటనే కోర్టు ముందు హాజరుపరిచేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ శిరీష హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై విచారణ చేపట్టిన ధర్మాసనం పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. విశాఖప రూరల్ ఎస్పీ రాహుల్దేవ్ శర్మ గురువారం కౌంటర్ దాఖలు చేశారు. ఆర్కే తమ కస్టడీలో లేరని కోర్టుకు నివేదించారు. అయితే ఈ వాదనలను శిరీష తరఫు న్యాయవాది రఘునాథ్ తోసిపుచ్చారు. ఆర్కే పోలీసుల కస్టడీలోనే ఉన్నారన్న పక్కా సమాచారం తమ వద్ద ఉందన్నారు. ఆర్కే పోలీసుల అదుపులోనే ఉన్నారనేందుకు నిర్ధిష్టమైన ఆధారాలను కోర్టు ముందుంచాలని, వాటిని పరిశీలించి అవసరమైన పక్షంలో విచారణకు సైతం ఆదేశాలు జారీ చేస్తామని ధర్మాసనం స్పష్టం చేసింది. ఆధారాల సమర్పణకు రెండు వారాల గడువు ఇచ్చింది. ఆర్కే సురక్షితంగా ఉన్నట్లు గురువారం రాత్రి విరసం నేత వరవరరావు ప్రకటించారు. ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం శిరీష తరఫు న్యాయవాది రఘునాథ్ తమకు అందిన సమాచారం ప్రకారం ఆర్కే సురక్షితంగా ఉన్నారని ధర్మాసనానికి నివేదించారు. దీనికి ధర్మాసనం స్పందిస్తూ... నిన్ననే కదా.. ఆర్కే ఆచూకీ తెలియడం లేదు, పోలీసుల కస్టడీలోనే ఉన్నారని చెప్పారు అంటూ ప్రశ్నించింది. పోలీసుల కాల్పుల్లో ఆర్కే గాయపడ్డారని, అందువల్ల ఇంతకాలం ఎక్కడున్నారో తెలియలేదని, ఇప్పుడు ఆయన సురక్షితంగా ఉన్నట్లు నిర్ధిష్టమైన సమాచారం అందిందని రఘునాథ్ పేర్కొన్నారు. అందువల్ల పిటిషన్ను ఉపసంహరించుకోవాలని శిరీష భావిస్తున్నారని, అందుకు అనుమతినివ్వాలని కోర్టును కోరారు. ఈ విషయాలన్నింటినీ లిఖితపూర్వకంగా కోర్టు ముందుంచాలని ధర్మాసనం రఘునాథ్కు స్పష్టం చేసింది. దానిని పరిశీలించి ఉపసంహరణ ఉత్తర్వులు జారీ చేస్తామని వెల్లడించింది. -
జిల్లా ఖోఖో జట్టు కెప్టెన్గా శిరీష
దుగ్గొండి: వరంగల్ జిల్లా ఖోఖో జట్టు కెప్టెన్గా మండలంలోని మహ్మదాపురం ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థిని ముద్రబోయిన శిరీష ఎంపికైనట్లు పీఈటీ కోట రాంబాబు తెలిపారు. ఇటీవల జేఎన్ఎస్లో జరిగిన జిల్లా స్థాయి పోటీల్లో అండర్ – 17 విభాగంలో ఆమె ప్రతిభ కనబర్చినట్లు పేర్కొన్నారు. ఈ నెల 10 నుంచి రంగారెడ్డి జిల్లాలో జరుగనున్న రాష్ట్రస్థాయి పోటీల్లో జిల్లా జట్టు కెప్టెన్గా శిరీష వ్యవహరిస్తారన్నారు. -
నీటికుంటలో పడి తల్లీకూతురు మృతి
కేవీపల్లి, న్యూస్లైన్: నీటికుంటలో పడి తల్లీకూతురు మృతిచెందిన విషాద ఘటన చిత్తూరు జిల్లా కేవీపల్లె మండలం జిల్లేళ్లమంద పంచాయతీ బసన్నగారిపల్లెలో గురువారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన బండారు వెంకట్రమణ గొర్రెలు మేపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. గురువారం ఇతను కూలిపనికి వెళ్లడంతో భార్య బీ.రూప(35), కుమార్తె శిరీష(10), కుమారుడు శివలు గొర్రెలను మేత కోసమని గ్రామ శివార్లలో తోలారు. మధ్యాహ్నం ఎండతీవ్రత ఎక్కువగా ఉండడంతో గొర్రెలను కడిగేందుకు పక్కనే ఉన్న కంజుమడుగుకు తోలారు. ఆపై వాటిని కడిగి పైకితోలేశారు. గుంటలో నుంచి పైకి ఎక్కేటప్పుడు కుమార్తె శిరీష ప్రమాదవశాత్తు కాలుజారి లోతులో పడిపోయింది. కుమార్తెను రక్షించేందుకు రూప గుంటలోకి దూకేసింది. ఇద్దరూ ఊపిరాడక తల్లడిల్లిపోయారు. గమనించిన శివ బిగ్గరగా కేకలు వేశాడు. గ్రామస్తులు హుటాహుటిన గుంట వద్దకు చేరేలోపే తల్లీకూతురు కన్నుమూశారు. -
‘స్వర్ణ’ శిరీష
న్యూఢిల్లీ: వెయిట్లిఫ్టింగ్లో మరో తెలుగుతేజం దూసుకొచ్చింది. ఆంధ్రప్రదేశ్కి చెందిన కొప్పర్తి శిరీష కామన్వెల్త్ వెయిట్లిఫ్టింగ్లో మూడు స్వర్ణాలు గెలిచింది. మలేసియాలోని పెనాంగ్లో జరుగుతున్న ఈ టోర్నీలో శిరీష జూనియర్ మహిళల 58 కేజీల విభాగంలో ఈ పతకాలు నెగ్గింది. స్నాచ్లో 73 కేజీల బరువెత్తి మొదటి స్థానంలో నిలిచిన ఆమె... క్లీన్ అండ్ జెర్క్లో 95 కేజీల బరువెత్తి మరో స్వర్ణాన్ని గెలిచింది. మొత్తం 168 కేజీలతో మూడో పసిడి పతకం గెలుచుకుంది. యూత్ మహిళల 58 కేజీల విభాగంలో జోయతిమాల్ కూడా మూడు స్వర్ణాలు గెలిచింది. సీనియర్ మహిళల 58 కేజీల విభాగంలో మినాటి సేథి మూడు కాంస్యాలు గెలిచింది. దీంతో బుధవారం భారత్ ఖాతాలో మొత్తం ఆరు స్వర్ణాలు, మూడు కాంస్యాలు చేరాయి. కామన్వెల్త్ వెయిట్లిఫ్టింగ్లో ఇప్పటివరకు భారత్కు మొత్తం 48 పతకాలు రాగా... ఇందులో 26 స్వర్ణాలు ఉండటం విశేషం.