నేడే అంతరిక్షంలోకి తెలుగు అతివ | Indian-origin aeronautical engineer Sirisha Bandla set to fly To Space | Sakshi
Sakshi News home page

నేడే అంతరిక్షంలోకి తెలుగు అతివ

Jul 11 2021 3:50 AM | Updated on Jul 11 2021 9:44 AM

Indian-origin aeronautical engineer Sirisha Bandla set to fly To Space - Sakshi

హూస్టన్‌: భారతీయ సంతతికి చెందిన బండ్ల శిరీష ఆదివారం అంతరిక్షయానానికి సిద్ధమైంది. అంతరిక్ష యాత్ర విజయవంతమైతే ఈ ఘనత సాధించిన మూడో భారతీయ సంతతి మహిళగా శిరీష నిలుస్తుంది. గతంలో కల్పనా చావ్లా, సునీతా విలియమ్స్‌ స్పేస్‌లో ప్రయాణించారు. వర్జిన్‌ గెలాక్టిక్‌ స్పేస్‌ షిప్‌లో ఆ సంస్థ అధిపతి రిచర్బ్‌ బ్రాన్సన్‌తో మరియు 5గురు సభ్యులతో కలిసి శిరీష అంతరిక్ష ప్రయాణం చేయనుంది. ఈ షిప్‌లో భాగస్వామి కావడం తనకెంతో గౌరవకారణమని శిరీషట్వీట్‌ చేశారు.

షిప్‌లో ఆమె రిసెర్చర్‌ ఎక్స్‌పీరియన్స్‌ బాధ్యతలు చేపట్టనుంది. తనకు ఈ అవకాశం దక్కినట్లు తెలియగానే మాటలు రాలేదంటూ వర్జిన్‌ గెలాక్టిక్‌ ట్విట్టర్‌లో ఒక వీడియో పోస్టు చేశారు. అమెరికాలోని ప్యూర్‌డ్యూ యూనివర్సిటీలో ఆమె విద్యాభ్యాసం చేశారు. ఈ సందర్భంగా తాను చదివిన యూనివర్సిటీని గుర్తు చేసుకున్నారు. 2015లో వర్జిన్‌ గలాక్టిక్‌లో ప్రభుత్వ వ్యవహారాల విభాగ మేనేజరుగా చేరారు. ప్రస్తుతం కంపెనీ గవర్నమెంట్‌ ఎఫైర్స్‌ అండ్‌ రీసెర్చ్‌ ఆపరేషన్స్‌ విభాగం ఉపాధ్యక్షురాలిగా కొనసాగుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement