breaking news
Sardar 2 Movie
-
స్టార్ హీరోల సీక్వెల్స్.. ఊహించని విధంగా డిజాస్టర్స్..!
ప్రస్తుతమున్న సినీ ఇండస్ట్రీలో సీక్వెల్ అనే పదం కామన్ అయిపోయింది. కానీ ప్రతి సినిమాకు కొనసాగింపుగా ఎడాపెడా సీక్వెల్స్ తీసేస్తున్నారు. పార్ట్-1 సక్సెస్ అయినంత ఈజీగా.. సీక్వెల్ ఆదరిస్తారని భ్రమలో ఉన్నారు మేకర్స్. పెద్ద హీరోల సినిమాలకు సీక్వెల్ తీయడం అంత సులువేమి కాదు. మొదటి పార్ట్కు ఉన్నంత ఆదరణ వస్తుందో లేదో చెప్పలేం. ఏదైనా తేడా కొట్టిందంటే మొదటికే మోసం వస్తుంది. అలా ఇటీవల కాలంలో రిలీజైన అగ్రహీరోల సినిమాల సీక్వెల్స్ సైతం బాక్సాఫీస్ వద్ద బోక్కబోర్లా పడ్డాయి. అవేంటో మనం కూడా ఓ లుక్కేద్దాం.కార్తీ సర్దార్-2లో సత్తాలేదు..కార్తీ హీరోగా పీఎస్ మిత్రన్ దర్శకత్వంలో నటించిన చిత్రం సర్దార్ 2. గతంలో వచ్చిన సర్దార్ మూవీకి సీక్వెల్గా తెరక్కిక్కించారు. ఈ మూవీలో మాళవికా మోహనన్, ఆషికా రంగనాథ్ హీరోయిన్లుగా నటించారు. ఎస్జే సూర్య విలన్ పాత్రపోషించారు. ప్రిన్స్ పిక్చర్స్ బ్యానర్పై ఎస్. లక్ష్మణ్ కుమార్ నిర్మించిన ఈ సినిమా సెప్టెంబరు 10న విడుదలైంది. కానీ బాక్సాఫీస్ వద్ద అంతగా మెప్పించలేకపోయింది. సీక్వెల్ సక్సెస్ అవుతుందని భావించిన నిర్మాతలకు నిరాశే ఎదురైంది.డిజాస్టర్గా ఇండియన్-2..కమల్ హాసన్ భారతీయుడు అప్పట్లో సంచలన విజయం సాధించింది. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద అద్భుతంగా రాణించింది. అదే కాన్ఫిడెన్స్తో ఇండియన్-2 నిర్మించారు మేకర్స్. శంకర్ డైరెక్షన్లో వచ్చిన ఈ సీక్వెల్ 2024లో రిలీజైంది. ఈ చిత్రానికి మొదటి రోజే మిక్స్డ్ టాక్ రావడంతో కలెక్షన్స్ దారుణంగా పడిపోయాయి. మొదటి ఏడు రోజుల్లో ఇండియన్-2 సినిమాకు దేశవ్యాప్తంగా కేవలం రూ.70 కోట్లకు పైగా మాత్రమే వసూళ్లు రాబట్టింది. అలా భారీ అంచనాలలో విడుదలైన ఈ చిత్రం అభిమానుల అంచనాలను అందుకోవడంలో విఫలమై డిజాస్టర్గా నిలిచింది. బాక్సాఫీస్ యుద్ధంలో వార్-2 ఫెయిల్..గతంలో సూపర్హిట్గా నిలిచిన బాలీవుడ్ మూవీ వార్. ఈ మూవీకి సీక్వెల్గా వార్-2 తెరెకెక్కించారు. ఈ చిత్రంలో హృతిక్ రోషన్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించారు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సీక్వెల్ బాక్సాఫీస్ వద్ద అభిమానులను ఆకట్టుకోలేకపోయింది. సీక్వెల్పై గంపెడాశలు పెట్టుకున్న నిర్మాతలకు ఎదురుదెబ్బ తగిలింది.కలిసిరాని అఖండ-2..టాలీవుడ్ హీరో బాలయ్య నటించిన హిట్ మూవీ అఖండ. మాస్ ఇమేజ్ ఉన్న బాలకృష్ణతో సీక్వెల్ తెరకెక్కించారు. బోయపాటి దర్శకత్వంలో వచ్చిన ఈ సీక్వెల్ ఆడియన్స్ను మెప్పించలేకపోయింది. రోటీన్ రొడ్డకొట్టుడు కంటెంట్తో అభిమానులను తీవ్రంగా నిరాశపర్చింది. సీక్వెల్తో సక్సెస్ కొడదామనుకున్న మేకర్స్కు అఖండ-2 షాకింగ్ ఫలితాన్నిచ్చింది.డబుల్ ఇస్మార్ట్.. డబుల్ షాక్టాలీవుడ్లో మరో మాస్ ఇమేజ్ ఉన్న హీరో రామ్ పోతినేని. గతంలో పూరి జగన్నాథ్ డైరెక్షన్లో ఇస్మార్ట్ శంకర్ టాలీవుడ్ అభిమానులను అలరించింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్గా నిలిచింది. పార్ట్-1 హిట్ కొట్టామన్న కాన్ఫిడెన్స్తో డబుల్ ఇస్మార్ట్ అంటూ ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఇది కాస్తా బెడిసికొట్టింది. అదే రోటీన్ కంటెంట్ ఉండడంతో అభిమానులు మొహం చాటేశారు. దీంతో సీక్వెల్తో సత్తా చాటుదామనుకున్న మేకర్స్కు నిరాశే ఎదురైంది.ఇలా హిట్ అయిన ప్రతి సినిమాకు సీక్వెల్ తీసుకుంటే పోతే రిజల్ట్ తేడా రావడం ఖాయంగా కనిపిస్తోంది. రోటీన్ కంటెంట్ను ప్రేక్షకులు ఆదరించరని ఇప్పటికైనా మేకర్స్ తెలుసుకోవాలి. సీక్వెల్ ఆలోచన ఓకే కానీ.. కంటెంట్ భిన్నంగా, ఆసక్తిగా ఉండేలా చూసుకుంటేనే సక్సెస్ సాధించే అవకాశముంది. అంతేకానీ ప్రతి హిట్ మూవీకి సీక్వెల్ తీస్తామంటే ఇదిగో ఇలాగే డిజాస్టర్స్ మూటగట్టుకోవాల్సిందే. పుష్ప, దురంధర్, కాంతార లాంటి సినిమాల్లాగే సీక్వెల్స్ సక్సెస్ రావాలంటే కంటెంట్పై మరింత దృష్టి పెట్టాల్సిందే. -
నాలుగు కొత్త సినిమాల రివ్యూస్.. ఏది ఎలా ఉంది?
ప్రతివారాంతంలో కొత్త సినిమాలు థియేటర్లలో రిలీజవుతూనే ఉంటాయి. ఈ వారం అలా స్ట్రెయిట్, డబ్బింగ్ రూపంలో నాలుగైదు మూవీస్ విడుదలయ్యాయి. వీటిలో కార్తీ 'సర్దార్ 2', ఆనంద్-వైష్ణవి 'ఎపిక్', సుహాస్ 'మండాడి', సుమంత్ 'మహేంద్రగిరి వారాహి' చిత్రాలున్నాయి. ఇంతకీ ఇవెలా ఉన్నాయి? వీటి రివ్యూలు ఏంటనేది ఇప్పుడు చూద్దాం.ఇదీ చదవండి: ఓటీటీలో 'బందర్' సినిమా.. తెలుగు రివ్యూ'బేబి' తర్వాత ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటించిన సినిమా 'ఎపిక్'. 90స్ వెబ్ సిరీస్లోని చిన్న పిల్లాడి పాత్రని తీసుకుని వాడి పెరిగి పెద్దయి.. పై చదువుల కోసం లండన్ వెళ్లి ఓ అమ్మాయితో ప్రేమలో పడితే ఏమైంది అనే కాన్సెప్ట్తో తీశారు. బోల్డ్ సీన్స్, రొమాన్స్ కాస్త ఎక్కువగానే దట్టించారు. అయితే స్టోరీ పెద్దగా లేకపోవడంతో చాలామంది ప్రేక్షకులకు ఈ మూవీ పెద్దగా వర్కౌట్ కాలేదు. కొన్నిచోట్ల ఎమోషన్ పర్లేదనిపించింది.పూర్తి రివ్యూ: ఎపిక్: ఫస్ట్ సెమిస్టర్ మూవీ రివ్యూ2022లో వచ్చిన 'సర్దార్' సినిమాకు సీక్వెల్ 'సర్దార్ 2'ని స్పై యాక్షన్ థ్రిల్లర్గా తీశారు. కార్తీ ద్విపాత్రాభినయంతో ఆకట్టుకున్నప్పటికీ మిగిలిన విషయాలు పెద్దగా అలరించలేదు. ఎస్జే సూర్య విలనిజం కాస్త బోర్ కొట్టించగా.. మాళవిక మోహనన్, ఆషికా రంగనాథ్ గ్లామర్ సరిపోలేదు. పీఎస్ మిత్రన్ ఈ చిత్రానికి దర్శకుడు. తొలి భాగాన్ని తీసినంత ఎంగేజింగ్గా దీనిని తీయలేకపోయారు.పూర్తి రివ్యూ: ‘సర్దార్ 2’ మూవీ రివ్యూతెలుగు నటుడు సుహాస్ చేసిన తమిళ చిత్రం 'మండాడి'. సూరి హీరో కాగా సుహాస్ ప్రతినాయక ఛాయలున్న పాత్రలో కనిపించాడు. సముద్రంలోని బోట్ రేసింగ్ బ్యాక్డ్రాప్ స్టోరీతో ఇది తీశారు. తెరపై కష్టం బాగా కనిపించింది. కథాకథనాలు పర్లేదనిపించాయి. ప్రస్తుతానికైతే తెలుగులో ఈ మూవీకి బాక్సాఫీస్ దగ్గర మంచి నంబర్స్ కనిపిస్తున్నాయి.పూర్తి రివ్యూ: మండాడి మూవీ రివ్యూసుమంత్ హీరోగా చేసిన డివోషనల్ థ్రిల్లర్ సినిమా 'మహేంద్ర గిరి వారాహి'. సిద్ధు జొన్నలగడ్డ, ఐశ్వర్యా రాజేశ్ తదితరులు ఇతర కీలక పాత్రలు చేశారు. ఓ ఊరు, రాజకుటుంబం, ఓ శాపం, 33 ఏళ్ల వయసొచ్చేసరికి రాజకుటుంబంలోని పురుషులు చనిపోవడం అనే కాన్సెప్ట్తో ఈ చిత్రం తీశారు. ఈ రహస్యం వెనకున్న నిజాన్ని బయటకు తీసే యూట్యూబర్గా సుమంత్ చేశాడు. ఈ మూవీ కూడా ఏ మాత్రం ఆకట్టుకోలేకపోయింది.పూర్తి రివ్యూ: ‘మహేంద్రగిరి వారాహి’ మూవీ రివ్యూ -
ఈ ఇద్దరి స్టార్ హీరోలు ఒకే స్కూల్.. ఎక్కడంటే..?
కార్తీ హీరోగా పీఎస్ మిత్రన్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం సర్దార్2. ఇటేవలే వచ్చిన ఈ చిత్రం మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుని ప్రేక్షకులను అలరిస్తోంది. ఈ సినిమాలో ఎస్జే సూర్య, మాళవికా మోహన్, ఆషికా రంగనాథ్ కీలక పాత్రల్లో నటించారు. ప్రిన్స్ పిక్చర్స్ పతాకంపై ఎస్. లక్ష్మణ్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మించారు. సినిమా విడుదల కావడంతో కార్తీ కోసం నెటిజన్లు తెగ సెర్చ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కార్తి చదువుకున్న స్కూల్ డేస్ కోసం ఓ వార్త చక్కర్లు కొడుతోంది.ఇద్దరూ చెన్నైలో..సూపర్స్టార్ మహేశ్ బాబు, కార్తి.. ఇద్దరూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరోలు . వీరికి కోసం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సినిమాల పరంగా వీరిద్దరి ప్రయాణం వేర్వేరు అయినా స్కూల్ డేస్ లో వీరిద్దరికీ మంచి అనుభందం ఉందని మీకు తెలుసా.. మహేశ్బాబు, కార్తీ ఇద్దరూ చెన్నైలోని సెయింట బేడ్స్ ఆంగ్లో ఇండియన్ హయ్యర్ సెకండరీ స్కూల్లో చదువుకున్నారు. ఆ టైంలో మహేశ్బాబుకి కార్తి రెండు సంవత్సరాల జూనియర్. ఈ విషయం తెలిసిన అభిమానులు సోషల్మీడియాలో వార్తను తెగ వైరల్ చేస్తున్నారు. ( ‘హనుమాన్ అంశ్2’లో కోహ్లీ,అనుష్క శర్మ.. నిజమెంత?)కలిసి నటిస్తారా..ఇద్దరు స్టార్ హీరోలకు ఉన్న ఈ కామన్ కనెక్షన్ అభిమానులకు ఆసక్తికరంగా మారింది. సినిమాల పరంగా కాకుండా బయట కూడా మంచి స్నేహితులు కావడంతో వీళ్లకాంబోలో ఓ సినిమా వస్తే బాగుంటుందని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఇదీ చదవండి: 80s ఫొటో ట్రెండా బాస్.. అభిమానం కోసం ఈ తప్పులు చేయద్దు..మహేశ్బాబు విషయానికి వస్తే.. దర్శకధీరుడు రాజమౌళి , సూపర్స్టార్ మహేశ్బాబు కాంబినేషన్లో తెరకెక్కుత్ను చిత్రం ‘వారణాసి’. ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలున్నాయి. సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. . ప్రియంకచోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ ముఖ్య పాత్రలు పోషిస్తుండగా మహేశ్ బాబు.. రుద్ర, శ్రీరాముడిగా కనిపించనున్నాడు. 2027 ఏప్రిల్ 7 నాటికి థియేటర్లలతో విడుదల చేయాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. -
ఆషిక మనసులో మాట.. తెలుగు వారికోసం ఇదే కోరిక..
కన్నడ చిత్ర పరిశ్రమలో హీరోయిన్గా అడుగుపెట్టి వరుస అవకాశాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది ఆషిక రంగనాథ్. గ్లామర్తో పాటు నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలను ఎంచుకుంటూ ముందుకెళ్తోంది. ఇప్పుడు తమిళం, తెలుగు ప్రేక్షకులకూ దగ్గరైంది. ప్రస్తుతం సర్ధార్2 సినిమాతో అటు తమిళ ప్రేక్షకులకూ, ఇటు తెలుగు వారికీ పలకరించింది. మరి సినిమా అవకాశాలపై ఆమె మనసులో మాట ఏంటో తెలుసా? ఆమె మాటల్లోనే..ఇదీ చదవండి: ‘సర్దార్ 2’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్‘ హీరోయిన్గా అవకాశాలు రావడం ఒక ఎత్తైతే వచ్చిన ప్రతి సినిమాలోనూ కొత్తగా కనిపంచాలనేదే నా కోరిక. స్టార్ హీరోల సినిమాల్లో నటించడం కంటే.. తన ప్రాధాన్యం ఉన్న పాత్రల్లో మెరవడం ముఖ్యం. అందుకే కథ విన్నప్పుడు పాత్ర ఎలా ఉంటుంది?. ప్రేక్షకులపై ఎలాంటి ప్రభావం చూపుతుందని అని పరిశీలించిన తర్వాతే సినిమాలకు ఓకే చెప్తా.చిత్ర సీమలో అడుగుపెట్టిన 2నుంచి 3 సంవత్సరాలకే తెలుగులో అవకాశాలు వచ్చాయి. కానీ అప్పుడు అంత ఐడియా లేదు. ఇవి మంచి ప్రాజెక్ట్లా కాదా అని. అందువల్లే కొంచం లేట్ అయింది. 2023లో వచ్చిన అమిగోస్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాను.తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరవ్వాలనేదే నా కోరిక. మంచి కథలు, బలమైన పాత్రలు వస్తే భాషతో సంబంధం లేకుండా నటించేందుకు సిద్ధం. హీరోయిన్ కేవలం అందంతో కాకుండా నటనతో ప్రేక్షకుల మనసుల్లో నిలిచిపోవాలనేదే లక్ష్యం. (బిగ్బాస్లో హైరిస్క్ టెన్షన్.. వేడెక్కిన వాతావరణం..)సర్దార్2 నా కెరీర్లో ప్రత్యేకమైన చిత్రంగా నిలుస్తుంది. చాలా మంది హీరోలతో చేసనప్పటికీ కార్తీ సార్తో కలిసి పనిచేయడం మంచి అనుభం. సినిమా కోసం చిత్రబృందం పడిన కష్టం తెరపై కనిపిస్తాయి. తెలుగులో నాకు నచ్చిన చిత్రాల్లో అలా వైకంఠపురం, సీతారామం సినిమాలు ఇష్టం. ఈ చిత్రాల్లో సాంగ్స్ ఇప్పటికీ ఇంట్లో వింటుంటాను.‘ అని ఆషిక గతంలో పలు ఇంటర్వ్యులో తెలిపారు. ఇదీ చదవండి: మండాడి మూవీ రివ్యూ అండ్ రేటింగ్ -
‘సర్దార్ 2’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్
టైటిల్: సర్దార్ 2నటీనటులు: కార్తి, ఎస్.జే. సూర్య, మాళవిక మోహన్, ఆశికా రంగనాథ్, యోగిబాబు, రజిషా విజయన్ తదితరులునిర్మాణ సంస్థ: ప్రిన్స్ పిక్చర్స్నిర్మాత: ఎస్. లక్ష్మణ్ కుమార్దర్శకత్వం: పీఎస్ మిత్రన్సంగీతం: సామ్ సి.ఎస్ఎడిటింగ్: విజయ్ వేలుకుట్టివిడుదల తేది: సెప్టెంబర్ 10, 2026కార్తి..పేరుకు తమిళ హీరోనే అయినా తెలుగు ప్రేక్షకులు మాత్రం మనవాడిగానే చూస్తారు. ఊపిరి, సత్యం సుందరం లాంటి చిత్రాలతో ఆయనకు ఇక్కడ మంచి ఫాలోయింగ్ పెరిగింది. అందుకే ఆయన చిత్రాలన్నీ ఇప్పుడు తెలుగులోనూ రిలీజ్ చేస్తున్నారు. ఆయన నటించిన తాజా చిత్రం సర్దార్ 2. 2022లో వచ్చిన బ్లాక్ బస్టక్ మూవీ ‘సర్దార్’కి కొనసాగింపు ఇది.నేడు(సెప్టెంబర్ 10) ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయింది. మరి ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించింది? రివ్యూలో చూద్దాం.కథేంటంటే.. ‘సర్దార్’ముంగింపే ఈ చిత్రానికి ప్రారంభం. ఇన్స్పెక్టర్ నుంచి రా ఏజెంట్గా మారిన విజయ్ ప్రకాశ్(కార్తి).. రా చీఫ్ మనోజ్ బొమ్మై (ఆశిష్ విద్యార్థి)కి తెలియకుండా ఓ రహస్య ఆపరేషన్ చేపడతాడు. అందులో భాగంగా మాజీ రా ఏజెంట్ వాల్రస్ (అచ్యుత్ కుమార్)ని కలుస్తారు. అయితే అప్పటికే ఇంటర్నేషనల్ అండర్ వరల్డ్ డాన్ బ్లాక్ డగ్గర్ (ఎస్.జె.సూర్య) మనుషులను అతనిపై దాడి చేస్తారు. చనిపోయే ముందు , విజయ్ కు తన దగ్గర ఉన్న ఓ 'కీ'ని ఇస్తాడు. అలాంటి మరో కీని మరో రా ఏజెంట్ (మాళవిక మోహనన్) తన కూతురు ఫైజా (ఆషిష్ రంగనాథ్)కు ఇస్తుంది. డి.ఆర్.డి.వో. ఛీఫ్ టైగర్ హరిశ్చంద్ర (బాబు ఆంటోనీ) దగ్గర ఇంకో కీ ఉందదే విషయం తెలుస్తుంది. దానిని సంపాదిస్తే.. ఓ భారీ ప్రమాదం నుంచి ఈ దేశాన్ని రక్షించొచ్చు అని విజయ్ భావిస్తాడు.(చదవండి: మండాడి మూవీ రివ్యూ)అయితే విజయ్ కంటే ముందే బ్లాక్ డగ్గర్ ఆ 'కీ'ని సొంతం చేసుకుని, ఈ దేశాన్ని నాశనం చేయడానికి సిద్థమవుతాడు. సరిగ్గా అదే సమయంలో రంగంలోకి దిగుతాడు సర్దార్(కార్తి). ప్రభుత్వం దృష్టిలో చైనాలో చనిపోయిన సర్ధార్ తిరిగి ఎలా వచ్చాడు? బ్లాక్ డగ్గర్ మిషన్ ఏంటి? మూడు ‘కీ’ల వెనుక ఉన్న రహస్య కథేంటి? బ్లాక్ దగ్గర్ మిషన్ని అడ్డుకునేందుకు తన కొడుకు విజయ్తో కలిసి సర్దార్ చేసిన సాహసాలేంటి? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే.. ‘సర్దార్’లో నీటి సమస్యను, వన్లైన్ పైప్లైన్ ప్రాజెక్ట్ ద్వారా జరిగే కుట్రను చూపించిన దర్శకుడు.. సీక్వెల్లో యాంటి బయాటిక్ మందుల్ని మితిమీరి వాడటం వల్ల జరగబోయే అనర్థాల్ని చూపించాడు. అయితే పార్ట్ 1 మాదిరి ఆసక్తికరంగా కథనాన్ని నడిపించడంలో మాత్రం దర్శకుడు పూర్తిగా విఫలం అయ్యాడు. కథ, కథనం రొటీన్గా ఉంటూ.. చాలా వరకు సర్దార్ సినిమాతో పాటు పలు స్పె యాక్షన్ సినిమాలను గుర్తుకు చేస్తాయి. తర్వాత ఏ జరుగుతుందన్న ఉత్కంఠ కూడా రేకెత్తించదు. ఎమోషనల్ సన్నివేశాలు కూడా అంతగా ఆకట్టుకోవు. కథను పక్కకు పెట్టి ఎక్కువగా స్టైలీష్ మీదే దృష్టిపెట్టాడు దర్శకుడు . ఫస్టాఫ్ అంతా డోకు బయోవెపన్ చుట్టే తిరుగుతుంది. దాన్ని తెరిచేందుకు మూడు తాళాలు అవసరం..వాటి కోసం హీరో ఒకవైపు.. విలన్ మరోవైపు ప్రయత్నాలు చేస్తారు. ఆయా సీన్లను ఉత్కంఠభరితంగా తీర్చిదిద్దితే బాగుండేది. కానీ చాలా సింపుల్గా, సాగదీతగా ఆ సన్నివేశాలు సాగుతాయి. ఒకానొక దశలో చిరాకు కలిగిస్తాయి కూడా. అలాగే సర్దార్ ప్లాష్ బ్యాక్ ఎపిసోడ్ సిల్లీగా అనిపిస్తుంది. ఇంటర్వెల్ సీన్ సెకండాఫ్పై ఆసక్తిని పెంచుతుంది. అయితే ద్వితియార్థంలో అయినా కథనం ఉత్కంఠభరితంగా సాగుతుందా అని ఆశించిన ప్రేక్షకుడికి.. కాసేపటికే నిరాశ తప్పదు. కోటలో ఉన్న ప్రమాద కర ఆయుదాన్ని వెతికిపట్టుకునేందుకు తండ్రి,కొడుకులు ప్రయత్నించడం.. బ్లాక్ డగ్గర్ దాన్ని స్వాధీనం చేసుకొని దేశాన్ని నాశనం చేసేందుకు ప్రయత్నించడం.. చివరిలో తండ్రి కొడుకులు కలిసి ఆ ప్రమాదాన్ని అడ్డుకోవడం.. సెకండాఫ్ అంతా ఇలానే సాగుతుంది. చాలా వరకు సాగదీత సన్నివేశాలు ఉండడం.. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఏమీ లేకపోవడంతో సెకండాఫ్ మరింత చిరాకు పెట్టిస్తుంది. ఇక చివరిలో పార్ట్ 3 కి లీడ్ ఇస్తూ కథను ముగించారు. అయితే అది తెరపైకి వస్తుందా లేదా అనేది చూడాలి. ఎవరెలా చేశారంటే.. కార్తి నటన గురించి తెలిసిందే. ఎలాంటి పాత్రలోనైనా ఒదిగిపోతాడు. ఇందులో కూడా తండ్రి కొడుకులుగా రెండు వేరియేషన్స్ ఉన్న పాత్రలను పోషించి మెప్పించాడు. అయితే కథ, కథనం బలంగా లేకపోవడంతో కార్తి పడిన కష్టం కూడా బూడిదలో పోసిన పన్నీరు మాదిరి అయిపోయింది. ఇక విలన్గా ఎస్.జే సూర్య నటన చాలావరకు అతిగా అనిపించింది. అయితే తెరపై మాత్రం స్టైలీష్గా కనిపించాడు. మాళవిక మోహన్, ఆశికా రంగనాథ్, నాజర్, అచ్యుత్ కుమార్, ఆషిష్ విద్యార్థి యోగిబాబుతో పాటు మిగిలిన నటీనటులంతా తమ పాత్రల పరిధిమేర నటించారు. సాంకేతికంగా సినిమా ఓకే. సామ్ సీఎస్ బీజీఎం పర్వాలేదు. చాలా వరకు హలీవుడ్ సినిమాలను ఇమిటేట్ చేసినట్లుగా అనిపిస్తుంది. ఇందులో ఒకే ఒక పాట ఉంది. అది కూడా అంతగా ఆకట్టుకోదు. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ బాగోలేదు. చాలా వరకు సాగదీత సన్నివేశాలు ఉన్నాయి. వాటికి ఇంకాస్త క్రిస్పీగా కట్ చేయాల్సిందే. నిర్మాణ విలువలు బాగున్నాయి. -
హాలీవుడ్ చిత్రాలను రీచ్ అవ్వాలనే ప్రయత్నమే ఈ చిత్రం: కార్తీ
కార్తీ తండ్రి కొడుకులుగా ద్విపాత్రాభినయం చేసిన తాజా చిత్రం సర్ధార్ – 2. ఈయన 2022లో నటించిన సర్ధార్ చిత్రం మంచి విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. దానికి ఫ్రీక్వెల్, సీక్వెల్ చిత్రం సర్ధార్ 2 అని నటుడు కార్తీ పేర్కొన్నారు. పీఎస్.మిత్రన్ కథ, కథనం దర్శకత్వం బాధ్యతలను నిర్వహించిన ఈ చిత్రాన్ని ప్రిన్స్ పిక్చర్స్, ఐవీవై ఎంటర్టైన్ మెంట్ సంస్థలపై ఎస్.లక్ష్మణన్, ఇషాన్ సక్సేనా కలిసి నిర్మించిన ఈ భారీ స్పై థ్రిల్లర్ యాక్షన్ ఎంటర్టైనర్ కథా చిత్రంలో నటుడు ఎస్ జే.సూర్య,నటి మాళవిక మోహన్, ఆషిక రంగనాథన్, రజీషా విజయన్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. జార్జ్ సీ.విలియంస్ ఛాయాగ్రహణం, శ్యామ్ సీఎస్ సంగీతాన్ని అందించిన సర్ధార్ –2 చిత్రం ఈ నెల 10వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా తెరపైకి రానుంది.ఈ సందర్భంగా చిత్ర కథానాయకుడు కార్తీ మంగళవారం మధ్యాహ్నం చెన్నైలో మీడియాతో సమావేశం అయ్యారు. ఆయన మాట్లాడుతూ సర్ధార్ 2 చిత్రం చాలా ముఖ్యమైనది. ఇది సర్ధార్ చిత్రానికి ప్రీక్వెల్, సీక్వెల్ గా ఉంటుంది. స్పై యాక్షన్ థ్రిల్లర్ కథా చిత్రం. హాలీవుడ్ చిత్రాలను రీచ్ అవ్వాలనే ప్రయత్నమే ఈ చిత్రం. యాక్షన్ సన్నివేశాలు, వీఎఫ్ ఎక్స్ సన్నివేశాల కోసం యూనిట్ వర్గాలు చాలా శ్రమించారు. కార్లు, ట్రైన్ చేజింగ్ వంటి సన్నివేశాల కోసం ప్రొడక్షన్ డిజైనర్ రాజీవన్ చాలా కష్టపడ్డారు. దర్శకుడు మిత్రన్ అయితే షూటింగ్ పూర్తి అయిన తరువాత ఏడాది పాటు చిత్ర పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలపైనే దష్టి పెట్టారు. నటి మాళవిక మోహన్, ఆషిక రంగనాథన్ పాత్రలకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది. వారు యాక్షన్ సన్నివేశాల్లోనూ నటించారు. చిత్ర జనరంజకంగా వచ్చింది అని నటుడు కార్తీ పేర్కొన్నారు. -
60 అడుగుల ఎత్తు నుంచి దూకిన మాళవిక మోహనన్
హీరోయిన్ మాళవిక మోహనన్ ‘సర్దార్-2’ సినిమాలో యాక్షన్ రోల్లో కనిపించనుంది. ఈ సినిమాలో ఓ సన్నివేశం కోసం ఆమె ఏకంగా 60 అడుగుల ఎత్తు నుంచి తాడు సహాయంతో డైవ్ చేసిందట. అయితే అది నిజంగా కాదు, సినిమా కోసమే.విమానం నుంచి దూకుతున్న అనుభూతి కలిగేలా షూటింగ్లో భారీ బ్లోయర్లను ఏర్పాటు చేశారని మాళవిక తెలిపింది. అంత ఎత్తు నుంచి కిందకు వస్తూనే శరీర భంగిమను కాపాడుకోవడంతో పాటు డైలాగ్ కూడా చెప్పాల్సి వచ్చిందట. కెరీర్లో తాను చేసిన అత్యంత క్రేజీయెస్ట్ సీన్ ఇదేనని చెప్పుకొచ్చింది. ఎంత పక్కా జాగ్రత్తలు తీసుకొని చేసినప్పటికీ అంత ఎత్తు నుంచి కాస్త కిందకు జారాలంటే ఎవరికైనా భయంగానే ఉంటుంది. కానీ హీరోయిన్ మాళవిక మాత్రం ఎంజాయ్ చేశానని చెబుతోంది.ఇక హీరో కార్తీ, తనకు ఒక కామన్ పాయింట్ ఉందని మాళవిక తెలిపింది. ఇద్దరికీ భోజనం కంటే అల్పాహారం, స్నాక్స్ అంటేనే ఎక్కువ ఇష్టమని చెప్పింది.పీఎస్ మిత్రన్ దర్శకత్వంలో కార్తీ హీరోగా నటించిన చిత్రం ‘సర్దార్ 2’. మాళవికా మోహనన్, ఆషికా రంగనాథ్ హీరోయిన్లుగా నటించారు. ఎస్జే సూర్య విలన్ పాత్రపోషించారు. ప్రిన్స్ పిక్చర్స్ బ్యానర్పై ఎస్. లక్ష్మణ్ కుమార్ నిర్మించిన ఈ సినిమా సెప్టెంబరు 10న విడుదల అవుతోంది. అన్నపూర్ణ స్టూడియోస్ ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేస్తోంది. -
'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్లో మెరిసిన.. మాళవిక మోహనన్ (ఫొటోలు)
-
కార్తి 'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్..(ఫొటోలు)
-
నా కెరీర్లో సర్దార్ 2 చాలా ముఖ్యం: కార్తీ
‘‘నా కెరీర్లో ‘సర్దార్ 2’ కచ్చితంగా చాలా ముఖ్యమైన సినిమా. ఇలాంటి ఒక గూఢచారి పాత్ర దొరకడం నా అదృష్టం. ‘సర్దార్ 2’ సినిమా విజయంపై నాకు నమ్మకం ఉంది. ప్రేక్షకుల స్పందన కోసం వేచి చూస్తున్నాను’’ అని కార్తీ అన్నారు. పీఎస్ మిత్రన్ దర్శకత్వంలో కార్తీ హీరోగా నటించిన చిత్రం ‘సర్దార్ 2’. మాళవికా మోహనన్, ఆషికా రంగనాథ్ హీరోయిన్లుగా నటించారు. ఎస్జే సూర్య విలన్ పాత్రపోషించారు. ప్రిన్స్ పిక్చర్స్ బ్యానర్పై ఎస్. లక్ష్మణ్ కుమార్ నిర్మించిన ఈ సినిమా సెప్టెంబరు 10న విడుదల అవుతోంది. అన్నపూర్ణ స్టూడియోస్ ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేస్తోంది. సోమవారం హైదరాబాద్లో నిర్వహించిన ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో కార్తీ మాట్లాడుతూ–‘‘కమల్హాసన్గారికి ‘ఇండియన్’(తెలుగులో భారతీయుడు) సినిమా ఎలానో నాకు ‘సర్దార్’ అలాగ. ఈ మూవీ తెలుగులోనూ చాలా పెద్ద హిట్ అయింది. ఆ మూవీ చూడని వారు ఓ సారి ఓటీటీలో చూసి ‘సర్దార్ 2’ కి రావాల్సిందిగా కోరుతున్నాను. ఈ చిత్రాన్ని ఇంత గ్రాండ్కి తెరకెక్కించిన మా నిర్మాతలు లక్ష్మణ్, వెంకటేశ్గార్లకు, విడుదల చేస్తున్న అన్నపూర్ణ స్టూడియోస్ నాగార్జునగారికి, సుప్రియగారికి, శ్రీధర్గారికి ధన్యవాదాలు’’ అన్నారు. హీరో అడివి శేష్ మాట్లాడుతూ–‘‘కార్తీసర్ అంటే నాకు చాలా ఇష్టం. నా ఆల్టైమ్ ఫేవరేట్ మూవీస్లో ఆయన ‘ఆవారా, ఖైదీ, సర్దార్’ వంటి సినిమాలున్నాయి. ‘సర్దార్ 2’ ఘన విజయం సాధించాలి’’ అని పేర్కొన్నారు. ఈ వేడుకలో డైరెక్టర్స్ బోయ పాటి శ్రీను, కళ్యాణ్ శంకర్, అన్నపూర్ణ స్టూడియోస్ సాయిబాబా, నిర్మాతలు భోగవల్లి ప్రసాద్, వై.రవిశంకర్, సూర్యదేవర నాగవంశీ, అనిల్ సుంకర, శ్రీధర్, హీరోయిన్లు మాళవికా మోహనన్, ఆషికా రంగనాథ్, నటుడు ఎస్జే సూర్య మాట్లాడారు. -
చెన్నైలో నా రోజు ఇలా గడిచింది (ఫొటోలు)
-
ఆ ప్రేక్షకులంతా ఏమైపోయారనిపించింది– కార్తీ
‘‘స్పై బ్యాక్డ్రాప్లో చాలా సినిమాలు వచ్చాయి. అయితే చాలా చిత్రాలు మన దేశం బయట జరిగే ఆపరేషన్స్ నేపథ్యంలో ఉంటాయి. కానీ ‘సర్దార్ 2’ మన దేశం లోపల మన కోసం గూఢచారులు చేసే సాహసాల నేపథ్యంలో ఉంటుంది’’ అని కార్తీ చెప్పారు. కార్తీ హీరోగా నటించిన సినిమా ‘సర్దార్ 2’. పీఎస్ మిత్రన్ దర్శకత్వంలో ఎస్. లక్ష్మణ్ కుమార్ నిర్మించిన ఈ చిత్రం సెప్టెంబరు 10న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా శనివారం విలేకరుల సమావేశంలో కార్తీ చెప్పిన విశేషాలు.→ ‘సర్దార్’లో వాటర్ కాన్సెప్ట్కి ఆడియన్స్ బాగా కనెక్ట్ అయ్యారు. మన జీవితాల్లోని ఓ ముఖ్యమైన అంశాన్ని ‘సర్దార్ 2’లో ప్రస్తావించాం. ఆ అంశాన్ని తెరపై చూస్తేనే బాగుంటుంది. ఈ సినిమాలో చాలా యాక్షన్ సీక్వెన్స్ ఉన్నాయి. నాకు యాక్షన్ అంటే ఇష్టం. డ్యాన్స్ అంటే భయం (సరదాగా..). ‘సర్దార్ 2’లో తండ్రీకొడుకులు ఓ మిషన్ కోసం కలిసి పని చేస్తారు. తండ్రీకొడుకుగా నటించాను. ఇలా ఒకేసారి రెండు పాత్రలు చేయడం సవాల్గా అనిపించింది. అలాగే ఓపికతో మేకప్ వేసుకోవాల్సి వచ్చేంది.→ నాగార్జున అన్నయ్యతో నాకు మంచి అనుబంధం ఉంది. ‘సర్దార్’ చిత్రం తెలుగులో అన్నపూర్ణ స్టూడియోస్ ద్వారా రిలీజ్ అయింది. ‘సర్దార్ 2’ కూడా ఆ సంస్థ ద్వారానే రిలీజ్ కావడం హ్యాపీగా ఉంది.→ ‘సత్యం సుందరం’ సినిమా థియేటర్స్లో సరిగ్గా ఆడలేదు. చాలా బాధగా అనిపించింది. కానీ ఓటీటీలో మంచి స్పందన లభించింది. అయితే ఒకప్పుడు ‘స్వాతిముత్యం’, ‘శంకరాభరణం’ వంటి చిత్రాలను ప్రేక్షకులు బ్లాక్ బస్టర్స్ చేశారు. ఆ ప్రేక్షకులంతా ఇప్పుడు ఏమైపోయారని నాకు బాధగా అనిపించింది. → తమిళనాడులో రాజకీయాల పరంగా జనరేషనల్ షిఫ్ట్ జరిగిందని అనుకుంటున్నాను. నేటి తరం ప్రేక్షకుల అభిరుచులకు తగ్గట్లుగా యాక్టర్స్గా మేం మారుతున్నాం. అలానే పొలిటీషియన్స్ నెక్ట్స్ జనరేషన్కు అడాప్ట్ అవ్వాలి. ఇక సినిమాలు వద్దని విజయ్గారు నిర్ణయించుకుని, ప్రజలకు సేవ చేయాలని రాజకీయాల్లోకి వెళ్లారు. అలాంటి అంకితభావంతో ఎవరు వచ్చినా వారికి ప్రత్యేకమైన జర్నీ ఉంటుంది. అయితే మా అన్నయ్య (హీరో సూర్య) చెప్తుంది ఏంటంటే... ప్రజలకు మంచి చేయాలంటే రాజకీయాలు మాత్రమే మార్గం కాదు. మా అగరం ఫౌండేషన్ నుంచి దాదాపు 8 వేలమంది స్టూడెంట్స్ చదువుకుంటున్నారు. → తెలుగులో కళ్యాణ్ శంకర్ డైరెక్షన్లో ఓ మూవీ చేస్తున్నాను. ‘హిట్ 4’కి చర్చలు జరుగుతున్నాయి. తమిళంలో ‘మార్షల్’ సినిమా చేస్తున్నాను. -
ఇలాంటి సినిమా చేయడం సాధ్యమా అని ఆశ్చర్యపోయా
కార్తీ హీరోగా చేసిన లేటెస్ట్ సినిమా 'సర్దార్ 2'. 2022లో తొలి భాగం విడుదలై హిట్ అయింది. ఇప్పుడు సీక్వెల్ తీశారు. ఈసారి మాళవిక మోహన్, ఆషిక రంగనాథన్ తదితర హీరోయిన్లు కొత్తగా నటించారు. రజిషా విజయన్ మరోసారి కార్తీతో స్క్రీన్ షేర్ చేసుకుంది. ఎస్జే సూర్య విలన్. వచ్చే శుక్రవారం పాన్ ఇండియా వైడ్ థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే సోమవారం చెన్నైలో ఆడియో లాంచ్ జరిగింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న సూర్య ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.(ఇదీ చదవండి: సైలెంట్గా ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమా 'పళ్లబురుసు')ఈ చిత్ర టీజర్ చూసి ఇలా తమిళంలో చేయడం సాధ్యమా? అరే ఇది మిత్రన్ సినిమానా? అని ఆశ్చర్యపోయాను. అందరూ కార్తీని సర్ధార్ అని పిలుస్తున్నారు. కార్తీ నాకంటే మంచి మూవీస్ చేస్తున్నాడు. దాన్ని నేను ఆస్వాదిస్తూ , ఆశ్చర్యంగాను, సంతోషంగానూ చూస్తున్నాను. మరో విషయం ఏంటంటే నేను చెన్నైలోనే ఉంటున్నాను. అప్పడప్పుడు ముంబైకి వెళ్లి వస్తున్నాను అని సూర్య తాను గురించి జరుగుతున్న ప్రచారంపై క్లారిటీ ఇచ్చాడు.నటుడు కార్తీ మాట్లాడుతూ .. నేను విదేశాల్లో చదువుకున్నాను. అక్కడ కూడా మన చిత్రాలకు ప్రత్యేక గుర్తింపు ఉంది. సినిమాను కొందరు ఎగతాళి చేస్తారు. కొందరు అభినందిస్తారు. వారు అభినందించే విధంగా మూవీస్ చేయాలని నేను భావిస్తాను. సర్ధార్ 2 చిత్రం అలాంటిదే అని అన్నాడు.(ఇదీ చదవండి: ఐటమ్ సాంగ్లో ట్రెండింగ్ హీరోయిన్ కాయదు?) -
కార్తీ యాక్షన్ మూవీ.. ట్రైలర్ వచ్చేసింది
కోలీవుడ్ హీరో కార్తి నటించిన సీక్వెల్ సర్దార్-2. ఈ సినిమాకు పీఎస్ మిత్రన్ దర్శకత్వం వహించారు. గతంలో రిలీజై సూపర్ హిట్గా నిలిచిన సర్దార్కు కొనసాగింపుగా ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. తమిళంతో పాటు తెలుగులోనూ ఓకేసారి ట్రైలర్ విడుదల చేశారు. ఈ ట్రైలర్ చూస్తుంటే ఓ మిషన్ చుట్టూ కథ ఉండనుందని తెలుస్తోంది. ఈ ట్రైలర్లో ఫుల్ యాక్షన్ సీన్స్ అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. విలన్గా ఎస్జే సూర్య కనిపించడం ఈ చిత్రానికి మరింత ప్లస్ అయ్యేలా కనిపిస్తోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ చిత్రం.. సెప్టెంబర్ 10న థియేటర్లలో సందడి చేయనుంది. కాగా.. ఈ మూవీలో మాళవిక మోహనన్, ఆషికా రంగనాథ్ హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రానికి సామ్ సీఎస్ సంగీతమందించారు. #Sardar2 Trailer is here! Tamil : https://t.co/XetVn1ESqfTelugu : https://t.co/bDJ6ffBYWB#Sardar2FromSep10— Karthi (@Karthi_Offl) August 31, 2026 -
నాకే ప్లాస్టిక్ బాటిల్ ఇస్తావా అంటూ ఎస్జే సూర్య ఆగ్రహం
తమిళ హీరో కార్తీక్కు తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ ఉంది. కార్తీక్ నటించిన బ్లాక్బాస్టర్ మూవీ సర్దార్కు సీక్వెల్గా తెరకెక్కుతున్న చిత్రం ‘సర్దార్2’. పీఎస్ మిత్రన్ దర్శకుడు. సెప్టెంబరు 10న పాన్ ఇండియాలో రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే మూవీ ప్రమోషన్స్ కూడా బాగా చేస్తున్నారు. ఈ తరహాలోనే ఓ ఆసక్తికరమైన సంఘటన ప్రస్తుతం సోషల్మీడియాలో వైరల్ అవుతోంది. ఓ ఈవెంట్లో పాల్గొన్న నటుడు ఎస్జే సూర్యకు అక్కడి సిబ్బంది తాగడానికి ప్లాస్టిక్ బాటిల్లో నీరు అందించారు. దీనిని గమనించిన సూర్య తనదైన శైలిలో ‘నాకే ప్లాస్టిక్ బాటిల్ ఇస్తావా..?ఈ సర్దార్కి కూడా ఇదేనా’ అని కోపంగా అంటూ నవ్వులు పూయించాడు. పక్కనే ఉన్న హీరో కార్తీ తన వాటర్ బాటిల్ను సూర్యకు అందించారు.సినిమా కాన్సెప్ట్కి.. కాగా ప్లాస్టిక్ బాటిల్స్ వల్ల ఆరోగ్యం పోతోంది అంటూ తీసిన సర్దార్ సినిమా కాన్సెప్ట్కి ఈ సంఘటన తోడు కావడంతో ఈ వీడియో వైరల్ అవుతోంది. కాగా ఇప్పటికే విడుదలైన టీజర్ సినిమాపై అంచనాలను పెంచేస్తోంది. ఈ సినిమాలో ఎస్జే సూర్య విలన్గా కనిపించనున్నాడు. మాళవిక మోహనన్, ఆషికా రంగనాథ్, రజిష్ విజయన్ హీరోయిన్లు కాగా సీఎస్ సామ్ సంగీతం అందిస్తున్నాడు.When given WATER to SJSuryah in PLASTIC BOTTLE:#Karthi: Adhu Plastic Bottle Venam....#SJSuryah: Enga Vandhu, Plastic Bottle kudukaringa...#Sardar2 daaaa👊 pic.twitter.com/OMvdgWRS9W— AmuthaBharathi (@CinemaWithAB) August 29, 2026ఇదీ చదవండి: కింగ్తో.. కింగే పోటీ.. ఆ రోజు ఏం జరగబోతోంది? -
యాక్షన్తో అదరగొట్టిన కార్తి 'సర్దార్ 2' టీజర్
పేరుకే తమిళ హీరో గానీ కార్తికి తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ ఉంది. కాకపోతే రీసెంట్ టైంలో సరైన హిట్ పడలేదు. అయితే ఆ లోటుని 'సర్దార్ 2' సినిమా తీర్చేలా కనిపిస్తుంది. స్పై యాక్షన్ థ్రిల్లర్గా దీన్ని తీశారు. పీఎస్ మిత్రన్ దర్శకుడు. సెప్టెంబరు 10న పాన్ ఇండియా రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే తాజాగా టీజర్ వదిలారు.(ఇదీ చదవండి: బన్నీ, మహేశ్కి పోటీ.. చరణ్-ఎన్టీఆర్ కూడా బిజినెస్లోకి?)గతంలో వచ్చిన తొలి భాగాన్ని మించిపోయేలా సినిమా ఉండనుందని టీజర్ బట్టి అర్థమైంది. ఇందులో తండ్రికొడుకులుగా కార్తి కనిపించనున్నాడు. మాళవిక మోహనన్, ఆషికా రంగనాథ్, రజిష్ విజయన్ హీరోయిన్లు. ఎస్జే సూర్య విలన్ పాత్రధారి.(ఇదీ చదవండి: ప్రియుడిని పరిచయం చేసిన 'గుండె నిండా గుడిగంటలు' మీనా)


