-
బస్సు డ్రైవర్కు ఫిట్స్
శృంగవరపుకోట: బస్సు నడుపుతున్న డ్రైవర్కు ఆకస్మికంగా ఫిట్స్ రావడంతో స్టీరింగ్పై పడిపోయాడు. బస్సు అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న ఓ ఇంటిని, బాలుడిని ఢీకొట్టింది. బాలుడు మృతిచెందగా, ఇంటి వద్ద ఉన్న మరో మహిళకు గాయాలయ్యాయి. ఎస్.కోట ఆర్టీసీ డిపో నుంచి ఆదివారం ఉదయం విజయనగరం బయలుదేరిన ఆర్టీసీ పల్లె వెలుగు బస్సు ధర్మవరం శివారు మారుతీనగర్ మలుపు వద్దకు వచ్చేసరికి డ్రైవర్ గంగునాయుడుకు ఒక్కసారిగా ఫిట్స్ వచ్చింది. డ్రైవర్ స్టీరింగ్పై పడిపోవడంతో బస్సు అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న ఇంటిపైకి దూసుకుపోయింది. ఇంటి ముందు ఉన్న బాలుడు శిరికి అభిషేక్ (12)ను, సమీపంలో వంట చేస్తున్న తొత్తడి పాపను ఢీకొట్టింది. అభిషేక్ను 108లో ఎస్.కోట ఏరియా ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. పాపకు కూడా గాయాలయ్యాయి. -
బస్సులో మహిళ హల్చల్.. ఆర్టీసీ డ్రైవర్పై దాడి
సాక్షి, విజయవాడ: నగరంలో ఓ మహిళ హల్చల్ చేసింది. ఆవేశంలో ఊగిపోతూ విధి నిర్వహణలో ఉన్న ఆర్టీసీ బస్సు డ్రైవర్పై దాడి చేసింది. ఆమె ఓవరాక్షన్కు బస్సులో ఉన్న వారంతా ఒక్కసారిగా షాకయ్యారు. వివరాల ప్రకారం.. విజయవాడలోని కంట్రోల్ రూమ్ సమీపంలో ఆర్టీసీ బస్సులో ఓ మహిళ హల్చల్ చేసింది. ఆర్టీసీ బస్సు తన బైకును ఢీకొట్టడంతో సదరు మహిళ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ క్రమంలో కోపంలో ఊగిపోతూ బస్సును ఆపింది. అనంతరం, బస్సులో డ్రైవర్ను ఎడాపెడా చితకబాదింది. కాగా, ఘటన పోలీసుల దృష్టికి చేరడంతో విచారణ జరుపుతున్నట్టు తెలిపారు. ఇది కూడా చదవండి: అబద్దాలకు లిమిట్ లేదా.. 1983లో చంద్రబాబు టీడీపీలో ఉన్నారా?: అంబటి ఫైర్ -
ప్రమాదాలకు చెక్.. వాటేన్ ఐడియా.. డ్రైవర్ రాజా..!
కొత్తపేట/రావులపాలెం(కోనసీమ జిల్లా): ఒక్క ఐడియా జీవితాన్ని మార్చేస్తుందన్నట్టుగా.. ఆ ఆర్టీసీ డ్రైవర్ మదిలో పుట్టిన ఓ ఐడియా.. ఎన్నో ప్రమాదాలను నివారిస్తోంది. బస్సుకు ఆయన అమర్చిన స్టీల్ బాల్ ఎన్నో ప్రాణాలను కాపాడుతోంది. ఈ ఐడియా కోనసీమ జిల్లా కపిలేశ్వరపురానికి చెందిన వీవీవీ సత్యనారాయణరాజుది. రావులపాలెం ఆర్టీసీ డిపోలో డ్రైవర్గా పని చేస్తున్న రాజు ఆ విశేషాలను ‘సాక్షి’తో పంచుకున్నారు. చదవండి: ప్రేమ పేరుతో ఎస్ఐ వంచన రోడ్డుపై వాహనంలో వెళ్తున్నప్పుడు వెనుక నుంచి వచ్చే ఇతర వాహనాలను గుర్తించేందుకు వాటికి కుడి, ఎడమ వైపు రియర్ వ్యూ అద్దాలు ఉంటాయి. వాటి ద్వారా వెనుక నుంచి వచ్చే వాహనాలను గమనిస్తూ డ్రైవర్లు తమ వాహనాలను జాగ్రత్తగా నడుపుతూంటారు. సాధారణంగా బస్సు డ్రైవర్కు ముందు భాగంలో 5 అడుగుల ఎత్తు వరకూ కనిపించదు. బస్టాండ్లు, బస్టాపుల్లో ఆగి ఉన్న బస్సు ముందు నుంచి ప్రయాణికులు, పాదచారులు రాకపోకలు సాగిస్తుండటం సర్వసాధారణంగా కనిపిస్తుంది. అలా ఎవరైనా వెళ్తున్నప్పుడు వారు కనిపించక, ఎవరూ లేరని భావించి, డ్రైవర్లు బస్సును ముందుకు పోనిస్తూంటారు. దీనివలన ప్రమాదాలు జరుగుతున్నాయి. కొన్నిసార్లు ప్రాణాలు పోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇదేవిధంగా గతంలో రావులపాలెం బస్టాండ్లోనే రెండు ప్రమాదాలు జరిగి, ఆయా డ్రైవర్లు 6 నెలల పాటు సస్పెండయ్యారు. బాధితులకు ఆర్టీసీ పరిహారం చెల్లించాల్సి వచ్చింది. ఇటువంటి ప్రమాదాలను, ఆర్టీసీ పరిహారాలు చెల్లించే పరిస్థితిని అరికట్టాలని సత్యనారాయణరాజు తీవ్రంగా ఆలోచించారు. ఆ క్రమంలోనే ఆయనకు స్టీల్ బాల్ పెట్టాలనే ఐడియా వచ్చింది. 180 డిగ్రీల కుంభాకారపు స్టీల్ బాల్ను 2 అడుగుల రాడ్కు అమర్చి, దానిని డ్రైవర్ సీటుకు కుడివైపున అద్దం ముందు బిగించారు. ఆ స్టీల్ బాల్లో బస్సు ముందు భాగం ఎడమ నుంచి కుడివైపు డ్రైవర్ డోర్ వరకూ కనిపిస్తోంది. దీంతో బస్సు ముందు ఎవరూ లేరని గుర్తించడం సులభమైంది. తద్వారా ఇటువంటి ప్రమాదాలకు చెక్ పడింది. ఈ స్టీల్ బాల్ను అన్ని బస్సులకూ అమర్చాలని ఆర్టీసీ యాజమాన్యం యోచిస్తోంది. ఈ స్టీల్ బాల్ తయారీకి కేవలం రూ.100 ఖర్చయినట్టు సత్యనారాయణరాజు తెలిపారు. ఆయన వినూత్న ఆలోచనను ఆర్టీసీ అధికారులు, సహచర డ్రైవర్లు, కండక్టర్లు, ఇతర సిబ్బంది ఎంతగానో మెచ్చుకుని, అభినందించారు. -
మహిళ వీరంగం.. బూతులు తిడుతూ.. చేత్తో కొడుతూ.. కాళ్లతో తన్నుతూ..
సాక్షి, విజయవాడ: ఆర్టీసీ డ్రైవర్పై ఓ మహిళ దాడి చేసిన ఘటన నగరంలో బుధవారం కలకలం రేపింది. సూర్యారావుపేట సీఐ జానకి రామయ్య కథనం మేరకు.. విద్యాధరపురం డిపోనకు చెందిన ఐదో నంబర్ రూట్ బస్సు బుధవారం సాయంత్రం కాళేశ్వరరావు మార్కెట్ నుంచి ఆటోనగర్కు బయలుదేరింది. కృష్ణలంక ప్రాంతానికి చెందిన కె.నందిని తన ద్విచక్ర వాహనంపై వన్ వేలో రాంగ్రూట్లో కేఎల్ యూనివర్సిటీ జంక్షన్ వద్ద బస్సుకు అడ్డంగా వచ్చింది. దీంతో డ్రైవర్ ఎం.ముసలయ్య అత్యవసర బ్రేకు వేసి ప్రమాదం జరగకుండా బస్సును అదుపు చేశారు. చదవండి: కాటేసిన బాబాయ్.. టాటా చెబుతూ నవ్వుతూ వెళ్లిన చిన్నారి.. అంతలోనే.. అయితే నందిని ఆగ్రహంతో చంపేస్తావా అంటూ బస్సులోకి ప్రవేశించి డ్రైవర్పై దాడి చేసింది. డ్రైవర్ను బూతులు తిడుతూ చేతులు, కాళ్లతో దాడిచేయడాన్ని అక్కడే ఉన్న మరో మహిళ తన ఫోన్లో చిత్రీకరించింది. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని నిందితురాలిని అదుపులోకి తీసుకున్నారు. వీడియో దృశ్యాలను పరిశీలించి, విచారణ చేపట్టిన అనంతరం డ్రైవర్ ముసలయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు నందినిపై కేసు నమోదు చేశారు. ఆర్టీసీ డ్రైవర్పై నందిని దాడి చేస్తున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టాయి. -
Tamil Nadu: 30 మంది ప్రాణాలు కాపాడి మృత్యు ఒడిలోకి ఆర్టీసీ డ్రైవర్
చెన్నై: తను చనిపోయే ముందు 30 మంది ప్రయాణికుల ప్రాణాలు కాపాడి రియల్ హీరో అనిపించుకున్నాడు ఓ ఆర్టీసీ డ్రైవర్.. తనకు ప్రమాదం ఎదురవబోతుందని ముందే గమనించి అప్రమత్తమైన డ్రైడర్ బస్సును రోడ్డు పక్కన నిలిపిన అయిదు నిమిషాల్లోనే గుండెపోటుతో మృత్యుఒడిలోకి చేరుకున్నాడు. ఈ ఈ హృదయవిదారక ఘటన తమిళనాడు రాష్ట్రంలోని మధురైకి సమీపంలో చోటుచేసుకుంది. తమిళనాడు స్టేట్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్లో ఎమ్ ఆరుముగమ్(44) ఆర్టీసీ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. గురువారం ఎప్పటిలాగే కండక్టర్ భాగ్యరాజ్తో కలిసి అరప్పాలయం నుంచి కొడైకెనాల్కు బస్సు నడుపుతున్నాడు. ఉదయం 6.20 నిమిషాలకు అరప్పాలయం నుంచి బస్సు బయలు దేరింది. బస్సులో 30 మంది ప్రయాణికులున్నారు. బస్సు బయల్దేరిన అయిదు నిమిషాలకు గురు థియేటర్ వద్దరు చేరుకోగానే అరుముగమ్కు అకస్మాత్తుగా ఛాతీలో నొప్పి ఏర్పడింది. వెంటనే అప్రమత్తమై బస్సును రోడ్డు పక్కకు పార్క్ చేసి కండక్టర్ను సమాచారం అందించాడు. అనంతరం బస్సులోని సీట్లో కుప్పకూలిపోయాడు. కండక్టర్ వెంటనే అంబులెన్స్కు సమాచారం అందించాడు. కానీ అంబులెన్స్ వచ్చేలోపే డ్రైవర్ అరుముగమ్ గుండెపోటుతో మరణించాడు. మృతుడికి ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. చదవండి: సెల్ఫీ పిచ్చి...జాలి పడాలా? మీరే చూడండి! టీఎన్ఎస్టీసీ డిప్యూటీ కమర్షియల్ మేనేజర్ యువరాజ్ మాట్లాడుతూ.. ఆరుముగం ఆర్టీసీలో డ్రైవర్గా 12 సంవత్సరాల అనుభవం ఉందన్నారు. 30 మంది ప్రాణాలను కాపాడిన అతని ఆదర్శప్రాయమైన సాహసం ఎల్లప్పుడూ గుర్తుండిపోతుందన్నారు. డ్రైవర్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కరిమేడు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: Tejashwi Yadav: ఘనంగా తేజస్వి యాదవ్ వివాహం
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
- సుచరితకు హ్యాండిచ్చిన కాంగ్రెస్.. పూరీ బరిలో ఆయనే..
- AP: ఆ జిల్లాల్లో రెండు రోజుల పాటు వర్షాలు
- అబద్ధాల వసంతం.. గ్రూపు రాజకీయాలే ఆసాంతం
- Prajwal Revanna: ఏ గదిలో ఏం జరిగింది?
- మహిళలపై టీడీపీ అభ్యర్థి అనుచిత వ్యాఖ్యలు
- అవన్నీ అపోహలే
- జైళ్లకు భయపడను.. ప్రాణాలైనా బలిపెడతా: కేసీఆర్
- ఐరాసలో జగన్ విజన్
- బెంగళూరు గెలుపు ‘హ్యాట్రిక్’
- అనుపమా కెరీర్ ప్రస్తుతం నాన్స్టాప్గా... జెట్ స్పీడ్లో
Advertisement