plastic godown
-
ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం..
ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో భారీ అగ్నిప్రమాద ఘటన చోటుచేసుకుంది. ఢిల్లీలోని టిక్రీ కలాన్లో ఉన్న పీవీసీ మార్కెట్ శనివారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ క్రమంలో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడటంతో చుట్టుపక్కల ప్రాంతాల్లో దట్టమైన పొగలు వ్యాపించాయి. ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. వివరాల ప్రకారం.. టిక్రీ కలాన్లో ఉన్న పీవీసీ మార్కెట్లో ఉన్న ప్లాస్టిక్ గోదాంలో మంటలు వ్యాపించాయి. ప్లాస్టిక్ సంబంధిత వస్తువులు ఉన్న కారణంగా పెద్దఎత్తున అగ్ని కీలలు ఎగసిపడ్డాయి. చుట్టుపక్కల ప్రాంతాల్లో దట్టంగా పొగలు అలముకున్నాయి. కిలోమీటర్ దూరంలో కూడా మంటలు వ్యాప్తి చెందాయి. ఈ క్రమంలో సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. 26 ఫైర్ ఇంజిన్లతో మంటలను అదుపుచేశారు. కాగా, ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి హానీ జరుగలేదని డిప్యూటీ చీఫ్ ఫైర్ ఆఫీసర్ ఎస్కే దువా చెప్పారు. #WATCH | Delhi: Morning visual from Tikri Kalan area where fire broke out in a plastic godown during the early hours today. 25 fire tenders at the spot. No casualties reported so far. https://t.co/yhTyNp2M4y pic.twitter.com/Clr2ul8CmF — ANI (@ANI) April 8, 2023 -
ఢిల్లీ గోడౌన్లో మంటలు ఆర్పుతున్న 'రోబో': వీడియో వైరల్
న్యూఢిల్లీ: ఢిల్లీలోని రోహిణిలో ఉన్న ప్లాస్టిక్ గోడౌన్లో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటన తెల్లవారుఝామున 2.18 గంటకు చోటు చేసుకుంది. దీంతో అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగి మంటలను అదుపులోకి తీసుకువచ్చింది. ఐతే ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి గాయాలుకాలేదని అధికారులు తెలిపారు. ఈ అగ్నిప్రమాదంలో మంటలను అదుపు చేయడంలో ఎరుపు రంగు రోబో కీలక పాత్ర పోషించింది. అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం గత నెలలో రెండు రోబోలను ఆస్ట్రేలియా కంపెనీ నుంచి కొనుగోలు చేసింది. ఆ రోబోలో ఒకటి ఈ రెడ్ రోబో. ఈ అగ్నిమాపక రోబోలను ఉపయోగించడం వల్ల త్వరిగతగతిన మంటలు అదుపులోకి తీసుకురాగలమని, సాధ్యమైనంత మేర తక్కువ నష్టం వాటిల్లుతుందని చెబుతున్నారు. ఇవి సుమారు 100 మీటర్ల దూరం నుంచి కూడా మంటలను ఆర్పగలదు. ఇరుకైన మార్గంలో సంభవించిన ప్రమాదాల్లో సైతం ఈ రోబోలు చాలచక్కగా నావిగేట్ చేసి మంటలను ఆర్పేస్తాయని అంటున్నారు. ఇవి నిమిషానికి దాదాపు 2 వేల లీటర్లు చొప్పున నీటిని విడుదల చేయగలవు. ఇవి అగ్ని ప్రమాదం జరిగినప్పుడు ఎగిసి పడుతున్న అగ్నికీలల స్థాయిని బట్టి సామర్థ్యం మేర నీటిని విడుదల చేసేలా ప్రత్యేక విభాగం కూడా ఉంది. వీటికి సెన్సార్, కెమెరాలు కూడా అమర్చి ఉంటాయి. ఇవి నాలుగు కిలోమీటర్ల వేగంతో కదలగలవు. Our government has procured remote-controlled fire fighting machines. Our brave fireman can now fight fires from a maximum safe distance of upto 100 meters. This will help reduce collateral damage and save the precious lives. pic.twitter.com/1NjGX3ni3B — Arvind Kejriwal (@ArvindKejriwal) May 20, 2022 (చదవండి: షాకింగ్ ఘటన.. ఆమె చేతులు కట్టేసి భవనం పై నుంచి తోసేసి....: వీడియో వైరల్) -
YSR Kadapa: ప్లాస్టిక్ గోడౌన్లో భారీ అగ్నిప్రమాదం
వైఎస్సార్ కడప: వైఎస్సార్ జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. బద్వేలులోని నాగభూషణం డిగ్రీ కళాశాల సమీపంలో ఉన్న ప్లాస్టిక్ గోడౌన్ షాపులో సోమవారం అర్ధరాత్రి షార్ట్ సర్క్యూట్తో మంటలు చెలరేగాయి. దీంతో అప్రమత్తమైన స్థానికులు వెంటనే పోలీసులకు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. మైదుకురు, పోరుమామిళ్ల నుంచి వచ్చిన ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఈ ఘటనలో భారీగా ఆస్తినష్టం సంభవించినట్లు అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. చదవండి: రోడ్డు ప్రమాదం.. ఒకరి మృతి -
రాజేంద్రనగర్లో అగ్ని ప్రమాదం
సాక్షి, హైదరాబాద్ : నగర శివారు మైలార్ దేవ్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో అగ్ని ప్రమాదం సంభవించింది. దానమ్మ దోపిడి ప్రాంతంలోని ఓ ప్లాస్టిక్ స్క్రాప్ గోదాంలో అనూహ్యంగా మంటలు చెలరేగాయి. ఎగిసి పడుతున్న మంటలతోపాటు దట్టమైన పొగ కమ్ముకోవడంతో ఆర్పేందుకు రాజేంద్రనగర్ అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. ఈ ప్రమాదంతోఎలాంటి ప్రాణ హానీ జరగలేదు. కాగా ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణమయి ఉంటుందని స్థానికులు భావిస్తున్నారు. అయితే స్కాప్ గోదానికి ప్రభుత్వం ఎలాంటి అనుమతులు ఇవ్వనట్లు, సంబంధిత అధికారుల అండదండలతోఈ దందా కోనసాగుతున్నట్లు తెలుస్తోంది. -
హైదరాబాద్ భోలక్పూర్లో అగ్నిప్రమాదం
-
ప్లాస్టిక్ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం
సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలోని నరేలా పారిశ్రామికవాడలో ఓ ప్లాస్టిక్ ఫ్యాక్టరీలో ఆదివారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. మంటలను అదుపు చేసేందుకు 22 అగ్నిమాపక యంత్రాలు ఘటనా స్ధలానికి చేరుకున్నాయి. అగ్నిప్రమాదానికి కారణాలు ఇంకా తెలియరాలేదు. కాగా గత నెలలో పలు ప్రభుత్వ కార్యాలయాలుండే సీజీఓ కాంప్లెక్స్లోనూ భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. పండిట్ దీన్దయాళ్ అంత్యోదయ భవన్ ఐదో ఫ్లోర్లో మంటలు చెలరేగిన ఘటనలో ఓ సీఆర్పీఎఫ్ ఉద్యోగి మరణించాడు. ఇక సీజీఓ కాంప్లెక్స్లో అగ్నిప్రమాదానికి సరిగ్గా నెలరోజుల ముందు ఢిల్లీలోని కరోల్బాగ్లోని ఓ హోటల్లో జరిగిన అగ్నిప్రమాదంలో 17 మంది మరణించారు. -
బోయిన్పల్లిలో భారీ అగ్నిప్రమాదం
హైదరాబాద్ : నగరంలోని బోయిన్పల్లిలో ఆదివారం మధ్యాహ్నం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. స్థానిక ప్లాస్టిక్ పైపుల గోడౌన్లో మంటలు చెలరేగాయి. భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. దట్టమైన పొగ వ్యాపించడంతో స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది రెండు ఫైరింజన్లతో మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. ప్రమాదానికి షార్ట్ సర్క్యూటే కారణమని తెలుస్తోంది. ఈ ప్రమాదంలో గోడౌన్లోని సామాన్లు పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి. భారీగా ఆస్తినష్టం జరిగినట్లు సమాచారం. పొగలు తీవ్రంగా వ్యాపించడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం మంటలను అదుపులోకి తెచ్చేందుకు ఫైర్ సిబ్బంది యత్నిస్తున్నారు. -
బోయిన్పల్లిలో భారీ అగ్నిప్రమాదం
-
ప్లాస్టిక్ గోడౌన్లో అగ్నిప్రమాదం..
-
ప్లాస్టిక్ గోడౌన్లో అగ్నిప్రమాదం
-
ప్లాస్టిక్ గోదాములో అగ్ని ప్రమాదం
హైదరాబాద్: నగరంలోని మంగళ్హాట్ పరిధిలో ఓ ప్లాస్టిక్ గోదాములో ఆదివారం మధ్యాహ్నం అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. మంటలు భారీగా ఎగసిపడుతుండడంతో స్థానికులు అగ్ని మాపక సిబ్బంది సమాచారం అందించారు. వెంటనే రంగంలోకి దిగిన ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
రాజమండ్రిలో తగలబడ్డ ప్లాస్టిక్ గౌడౌన్
-
మైలార్దేవ్పల్లి పాస్టిక్ గోడౌన్లో అగ్నిప్రమాదం
హైదరాబాద్: నగరంలో మైలార్దేవ్పల్లి సమీపంలోని ఓ ప్లాస్టిక్ గోడౌన్లో గురువారం అగ్నిప్రమాదం సంభవించింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు యత్నిస్తున్నట్టు సమాచారం. అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. -
ప్లాస్టిక్ గోడౌన్లో అగ్నిప్రమాదం
హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లా మైలార్ దేవ్పల్లి నేతాజీనగర్లో సోమవారం ఉదయం ఓ ప్లాస్టిక్ గోడౌన్లో అగ్నిప్రమాదం జరిగింది. మంటలు పెద్ద ఎత్తున ఎగసి పడుతున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు యత్నిస్తున్నారు. కాగా ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. -
గోడౌన్లో మంటలు: నలుగురు సజీవ దహనం
చెన్నై: ప్లాస్టిక్ గోడౌన్లో మంటలు చెలరేగి నలుగురు కార్మికులు సజీవ దహనమైన సంఘటన తమిళనాడులోని తిరువళ్లూరులో గురువారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. గోడౌన్లో అకస్మాత్తుగా మంటలు వ్యాపించి ... భారీ ఎత్తున అగ్నికీలలు ఎగసిపడుతున్నాయి. దాంతో భద్రత సిబ్బంది వెంటనే అగ్నిమాపక సిబ్బందికి పోలీసులకు సమాచారం అందించారు. ఫైరింజన్లతో అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని.. మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. సజీవ దహనమైన కార్మికులు గోడౌన్లో నిద్రిస్తుండగా ఆ ప్రమాదం జరిగిందని పోలీసులు చెప్పారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. పోలీసులకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


