breaking news
Panchadarla
-
మంత్రి సహకారంతో పంచదర్లలో అక్రమ మైనింగ్.. ఆ మంత్రి పేరు...
-
అల్లుడు పేరుతో గిల్లుడు!
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: శైవ క్షేత్రమైన పంచదార్ల కొండకు గుండుకొడుతూ అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ అల్లుడు పేరుతో గిల్లుడు వ్యవహారం నడిపారు. ఏకంగా రెండు మైనింగ్ లీజుల ద్వారా 2 లక్షల టన్నుల గ్రావెల్ను అదనంగా ‘విజయ’వంతంగా అక్రమ తవ్వకాలు చేపట్టినట్టు మైనింగ్ శాఖ సర్వేలో తేల్చింది. దీని విలువ రూ.3 కోట్ల నుంచి రూ.4 కోట్ల వరకు ఉంటుందని తెలుస్తోంది. వాస్తవానికి మార్కెట్లో దీని ధర రూ. 10 కోట్లకు పైనే ఉంటుందని మైనింగ్ వర్గాలు చెబుతున్నాయి. ఎంపీ సీఎం రమేష్కు అల్లుడి వరుసైన విజయకుమార్ నాయుడు పేరుతో రెండు చోట్ల లీజులు తీసుకున్నారు.విజయ్కుమార్ నాయుడు సీఎం రమేష్ సొంత ప్రాంతమైన వైఎస్సార్ జిల్లా ఎర్రగుంట్లకు చెందినవాడు. ఒకచోట 2.153 హెక్టార్లు, మరో చోట 4.99 హెక్టార్లు.. మొత్తం 7.143 హెక్టార్లలో మైనింగ్ అనుమతులు జారీ చేశారు. ఆపై రేయింబవళ్లు తవ్వకాలతో రెండు నెలల్లోనే లీజుకు మించి అక్రమ తవ్వకాలు చేపట్టారు. ఎంతో ప్రాచీన చరిత్ర కలిగిన పంచదార్ల శైవ క్షేత్రంలో స్వయంభూ లింగం ఉండేది. యమ ధర్మరాజు తన కుష్ఠు వ్యాధి నివారణ కోసం ఇక్కడ శివ లింగాన్ని పునఃప్రతిష్ట చేసినట్టు చరిత్ర చెబుతోంది. ఈ శైవ క్షేత్రంలో నిరంతరాయంగా లింగాల నుంచి పారే నీరు ఎంతో స్వచ్ఛంగా ఉండటంతో పాటు అనారోగ్యం పాలుకాకుండా కాపాడుతుందని భక్తుల విశ్వాసం. అదేవిధంగా నరసింహస్వామి మొదటిసారిగా ఇక్కడే పాదాలు మోపారని కూడా చరిత్ర చెబుతోంది. ఈ శైవ క్షేత్రాన్ని పురావస్తు శాఖ పురాతన కట్టడంగా గుర్తించింది. ఇటువంటి పంచదార్ల కొండపై ఎంపీ సీఎం రమేష్ కన్ను పడింది. ఇందుకు అనుగుణంగా అల్లుడి పేరుపై మైనింగ్ లీజుతో నాటకానికి తెరలేపారు. రాత్రి, పగలు తేడా లేకుండా రెండు నెలలుగా అక్రమంగా లీజు అనుమతికి మించి అదనంగా తవ్వకాలు చేపట్టారు. విజయ్కుమార్ నాయుడు పేరుతో తీసుకున్న రెండు మైనింగ్ అనుమతుల ద్వారా.. ఒక దాని నుంచి 1,39,000 టన్నులు, మరో దాంట్లో మరో 63 వేల టన్నులు అక్రమంగా తవ్వకాలు చేపట్టినట్టు మైనింగ్ సర్వేలో తేలింది. అక్రమంగా తవ్విన గ్రావెల్ను సమీపంలో పనులు చేస్తున్న సీఎం రమేష్కు చెందిన రితి్వక్ ప్రాజెక్ట్స్ ప్రైవేటు లిమిటెడ్కు సరఫరా చేస్తున్నారు. తద్వారా అంతిమంగా లబ్ధి పొందుతోంది సీఎం రమేష్ అని స్పష్టమవుతోంది. -
‘పంచదార్ల’ను కాపాడండి.. కేంద్రానికి వైఎస్సార్సీపీ విజ్ఞప్తి
ఢిల్లీ: అనకాపల్లి జిల్లా పంచదార్ల కొండల్లో మైనింగ్ను వెంటనే అరికట్టి, అక్కడి వారసత్వ సంపదను కాపాడాలని కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్కు వైఎస్సార్సీపీ ఎంపీ ఎం.గురుమూర్తి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు పూర్తి వివరాలతో కేంద్ర మంత్రికి ఒక వినతి పత్రం సమర్పించిన ఆయన, చారిత్రక బౌద్ధ పురావస్తు ప్రాంతం, శ్రీ ధర్మలింగేశ్వరస్వామి ఆలయ పరిసరాల్లో కొనసాగుతున్న మైనింగ్ కార్యకలాపాలను తక్షణమే నిలిపి వేయించాలని, ఆ మొత్తం పంచదార్ల కొండ ప్రాంతాన్ని ‘నో మైనింగ్ జోన్’గా ప్రకటించాలని కోరారు.ధనదిబ్బలు బౌద్ధ పురావస్తు స్థలం శాతవాహన కాలానికి చెందిన అత్యంత ప్రాచీన వారసత్వ కట్టడం అని, అది భారత పురావస్తు సర్వేక్షణ సంస్థ (ఏఎస్ఐ) రక్షిత ప్రాంతంగా గుర్తింపు పొందిందని ఎంపీ గురుమూర్తి గుర్తు చేశారు. అలాగే పంచదార్లలోని శ్రీ ధర్మలింగేశ్వర స్వామి ఆలయం తూర్పు చాళుక్యుల కాలానికి చెందిన చారిత్రక ప్రాముఖ్యత కలిగిన ఆలయమని తెలిపారు. ఈ రెండు చారిత్రక వారసత్వ కట్టడాల సమీపంలో మైనింగ్, బ్లాస్టింగ్ కార్యకలాపాలు కొనసాగడం వల్ల పురావస్తు సంపదకు, సహజ వాతావరణానికి, శాశ్వత జలధారలకు తీవ్ర ముప్పు ఏర్పడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు.ఏఎస్ఐ రక్షిత ధనదిబ్బలు బౌద్ధ క్షేత్రానికి సుమారు 90 మీటర్లు, 190 మీటర్లు, 200 మీటర్ల దూరంలో మైనింగ్ జరుగుతోందని, ఉపగ్రహ చిత్రాలతో పాటు, క్షేత్రస్థాయి పరిశీలనల్లో కూడా ఆ విషయం తెలిందని, ఇంకా మైనింగ్ కొనసాగితే, అది పురావస్తు సంరక్షణ చట్టాల ఉల్లంఘన అవుతుందని తెలిపారు. వీటన్నింటి నేపథ్యంలో పురావస్తు శాఖతో తక్షణ క్షేత్రస్థాయి పరిశీలన నిర్వహించాలని, మైనింగ్ ప్రభావంపై శాస్త్రీయ అధ్యయనం చేపట్టాలని, నిపుణులతో కూడిన సంయుక్త కమిటీని ఏర్పాటు చేయాలని, విచారణ పూర్తయ్యే వరకు మైనింగ్, బ్లాస్టింగ్ కార్యకలాపాలను పూర్తిగా నిలిపివేయాలని ఎంపీ గురుమూర్తి కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేశారు. అదే విధంగా పంచదార్ల మొత్తం ప్రాంతాన్ని ‘నో మైనింగ్ జోన్’గా ప్రకటించాలని కోరారు. -
ఫలించిన వైఎస్సార్సీపీ పోరాటం.. పంచదార్ల నో మైనింగ్ జోన్
సాక్షి, అనకాపల్లి: అక్రమమైనింగ్ వ్యవహారంలో వైఎస్సార్సీపీ చేపట్టిన ధర్మపోరాటానికి కూటమి ప్రభుత్వం దిగొచ్చింది. పంచదార్లను నోమైనింగ్ జోన్గా ప్రకటించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. పర్యావరణ నిబంధనలపై సమగ్ర విచారణ జరపాలని ఆదేశించింది. మైనింగ్ సంస్థ ఇచ్చిన పర్యావరణ అనుమతులు ఎస్టాబ్లిష్మెంట్ ఆపరేషన్ తక్షణమే రద్దు చేయాలని తెలిపింది. పంచదార్ల సంరక్షణకు చర్యలు చేపట్టాలని సూచించింది.మరోవైపు పంచదార్లను నోమైనింగ్ జోన్గా చేపట్టాలని వైఎస్సార్సీపీ పిలుపునిచ్చింది. లేకుంటే పెద్దఎత్తున పోరాటం చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించింది. వైఎస్సార్సీపీ హెచ్చరికల నేపథ్యంలో చంద్రబాబు ప్రభుత్వం ఎట్టకేలకు తలొగ్గి పంచదార్లను నో మైనింగ్ జోన్గా ప్రకటిస్తూ ఆదేశాలు జారీ చేసింది. -
‘పంచదార్లను నో మైనింగ్ జోన్గా ప్రకటించే వరకూ ఉద్యమిస్తాం’
పంచదార్ల: అనకాపల్లి జిల్లాలోని పవిత్ర పుణ్యక్షేత్రం పంచదార్లలో తవ్వకాలు దారుణమని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి కురసాల కన్నబాబు ధ్వజమెత్తారు. పంచదార్ల కొండను నో మైనింగ్ జోన్గా ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ ప్రభుత్వానికి దేవుడంటే భయం లేదని, తవ్వకాలు ఆపకపోతే ఇది ప్రజా ఉద్యమంగా మారుతుందని హెచ్చరించారు కన్నబాబు. పంచదార్లలో మైనింగ్ అక్రమాలపై మీడియాతో మాట్లాడిన కురసాల కన్నబాబు.. సంపద సృష్టి అంటే విధ్వంసమా అని ప్రశ్నించారు. ‘మైనింగ్ మాఫియాకు వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ చేపట్టిన కార్యక్రమం విజయవంతమైంది. చంపేస్తామని బెదిరిస్తే బెదిరేది లేదు. ఎక్కడైతే అవినీతి ఉంటుందో అక్కడ వైఎస్సార్సీపీ ఉద్యమిస్తుంది. పంచదార్లను చూస్తుంటే కేజీఎఫ్ గుర్తుకు వస్తుంది. సింగరేణి గనుల్లా తవ్వేశారు. ఉమా సమేత రామలింగేశ్వర స్వామి ఆలయాన్ని ధ్వంసం చేస్తున్నారు. పంచదార్లలో మైనింగ్ చేసే వారిపై కేసులు పెడుతున్నారా? లేదా?, కూటమి అధికారంలోకి వచ్చాక ప్రజలను భయపెట్టి బతుకుతున్నారు. హిందూ ధర్మాన్ని కాపాడుతున్నామని చెప్పేవాళ్లు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు. పంచదార్లను నో మైనింగ్ జోన్గా జీవో ఇచ్చేవరకూ ఉద్యమిస్తాం. పంచదార్ల కొండపై అమరలింగేశ్వర స్వామి స్వయంభుగా వెలిశారు. శివుడు మూడో కన్ను తెరిస్తే కూటమి భస్మం అవుతుంది. పంచదార్ల కొండపై తట్ట మట్టి తీయండి.. పరిణామాలు ఎలా ఉంటాయో చూస్తారు. ఇంతటితో వదలం.. లక్షలాది మందిని పంచదార్లకు తీసుకొస్తాం’ అని హెచ్చరించారు. -
టీడీపీ నేతల అక్రమ మైనింగ్పై వైఎస్సార్సీపీ పోరాటం
సాక్షి, అనకాపల్లి జిల్లా: కూటమి నేతలు సాగిస్తున్న అక్రమ మైనింగ్ అరాచకంపై వైఎస్సార్సీపీ ఉద్యమబాట పట్టింది. యలమంచిలి నియోజకవర్గం రాంబిల్లి మండలంలోని పంచదార్ల గ్రామంలో ఉన్న ఫణిగిరి కొండపై కూటమి నేతలు సాగిస్తున్న అక్రమ మైనింగ్ను వ్యతిరేకిస్తూ ఇవాళ (మంగళవారం) చలో పంచదార్ల’ పేరిట భారీ నిరసన కార్యక్రమం నిర్వహించింది. వేలాది బైకులు, వందలాది కార్లతో వైఎస్సార్సీపీ నేతలు భారీ ర్యాలీ నిర్వహించారు. పంచదార్ల కొండలను వైఎస్సార్సీపీ నేతలు పరిశీలించారుయలమంచిలి నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ఉద్యమబాటలో శాసనమండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ, రీజనల్ కోఆర్డినేటర్లు కురసాల కన్నబాబు, బూడి ముత్యాలనాయుడు, గుడివాడ అమర్నాథ్ తదితరులు పాల్గొన్నారు.పంచదార్ల కొండల కోసం ధర్మ పోరాటం: బొత్సఈ సందర్భంగా బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. పంచదార్ల కొండల కోసం ధర్మ పోరాటం చేస్తున్నామన్నారు. పంచదార్ల కొండలను దోపిడీ చేస్తున్నారు. ప్రజా ఉద్యమంలా మారకుండా కలెక్టర్ తగిన చర్యలు తీసుకోవాలి. అక్రమ మైనింగ్ ఆపకపోతే మళ్ళీ ఇక్కడికి వస్తాం. వాస్తవాలు ప్రజలకు తెలియాలని మీడియాను మొత్తం తీసుకువచ్చాంఅక్రమ మైనింగ్కు పాల్పడేది చిన్న వ్యక్తులు కాదు. ఎంపీ, ఎమ్మెల్యే ఇద్దరు కలిపి దోచుకుంటున్నారు. రోజు సనాతన ధర్మం అంటారు, ఎక్కడ ఉంది మీ సనాతన ధర్మం. మీకు కళ్లు ఉంటే కూటమి పెద్దలు వచ్చి అక్రమ మైనింగ్ చూడండి. పంచదార్ల కొండ కోసం మేము పోరాటం చేస్తుంటే కుట్ర దాగి ఉందని మాట్లాడతారా?. ఏమి కుట్ర దాగి ఉందో కూటమి నేతలు చెప్పాలి. శివుడు మూడో కన్ను తెరిస్తే ఏమవుతుందో తెలియదు. పాపం కూటమి నేతలకు తగులుతుంది. రేపు ఉదయం మైనింగ్ వాహనాలు పంచదార్ల కొండపై ఉండకూడదు. ఉంటే నడిరోడ్డుపై ధర్నా చేస్తాం’’ అని బొత్స హెచ్చరించారు. -
కొండల్ని కొల్లగొడుతున్నారు.. సీఎం రమేష్పై అమర్నాథ్ ఫైర్
సాక్షి, విశాఖ: ఏపీలో కూటమి ఎంపీ సీఎం రమేష్, ఆయన అనుచరులు పంచదార్ల కొండలను దోచుకుంటున్నారని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆరోపించారు. ఇలా అక్రమ సంపాదనతో ప్రత్యేక విమానాలు, ఎన్నికల్లో సీట్లు కొంటున్నారని విమర్శించారు. ప్రభుత్వం వెంటనే పంచదార్ల కొండలను నో మైనింగ్ జోన్గా ప్రకటించాలని డిమాండ్ చేశారు.మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ విశాఖలో మీడియాతో మాట్లాడుతూ..‘అక్రమ మైనింగ్ కు వ్యతిరేకంగా మంగళవారం ఛలో పంచదారల కార్యక్రమం నిర్వహిస్తున్నాం. పంచదార్ల కొండలను నో మైనింగ్ జోన్ గా ప్రకటించాలి. అక్రమ సీఎం సంపాదనతో సీఎం రమేష్ విమానాలు, ఎన్నికల్లో సీట్లు కొంటున్నారు. ఒక వైపు పంచదార్ల కొండలను.. మరోవైపు సింహాచలం కొండలను ధ్వంసం చేస్తున్నారు. అక్రమ మైనింగ్ ద్వారా పురాతన ఆలయానికి నష్టం జరుగుతుందని కలెక్టర్కు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు.కొండపై ఇచ్చిన అనుమతులకు మించి తవ్వకాలు జరిపారు. సీఎం రమేష్, ఆయన అనుచరులు కోట్లాది రూపాయలు దోచుకుంటున్నారు. అక్రమ మైనింగ్ వల్ల పంచదార్లలో ఒక దారలో బురద వస్తుంది. వందల ఏళ్ళ నుంచి పంచదార్ల ఉమ ధర్మ లింగేశ్వర స్వామి ఆలయంలో ప్రవహిస్తున్నాయి.మైనింగ్కు అనుమతులు ఇచ్చిన అధికారులపై చర్యలు తీసుకోవాలి’ అని డిమాండ్ చేశారు. -
రంగంలోకి దిగనున్న జగన్... విశాఖలో మహాధర్నా
-
‘కూటమి నేతలు పంచభూతాలను దోచుకుంటున్నారు’
సాక్షి, యలమంచిలి: కూటమి పాలనలో దోపిడీకి హద్దు లేకుండాపోతోందని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆరోపించారు. అనకాపల్లి జిల్లాల్లో పంచ భూతాలను ఎంపీ సీఎం రమేష్ దోచుకుంటున్నారని అమర్నాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మహా పాపానికి కూటమి నేతలు ఒడిగట్టారు అంటూ మండిపడ్డారు.అనకాపల్లి జిల్లాలోని ఎలమంచిలిలో పంచదారల కొండపై అక్రమ మైనింగ్కు వ్యతిరేకంగా గ్రామస్తులు రిలే నిరాహార దీక్షలకు దిగారు. వారి రిలే దీక్షలకు వైఎస్సార్సీపీ నేతలు కురసాల కన్నబాబు, గుడివాడ అమర్నాథ్, దాడిశెట్టి రాజా, కరణం ధర్మశ్రీ, బొడ్డేడ ప్రసాద్ సంఘీభావం తెలిపారు. ఈ క్రమంలో రిలే నిరాహార దీక్షను సందర్శించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ..‘ఎంపీ సీఎం రమేష్ దోపీడీ పీక్ స్టేజ్కు చేరుకుంది. కొండలను పిండి చేస్తున్నారు. వందల లారీలతో గ్రావెల్ తరలిస్తున్నారు. పవిత్రమైన పంచదార్ల కొండను మింగేస్తున్నారు. మహా పాపానికి కూటమి నేతలు ఒడిగట్టారు. సనాతన ధర్మం గురించి మాట్లాడే పవన్ కళ్యాణ్ ఏమైపోయారు?. 1200 ఏళ్ల చరిత్ర కలిగిన పంచదార కొండను ధ్వంసం చేస్తున్నారు. ఈ పాపానికి పవన్ కళ్యాణ్ ఏం ప్రాయశ్చిత్తం చేస్తారు?’ అని ప్రశ్నించారు.కురసాల కన్నబాబు మాట్లాడుతూ..‘దొంగలు దొంగలు ఉళ్లు పంచుకున్నట్లు దోపిడీకి కూటమి నేతలు పాల్పడుతున్నారు. కొండలను మాయం చేస్తున్నారు. పర్యావరణానికి విఘాతం కల్పిస్తున్నారు. కడప నుంచి సీఎం రమేష్ ప్రజా సేవకు వచ్చారు అనుకున్నాం. వారి కంపెనీల పేరు మీద పర్మిట్లతో కొండలను మింగేస్తున్నారు. సనాతన ధర్మం గురించి మాట్లాడే నాయకులు తెల్లవారితే ఉమా ధర్మ లింగేశ్వర స్వామి దేవాలయానికి గుండు కొడుతున్నారు. ఇక్కడ జరుగుతున్న అన్యాయాన్ని వైఎస్ జగన్ దృష్టికి తీసుకువెళ్తాం. ఈ నెల 21వ తేదీన చలో పంచదార్ల కార్యక్రమం నిర్వహిస్తాం. 30 కిలోమీటర్ల పరిధిలో ఉన్న పంచదార్ల కొండలను నో మైనింగ్ జోన్ గా ప్రకటించాలి. మైనింగ్ లీజులు సోమవారం లోపు రద్దు చేయాలి అని డిమాండ్ చేశారు.మాజీ మంత్రి దాడి శెట్టి రాజా మాట్లాడుతూ..‘మహా పవిత్రమైనవి పంచదార్ల కొండలు. ఈ కొండ గురించి మహా భారతంలో ప్రస్తావన ఉంది. చోళుల కాలంలో ఉమా ధర్మ లింగేశ్వర స్వామి దేవాలయాన్ని నిర్మించారు. పంచదార్ల కొండపై జరుగుతున్న అక్రమ మైనింగ్ సనాతన వాదులకు కనిపించలేదా?. సంపద సృష్టి పేరుతో వారసత్వ సంపదను దోచుకుంటున్నారు. ఎక్కడ నుంచో వచ్చి ఉత్తరాంధ్ర సంపాదనను దోచుకుంటున్నారు అని మండిపడ్డారు.కరణం ధర్మశ్రీ మాట్లాడుతూ..‘పంచదార్ల కొండపై కూటమి అనకొండలు పడ్డాయి. కొండలను ఎంపీ సీఎం రమేష్, ఎమ్మెల్యే సుందరపు విజయ కుమార్ గద్దల్లా దోచుకుంటున్నారు. అక్రమ మైనింగ్ పై అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. 30 కిలో మీటర్ల పరిధిలో పంచదార్ల కొండలు విస్తరించి ఉన్నాయి. ప్రజలకు జీవనాధారం ఈ కొండలు’ అని చెప్పుకొచ్చారు. -
పోటెత్తిన పంచదార్ల
రాంబిల్లి: జిల్లాలోని శివాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. కార్తీక మూడో సోమవారం పురస్కరించుకుని ఆలయాల్లో పెద్ద ఎత్తున బారులు తీరారు. పలువురు ఉపవాస దీక్షలు పాటించారు. ప్రముఖ ఫుణ్యక్షేత్రం పంచదార్ల శివనామ స్మరణంతో మార్మోగింది. జిల్లా నలు మూలలు నుంచి సుమారు 30 వేల మంది ఇక్కడి కాశీ విశ్వేశ్వరస్వామి, సహస్ర లింగేశ్వరస్వామి, రాధా మాధవ స్వామిలను దర్శించుకొని తరించారు. తొలుత ఇక్కడి పవిత్రమైన ఆకాశధారతో పాటు మరో నాలుగు పుణ్యధారల వద్ద భక్తులు స్నానాలు ఆచరించారు. అనంతరం క్షేత్ర పాలకుడు ఉమా ధర్మలింగేశ్వరస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆకాశ ధార వద్ద పుణ్యస్నానాలు ఆచరించడానికి, ఉమా ధర్మలింగేశ్వరస్వామిని దర్శించుకునేందుకు గంటల తరబడి బారులు తీరారు. వేలాది మంది రాకతో సందడిగా మారింది. పలు ప్రాంతాలు నుంచి వచ్చిన వారు ఇక్కడ పిక్నిక్లు ఏర్పాటు చేసుకుని ఆనందంగా గడిపారు. ఎస్ఐ కె. మల్లేశ్వరరావు ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు. చోడవరం మండలం గోవాడ శివాలయం, రాయపురాజుపేట శివ పంచాయతన ఆలయం, వెంకన్నపాలెం కాశీవిశ్వేశ్వరాలయం, జుత్తాడ ఉమా మల్లికార్జున ఆలయం, భోగాపురం భోగలింగేశ్వరుని ఆలయంలో భక్తులు పెద్ద సంఖ్యలో తెల్లవారు జాము నుంచి పూజలు చేశారు.


