Oil companies
-
టెర్మినల్ నుంచి బంక్ దాకా ప్రతీ చుక్కకూ లెక్క!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహనంలో ఇంధనం కావాల్సి వస్తే సమీపంలోని ఫిల్లింగ్ స్టేషన్కు వెళతాం. పెట్రోల్ లేదా డీజిల్ కావాల్సినంత కొట్టించి డబ్బులు కట్టి బయటకు వస్తాం. ఇందులో కొత్తేమి ఉంది అనే కదా మీ సందేహం. అక్కడికే వస్తున్నాం.. ఎక్కడో తయారైన ఇంధనం వేలాది కిలోమీటర్లు ప్రయాణం చేసి మనదాకా వస్తోంది. ఈ ప్రయాణంలో నాణ్యత, పరిమాణంలో ఎటువంటి రాజీ లేకుండా కస్టమర్కు కల్తీ లేని ఇంధనం చేరేందుకు చమురు కంపెనీలు, డీలర్లు నిరంతరం తీసుకుంటున్న చర్యల గురించి ఎప్పుడైనా ఆలోచించారా? రిఫైనరీ నుంచి టెర్మినల్.. అక్కడి నుంచి ఫిల్లింగ్ స్టేషన్ (Filling Station). ఇలా వినియోగదారుడి వాహనంలోకి ఇంధనం చేరే వరకు కంపెనీల నిఘా కళ్లు వెంటాడుతూనే ఉంటాయన్న సంగతి చాలా మందికి తెలియదు. తేడా వస్తే రద్దు చేస్తారు.. చక్రం తిరిగితేనే వ్యవస్థ పరుగెడుతుంది. ఇంధన అమ్మకాలు పెరిగాయంటే ఆర్థిక వ్యవస్థ బాగున్నట్టు. అందుకే ఆయిల్ కంపెనీలు బాధ్యతగా వ్యవహరిస్తున్నాయి. సాంకేతికతను ఆసరాగా చేసుకుని దేశంలోని మారుమూలన ఉన్న పల్లెకూ నాణ్యమైన ఇంధనాన్ని చేర్చాలన్న సంకల్పంతో పనిచేస్తున్నాయి. పరిమాణంలో తేడా రాకుండా న్యాయబద్ధంగా కస్టమర్ చెల్లించిన డబ్బులకు తగ్గట్టుగా ఇంధనం అందిస్తున్నాయి. పైగా ప్రభుత్వ నియంత్రణలోనే చమురు వ్యాపారాలు సాగుతుంటాయి. దీంతో రెవెన్యూ, పోలీసు, తూనికలు కొలతల శాఖకు చెందిన అధికారులు సైతం తనిఖీలు చేపడుతుంటారు. ఈ క్రమంలో ఏమాత్రం తప్పు జరిగినా ఆయిల్ కంపెనీలు కఠిన చర్యలకు దిగుతున్నాయి. ఫిల్లింగ్ స్టేషన్లో స్టాక్లో కొద్ది తేడా వచ్చినా భారీ జరిమానా లేదా డీలర్షిప్ రద్దుకు వెనుకాడడం లేదు. ఇంధనం రవాణా చేసే ఏజెన్సీలు చేతివాటం ప్రదర్శిస్తే బ్లాక్ లిస్టులో పెడతాయి. దేశవ్యాప్తంగా ఉన్న 88 వేల బంకుల్లో ఎక్క డో ఒక దగ్గర జరిగిన తప్పును మొత్తం పరిశ్రమకు ఆపాదించకూడదన్నది కంపెనీలు, డీలర్ల వాదన. ఫిల్లింగ్ స్టేషన్లలో ఇవి తప్పనిసరి → మంచి నీరు → వాష్ రూమ్స్ → ఫిర్యాదుల పుస్తకం → ఫస్ట్ ఎయిడ్ → ఫ్రీ ఎయిర్ కోసం టైర్ ఇన్ఫ్లేటర్ → సీసీ కెమెరాలు → ఫైర్ ఎక్స్టింగ్విషర్, ఇసుకటెర్మినల్ నుంచి బంక్ దాకా.. అయిల్ కంపెనీకి చెందిన టెర్మినల్స్ నుంచి వివిధ ప్రాంతాల్లోని బంకులకు ఇంధనం సరఫరా అవుతుంది. ఇంధనం కేటాయించగానే సంబంధిత ఫిల్లింగ్ స్టేషన్ (బంక్) యజమానికి ఆయిల్ టెర్మినల్ నుంచి సందేశం వెళుతుంది. అలాగే ట్యాంకర్ బయలుదేరగానే, బంక్కు చేరిన వెంటనే మెసేజ్ వస్తుంది. టెర్మినల్ నుంచి బంక్ వరకు ట్యాంకర్ ప్రయాణాన్ని జీపీఎస్ (GPS) ఆధారంగా ట్రాక్ చేస్తారు. ఇచ్చిన రూట్ మ్యాప్లోనే ట్యాంకర్ వెళ్లాలి. మరో రూట్లో వెళ్లినట్టయితే తదుపరి లోడ్కు అవకాశం లేకుండా ఆ వాహన ఏజెన్సీని బ్లాక్ చేస్తారు. నిర్ధేశించిన ప్రాంతంలోనే డ్రైవర్లు భోజనం చేయాల్సి ఉంటుంది. మార్గ మధ్యలో వాహనం ఆపినా కారణం చెప్పాల్సిందే. ఇక బంక్ వద్దకు ట్యాంకర్ చేరగానే నిర్ధేశించిన స్థలంలో కాకుండా మరెక్కడైనా పార్క్ చేసినా ఫిల్లింగ్ స్టేషన్పై చర్యలుంటాయి. బంక్ యజమాని ఓటీపీ ఇస్తేనే ట్యాంకర్ తెరుచుకుంటుంది. అన్లోడ్ అయ్యాక ట్యాంకర్లో నిల్ స్టాక్ అని కంపెనీకి సమాచారం ఇవ్వాలి. ఫిల్లింగ్ స్టేషన్లో ఇలా.. బంకులోని ట్యాంకులో ఎంత ఇంధనం మిగిలి ఉంది, లోడ్ ఎంత వచ్చింది, అమ్మకాలు.. అంతా పారదర్శకం. గణాంకాలు అన్నీ ఎప్పటికప్పుడు కంపెనీ, డీలర్ వద్ద ఆన్లైన్లో దర్శనమిస్తాయి. ట్యాంకర్ తీసుకొచ్చిన స్టాక్లో తేడా ఉంటే ఇన్వాయిస్పైన వివరాలు పొందుపరిచి కంపెనీకి సమాచారం ఇవ్వాలి. ఇలా ప్రతీ చుక్కకూ లెక్క ఉంటుంది. మీటర్ తిరిగిన దానికి తగ్గట్టుగా బంకు ట్యాంకులో ఖాళీ కావాలి. స్టాక్లో తేడా 2 శాతం మించకూడదు. మించితే జవాబు చెప్పాల్సిందే. అంతేకాదు రూ.3 లక్షల వరకు పెనాల్టీ భారం తప్పదు. తరచుగా కంపెనీకి చెందిన సేల్స్ ఆఫీసర్ తనిఖీ చేస్తుంటారు. థర్డ్ పార్టీ నుంచి, అలాగే ఇతర ఆయిల్ కంపెనీల నుంచి కూడా తరచూ తనిఖీలు ఉంటాయి. ఆ మూడు సంస్థలదే.. దేశంలో మొత్తం ఇంధన రిటైల్ పరిశ్రమలో ప్రభుత్వ రంగ ఆయిల్ కంపెనీలైన బీపీసీఎల్, ఐవోసీఎల్, హెచ్పీసీఎల్ వాటా ఏకంగా 90% ఉంది. కంపెనీల వెబ్సైట్స్ ప్రకారం ఐవోసీఎల్కు 37,500లకుపైగా, బీపీసీఎల్కు 22,000ల పైచిలుకు, హెచ్పీసీఎల్కు 17,000 లకుపైగా ఫ్యూయల్ స్టేషన్స్ ఉన్నాయి. ప్రైవేటు సంస్థలు జియో–బీపీ, నయారా, షెల్ సైతం ఈ రంగంలో పోటీపడుతున్నాయి. చదవండి: రోడ్డుపై, నీటిపై నడిచే వెహికల్దేశవ్యాప్తంగా నిర్వహణ మాత్రమే బంకుల యజమానులది. మౌలిక వసతుల ఏర్పాటు, మెషినరీ, ఇంధనంపై సర్వ హక్కులూ పెట్రోలియం కంపెనీలదేనని వ్యాపారులు చెబుతున్నారు. నిర్వహణకుగాను ప్రతి నెల డీలర్కు వేతనం కింద కంపెనీలు రూ.27,500 చెల్లిస్తున్నాయి. డీలర్లకు లీటరు పెట్రోల్ అమ్మకంపై రూ.3.99, డీజిల్పై రూ.2.51 కమిషన్ ఉంటుంది.వేగానికీ పరిమితులు.. ట్యాంకర్ గంటకు 60 కిలోమీటర్ల వేగాన్ని మించకూడదు. ఒక్క వాహనం నిబంధనలు అతిక్రమించినా ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీనే రద్దు చేస్తారు. టెర్మినల్ నుంచి సుదూర ప్రాంతంలో ఫిల్లింగ్ స్టేషన్ ఉన్నట్టయితే.. డ్రైవర్లకు భోజనానికి 45 నిముషాలు, టీ తాగడానికి 15 నిముషాలు సమయం ఇస్తారు. నిర్ధేశిత సమయం మించితే కంపెనీ నుంచి ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీ యజమానికి మెయిల్, ఎస్ఎంఎస్ వెళుతుంది. ఆలస్యానికి కారణం తెలపాల్సిందే. రాత్రి 12 నుంచి ఉదయం 5 మధ్య రవాణా నిషేధం. వయబిలిటీ స్టడీలో లోపాలు.. మోసాలకు తావు లేకుండా కస్టమర్లకు నాణ్యమైన ఇంధనం అందుతోందనడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే పెట్రోల్ బంక్ ఏర్పాటు కోసం ఇచ్చే ప్రకటనలో సంబంధిత ప్రాంతంలో ఇంత మొత్తంలో విక్రయాలు జరుగుతాయని కంపెనీ ఇచ్చే అంకెలకు, వాస్తవ అమ్మకాలకు భారీ వ్యత్యాసం ఉంటోంది. వయబిలిటీ స్టడీ సక్రమంగా జరగడం లేదు. ప్రకటన ఆధారంగా ముందుకొచ్చి బంక్ ఏర్పాటు చేసి నష్టాలు మూటగట్టుకుంటున్న యజమానులు ఎందరో. – మర్రి అమరేందర్ రెడ్డి, తెలంగాణ పెట్రోల్ డీలర్స్ అసోసియేషన్. బంకు యజమానులే బాధ్యులా? డ్రైవర్లు ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్నా వర్షాకాలంలో ట్యాంకర్ లోపలికి నీరు చేరే అవకాశం ఉంది. ఇథనాల్ మిశ్రమంలో తేడాలున్నా సమస్యకు దారి తీస్తుంది. బంకుల్లోని ట్యాంకులు స్టీలుతో తయారయ్యాయి. తుప్పు పడితే ట్యాంకులో చెమ్మ చేరుతుంది. ఇదే జరిగితే ఆ నీరు కాస్తా బంకులోని ట్యాంకర్కు, అక్కడి నుంచి కస్టమర్ వాహనంలోకి వెళ్లడం ఖాయం. ఈ సమస్యకు పరిష్కారంగా హెచ్డీపీఈతో చేసిన ట్యాంకులను బంకుల్లో ఏర్పాటు చేయాల్సిందిగా విన్నవిస్తున్నా కంపెనీల నుంచి స్పందన లేదు. రవాణా ఏజెన్సీ తప్పిదం, మౌలిక వసతుల లోపం వల్ల సమస్య తలెత్తినా బంకు యజమానిని బాధ్యులను చేస్తున్నారు. – రాజీవ్ అమరం, జాయింట్ సెక్రటరీ, కన్సార్షియం ఆఫ్ ఇండియన్ పెట్రోలియం డీలర్స్. -
ప్రభుత్వ కంపెనీలకు జరిమానా!
చమురు రంగ పీఎస్యూ దిగ్గజాలకు వరుసగా ఐదో త్రైమాసికంలోనూ జరిమానాలు తప్పలేదు. నిబంధనల ప్రకారం సంస్థల్లో స్వతంత్ర, మహిళా డైరెక్టర్ల నియామకం చేపట్టకపోవడంతో ఈ చర్యకు పూనుకున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.జరిమానా విధించిన కంపెనీల జాబితాలో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్(ఐవోసీ), భారత్ పెట్రోలియం కార్పొరేషన్(బీపీసీఎల్), హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్(హెచ్పీసీఎల్), గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా(గెయిల్), ఆయిల్ ఇండియా లిమిటెడ్(ఓఐఎల్), మంగళూర్ రిఫైనరీ అండ్ పెట్రోకెమికల్స్ ఉన్నాయి. లిస్టింగ్ నిబంధనలకు అనుగుణంగా ఆయా కంపెనీల బోర్డుల్లో అవసరమైనమేర స్వతంత్ర, మహిళా డైరెక్టర్లను ఎంపిక చేసుకోకపోవడంతో జరిమానాల వడ్డింపు కొనసాగింది.ఇదీ చదవండి: ఫెడ్వైపు ఇన్వెస్టర్ల చూపుఈ ఆర్థిక సంవత్సరం క్యూ1(ఏప్రిల్–జూన్)లోనూ స్వతంత్ర, మహిళా డైరెక్టర్లను తగిన సంఖ్యలో నిమమించుకోవడం వల్ల జరిమానాలు తప్పలేదు. గత కొద్దికాలంగా ఈ తంతు కొనసాగుతోంది. ఆయా కంపెనీలు పెనాల్టీ చెల్లిస్తున్నా తీరుమార్చుకోకపోవడం కొంత ఆందోళన కలిస్తుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. నిబంధనలను ఉల్లంఘించినందుకుగాను స్టాక్ ఎక్స్ఛేంజీలు ఎన్ఎస్ఈ, బీఎస్ఈ గరిష్టంగా రూ.5,36,900, కనిష్టంగా రూ.2,41,900 మధ్య జరిమానాలు విధించాయి. -
ఆయిల్ కంపెనీలకు చేదువార్త
న్యూఢిల్లీ: ఆయిల్ కంపెనీలను బడ్జెట్ నిరాశపరిచింది. ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియంలకు 2023–24 ఆర్థిక సంవత్సరంలో వచి్చన రికార్డు లాభాల (దాదాపు రూ.81,000 కోట్లు) కారణంగా గత ఆర్థిక సంవత్సరం ప్రకటించిన రూ. 30,000 కోట్ల మూలధన మద్దతును ఆర్థికమంత్రి రద్దు చేశారు.నిజానికి ఈ మద్దతును రూ.15,000 కోట్లకు తగ్గించాలని 2024 ఫిబ్రవరిలో ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్లో ప్రతిపాదించిన నిర్మలా సీతారామన్, తాజా బడ్జెట్లో ఈ మద్దతును పూర్తిగా రద్దు చేయడం గమనార్హం.వ్యూహాత్మక నిల్వలకు రూ.5,000 కోట్లు ఇక సరఫరాల్లో అంతరాయాలను నిరోధించడానికి కర్ణాటకలోని మంగళూరు అలాగే ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో నిర్మించిన వ్యూహాత్మక భూగర్భ నిల్వల క్షేత్రాలను నింపడానికి వీలుగా ముడి చమురును కొనుగోలు చేయడానికి రూ. 5,000 కోట్లను బడ్జెట్లో ప్రతిపాదించారు. షేర్లు డీలా... తాజా నిర్ణయం నేపథ్యంలో ఎన్ఎస్ఈలో ఐఓసీ షేర్ ధర క్రితం ముగింపుతో పోలి్చతే 2 శాతం నష్టపోయి రూ.166 వద్ద ముగిసింది. బీపీసీఎల్ షేర్ ధర 1 శాతం తగ్గి రూ.306 వద్ద ముగిసింది. హెచ్పీసీఎల్ షేరు ధర స్వల్ప నష్టంతో 347 వద్ద స్థిరపడింది.క్రూజ్ పర్యాటకానికి ప్రోత్సాహంవిదేశీ షిప్పింగ్ కంపెనీలపై సులభతర పన్ను దేశీ క్రూజ్ విభాగంలో కార్యకలాపాలు నిర్వహించే విదేశీ షిప్పింగ్ కంపెనీలకు సులభతర పన్నుల విధానాన్ని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రతిపాదించారు. క్రూజ్ పర్యాటకంలో ఉపాధి అవకాశాలను పెంచేందుకు ఈ చర్య తీసుకున్నారు. సముద్ర జలాలపై నడిచే పర్యాటక ఓడలను క్రూజ్లుగా చెబుతారు. దేశంలో క్రూజ్ పర్యాటకానికి భారీ అవకాశాలున్నట్టు మంత్రి చెప్పారు.ఈ విభాగంలో భారత షిప్పింగ్ పరిశ్రమ వాటాను పెంచేందుకు, ఉపాధి అవకాశాలను పెంచేందుకు యాజమాన్యం, లీజింగ్ పరంగా సంస్కరణలు తీసుకొస్తామని ప్రకటించారు. క్రూజ్ పర్యాటకానికి భారత్ను ఆర్షణీయ కేంద్రంగా మారుస్తామని, అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్షిస్తామని చెప్పారు. ‘‘క్రూజ్ షిప్పింగ్ల నిర్వహణలో పాలు పంచుకునే ప్రవాసులకు ఊహాత్మకమైన పన్ను విధానం ప్రతిపాదిస్తున్నాం. విదేశీ కంపెనీ, నాన్ రెసిడెంట్ షిప్ ఆపరేటర్ రెండూ ఒకే హోల్డింగ్ కంపెనీ కింద ఉంటే లీజ్ రెంటల్ రూపంలో ఆర్జించే ఆదాయంపై పన్ను మినహాయింపును కలి్పస్తున్నాం’’అని వివరించారు. ఈ దిశగా సెక్షన్ 44బీబీసీని ప్రతిపాదించారు. 2025 ఏప్రిల్ 1 నుంచి సవరణలు అమల్లోకి వస్తాయని చెప్పారు. ఎన్పీఎస్పై మరింత పన్ను ప్రయోజనంనూతన పన్ను విధానాన్ని మరింత ఆకర్షణీయంగా మార్చే దిశగా కేంద్ర సర్కారు జాతీయ పింఛను పథకంలో (ఎన్పీఎస్) పెట్టుబడులకు ప్రోత్సాహకాన్ని పెంచింది. ఉద్యోగి తరఫున ప్రైవేటు సంస్థలు జమ చేసే ఎన్పీఎస్ వాటాపై పన్ను మినహాయింపు పరిమితిని 14 శాతం చేసింది. ఉద్యోగి మూల వేతనం, కరువు భత్యంలో (గరిష్ట పరిమితి రూ.లక్ష) 10 శాతం జమలపైనే ప్రస్తుతం పన్ను మినహాయింపు ఉంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రస్తుతం ఇది 14 శాతంగానే ఉండగా.. ప్రైవేటు రంగ ఉద్యోగులకు సైతం ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ప్రయోజనాన్ని పెంచారు. ఆదాయపన్ను చట్టంలోని పాత పన్ను వ్యవస్థలో ఉద్యోగి తరఫున సంస్థలు చేసే ఎన్పీఎస్ జమలపై పన్ను మినహాయింపు 10 శాతంగానే కొనసాగుతుంది. ఉదాహరణకు పార్థసారథి మూలవేతనం, కరవు భత్యం రూ.1,00,000 ఉందనుకుంటే.. తాజా మార్పుతో ప్రతి నెలా రూ.4,000 చొప్పున ఏడాదికి రూ.48వేల మొత్తంపై పన్ను లేకుండా చూసుకోవచ్చు. మైనర్ల పేరిట తల్లిదండ్రులు లేదా సంరక్షకులు ఎన్పీఎస్ ఖాతా తెరిచేందుకు ‘ఎన్పీఎస్ వాత్సల్య’ ప్లాన్ను కూడా ప్రకటించారు. ఈకామర్స్ ఎగుమతులకు దన్నుహబ్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు ఈకామర్స్ రంగం ద్వారా ఎగుమతులను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం తాజా బడ్జెట్లో హబ్ల ఏర్పాటుకు ప్రతిపాదించింది. ఇందుకు ప్రభుత్వ, ప్రయివేట్ విధానం(పీపీపీ)లో వీలు కలి్పంచనుంది. అవాంతరాలులేని నియంత్రణ, లాజిస్టిక్ మార్గదర్శకాల ద్వారా ఒకే గొడుగుకింద వాణిజ్యం, ఎగుమతి సంబంధ సరీ్వసులకు ఇవి తెరతీయనున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. వెరసి సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థలు(ఎంఎస్ఎంఈలు), సంప్రదాయ చేనేత, హస్తకళలు తదితర శ్రామికులు తమ ఉత్పత్తులను అంతర్జాతీయ మార్కెట్లలో విక్రయించేందుకు వీలు చిక్కనున్నట్లు తెలియజేశారు.ప్రస్తుతం ఈకామర్స్ విభాగం ద్వారా దేశీ ఎగుమతులు కేవలం 5 బిలియన్ డాలర్లకు పరిమితంకాగా.. చైనా నుంచి వార్షికంగా 300 బిలియన్ డాలర్లు ఎగుమతులు నమోదవుతున్నాయి. రానున్న కాలంలో 50–100 బిలియన్ డాలర్లకు దేశీ ఎగుమతులను పెంచేందుకు అవకాశముంది. బడ్జెట్ ప్రతిపాదిత కేంద్రా(హబ్)ల ద్వారా తొలుత చిన్న తయారీదారులు ఈకామర్స్ సంస్థలు(అగ్రిగేటర్ల)కు ఉత్పత్తులను విక్రయిస్తారు.తదుపరి ఇతర మార్కెట్లలో అగ్రిగేటర్లు వీటిని విక్రయిస్తాయి. ప్రధానంగా ఆభరణాలు(జ్యువెలరీ), దుస్తులు, హస్తకళలు తదితరాలకు భారీ అవకాశాలున్నాయి. ఇందుకు అవసరమైన చర్యలు తీసుకునే బాటలో ఆర్బీఐసహా సంబంధిత శాఖలతో వాణిజ్య శాఖ విభాగం డీజీఎఫ్టీ కలసి పనిచేస్తోంది. ఫలితంగా ఈ హబ్లకు ఎగుమతులు క్లియరెన్స్లను కలి్పస్తారు. అంతేకాకుండా వేర్హౌసింగ్, కస్టమ్స్ క్లియరెన్స్, రిటర్నుల ప్రాసెసింగ్, లేబిలింగ్, టెస్టింగ్, ప్యాకేజింగ్లను వీటికి జత చేస్తారు.డిజిన్వెస్ట్మెంట్ లక్ష్యం రూ. 50,000 కోట్లు ప్రభుత్వ సంస్థలలో వాటాల విక్రయం(డిజిన్వెస్ట్మెంట్) ద్వారా ఈ ఆర్థిక సంవత్సరం(2024–25) రూ. 50,000 కోట్లు సమీకరించవచ్చని తాజా బడ్జెట్ అంచనా వేసింది. మధ్యంతర బడ్జెట్లోనూ ఇదేస్థాయిలో ప్రభుత్వం అంచనాలు ప్రకటించింది. ఇక కేంద్ర ప్రభుత్వ కంపెనీల(సీపీఎస్ఈలు) నుంచి రూ. 56,260 కోట్ల డివిడెండ్ లభించవచ్చని భావిస్తోంది.మధ్యంతర బడ్జెట్లో వేసిన అంచనాలు రూ. 48,000 కోట్లకంటే అధికంకావడం గమనార్హం! మరోవైపు ఆర్బీఐ, పీఎస్యూ బ్యాంకుల నుంచి ఈ ఏడాది రూ. 2,32,874 కోట్ల డివిడెండ్ అందుకునే చాన్స్ ఉన్నట్లు బడ్జెట్ ఊహిస్తోంది. ఇందుకు ప్రధానంగా ఆర్బీఐ నుంచి రూ. 2.11 లక్షల కోట్ల అనూహ్య డివిడెండ్ లభించడం ప్రభావం చూపింది. మధ్యంతర బడ్జెట్ ఈ పద్దుకింద రూ. 1.02 లక్షల కోట్లు మాత్రమే అంచనా వేసింది.దివాలా వ్యవహారాల్లో ఇక మరింత పారదర్శకతఇంటిగ్రేటెడ్ టెక్నాలజీ ప్లాట్ఫారమ్ ఏర్పాటు దివాలా కోడ్ (ఐబీసీ) పక్రియను మరింత మెరుగుపరచడంపై బడ్జెట్ దృష్టి సారించింది. ఇందుకు సంబంధించి స్థిరత్వం, పారదర్శకత, సమయానుకూల ప్రాసెసింగ్, వాటాదారులకు సంబంధించి మెరుగైన పర్యవేక్షణ సాధన లక్ష్యంగా ‘ఇంటిగ్రేటెడ్ టెక్నాలజీ ప్లాట్ఫారమ్’ను ఆవిష్కరిస్తున్నట్లు ఆర్థికమంత్రి తెలిపారు. 2016 నుంచి అమల్లోకి వచ్చిన దివాలా కోడ్ పటిష్టత కోసం తగిన మార్పులను తీసుకురావడం జరుగుతుందని మంత్రి తెలిపారు. కోడ్ను ఇప్పటి వరకూ ఆరు సార్లు సవరించిన సంగతి తెలిసిందే. ఐబీసీ 1,000 కంటే ఎక్కువ కంపెనీల దివాల అంశాలను పరిష్కరించిందని, ఫలితంగా రుణదాతలకు నేరుగా రూ. 3.3 లక్షల కోట్ల రికవరీ జరిగిందని ఆమె చెప్పారు. ప్రస్తుతం దేశ రాజధానిలో ఉన్న ప్రధాన బెంచ్సహా 15 నగరాల్లో ఎన్సీఎల్టీ బెంచ్లు ఉన్నాయి. అంతేకాకుండా, నేషనల్ కంపెనీ లా అప్పిలేట్ ట్రిబ్యునల్ (ఎన్సీఎల్ఏటీ) ఢిల్లీ, చెన్నైలలో బెంచ్లను కలిగి ఉంది. రికవరీని వేగవంతం చేసేందుకు మరిన్ని ట్రిబ్యునళ్లను ఏర్పాటు చేస్తామని ఆమె తెలిపారు. టెలికం పరికరాల దిగుమతులకు చెక్10 శాతం నుంచి 15 శాతానికి సుంకాల పెంపు దేశీయంగా టెలికం గేర్ తయారీకి దన్నుగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తాజా బడ్జెట్లో దిగుమతి సుంకాల పెంపునకు తెరతీశారు. ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డు(పీసీబీఏ)లుగా వ్యవహరించే మదర్బోర్డులపై 5 శాతం పెంపును ప్రతిపాదించారు. వెరసి టెలికం పీసీబీఏలపై బేసిక్ కస్టమ్ డ్యూటీ ప్రస్తుత 10 శాతం నుంచి 15 శాతానికి పెరగనుంది.అయితే కమ్యూనికేషన్ పరికరాల తయారీలో వినియోగించే కీలక 25 మినరల్స్పై డ్యూటీని పూర్తిస్థాయిలో మినహాయించింది. వీటిలో అణువిద్యుత్, పునరుత్పాదక ఇంధనం, రక్షణ, టెలికం రంగాలలో వినియోగించే లిథియం, కాపర్, కోబాల్ట్ తదితరాలున్నాయి.రూ.50 లక్షలు మించితేనే రిటర్నుల పునః మదింపుపన్ను చెల్లింపుదారులకు సంబంధించి కొన్ని సానుకూల చర్యలకు బడ్జెట్లో చోటు లభించింది. ఎగవేసిన పన్ను ఆదాయం రూ.50లక్షలకు మించి ఉన్నప్పుడే.. అసెస్మెంట్ సంవత్సరం ముగిసిన మూడు నుంచి ఐదేళ్లలోపు తిరిగి మదింపు చేయవచ్చని ప్రకటించారు. సోదాలకు సంబంధించి కూడా ప్రస్తుతం అసెస్మెంట్ సంవత్సరం ముగిసిన పదేళ్ల వరకు అవకాశం ఉండగా, దీన్ని ఆరేళ్లకు తగ్గించారు.పన్నుల విషయంలో అనిశి్చత, వివాదాలను ఈ చర్యలు తగ్గిస్తాయని మంత్రి చెప్పారు. ఎలాంటి కేసుల్లోనూ ఐదేళ్ల తర్వాత సంబంధిత పన్ను రిటర్నులను తిరిగి మదించకుండా నిబంధనల్లో సవరణలు తీసుకొస్తామని ప్రకటించారు. పన్ను వివాదాల పరిష్కారానికి వీలుగా ‘వివాద్ సే విశ్వాస్ పథకం 2.0’ను తీసుకొస్తామన్నారు. సమతౌల్యత సాధన..ప్రజాదరణ, విధాన చర్యల మధ్య సమతుల్యతను సాధించడానికి ప్రభుత్వం ప్రయతి్నంచింది. రైతులకు ద్రవ్య మద్దతు, వ్యక్తిగత ఆదాయపు పన్నులో అధిక మినహాయింపు పరిమితులు, పెరిగిన ప్రామాణిక తగ్గింపులు వంటి కార్యక్రమాలు ఖర్చు చేయదగ్గ అధిక ఆదాయాన్ని అందిస్తాయి. ఇది వ్యయాలను పెంచడానికి దారి తీస్తుంది. – కుమార్ రాజగోపాలన్, సీఈవో, రిటైలర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా.కీలక పురోగతి..ఊహించినట్లుగా 2024 యూనియన్ బడ్జెట్ సౌర, పునరుత్పాదక ఇంధన రంగాలకు ప్రాధాన్యత ఇచ్చింది. ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన కింద ఒక కోటి రూఫ్టాప్ సోలార్ ప్యానెల్స్ను ఏర్పాటు చేయాలనే లక్ష్యం ఒక ముఖ్యమైన పురోగతిగా నిలుస్తుంది. కస్టమ్ డ్యూటీ మినహాయింపు జాబితా నుండి సోలార్ గ్లాస్, గ్లాస్, కాపర్ వైర్ కనెక్టర్లను తొలగించడం వివేకవంతమైన చర్య. అభివృద్ధి చెందుతున్న దేశీయ పరిశ్రమకు మద్దతుగా ఈ నిర్ణయం కీలకం. – విశ్వేశ్వర రెడ్డి, సీఎండీ, షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ అద్భుతమైనది ఏమీ లేదు..ఆతిథ్య రంగానికి సంబంధించి ఎటువంటి నిర్దిష్ట చర్యలు లేకపోవడం నిరాశ కలిగించింది. 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఈ రంగం వృద్ధిని వేగవంతం చేయడానికి బడ్జెట్లో అద్భుతమైనది ఏమీ లేదు. – ప్రదీప్ శెట్టి, ప్రెసిడెంట్, ఫెడరేషన్ ఆఫ్ హోటల్ అసోసియేషన్స్వ్యవసాయానికి దన్నువ్యవసాయం భారత ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలిచినందున ఆహార భద్రత, గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం, అలాగే వ్యవసాయంలో ఉత్పాదకతను పెంపొందించడంపై కేంద్ర బడ్జెట్ ప్రాధాన్యతను స్వాగతిస్తున్నాము. ఉత్పాదకతను మెరుగుపరచడం, వాతావరణాన్ని తట్టుకునే పంటలను అభివృద్ధి చేయడంపై దృష్టి సారించడానికి ప్రతిపాదిత సమగ్ర సమీక్ష భారతీయ వ్యవసాయం వాతావరణ ప్రభావాన్ని తట్టుకోగలదని నిర్ధారించడానికి ఒక ప్రేరణనిస్తుంది. – అరుణ్ అలగప్పన్, కోరమాండల్ ఇంటర్నేషనల్.వృద్ధి ఆధారితంఅభివృద్ధి ఆధారిత బడ్జెట్. ఇది స్వల్పకాలిక డిమాండ్ ఉద్దీపన, ఆర్థిక క్రమశిక్షణను కొనసాగిస్తూ మధ్యకాలిక వృద్ధి ఆవశ్యకతలపై దృష్టి సారించింది. ఉద్యోగాల కల్పన, నైపుణ్యానికి బలమైన ప్రాధాన్యతనిస్తూ బడ్జెట్ అందరినీ కలుపుకొని ఉంది. – అనీశ్ షా, ప్రెసిడెంట్, ఫిక్కీ.సాహసోపేతందీర్ఘకాలిక ఆర్థిక వివేకాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం రూపొందించిన సాహసోపేత బడ్జెట్ ఇది. దేశంలో తయారీ, ఎంఎస్ఎంఈల పటిష్ట పాత్ర ద్వారా ఉద్యోగ కల్పన యొక్క సుదీర్ఘ, మరింత స్థిర మార్గంపై దృష్టి పెడుతుంది. – సంజయ్ నాయర్, ప్రెసిడెంట్, అసోచామ్.మౌలిక రంగ పురోగతి లక్ష్యంవివిధ ముఖ్య ప్రాజెక్టులు, కేటాయింపుల ద్వారా మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇవ్వడం వల్ల నిస్సందేహంగా సిమెంట్, ఇతర నిర్మాణ సామగ్రికి డిమాండ్ పెరుగుతుంది. ఆర్థిక ఏకీకరణపై దృష్టి సారించి పరివర్తనాత్మకంగా, ముందుకు చూసేదిగా బడ్జెట్ ఉంది. ఇది మౌలిక సదుపాయాల అభివృద్ధి, ఉపాధి కల్పన, ఇంధన భద్రతపై బలమైన దృష్టిని కలిగి ఉంది. – నీరజ్ అఖౌరీ, ప్రెసిడెంట్, సిమెంట్ మాన్యుఫ్యాక్చరర్స్ అసోసియేషన్.ఉపాధి కల్పనకు ఊతంబడ్జెట్లో పురోగామి ప్రతిపాదనలు చేశారు. దీనితో ఉత్తరాంధ్రలో కనీసం 2,00,000 ఉద్యోగాల కల్పనకు అవకాశం ఉంది. వివిధ రంగాల అభివృద్ధికి గణనీయంగా అవకాశాలు కలి్పంచడం ద్వారా దేశీయంగా ఉపాధి కల్పన ముఖచిత్రాన్ని మార్చే విధంగా బడ్జెట్ ఉంది. – గేదెల శీనుబాబు, సీఈవో, పల్సస్ గ్రూప్ -
మరో గుడ్ న్యూస్: భారీగా తగ్గిన గ్యాస్ ధర
Commercial LPG cylinder price cut కమర్షియల్ సిలిండర్ ధరలను తగ్గించిన కేంద్రం ఇప్పుడు మరో శుభవార్త అందించింది. ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీలు (OMCలు)కీలక నిర్ణయం తీసుకున్నాయి. కేంద్రం వంటగ్యాస్ డొమెస్టిక్ సిలిండర్ల ధరలను భారీగా తగ్గించిన నేపథ్యంలో కమర్షియల్ సిలిండర్లను తగ్గించాయి.కొత్త ధరలు నేటి నుండి అమలులో ఉంటాయి. (పాక్ ఆర్థిక సంక్షోభం: రూ. 300 దాటేసిన పెట్రోలు) అనేక రాష్ట్రాల్లో 19 కిలోల కమర్షియల్ ఎల్పిజి గ్యాస్ సిలిండర్ల ధరను సుమారు రూ.158 తగ్గించాయి. తాజా తగ్గింపుతో ఢిల్లీలో 19 కిలోల వాణిజ్య LPG సిలిండర్ రిటైల్ విక్రయ ధర రూ. 1,522.50 అవుతుంది. అదే విధంగా ముంబైలో గతంలో రూ.1640.50 ఉండగా ఇప్పుడు రూ.1482గా ఉందినుంది. అలాగే చెన్నైలో రూ.1852.50కి బదులుగా రూ.1695కే అందించనున్నారు. వాణిజ్య, గృహ LPG (ద్రవీకృత పెట్రోలియం గ్యాస్) సిలిండర్ల ధరలను ప్రతి నెల మొదటి రోజున సమీక్షిస్తారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది జూలైలో 7 రూపాయలు పెరిగిన వాణిజ్య LPG సిలిండర్ల ధర ఆగస్టులో రూ. 99.75 మేర తగ్గిన సంగతి తెలిసిందే. ( LPG Price Cut: మహిళలకు రూ. వేల కోట్ల రక్షాబంధన్ గిఫ్ట్) కాగా రక్షా బంధన్ సందర్భంగా, దేశంలోని మహిళలకు బహుమతిగా కేంద్ర ప్రభుత్వం దేశీయ ఎల్పిజి ధరను రూ.200 తగ్గించింది. అలాగే ఉజ్వల స్కీమ్ కింద అందించే రూ.200 సబ్సిడీకి అదనంగా రూ.200తో మొత్తంగా రూ. 400 తక్కువకే సిలిండర్ లభిస్తోంది. -
టికెట్ల ధరలకు ‘రెక్కలు’: ప్రయాణీకులకు ఇక చుక్కలే!
న్యూఢిల్లీ: అంతర్జాతీయ ధోరణులకు అనుగుణంగా దేశీయంగా ప్రభుత్వ రంగ ఇంధన రిటైల్ సంస్థలు విమాన ఇంధన (ఏటీఎఫ్) రేటును ఏకంగా 8.5 శాతం పెంచాయి. అటు వాణిజ్య వంట గ్యాస్ ధరను సిలిండర్కు రూ. 100 మేర తగ్గించాయి. తాజా మార్పులతో ఢిల్లీలో ఏటీఎఫ్ రేటు కిలోలీటరుకు రూ. 7,728 పెరిగి రూ. 98,508కి చేరింది. దీంతో వరుసగా రెండో నెలా విమాన ఇంధనం రేటు పెరిగినట్లయింది. జూలై 1నే ఇది 1.65శాతం మేర (కిలోలీటరుకు రూ. 1,477) పెరిగింది. అంతకు ముందు ఆయిల్ కంపెనీలు నాలుగు సార్లు తగ్గించాయి. కొత్త రేట్లు మంగళవారంనుంచి అమల్లోకి వచ్చాయి. పెంపు తర్వాత, న్యూఢిల్లీలో ఏటీఎఫ్ రేటు కిలోలీటర్కు రూ.7,728 పెరిగి రూ.98,508.26కి చేరుకుంది. ముంబైలో కిలోలీటర్కు రూ.84,854.74 నుంచి రూ.92,124.13కి పెరిగింది. డొమెస్టిక్ ఎయిర్లైన్స్ మెట్రోలలో (రూపాయిలు/కేఎల్) ఏటీఎఫ్ ధరలు న్యూఢిల్లీ - 98,508.26 కోల్కతా - 1,07,383.08 ముంబై - 92,124.13 చెన్నై- 1,02,391.64 ఇంటర్నేషనల్ రన్లో డొమెస్టిక్ ఎయిర్లైన్స్ మెట్రోలలో ఏటీఎఫ్ ధరలు (డాలర్లు/కిలో) ఢిల్లీ-902.62 కోల్కతా-941.09 ముంబై-900.73 చెన్నై- 897.83 ఇక 19 కేజీల కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధర ఢిల్లీలో రూ. 100 తగ్గి రూ. 1,680కి లభించనుంది. గృహావసరాలకు ఉపయోగించే వంట గ్యాస్ రేటు యథాతథంగా రూ. 1,103 (14.2 కేజీల సిలిండర్) ఉంది. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐవోసీ), భారత్ పెట్రోలియం కార్పొరేషన్ (బీపీసీఎల్), హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ (హెచ్పీసీఎల్) ప్రతి నెలా 1వ తేదీన వంట గ్యాస్, ఏటీఎఫ్ రేట్లను సవరిస్తాయి. -
ఆయిల్ కంపెనీలకు ఇక మీదట లాభాలే.. మరి డీజిల్,పెట్రోల్ ధరలు తగ్గేనా?
న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ చమురు కంపెనీలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో లాభాలు ఆర్జిస్తాయని ఫిచ్ రేటింగ్స్ అంచనా వేసింది. గతేడాది ఇవి భారీ నష్టాలను ఎదుర్కొన్న విషయం తెలిసిందే. చము రు ధరలు బ్యారెల్కు 78.8 డాలర్లకు క్షీణించడాన్ని సానుకూలంగా ప్రస్తావించింది. దీంతో 2022–23 ఆర్థిక సంవత్సరం నష్టాలను.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల కాలంలో వచ్చే లాభాలతో భర్తీ చేసుకోగలవని తెలిపింది. గతేడాది ఏప్రిల్ నుంచి ప్రభుత్వరంగ సంస్థలైన ఐవోసీ, హెచ్పీసీఎల్, బీపీసీఎల్ పెట్రోల్ ధరలను ఒకే స్థాయిలో కొసాగిస్తూ వస్తున్నాయి. అంతర్జాతీయంగా రేట్లు పెరిగినప్పటికీ, దేశీయంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు సవరించకపోవడంతో అవి నష్టాల పాలయ్యాయి. చమురు ధరలు గణనీయంగా తగ్గిన తర్వాత నుంచి తిరిగి అవి లాభాలను చూస్తున్నాయి. 5 శాతం పెరగొచ్చు గడిచిన ఆర్థిక సంవత్సరంలో పెట్రోలియం డిమాండ్ 10 శాతం పెరగ్గా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 5–6 శాతం మేర పెరగొచ్చని ఫిచ్ రేటింగ్స్ అంచనా వేసింది. అంతేకాదు మధ్య కాలానికి సైతం దేశంలో పెట్రోల్ డిమాండ్ 5–6 శాతం మేర పెరగొచ్చని పేర్కొంది. భారత్ జీడీపీ వచ్చే కొన్నేళ్లపాటు 6–7 శాతం మేర వృద్ధి చెందొచ్చని అంచనా వేసింది. ప్రభుత్వం మౌలిక సదుపాయాలపై వ్యయాలను పెంచుతూ ఉండడం, పారిశ్రామిక కార్యకలాపాలు పుంజుకోవడం పెట్రోల్ వినియోగానికి సానుకూలంగా పేర్కొంది. ‘‘స్థూల రిఫైనింగ్ మార్జిన్లు 2023–24లో మోస్తరు స్థాయికి దిగొస్తాయి. అయినప్పటికీ స్థూల మార్జిన్లు సగటు స్థాయిలకు ఎగువనే ఉండొచ్చని అంచనా వేస్తున్నాం’’అని ఫిచ్ రేటింగ్స్ వివరించింది. మోస్తరు స్థాయిలో ధరలు చమురు ధరలు 2022–23 గరిష్టాల నుంచి చూసుకుంటే మోస్తరు స్థాయిలో, ఎగువవైపే కొనసాగొచ్చని ఫిచ్ రేటింగ్స్ తెలిపింది. దీనివల్ల చమురు ఉత్పత్తి సంస్థలైన ఓఎన్జీసీ, ఆయిల్ ఇండియాలకు మంచి నగదు ప్రవాహాలు సమకూరతాయని పేర్కొంది. భారత నూతన గ్యాస్ ధరల విధానం వల్ల ఈ సంస్థలకు నగదు ప్రవాహాల్లో ఉన్న అస్థిరతలు తగ్గుతాయని తెలిపింది. ఉత్పత్తికి సంబంధించి ఈ సంస్థలకు అధిక మూలధన నిధులు అవసరం కొనసాగుతుందని అంచనా వేసింది. దేశ చమురు ఉత్పత్తి 2022–23లో 1.7 శాతం తగ్గినట్టు వివరించింది. ఓఎన్జీసీ ఉత్పత్తి 1 శాతం తగ్గగా, ఆయిల్ ఇండియా ఉత్పత్తి 5 శాతం పెరిగినట్టు తెలిపింది. పెట్రోలియం ఉత్పత్తులకు డిమాండ్ బలంగా ఉండడం, దేశీయంగా ఉత్పత్తి స్థిరంగా ఉండడంతో 2023–24లోనూ చమురు దిగుమతులు అధికంగానే ఉంటాయని ఫిచ్ రేటింగ్స్ పేర్కొంది. -
బండపై మళ్లీ రూ.50
సాక్షి, హైదరాబాద్: పెరిగిన నిత్యావసరాల ధరలతో ఇప్పటికే సతమతమవుతున్న సామాన్య ప్రజానీకంపై మరో బాదుడు. ఎనిమిది నెలల విరామం తరువాత చమురు సంస్థలు మరోసారి గ్యాస్ సిలిండర్ ధరలను పెంచేశాయి. 14.2 కిలోల గృహావసర సిలిండర్పై రూ. 50 పెంచగా, వాణిజ్య అవసరాలకు వినియోగించే 19 కిలోల సిలిండర్పై రూ. 350.50 పెంచాయి. దీంతో హైదరాబాద్లో గృహావసరాల సిలిండర్ రేటు రూ.1,105 నుంచి రూ.1,155కి చేరింది. కాగా, గ్యాస్ సబ్సిడీని కేంద్ర ప్రభుత్వం ఎత్తివేయడంతో రెండేళ్లుగా వినియోగదారులకు నగదు బదిలీ నిలిచిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో 1.16 కోట్ల గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. ఇందులో సింగిల్ సిలిండర్ కనెక్షన్లు 68.74 లక్షలు కాగా, డబుల్ గ్యాస్ సిలిండర్ కనెక్షన్లు 48 లక్షలు. ఇవి కాకుండా దీపం కనెక్షన్లు 19.72 లక్షలు, ఉజ్వల కనెక్షన్లు 11.46 లక్షలు, సీఎస్ఆర్ కింద 7.30 లక్షల కనెక్షన్లు ఉన్నాయి. కుటుంబ సభ్యులను బట్టి సిలిండర్ల వినియోగంలో తేడాలున్నా... సాధారణ కుటుంబానికి సగటున నెలకు ఒక సిలిండర్ అవసరమవుతుంది. గ్రామాల్లో కొంత తక్కువ వినియోగం ఉంటుంది. ఈ లెక్కన రాష్ట్రంలో ప్రతి నెలా కోటి సిలిండర్లకు పైగా రీఫిల్ కోసం వస్తాయనుకున్నా... నెలకు అదనపు భారం రూ. 50 కోట్లకుపైనే ఉంటుందని చమురు కంపెనీల వర్గాలు తెలిపాయి. హోటల్ తిండి భారమే.. వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరలను చమురు సంస్థలు ఎకాఎకిన రూ. 350.50 పెంచేశాయి. దీంతో హోటళ్లు, ఇతర వాణిజ్య అవసరాలకు వినియోగించే ఈ సిలిండర్ ధర హైదరాబాద్లో రూ.1,973 నుంచి రూ. 2,323.50కి చేరినట్లయింది. ఆదిలాబాద్, ఖమ్మం వంటి జిల్లాల్లో సిలిండర్ ధర మరింత అధికంగా ఉంది. ఈ పరిస్థితుల్లో హోటళ్లలో టిఫిన్లు, భోజనాల ధరలకు రెక్కలు వచ్చే అవకాశం ఉంది. మహిళలను వంచించిన కేంద్రం: మంత్రి గంగుల కమలాకర్ గ్యాస్ ధరలు పెంచి కేంద్ర ప్రభుత్వం మహిళలను మరోసారి వంచించింది. వారం రోజుల్లో మహిళా దినోత్సవం రానున్న సందర్భంగా మోదీ ప్రభుత్వం దేశ మహిళలకు గ్యాస్ ధరలను పెంచి కానుకగా ఇచ్చింది. అదానీ నష్టాలను పూడ్చుకునేలా సామాన్యుల నుంచి గ్యాస్ ధరల రూపంలో వసూలు చేస్తోంది. అధ్వానపు విధానాలతో ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరలు పెరగడానికి కారణమైన కేంద్రం.. ఏమాత్రం మానవత్వం ఉన్నా పెంచిన గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలి. -
ఆయిల్ కంపెనీలకు ఉపశమనం.. రూ.30,000 కోట్లు కేటాయింపు
ప్రభుత్వరంగ చమురు విక్రయ సంస్థలకు కేంద్ర ప్రభుత్వం ఉపశమనం కల్పించింది. 10 నెలలుగా పెట్రోల్, డీజిల్ విక్రయ ధరలను సవరించకుండా నష్టపోయిన బీపీసీఎల్, హెచ్పీసీఎల్, ఐవోసీ కోసం రూ.30,000 కోట్లను ఆర్థిక మంత్రి కేటాయించారు. అంతర్జాతీయంగా ధరలు గణనీయంగా పెరిగినప్పటికీ, 2021 ఏప్రిల్ 6 నుంచి ఈ సంస్థలు ధరలను సవరించకుండా విక్రయిస్తున్నాయి. బ్యారెల్ చమురు ధర 116 డాలర్లకు వెళ్లిన సమయంలో వాటికి ఎక్కువ నష్టం వచ్చింది. ఆ తర్వాత చమురు ధరలు తగ్గడంతో పెట్రోల్పై లాభం వస్తుండగా, డీజిల్పై ఇప్పటికీ నష్టపోతున్నాయి. 2022–23లో ఏప్రిల్–సెప్టెంబర్ కాలానికి ఈ మూడు ఉమ్మడిగా రూ.21,200 కోట్ల నష్టాలను ప్రకటించడం గమనార్హం. పైగా వీటికి రెండేళ్లుగా ఎల్పీజీ సబ్సిడీ చెల్లింపులు కూడా చేయలేదు. దీంతో రూ.50,000 కోట్లను ఇవ్వాలని అవి కోరగా, ప్రభుత్వం రూ.30,000 కోట్లను కేటాయించింది. చదవండి: ఆ కార్ల కొనుగోలుదారులకు షాక్.. పెరగనున్న ధరలు! -
చమురు కంపెనీలకు కేంద్రం శుభవార్త!
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా రేట్ల అనూహ్య పెరుగుదల వల్ల దేశీ చమురు ఉత్పత్తి కంపెనీలు ఆర్జిస్తున్న భారీ లాభాలపై (విండ్ఫాల్ ట్యాక్స్) పన్నును కేంద్ర ప్రభుత్వం వచ్చే ఏడాది ఎత్తివేయవచ్చని ఫిచ్ రేటింగ్స్ అంచనా వేసింది. చమురు ధరలు మోస్తరు స్థాయికి చేరుకోనుండడాన్ని ఇందుకు అనుకూలంగా ప్రస్తావించింది. ఈ ఏడాది జూలై 1 నుంచి విండ్ఫాల్ పన్నును కేంద్ర సర్కారు అమల్లోకి తీసుకురావడం గమనార్హం. దేశీయంగా ఉత్పత్తి చేసి విక్రయించే, ఎగుమతి చేసే పెట్రోల్, డీజిల్, ఏటీఎఫ్లపై దీన్ని విధించింది. అంతర్జాతీయంగా ధరలు భారీగా పెరిగిపోవడంతో ఉత్పత్తి కంపెనీలకు ఒక్కసారిగా అనూహ్య లాభాలు వచ్చిపడ్డాయి. ఈ ప్రయోజనాన్ని కొంత వరకు పన్నుల రూపంలో ప్రజల ప్రయోజనాల దృష్ట్యా వెనక్కి తీసుకునే ప్రయతాన్ని ప్రభుత్వం చేసింది. దేశ చమురు వినియోగంలో 15 శాతం స్థానికంగా ఉత్పత్తి అవుతున్నదే ఉంటోంది. ఉక్రెయిన్పై రష్యా యుద్ధంతో అంతర్జాతీయంగా చమురు ధరలు దశాబ్ద గరిష్టాలకు చేరడం తెలిసిందే. ఈ ఏడాది చివరికి బ్రెంట్ చమురు బ్యారెల్ ధర 85 డాలర్ల వద్ద స్థిరపడుతుందని ఫిచ్ అంచనా వేసింది. ధరలు తగ్గడం వల్ల చమురు మార్కెటింగ్ కంపెనీల మార్జిన్లు పుంజుకుంటాయని, 2022లో నష్టాలను అవి కొంత వరకు భర్తీ చేసుకుంటాయని ఫిచ్ తన తాజా నివేదికలో అంచనా వేసింది. రిఫైనింగ్ మార్జిన్లు మధ్య స్థాయికి చేరుకుంటాయని, చమురు మార్కెటింగ్ కంపెనీల క్రెడిట్ అంశాలు మెరుగుపడతాయని పేర్కొంది. -
కమర్షియల్ సిలిండర్ వినియోగదారులకు బిగ్ షాక్
సాక్షి, పంజగుట్ట: వాణిజ్య అవసరాల కోసం వాడే ఎల్పీజీ సిలిండర్ల వినియోగదారులకు ఊహించని షాక్ తగిలింది. సిలిండర్లపై ఈ నెల 7వ తేదీ అర్ధరాత్రి నుంచి ఆయిల్ మార్కెటింగ్ సంస్థలు ఇచ్చే రాయితీని దేశ వ్యాప్తంగా పూర్తిగా ఎత్తివేశారని, ఈ విషయం వినియోగదారులు గ్రహించి సహకరించాలని తెలంగాణ ఎల్పీజీ డి్రస్టిబ్యూటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కె.జగన్మోహన్ రెడ్డి తెలిపారు. గురువారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... తెలంగాణ వ్యాప్తంగా నెలకు 8 నుంచి 9 లక్షల వాణిజ్య సిలిండర్లు విక్రయిస్తున్నట్లు పేర్కొన్నారు. వీటికి గతంలో వినియోగదారున్ని బట్టి 100 నుంచి 200 వరకు డిస్కౌంట్ లభించేదని దాన్ని పూర్తిగా ఎత్తేశారని తెలిపారు. ఎల్పీజీ ప్రమాదాలు ఇటీవల బాగా జరుగుతున్నాయని డిస్ట్రిబ్యూటర్స్ చెప్పే సేఫ్టీ ప్రతిఒక్కరూ పాటించాలని కోరారు. ప్రమాదం జరిగితే రూ.40 లక్షల ఇన్సూరెన్స్ ఉంటుందని, ఇది రావాలంటే డిస్ట్రిబ్యూటర్ వద్ద రిజిస్ట్రేషన్ ఉండాలన్నారు. ఈ సమావేశంలో సెక్రటరీ శ్రీచరణ్, అశోక్, వెంకట్రావ్ తదితరులు పాల్గొన్నారు. -
చమురు సంస్థలకు వేల కోట్ల నష్టం, ధరలు పెంచకపోవడం వల్లే?
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ దిగ్గజాలు ఐవోసీ, బీపీసీఎల్, హెచ్పీసీఎల్ ఈ ఆర్థిక సంవత్సరం(2022–23) రెండో త్రైమాసికంలో మరోసారి నష్టాలు ప్రకటించే అవకాశమున్నట్లు బ్రోకింగ్ కంపెనీ ఐసీఐసీఐ సెక్యూరిటీస్ అంచనా వేసింది. జులై–సెప్టెంబర్(క్యూ2)లో ఉమ్మడిగా రూ. 21,270 కోట్ల నష్టాలు నమోదుకావచ్చని పేర్కొంది. వెరసి సరికొత్త రికార్డ్ నెలకొల్పుతూ వరుసగా రెండో త్రైమాసికంలోనూ నష్టాలు ప్రకటించనున్నట్లు తెలియజేసింది. చమురు పీఎస్యూలు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్(ఐవోసీ), భారత్ పెట్రోలియం కార్పొరేషన్(బీపీసీఎల్), హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్(హెచ్పీసీఎల్) ఉమ్మడిగా ఈ ఏడాది ఏప్రిల్–జూన్(క్యూ1)లో రూ. 18,480 కోట్ల నష్టాలు ప్రకటించాయి. పెట్రోల్, డీజిల్, దేశీ ఎల్పీజీ విక్రయాలలో మార్కెటింగ్ మార్జిన్లు క్షీణించడం ప్రభావం చూపింది. ఈ బాటలో క్యూ2లోనూ మార్కెటింగ్ మార్జిన్లు బలహీనపడటంతో లాభదాయకత క్షీణించనున్నట్లు తాజా నివేదికలో ఐసీఐసీఐ సెక్యూరిటీస్ తెలియజేసింది. ఇతర వివరాలిలా.. నవంబర్లో చమురు పీఎస్యూలు ఈ నెలఖారు లేదా వచ్చే నెల(నవంబర్)లో క్యూ2 ఫలితాలు వెల్లడించనున్నాయి. క్యూ1లో రికార్డు రిఫైనింగ్ మార్జిన్లు సాధించినప్పటికీ పెట్రోల్, డీజిల్ రోజువారీ విక్రయ ధరలను సవరించకపోవడంతో లాభాలు ఆవిరయ్యాయి. నష్టాలు నమోదయ్యాయి. పెట్రోల్, డీజిల్ ఉత్పత్తి వ్యయాలు, రిటైల్ విక్రయ ధరల మధ్య వ్యత్యాసం తగ్గిపోవడంతో మార్జిన్లు క్షీణించాయి. ఈ పరిస్థితి మూడు చమురు పీఎస్యూలను ఆర్థికంగా దెబ్బతీస్తోంది. ఇది క్యూ2లోనూ కొనసాగడంతో ఆర్థిక పనితీరు మరింత నీరసించనుంది. త్రైమాసికవారీగా స్థూల రిఫైనింగ్ మార్జిన్ల(జీఆర్ఎం)లో బ్యారల్కు 5.6–15.9 డాలర్లమేర కోత పడనుంది. అయితే బ్లెండెడ్ రిటైల్ ఇంధన నష్టాలు తగ్గడంతో కొంతమేర కంపెనీలకు మేలు జరగనుంది. క్యూ1లో నమోదైన రూ. 14.4తో పోలిస్తే క్యూ2లో ఇవి రూ. 9.8కు పరిమితమయ్యే వీలుంది. ఇబిటా నష్టాలు మొత్తంగా క్యూ2లో చమురు పీఎస్యూల నిర్వహణ(ఇబిటా) నష్టాలు రూ. 14,700 కోట్లకు చేరనున్నాయి. నికర నష్టాలు మరింత అధికంగా రూ. 21,270 కోట్లను తాకవచ్చు. గత ఆరు నెలలుగా కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరల సవరణను చేపట్టకపోవడం గమనార్హం! 2017లో రోజువారీ ధరల సవరణను అమల్లోకి తీసుకువచ్చాక ఆరు నెలలపాటు నిలిపివేయడం ఇదే ప్రథమం! ఇదే సమయంలో ముడిచమురు ధరలు పుంజుకోవడం, డాలరుతో మారకంలో రూపాయి బలహీనపడటంతో ఉత్పత్తి వ్యయాలు పెరిగిపోయాయి. ఇక వంటగ్యాస్ ధరలను సైతం వ్యయాలకు అనుగుణంగా పెంచకపోవడం ప్రస్తావించ దగ్గ విషయం. కంపెనీలవారీగా... నివేదిక ప్రకారం క్యూలో ఐవోసీ రూ. 6,300 కోట్ల నష్టాలు నమోదు చేసే వీలుంది. ఈ బాటలో బీపీసీఎల్ రూ. 6,900 కోట్లు, హెచ్పీసీఎల్ రూ. 8,100 కోట్ల నష్టాలు ప్రకటించవచ్చు. వెరసి తొలిసారి మూడు పీఎస్యూలు వరుస త్రైమాసికాలలో నష్టాలు ప్రకటించడం ద్వారా రికార్డ్ నెలకొల్పనున్నాయి. క్యూ1లోనూ ఐవోసీ రూ. 1,995 కోట్లు, హెచ్పీసీఎల్ రూ. 10,197 కోట్లు(సరికొత్త రికార్డ్), బీపీసీఎల్ రూ. 6,291 కోట్లు చొప్పున నష్టాలు ప్రకటించాయి. దేశీయంగా చమురు కంపెనీలు అంతర్జాతీయ మార్కెట్లలో చమురు ధరలకు అనుగుణంగా రోజువారీ ఇంధన ధరల సవరణను చేపట్టే సంగతి తెలిసిందే. -
చమురు ఉత్పత్తికి ఒపెక్ కోత, దేశంలో మళ్లీ పెట్రో ధరల మంట?
న్యూఢిల్లీ: పెట్రోల్, డీజిల్ విక్రయాలపై లాభాలు కళ్లచూద్దామన్న ప్రభుత్వరంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల (ఐవోసీ, బీపీసీఎల్, హెచ్పీసీఎల్) ఆశలు ఇప్పట్లో నెరవేరేలా కనిపించడం లేదు. పెట్రోల్ ఉత్పత్తుల ధరలు దేశంలో ఆరు నెలలుగా ఒకే స్థాయిలో ఉండిపోయాయి. కేంద్ర ప్రభుత్వ పరోక్ష ఆదేశాలతో ప్రభుత్వరంగ ఆయిల్ కంపెనీలు రోజువారీ రేట్ల సవరణను నిలిపివేశాయి. చమురు ఉత్పత్తికి కోత పెట్టాలని చమురు ఉత్పత్తి దేశాల సమాఖ్య (ఒపెక్) తాజాగా తీసుకున్న నిర్ణయంతో అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు మళ్లీ పెరిగాయి. దీంతో రేట్ల సవరణ కూడా ఇప్పట్లో చేపట్టే అవకాశాల్లేవని తెలుస్తోంది. చమురు ధరలు ఇటీవలి గరిష్టాల నుంచి కొంత తగ్గుముఖం పట్టాయి. దీంతో చమురును ఉత్పత్తి చేస్తున్న దేశాల కూటమి ఒపెక్ రోజువారీగా 2 మిలియన్ బ్యారెళ్ల మేర తగ్గించుకోవాలని బుధవారం నిర్ణయం తీసుకుంది. ఇటీవల ధరలు తగ్గడంతో ఊపిరి పీల్చుకుంటున్న మన ఆర్థిక వ్యవస్థకు ఓపెక్ తాజా నిర్ణయం ప్రతికూలం కానుంది. మన దేశ ముడి చమురు అవసరాల్లో 85 శాతాన్ని దిగుమతి చేసుకుంటున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా అంతర్జాతీయ మార్కెట్కు అనుగుణంగా ధరలను సవరించకపోవడం వల్ల చమురు మార్కెటింగ్ కంపెనీలు భారీ నష్టాలను ఎదుర్కొంటున్నాయి. ఇటీవల ధరలు తగ్గడంతో డీజిల్ మినహా పెట్రోల్, గ్యాస్పై అవి ఎదుర్కొంటున్న నష్టాలు సున్నా స్థాయికి చేరాయి. లీటర్ డీజిల్పై నష్టం రూ.5కు తగ్గింది. కానీ, తాజా పరిణామంతో తిరిగి ఆయిల్ కంపెనీలకు నష్టాలు పెరిగిపోనున్నాయి. మరోవైపు రూపాయి మారకం విలువ క్షీణించడం కూడా చమురుపై నష్టాలను పెంచనుందని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. నష్టాల బాట.. ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయాలన్న కేంద్ర సర్కారు లక్ష్యానికి అనుగుణంగా పెట్రోలియం ఉత్పత్తుల విక్రయ ధరలను సవరించకపోవడంతో ఆయిల్ కంపెనీల నష్టాలు పెరిగిపోతున్నాయి. ఫలితంగా జూన్ త్రైమాసికంలో మూడు ప్రభుత్వరంగ చమురు కంపెనీలు ఉమ్మడిగా రూ.18,480 కోట్ల నష్టాలను నమోదు చేశాయి. భారత్ దిగుమతి చేసుకునే బ్యారెల్ ముడి చమురు ధర సెప్టెంబర్ 27 నాటికి 84.75 డాలర్లకు తగ్గగా, అక్టోబర్ 5 నాటికి తిరిగి 92.17 డాలర్లకు పెరిగిపోయింది. చమురు ధరల క్షీణత ఇలానే కొనసాగితే, ఏప్రిల్ నుంచి ఎదుర్కొన్న నష్టాల భారం నుంచి గట్టెక్కొచ్చన్న చమురు కంపెనీల ఆశలు తాజా పరిణామంతో చెదిరిపోయాయి. 2021 నవంబర్ 4 నుంచి ఐవోసీ, బీపీసీఎల్, హెచ్పీసీఎల్ పెట్రోల్, డీజిల్ ధరల సవరణను నిలిపివేయడం గమనార్హం. మార్చి 22 తర్వాత తిరిగి ఇవి రేట్లను సవరించాయి. ఫలితంగా లీటర్ పెట్రోల్, డీజిల్పై రూ.10 మేర పెరిగింది. తిరిగి ఏప్రిల్ 7 నుంచి రేట్ల సవరణ నిలిచిపోయింది. ప్రస్తుతం దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్ లీటర్ ధర రూ.96.72, డీజిల్ ధర రూ.89.62 చొప్పున ఉంది. -
ఆయిల్ కంపెనీలకు కేంద్రం శుభవార్త, పెట్రోల్..డీజిల్ రేట్లు తగ్గేనా?
నష్టపోతున్న ప్రభుత్వ యాజమాన్యంలోని చమురు సంస్థకు కేంద్రం పాక్షికంగా సహాయం చేసేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగా భారత ప్రభుత్వం ఇంధన రీటైలర్ సంస్థలైన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్తో పాటు ఇతర కంపెనీలకు రూ.20వేల కోట్లు పరిహారం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. మూడు ప్రభుత్వ రంగ ఆయిల్ కంపెనీలు దేశ వ్యాప్తంగా 90శాతం కంటే ఎక్కుగానే ఇంధనాన్ని సరఫరా చేస్తున్నాయి. అయితే అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు భారీగా పెరగడంతో ఆ ప్రభావం ప్రభుత్వ ఆయిల్ సంస్థలపై పడింది. దీంతో ఏప్రిల్ - జూన్ వార్షిక ఫలితాల్లో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ) ప్రతి లీటర్ పెట్రోల్ పై రూ.10, లీటర్ డీజిల్పై రూ.14 నష్టంతో మొత్తం రూ.1992.52 కోట్ల నష్టాల్ని మూటగట్టుకుంది. ఆ నష్టాల నుంచి ఉపశమనం కలిగించేందుకు ఇంధనాలపై పన్ను తగ్గింపులు, పెరుగుతున్న ద్రవ్యోల్బణ ఒత్తిళ్లను పరిష్కరించేందుకు కేంద్రం కృషి చేసింది. మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి ప్రభుత్వం చమురు సబ్సిడీని 58 బిలియన్ రూపాయిలు కేటాయించగా, ఎరువుల సబ్సిడీపై 1.05 ట్రిలియన్ రూపాయలు అందించడంతో ప్రభుత్వ ఖజానాకు భారీగా గండిపడింది. అదే సమయంలో అమెరికాలో ఇంధన తయారీ సామర్ధ్యం తగ్గడం, ఉక్రెయిన్పై యుద్ధంతో రష్యా నుంచి ఎగుమతులు తగ్గాయి. 85శాతం కంటే ఎక్కువగా దిగుమతి చేసుకున్న చమురు రిఫైనింగ్-కమ్-ఫ్యూయల్ రిటైలింగ్ కంపెనీలు అంతర్జాతీయ ధరలకే ఉత్పత్తి చేయడంలో బెంచ్ మార్క్ను క్రాస్ చేశాయి. ఈ తరుణంలో ఈ ఆగస్ట్ నెలలో చమురు కంపెనీలకు ధరల పెంపు లేదా ప్రభుత్వ పరిహారం ద్వారా నిరంతర నష్టాలను పూడ్చేందుకు కొంత జోక్యం అవసరం అని భారత పెట్రోలియం చైర్మన్ అరుణ్ కుమార్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన వ్యాఖ్యలకు ఊతం ఇచ్చేలా పెట్రోలియం శాఖ ఆర్ధిక సాయం కింద కేంద్రాన్ని 280 బిలియన్ డాలర్లు (రూ.28వేల కోట్లు) అడిగినట్లు బ్లూమ్ బెర్గ్ తన కథనంలో పేర్కొంది. పెట్రోలియం శాఖ అభ్యర్ధనపై ఆర్ధిక శాఖ 200బిలియన్ల (రూ.20వేల కోట్లు) ఇచ్చేందుకు సిద్ధమైంది. ప్రస్తుతం ఆ రెండు కేంద్ర ప్రభుత్వ శాఖల మధ్య చర్చలు జరుగుతున్నాయని, త్వరలోనే ఇంధన రీటైల్ సంస్థలకు ఆర్ధిక సాయం అందనున్నట్లు వెలుగులోకి వచ్చిన పలు కథనాలు హైలెట్ చేస్తున్నాయి. -
మరోసారి పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలు
గ్యాస్ సిలిండర్ సామాన్యులకు గుదిబండలా మారుతోంది. గృహావసరాలకు వినియోగించే 14.2 కిలోల సిలిండర్ ధర మరోసారి పెరిగింది. గ్యాస్ బండ ధరను రూ. 3.50 పెంచాయి చమురు సంస్థలు. అలాగే వాణిజ్య సిలిండర్ ధరను రూ. 8 వంతున పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. తాజా పెంపుతో దేశరాజధాని ఢిల్లీలో డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధర వెయ్యి దాటింది. పెరిగిన ధరలు అర్థరాత్రి నుంచే అమల్లోకి వచ్చాయి. ఇప్పటికే నిత్యవసర వస్తువుల ధరలు, పెట్రోలు ధరలతో సామాన్యులు ఇబ్బందులు పడుతుండగా గోరుచుట్టపై రోకలిపోటులా వరుసగా గ్యాస్ సిలిండర్ ధరలు పెంచుతూ పోతోంది కేంద్రం. ఈ ఏడాది మార్చి 22న డొమెస్టిక్ సిలిండర్పై రూ. 50 పెంచాయి. ఆ తర్వాత మే 7 మరోసారి రూ. 50వంతున ధరను పెంచాయి. ఈసారి కొంచెం కనికరించి ఈ పెంపు కేవలం రూ.3.50లకు పరిమితం చేశాయి. ఇక ఏడాది కాలంగా కమర్షియల్ సిలిండర్ ధరలయితే అడ్డు అదుపు లేకుండా పెరుగుతూనే ఉన్నాయి. చదవండి: ‘మోదీగారు.. వంటగ్యాస్ ధర తగ్గించండి’ -
పెట్రోల్ 118 నాటౌట్.. డీజిల్ 104 నాటౌట్
సామాన్యులపై కనీస కనికరం చూపకుండా ధరలు పెంచుకుంటూ పోతున్నాయి చమురు కంపెనీలు. తాజాగా లీటరు, పెట్రోలు, డీజిల్లపై 80 పైసల వంతున ధరను పెంచాయి. వీటికి డీలర్ కమిషన్, వ్యాట్ తదితర అంతా కలిపితే లీటరు పెట్రోలు ధర 91 పైసలు, డీజిల్ ధర 87 పైసలు పెరిగింది. పెరిగిన ధరలతో హైదరాబాద్లో లీటరు పెట్రోలు ధర 118.59కి పెరగగా లీటరు డీజిల్ ధర రూ.104.62కి చేరుకుంది. రూ.10కి పైగా ఉదయం ఆరు గంటలు అయ్యిందంటే చాలు పెట్రోలు రేట్లు ఎప్పుడు పెంచుదామా అన్నట్టుగా చూస్తున్నాయి చమురు కంపెనీలు. గడిచిన పదిహేను రోజుల వ్యవధిలో కేవలం రెండంటే రెండే రోజులు గ్యాప్ ఇచ్చి పదమూడు సార్లు ధరలను సవరిస్తున్నట్టు ప్రకటించాయి. ఈ సవరణల కారణంగా లీటరు పెట్రోలు ధర గత రెండు వారాల్లోనే రూ.10.39 పెరగగా డీజిల్ ధర రూ. 10.57లు పెరిగింది. ఉపశమనం లేదు అంతర్జాతీయ మార్కెట్ రేట్లకు అనుగుణంగా పెట్రోలు, డీజిల్ రేట్లను సవరిస్తున్నట్టు చమురు సంస్థలు ప్రకటిస్తున్నాయి. ఎన్నికలు పెట్రోలు రేట్లకు సంబంధం లేదని కేంద్ర మంత్రులు ప్రకటనలు గుప్పిస్తున్నారు. వాస్తవ పరిస్థితులు ఇందుకు విరుద్ధంగా ఉంటున్నాయి. 2022 మార్చి 21న అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర 111.83 డాలర్లుగా ఉండగా ఏప్రిల్ 5న 109.41 డాలర్ల వద్ద ఉంది. ఐనప్పటికీ ధరల పెంపు నుంచి సామాన్యులకు ఉపశమనం లభించడం లేదు. ఎన్నికలుంటేనే 2021 మేలో బెంగాల్ అసెంబ్లీ ఫలితాలు వెలువడిన మరుక్షణం నుంచి పెట్రోలు వాతలు మొదలయ్యాయి. ఈ పరంపర 2021 నవంబరు 4 వరకు కొనసాగింది. ఈ దెబ్బకు దేశవ్యాప్తంగా లీటరు పెట్రోలు, డీజిల్ ధర వంద దాటేసింది. దీంతో ప్రజా వ్యతిరేకత వస్తుందనే ఉద్దేశంతో కేంద్రం లీటరు పెట్రోలు, డీజిల్ ధరలను రూ.5 వంతున తగ్గించింది. ఆ తర్వాత ఉత్తర్ ప్రదేశ్తో సహా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు వచ్చేశాయి. నాటౌట్ ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కేంద్రం 2021 నవంబరు 4 నుంచి 2022 మార్చి 22 వరకు దాదాపు 137 రోజుల పాటు పెట్రోలు, డీజిల్ రేట్లను పెంచలేదు. ఇక మార్చి 22న మొదలైన చమురు సంస్థల బాదుడు నిరంతరం కొనసాగుతూనే ఉంది. ఈ దెబ్బకు లీటరు పెట్రోలు 118 నాటౌట్, డీజిల్ 104 నాటౌట్ బ్యాటింగ్ అన్నట్టుగా పరిస్థితి మారింది. -
ఎనిమిది రోజుల్లో ఏడోసారి.. పెరుగుతూనే ఉన్న పెట్రోల్, డీజిల్ ధరలు
అంతర్జాతీయ ధరల పేరు చెప్పి చమురు కంపెనీలు షాకుల మీద షాకులు ఇస్తున్నాయి. వరుసగా ఎనిమిది రోజుల్లో ఏడోసారి పెట్రోల్, డీజిల్ రేట్లు పెంచాయి. 2022 మార్చి 29న లీటరు పెట్రోలుపై 90 పైసలు, డీజిల్పై 76 పైసల వంతున ధరను పెంచాయి. తాజాగా సవరణలతో హైదరాబాద్లో లీటరు పెట్రోలు ధర రూ. 113.61కి చేరుకోగా డీజిల్ ధర రూ.99.83ని టచ్ చేసింది. రేపోమాపో డీజిల్ ధర హైదరాబాద్లో వంద రూపాయలను క్రాస్ చేయడం ఖాయమనే పరిస్థితి నెలకొంది. ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో 2021 నవంబరు రెండో వారం నుంచి 2022 మార్చి మూడో వారం వరకు పెట్రోలు, డీజిల్ ధరలను ప్రభుత్వం పెంచలేదు. అప్పటికే అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరిగినా ప్రభుత్వం ఆ భారాన్ని ప్రజలపై మోపలేదు. ఇక ఉక్రెయిన్ యుద్ధం తర్వాత ఓ దశలో బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధర 139 డాలర్లకు చేరుకున్నా.. ప్రభుత్వం మిన్నకుండిపోయింది. పెరిగిన ముడి చమురు ధర భారాన్ని బల్క్ డీజిల్పైకి మోపి సర్థుబాటు చేసింది. ఇక ఎన్నికలు ముగిసిన తర్వాత నుంచి పెట్రో బాదుడు మొదలైంది. కేవలం ఎనిమిది రోజుల వ్యవధిలో ఏకంగా ఏడు సార్లు పెట్రోలు , డీజిల్ ధరలను పెంచింది. పెట్రోలుపై ప్రతీ రోజు సగటున 90 పైసల వంతున ఏడు సార్లు పెంచడంతో కేవలం వారం రోజుల వ్యవధిలో లీటరు పెట్రోలు ధర రూ.6.30 వంతున పెరిగింది. చైనాలో లాక్డౌన్ నేపథ్యంలో గత రెండు రోజులుగా అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధర తగ్గుతోంది. వారం క్రితం బ్యారెల్ ధర 120 డాలర్లు ఉండగా చైనా పరిణామాల నేపథ్యంలో ప్రస్తుతం 108 డాలర్ల దగ్గర కొనసాగుతోంది. ఐనప్పటికీ గతంలో వచ్చిన నష్టాలను పూడ్చుకునేందుకు చమురు సంస్థలు పెట్రోలు ధరలు పెంచుతూ పోతున్నాయి. -
మరోసారి పెరిగిన ఇంధన ధరలు..! 3 రోజుల్లోనే రూ. 2 పైగా బాదుడు..! కొత్త ధరలు ఇవే..
Fuel Rates Today: రష్యా-ఉక్రెయిన్ వార్ నేపథ్యంలో క్రూడాయిల్ ధరలు భారీగా పెరిగిన విషయం తెలిసిందే. దీంతో ఒక్కసారిగా బ్యారెట్ క్రూడాయిల్ ధరలు 140 డాలర్లకు చేరుకుంది. ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో ఇంధన ధరలను స్థిరంగా ఉంచిన కేంద్రం..ఇప్పుడు ధరల పెంపుకు చమురు సంస్థలు సిద్ధమయ్యాయి. రెండు రోజుల పాటు వరుసగా పెంచిన చమురు సంస్థలు, ధరల పెంపుకు ఒక్కరోజు బ్రేక్ గ్యాప్ ఇచ్చి మరోసారి బాదుడు షురూ చేశాయి. దేశీయ చమురు కంపెనీలు తాజాగా లీటరు పెట్రోల్ 90 పైసలు, డీజిల్పై 87 పైసలు పెంచాయి. తాజా పెంపుతో దేశ రాజధాని ఢిల్లీలో లీటరు పెట్రోల్ ధర రూ.97.81, డీజిల్ ధర రూ.89.07కు చేరాయి. ముంబైలో పెట్రోల్ రూ.112.51, డీజిల్ రూ.96.70గా ఉన్నాయి. చెన్నైలో 76 పైసల చొప్పున పెరగడంతో పెట్రోల్ రూ.103.67, డీజిల్ రూ.93.71, కోల్కతాలో పెట్రోల్ రూ.106.34 (84 పైసలు), డీజిల్ రూ.91.42 (80 పైసలు)కి చేరాయి. ఇక హైదరాబాద్లో లీటరు పెట్రోలుపై 90 పైసలు, డీజిల్పై 87 పైసల చొప్పున పెరిగాయి. దీంతో పెట్రోలు ధర రూ.110.91, డీజిల్ రూ.97.23కు చేరాయి. విజయవాడలో లీటర్ పెట్రోల్ ధర రూ. 112.76, డీజిల్ ధర రూ. 98.74 గా ఉంది. దేశంలో గతేడాది నవంబర్ 4వ తేదీ తర్వాత మొదటిసారిగా మార్చి 22న పెట్రోల్, డీజిల్ ధరలు అధికమయ్యాయి. మార్చి 23న కూడా చమురు కంపెనీలు ధరలు పెంచాయి. తాజా పెంపుతో మూడు రోజుల్లోనే లీటరు పెట్రోల్, డీజిల్ ధరలు రూ.2.40 పైగా పెరిగాయి. చదవండి: బ్యాంకు ఖాతాదారులకు అలర్ట్..! వచ్చే 6 రోజుల్లో 4 రోజులు బంద్..! -
వీరి రూటు.. సపరేటు
-
రష్యా డిస్కౌంట్! పెట్రోల్ ధరలు అదుపులో ?
ప్రస్తుతం రష్యా– ఉక్రెయిన్ మధ్య కొనసాగుతున్న యుద్ధ వివాదాలు ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలు పుట్టిస్తున్నాయి. ప్రధానంగా ముడిచమురు, పసిడి తదితర కమోడిటీల ధరలు మండుతున్నాయి. దీంతో ఇప్పటికే ద్రవ్యోల్బణ సెగతో సమస్యలు ఎదుర్కొంటున్న భారత్సహా పలు దేశాలు ఆందోళన చెందుతున్నాయి. ఉక్రెయిన్ సరిహద్దులో రష్యా సైనిక దళాలను మోహరించడం ప్రారంభించాక ఊపందుకున్న ముడిచమురు ధరలు నిలకడగా పెరుగుతూ వచ్చాయి. లండన్ మార్కెట్లో బ్రెంట్ చమురు బ్యారల్ ముందురోజు 139 డాలర్లను దాటగా.. ప్రస్తుతం 132 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. మరోపక్క ఇంటర్ బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో డాలరుతో మారకంలో రూపాయి విలువ సైతం చరిత్రలోనే తొలిసారి 77 వద్ద ముగిసింది. దీంతో దేశీ దిగుమతులు బిల్లు తడిసిమోపెడు కానుంది. అయితే రష్యా తాజాగా 25–27 శాతం డిస్కౌంట్ ధరలో భారత్కు ముడిచమురు అందించేందుకు ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. వివరాలు చూద్దాం.. మూడో ర్యాంకులో ప్రపంచ దేశాలలో భారత్ చమురు దిగుమతులకు మూడో ర్యాంకులో నిలుస్తున్న సంగతి తెలిసిందే. ప్రధానంగా ఒమన్, దుబాయ్, బ్రెంట్ చమురును 75:25 నిష్పత్తిలో కొనుగోలు చేస్తోంది. రష్యా నుంచి నామమాత్ర స్థాయిలోనే (మొత్తం దిగుమతుల్లో దాదాపు ఒక శాతం) చమురును దిగుమతి చేసుకుంటోంది. అయితే బ్రెంట్ ధరలు తాజాగా 14ఏళ్ల గరిష్టానికి చేరడంతో రష్యా 25–27 శాతం డిస్కౌంట్ ధరలో చమురు సరఫరాకు ఆఫర్ చేస్తున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. గతేడాది డిసెంబర్లో రష్యా ప్రెసిడెంట్ పుతిన్ దేశీ పర్యటనకు వచ్చిన సందర్భంలో పీఎస్యూ దిగ్గజం ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్(ఐవోసీ), రష్యా ప్రభుత్వ ఇంధన దిగ్గజం రాస్నెఫ్ట్ మధ్య ఒప్పందం కుదిరింది. అత్యంత భారీ స్థాయిలో ఇండియాకు చమురు సరఫరాలు చేయగల రాస్నెఫ్ట్.. 2022 చివరికల్లా 2 మిలియన్ టన్నులమేర సరఫరా చేసేందుకు అంగీకరించింది. స్విఫ్ట్ ఎఫెక్ట్... రష్యా చమురు సరఫరాలకుగాను చెల్లింపుల విషయంలో ఇప్పటికింకా స్పష్టతలేనట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. అంతేకాకుండా పశ్చిమ దేశాల ఆంక్షల నేపథ్యంలో భారత్ ఆచితూచి వ్యవహరించవలసి ఉన్నట్లు తెలియజేశాయి. అయితే రష్యా బ్యారల్కు 11.6 డాలర్ల డిస్కౌంట్ ఆఫర్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పశ్చిమ దేశాలు అంతర్జాతీయ చెల్లింపుల వ్యవస్థ స్విఫ్ట్ నుంచి పలు రష్యన్ బ్యాంకులను నిషేధించిన కారణంగా రిజర్వ్ బ్యాంక్సహా బ్యాంకింగ్ వర్గాలు ప్రత్యామ్నాయ చెల్లింపు అవకాశాలను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకు రుపీ–రూబుల్ వాణిజ్య ఖాతాను యాక్టివేట్ చేయడం ఒక ఆప్షన్గా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. 2020–21లో ఒపెక్ దేశాల నుంచి ఇండియా 196.5 మిలియన్ టన్నుల చమురును దిగుమతి చేసుకుంది. ఈ ఏడాది చివరికల్లా క్రూడ్ ధరలు బ్యారల్కు 185 డాలర్లకు చేరవచ్చని జేపీ మోర్గాన్ అంచనా వేస్తుండటం ప్రస్తావించదగ్గ అంశం. -
అనుకున్నట్టే అయ్యింది .. గ్యాస్ సిలిండర్ ధరల పెంపు..
Oil Companies Hike LPG Price: రష్యా - ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో అంతా భయపడుతున్నట్టే జరిగింది. ధరల పెంపు నిర్ణయాన్ని ముందుగా చమురు కంపెనీలు ప్రకటించాయి. వాణిజ్య సిలిండర్ ధరలు పెంచుతూ సోమవారం చమురు కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. పెరిగిన ధరలు 2022 మార్చి 1 నుంచి అమల్లోకి వస్తాయని ప్రకటించాయి. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలను పెంచాయి చమురు కంపెనీలు. 19 కేజీల సిలిండర్ ధరపై రూ. 105లు , 5 కేజీల సిలిండర్పై రూ. 27 వంతున ధర పెంచాయి. దీంతో దేశ రాజధానిలో కమర్షియల్ సిలిండర్ ధర రెండు వేలు దాటింది. 19 కేజీ సిలిండర్ ధర రూ. 2,012కి చేరగా 5 కేజీల సిలిండర్ ధర రూ. 569గా ఉంది. పెరిగిన ధరలను పరిగణలోకి తీసుకుని వివిధ నగరాల వారీగా 19 కేజీలు సిలిండర్ల ధరను పరిశీలిస్తే చెన్నైలో రూ. 2185, ముంబై రూ.1962 , కోల్కతా రూ.2089లు, హైదరాబాద్లో రూ.1904లుగా నమోదు అవుతున్నాయి. ఐదు రాష్ట్రాల ఎన్నికలు జరుగుతుండటంతో గృహ అవసరాలకు ఉపయోగించే సిలిండర్ ధరలు పెంచే సాహాసం చమురు కంపెనీలు చేయలేదు. దీంతో వీటి ధరల్లో ఎటువంటి మార్పులేదు. అయితే త్వరలోనే డొమెస్టిక్ సిలిండర్లకు ధరల వాత తప్పదనే ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ద్రవ్యోల్బణం ఎఫెక్ట్తో కొట్టుమిట్టాడుతున్న చిరు వ్యాపారులకు, స్ట్రీట్ఫుడ్ వెండర్స్కి కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరల పెంపు అశనిపాతంగా మారింది. కోవిడ్ కారణంగా వచ్చిన నష్టాల భర్తీకి గతంలో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలు పెంచారు. దీంతో తమ ఆదాయానికి గండి పడుతుందనే ఆవేదన చిరు వ్యాపారుల నుంచి వచ్చింది. ఇప్పుడు ఒకేసారి ఒక్కో సిలిండర్పై రూ. 105 వంతున ధరల పెంచాయి చమురు కంపెనీలు -
గుడ్న్యూస్! గ్యాస్ సిలిండర్ ధర తగ్గింపు
నూతన సంవత్సరం తొలి రోజున రెస్టారెంట్లు, చిరు వ్యాపారులకు సంతోషం కలిగించే నిర్ణయాన్ని కేంద్రం ప్రకటించింది. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలను తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. గతేడాది మేలో బెంగాల్తో పాటు ఐదు రాష్ట్రాల ఎన్నికల ముగిసింది మొదలు వరుసగా పెట్రోలు, డీజిల్, ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరలను పెంచుతూ పోయింది కేంద్రం. ముఖ్యంగా కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలను అమాంతం పెంచేసింది. ఆరు నెలల వ్యవధిలో దాదాపు రూ. 400లకు వరకు ధరను పెంచింది. చివరి సారిగా 2021 డిసెంబరు 1న రూ.100 వంతున సిలిండర్ ధర పెంచింది. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరల పెంపు పట్ల నలువైపుల నుంచి విమర్శలు వచ్చినా కేంద్రం పట్టించుకోలేదు. ఆయిల కంపెనీలకు ధరల తగ్గింపుపై ఎటువంటి ఆదేశాలు జారీ చేయలేదు. కానీ కీలకమైన యూపీ ఎన్నికలు సమీపించడంతో తొలిసారిగా గ్యాస్ ధరల నుంచి ఉపశమనం కలిగించే దిశగా ఆయిల్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. 2022 జనవరి 1 నుంచి కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరను రూ.100 వంతున తగ్గిస్తున్నట్టు కేంద్రం ప్రకటించింది. దీంతో 19 కేజీల గ్యాస్ సిలిండర్ ధర ఢిల్లీలో రూ. 2004కి చేరుకోగా కోల్కతాలో రూ.2,074, చెన్నైలో రూ.2134, ముంబైలో రూ.1951కి చేరుకుంది. -
వ్యాపారులకు షాక్! ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధర పెంపు
ఓవైపు పెట్రోలు ధరలపై తగ్గింపు ప్రకటించిన చమురు సంస్థలు మరో వైపు గ్యాస్ సిలిండర్ ధరలు పెంచి ప్రజలపై భారాన్ని మోపుతున్నాయి. సరిగ్గా నెల రోజులు కూడా గడవకముందే మరోసారి కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరను పెంచేశాయి. ఒక్కో సిలిండర్పై రూ.100 వంతున చమురు కంపెనీలు ధర పెంచాయి. బుధవారం నుంచి కొత్త ధరలు అమల్లోకి వస్తున్నట్టు ఏఎన్ఐలో కథనం ప్రచురితమైంది. దీనిపై చమురు కంపెనీలు ఇంకా నోరు విప్పలేదు. ఇంతకు ముందు నవంబరు 1న 19 కేజీల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరను రూ.266 పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. దీంతో దేశవ్యాప్తంగా కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర సగటున రూ.2000లకు అటుఇటుగా నమోదు అవుతోంది. సరిగ్గా నెల రోజుల వ్యవధి ఇచ్చి ఈసారి సిలిండర్ ధరను వంద రూపాయలు పెంచాయి. దీంతో దేశవ్యాప్తంగా సగటున సిలిండర్ ధర రూ.2100కి చేరుకుంది. పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలు చిరు వ్యాపారులు, హోటళ్లు, స్ట్రీట్ఫుడ్ వెండర్లకు భారంగా మారింది. ఇప్పుడిప్పుడు ఆర్థిక పరిస్థితి కుదురుకుంటుందని భావించేలోగా వరుసగా పెరుగుతున్న గ్యాస్ సిలిండర్ ధరలు వారి జేబులకు చిల్లులు పెడుతున్నాయి. వ్యాపారంపై వస్తున్న అరకొర సంపాదన పెరుగుతున్న ధరలకే సరిపోతుందంటూ వారు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో 19 కేజీల గ్యాస్ సిలిండర్ ధర రూ.1905 ఉండగా పెరిగిన ధరలతో రూ.2005కి చేరుకుంది. చదవండి:భారీగా పెరిగిన ఎల్పీజీ గ్యాస్ ధరలు -
‘ఈవీ’ చార్జింగ్ స్టేషన్లపై ఆయిల్ కంపెనీల దృష్టి
న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ చమురు కంపెనీలు ఎలక్ట్రిక్ వాహన (ఈవీ) చార్జింగ్ సదుపాయాల కల్పనపై దృష్టి సారించాయి. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐవోసీ), బీపీసీఎల్, హెచ్పీసీఎల్ మూడు కలసి రానున్న 3–5 ఏళ్లలో 22,000 ఈవీ చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయనున్నాయి. కర్బన ఉద్గారాల విడుదలను తగ్గించి.. 2070 నాటికి నెట్ జీరో (కాలుష్యం విడుదల పరంగా తటస్థ స్థితికి)కు చేరుకోవాలన్న కేంద్ర ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా చమురు కంపెనీలు ఈ ప్రణాళికలతో ఉన్నాయి. ఇందులో ఒక్క ఐవోసీనే 10,000 పెట్రోల్ బంకుల్లో ఈవీ చార్జింగ్ సదుపాయాలను వచ్చే మూడేళ్లలో ఏర్పాటు చేయనున్నట్టు సంస్థ చైర్మన్ శ్రీకాంత్ మాధవ్ వైద్య తెలిపారు. వచ్చే ఐదేళ్లలో 7,000 స్టేషన్లలో ఈవీ చార్జింగ్ సదుపాయాలను ఏర్పాటు చేస్తున్నట్టు బీపీసీఎల్ ప్రకటించింది. హెచ్పీసీఎల్ 5,000 చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయాలనుకుంటోంది. ముఖ్యంగా వచ్చే ఏడాది కాలంలోనే ఐవోసీ 2,000 చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేస్తుందని.. బీపీసీఎల్, హెచ్పీసీఎల్ చెరో 1,000 స్టేషన్లను ప్రారంభిస్తాయని పెట్రోలియం మంత్రి హర్దీప్సింగ్ పురి మంగళవారం ప్రకటించారు. ఇటీవలే జరిగిన కాప్26 సదస్సులో భాగంగా నెట్జీరో లక్ష్యాన్ని ప్రధాని నరేంద్రమోదీ ప్రకటించడం తెలిసిందే. -
వరుసగా ఏడో రోజు పెంపు.. రూ. 120 దిశగా పెట్రోలు రేటు
పెట్రోలు ధరలకు కళ్లెం వేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా లేదు. దీంతో వరుసగా ఏడో రోజు కూడా పెట్రోలు ధరలు భగ్గుమన్నాయి. మరోసారి లీటరు పెట్రోలుపై 35 పైసల వంతున ధరను పెంచుతూ చమురు కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. అయితే ఈసారి పెంపు నుంచి డీజిల్కి మినహాయింపు ఇచ్చాయి. పెరిగిన ధరలతో హైదరాబాద్లో లీటరు పెట్రోలు ధర రూ 114.47 కి చేరుకుంది. ఈ ఏడాదిలో రూ.27 పెట్రోలు ధరలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. ఈ ఏడాది జనవరి 1న లీటరు పెట్రోలు ధర రూ. 87.06 ఉండగా... ఇప్పుడు ఏకంగా రూ.114.37కి చేరుకుంది. జనవరి నుంచి మార్చి వరకు పెట్రోలు రేట్లు పెంచుకుంటూ పోయిన చమురు సంస్థలు బెంగాల్ ఎన్నికల కారణంగా మార్చి, ఏప్రిల్లో ధరల పెంపుకు విరామం ఇచ్చాయి. ఆ తర్వాత మే నుంచి జూన్ వరకు తాజాగా అక్టోబరులో ఎడాపెడా రేట్లు పెంచుతూ వస్తున్నాయి. -
ఈ దేశంలో పెట్రోలు చాలా చీప్.. లీటరు రూ.1.50 మాత్రమే!
Most Expensive and Cheapest Petrol and Diesel Prices Countries: పెట్రోలు, డీజిల్ ధరలు పెరుగుతూనే ఉన్నాయి. అంతర్జాతీయంగా పెరిగిన చమురు ధరల పేరుతో ఆయిల్ కంపెనీలు. వ్యాట్, ఎక్సైజ్ డ్యూటీ పేరుతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వేస్తున్న భారంతో పెట్రోలు, డీజిల్ రేట్లు లీటరకు వంద రూపాయలు ఎప్పుడో దాటేశాయి. కాన్నీ కొన్ని దేశాల్లో అగ్గిపెట్టె కంటే పెట్రోలు చాలా చీప్. మరి కొన్ని చోట్ల ధరలు భగ్గుమంటున్నాయి. ఇప్పటికే సామాన్యులు మోయలేని దశకు పెట్రోలు, డీజిల్ ధరలు పెరిగినా.. ఇంకా తమ ధరల దాహం తీరలేదన్నట్టుగా ఆయిల్ కంపెనీలు సంకేతాలు పంపుతున్నాయి. కానీ ఈ దేశంలో అగ్గిపెట్టె కొన్నంత ఈజీగా లీటరు పెట్రోలును కొనేయెచ్చు. ఆ దేశం పేరే వెనుజువెలా. దక్షిణ అమెరికా ఖండంలో ఉన్న ఈ లాటిన్ కంట్రీలో చమురు నిక్షేపాలు పుష్కలం. అమెరికా ఆయిల్ సరఫరాలు తీర్చడంలో ఈ దేశానిదే ముఖ్య పాత్ర. ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుని విలవిలాడుతున్నా పెట్రోలు కష్టాలయితే ఆ దేశాన్ని చుట్టుముట్టలేదు. వెనుజువెలాలో లీటరు పెట్రోలు ధర 0.02 డాలర్లు మన కరెన్సీలో అక్షరాల కేవలం రూపాయిన్నర (రూ.1.50) మాత్రమే. చమురు నిల్వలు ఎక్కువగా ఉండటంతో ఈ దేశం అత్యంత చవగ్గా తమ పౌరులకు పెట్రోలు, డీజిల్ అందిస్తోంది. ఇక్కడయితే ఇంతే వెనుజువెలా తర్వాత పెట్రోలు అతి తక్కువ ధరకే అందిస్తున్న దేశంగా ఇరాన్ నిలిచింది. ఇక్కడ లీటరు పెట్రోలు ధర 0.06 డాలర్లుగా ఉంది. అంటే మన కరెన్సీలో రూ.4.51గా ఉంది. ఆ తర్వాత అంతర్యుద్ధంలో కొట్టుమిట్టాడుతున్న సిరియాలో 0.23 డాలర్లు (రూ.17)గా పెట్రోలు ధర ఉంది. వీటి తర్వాత అంగోలా, అల్జేరియా, కువైట్, నైజీరియా, తుర్క్మెనిస్తాన్, ఖజకిస్తాన్, ఇథియోపియా దేశాల్లో 0.50 డాలర్ల లోపే అంటే రూ.40లోపే లీటరు పెట్రోలు వస్తోంది. అక్కడ మోత మోగుతోంది పెట్రోలు ధరలు చాలా ఎక్కువగా ఉన్న దేశాల్లో మొదటి స్థానం హంగ్కాంగ్ది. చైనాలో అంతర్భాగం అయినప్పటికీ పెట్రోలు విషయంలో ఇక్కడ ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇటీవల హాంగ్కాంగ్లో లీటరు పెట్రోలు ధర 2.56 డాలర్లుగా నమోదు అవుతోంది. అంటే మన కరెన్సీలో లీటరు పెట్రోలు ధర రూ.192ల దగ్గరగా ఉంది. హాంగ్కాంగ్ తర్వాత స్థానంలో నెదర్లాండ్స్ 2.18 డాలర్లు (రూ.163), సెంట్రల్ ఆఫ్రికా రిపబ్లిక్ 2.14 డాలర్లు (రూ.160)గా ఉన్నాయి. వీటి తర్వాత నార్వే, ఇజ్రాయిల్, డెన్మార్క్, మోనాకో, గ్రీస్, ఫిన్లాండ్, ఐస్లాండ్లలో లీటరు పెట్రోలు కొనాలంటే మన కరెన్సీలో రూ. 150కి పైగానే చెల్లించాలి. ఏడాదిన్నరలో రూ.36 పెరుగుదల కరోనా సమయంలో డిమాండ్, సప్లై మధ్య తేడాలు రావడంతో పెట్రోలు ధరలు ఒత్తిడికి లోనయ్యాయి. దీని మధ్య సమతూకం పేరుతో ఎక్సైజ్ డ్యూటీని కేంద్రం విధించింది. అప్పటి నుంచి మన దగ్గర ఎడాపెడా పెట్రోలు, డీజిల్ ధరలకు అదుపు లేకుండా పోయింది. 2020 మేలో హైదరాబాద్లో లీటరు పెట్రోలు ధర రూ. 75 దగ్గర ఉండగా ప్రస్తుతం లీటరు పెట్రోలు ధర రూ.111లుగా ఉంది. దాదాపు ఏడాదిన్నర కాలంలో లీటరు పెట్రోలు ధర కనివినీ ఎరుగని రీతిలో పెరిగింది. మరీ ఈ వైరుధ్యం ఏంటో ? అంతర్జాతీయ మార్కెట్లో ధరలు అంటూ కేంద్రం చెబుతున్నా.. క్షేత్ర స్థాయిలో పరిస్థితులు వేరుగా ఉన్నాయి. 2014లో అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధర 109 డాలర్లుగా నమోదు అయ్యింది. అప్పుడు లీటరు పెట్రోలు ధర నికరంగా రూ. 71లుగా ఉంది. 2021 అక్టోబరులో బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధర 85 డాలర్లుగా ఉంది. కానీ ప్రస్తుతం లీటరు పెట్రోలు రూ. 111 దగ్గర నమోదు అవుతోంది. - సాక్షి, వెబ్డెస్క్ చదవండి : మళ్లీ పెంపుతో రికార్డు స్థాయికి ధరలు -
హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ ధర ఎంతంటే..
Petrol Diesel Prices Today: వరుసగా మూడో రోజూ పెరిగిన ఇంధన ధరలు. ముడి చమురు ధరల పెంపు కొనసాగుతూనే ఉంది. ఫలితంగా పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా మూడో రోజూ పెరిగాయి. గత మూడు వారాల్లో డీజిల్ ధరలు 18 సార్లు పెరగ్గా.. పెట్రోల్ ధరలు 15 సార్లు ఎగబాకాయి. తాజాగా దసరా తెల్లారి శనివారం లీటర్ పెట్రోల్ 36 పైసలు, డీజిల్పై 38 పైసలు చొప్పున పెరిగాయి. ఈ పెంపుతో హైదరాబాద్లో ఇవాళ(అక్టోబర్ 16, శనివారం) లీటర్ డీజిల్ ధర రూ. 102.80, లీటర్ పెట్రోల్ ధర రూ.109.73కు చేరుకుంది. ఇక ఢిల్లీలో పెట్రోల్ ధర రూ.105.49పై.లతో గరిష్టానికి చేరుకోగా, ముంబైలో రూ.111.43పై., డీజీల్ ధర ఢిల్లీలో డీజీల్ లీటర్ ధర. రూ.94.22పై., ముంబైలో రూ.102.15పై.కు చేరుకుంది. చెన్నైలో పెట్రోల్ ధర102.70పైసలుగా, డీజీల్ రూ. 98.59పైసలుగా ఉంది. అక్టోబర్ 12, 13 తేదీల్లో పెట్రో రేట్లలో ఎలాంటి మార్పు లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్న వాహనదారులకు మళ్లీ హ్యాట్రిక్ రోజుల పెంపు కంగారుపుట్టిస్తోంది. అంతర్జాతీయ మార్కెట్ ధరల స్థిరీకరణ పేరుతో గ్యాప్ లేకుండా బాదుతున్నాయి చమురు కంపెనీలు. చదవండి: గ్యాస్ సిలిండర్ పేలుళ్లు.. ఈ జాగ్రత్తలు పాటిస్తే సురక్షితం -
పండగనాడు వదల్లేదు.. మళ్లీ బాదేశారు
Petrol Prices : పండగ పబ్బం అనే తేడా లేకుండా చమురు కంపెనీలు ప్రజలపై భారం మోపుతూనే ఉన్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో చీమ చిటుక్కుమంటే చాలు ఆ ప్రభావం ఇక్కడి ప్రజలపై కనిపించేలా నిర్ణయాలు తీసుకుంటుంది. లీటరు పెట్రోలుపై 36 పైసలు, లీటరు డీజిల్పై 38 పైసల వంతున ధర పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. దీంతో హైదరాబాద్లో లీటరు పెట్రోలు ధర రూ.109.33కి చేరుకోగా డీజిల్ ధర రూ.102.38 పైసలుగా నమోదు అయ్యింది. 15 రోజులు 13 సార్లు అక్టోబరు నెల వచ్చింది మొదలు పెట్రోలు ధర పిడుగులు సామాన్యుల నెత్తిపై పడుతూనే ఉన్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరగడం సాకుగా చూపుతూ గడిచిన 15 రోజుల్లో 13 సార్లు పెట్రోలు ధరలను చమురు కంపెనీలు పెంచాయి. దీంతో ఈ నెలలోనే దాదాపు లీటరు పెట్రోలు ధర ఐదు రూపాయలు, డీజిల్ ధర నాలుగు రూపాయల వరకు పెరిగినట్టయ్యింది. కేవలం అక్టోబరు 12, 13 తేదీల్లోనే పెట్రోలు ధరల పెంపు నుంచి సామాన్యులు తప్పించుకున్నారు. ఐదు నెలల్లో రూ.12 బెంగాల్ ఎన్నికలు ముగిసినప్పటి నుంచి ఇప్పటి వరకు గడిచిన ఐదు నెలల్లో చమురు కంపెనీలు పెట్రోలు ధరలు పెంచుతూ పోతున్నాయి. ఒక్క సెప్టెంబరు నెలలలోనే రెండు వారాల పాటు ఈ ధరాఘాతం నుంచి విముక్తి లభించింది. మిగిలిన ఐదు నెలల కాలంలో రోజు విడిచి రోజు లేదా వారానికి రెండు మూడు సార్లయినా ధరలు పెంచాయి చమురు కంపెనీలు. మొత్తంగా గడిచిన ఐదు నెలల్లో లీటరు పెట్రోలు ధర రూ.11.44 పెరగగా లీటరు డీజిల్ ధర రూ.9.14 పెరిగింది. -
పండగ పూట షాక్ ! పెరిగిన పెట్రోల్ ధరలు
హైదరాబాద్ : చమురు కంపెనీలు సామాన్యులకు షాక్ల మీద షాక్లు ఇస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ ధరల స్థిరీకరణ పేరుతో గ్యాప్ లేకుండా బాదుతున్నాయి. ఈ నెలలో మరోసారి పెట్రోలు, డీజిల్ ధరలను పెంచాయి. తాజాగా సవరించిన ధరలతో లీటరు పెట్రోలుపై 34 పైసలు, లీటరు డీజిల్పై 37 పైసల వంతున ధరలు పెరిగాయి. దీంతో హైదరాబాద్ నగరంలో లీటరు పెట్రోలు ధర ఏకంగా రూ. 108.96 లకు చేరుకోగా డీజిల్ ధర రూ.102లుగా నమోదు అవుతోంది. ఈ నెలంతా బాదుడే మే నుంచి ఆగస్టు వరకు అంతర్జాతీయ ధరల పేరుతో చమురు కంపెనీలు పెట్రోలు, డీజిలు ధరలు పెంచాయి. దీంతో తెలుగు రాష్ట్రాల్లో లీటరు పెట్రోలు ధర వంద దాటేయగా డీజిల్ ధర సెంచరీకి చేరువైంది. ఆ తర్వాత నెల రోజుల పాటు ధరల పెరుగుదల నుంచి ఉపశమనం లభించింది. సెప్టెంబరు 5 నుంచి అక్టోబరు 2 వరకు పెట్రోలు ధరలు పెరగలేదు. గత పది రోజులుగా పెట్రోలు ధరలు వరుసగా పెరుగుతూనే ఉన్నాయి. దీంతో డీజిల్ ధర సెంచరీ క్రాస్ చేయగా పెట్రోలు ధర రూ. 110 కి చేరుకుంది. -
వరుసగా ఏడో రోజు.. పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరల పెరుగుతుండటంతో నేరుగా ఆ భారం వినియోగదారుడిపై మోపుతున్నాయి దేశీ చమురు సంస్థలు. లీటరు డీజిల్పై 30 పైసలు, లీటరు పెట్రోలు 37 పైసల వంతున ఛార్జీలు పెరిగాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా వరుసగా ఏడు రోజులు పెట్రోలు, డీజిల్ ధరలు పెరిగాయి. పెరిగిన ధరలతో హైదరాబాద్లో లీటరు పెట్రోలు ధర రూ. 108.60 లీటరు డీజిల్ ధర రూ.101.62లకు చేరుకుంది. చేతులెత్తేసిన చమురు సంస్థలు చమురు ఉత్పత్తిపై ఒపెక్ దేశాలు తీసుకున్న నిర్ణయాన్ని అనుసరించి దేశ ప్రజలపై పెట్రోలు భారం పడకుండా చర్యలు తీసుకోవడంలో చమురు సంస్థలు విఫలమవుతున్నాయి. మరోవైపు కేంద్రం సైతం చమురు సంస్థలు ఎడాపెడా ఛార్జీలు పెంచుతుంటే ప్రేక్షక పాత్ర పోషిస్తున్నాయి తప్పితే, ధరాఘాతం నుంచి సామాన్యలను రక్షించేందుకు ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు. నవంబర్ వరకు నవంబర్ వరకు ముడి చమురు ధరలు పెరుగాయని ఒపెక్ దేశాలు ఇప్పటికే స్పష్టం చేశాయి. ఇటు కేంద్రం, అటు చమురు సంస్థలు ఈలోగా ఏమైనా ఉపశమనం చర్యలు తీసుకోకుంటే చమురు ధరలు భరించలేని స్థాయికి చేరుకునే ప్రమాదం ఉంది. -
సెంచరీ దాటిన లీటరు డీజిల్ ధర
Petrol Price: హైదరాబాద్ : చమురు సంస్థల ధరల పెంపు నిర్ణయంతో తెలుగు రాష్ట్రాల్లో లీటరు డీజిల్ ధర సెంచరీ మార్క్ని క్రాస్ చేసింది. గురువారం పెంచిన ధరలతో దాదాపు రెండు రాష్ట్రాల్లో అన్ని లీటరు డీజిల్ ధర వంద రూపాయలను దాటేసింది. జూన్లోనే లీటరు పెట్రోలు ధర వందను దాటింది. పెంపు ఇలా పెట్రో వడ్డన కార్యక్రమం షురూ అయ్యింది. వరుసగా మూడో రోజు పెట్రోలు, డీజిల్ రేట్లను పెంచుతున్నట్టు చమురు సంస్థలు ప్రకటించాయి. లీటరు పెట్రోలుపై 30 పైసలు, లీటరు డీజిల్పై 38 పైసల వంతున ధరలు పెంచాయి. దీంతో హైదరాబాద్ నగరంలో లీటరు పెట్రోలు ధర రూ. 107.36లకు పెరగగా డీజిల్ ధర 100.09లుగా నమోదు అయ్యింది. అక్టోబరు తొలి వారంలో ఏకంగా మూడు సార్లు పెట్రోలు ధరలు పెరిగాయి. మాటలకే పరిమితం పెట్రోలు ధరల నుంచి ఉపశమనం కలిగించేందుకు జీఎస్టీ పరిధిలోకి తీసుకువస్తామంటూ కేంద్రం ఫీలర్లు వదలడమే తప్ప ఆ దిశగా ఇంత వరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. జీఎస్టీ పరిధిలోకి తీసుకురావడం వల్ల రాష్ట్రాలకు తగ్గిపోయే ఆదాయం, అందుకు తగ్గ ప్రత్యామ్నాయం చూపించడంలో కేంద్రం విఫలమవుతోంది. ఫలితంగా పెట్రోలు ధరల భారం సామాన్యులపై పడుతోంది. చదవండి : మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు -
హైదరాబాద్: 2 శాతం మంది ఇంకా కిరోసిన్పైనే వంట
సాక్షి, హైదరాబాద్: విశ్వనగరం వైపు పరుగులు తీస్తున్న హైదరాబాద్లో రెండు శాతం వరకు పేద కుటుంబాలు కిరోసిన్పైనే ఆధారపడి వంటావార్పు కొనసాగిస్తున్నాయి. సరిగ్గా ఐదేళ్ల క్రితం ఢిల్లీ, చండీగఢ్ తరహాలో కిరోసిన్ రహిత నగరంగా తీర్చిదిద్దాలనే పాలకుల ప్రయత్నాలు అటకెక్కాయి. పౌరసరఫరాల శాఖ నగరంలో కిరోసిన్ వినియోగం నివారించేందుకు నడుం బిగించినప్పటికీ ఆచరణలో మాత్రం అమలు కావడంలేదు. రేషన్ కార్డులు కలిగి ఉన్న బీపీఎల్ కుటుంబాలను సర్కిల్వారీగా గుర్తించి ఎల్పీజీ కనెక్షన్లు మంజూరు చేసే విధంగా ఆయిల్ కంపెనీల డిస్ట్రిబ్యూటర్లకు ఆదేశాలు జారీ చేసినా ఫలితం లేకుండా పోయింది. కేవలం కొత్త కార్డుల జారీలో గ్యాస్ కనెక్షన్ తప్పనిసరి నిబంధనను అమలు చేసి..పాత కార్డుదారులకు మాత్రం కనెక్షన్లు మంజూరు చేయించడాన్ని గాలికి వదిలేసింది. ఉజ్వల అంతంతే... కేంద్ర ప్రభుత్వ ప్రధాన మంత్రి ఉజ్వల యోజన(దీపం) పథకం అమల్లో సైతం పౌరసరఫరాల శాఖ వెనుకబడింది. అప్పట్లో గ్రేటర్ పరిధిలోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ పౌరసరఫరాల విభాగాలు ఉజ్వల యోజన పథకం కింద సుమారు 1,67,198 కుటుంబాలను గుర్తించాయి. అందులో 1,66,522 కుటుంబాలకు ఎల్పీజీ కనెక్షన్ల కోసం సిఫార్సు చేయగా, ఆయిల్ కంపెనీల డి్రస్టిబ్యూటర్లు మాత్రం 84,713 కుటుంబాలకు మాత్రమే కనెక్షన్లు ఇచ్చి చేతులు దులుపుకున్నారు. చదవండి: మద్యం మత్తులో పోలీసులనే ముప్పు తిప్పలు పెట్టాడు ఇంకా కిరోసిన్ లబ్దిదారులు గ్రేటర్ పరిధిలోని నిరుపేద కుటుంబాలు ఇంకా కిరోసిన్పైనే ఆధారపడి వంటావార్పు కొనసాగించడం విస్మయానికి గురిచేస్తోంది. ప్రస్తుతం మొత్తం 17,21,212 రేషన్కార్డు కలిగిన కుటుంబాలు ఉండగా, అందులో 3,41,823 కుటుంబాలకు ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్ లేక కిరోసిన్ లబ్దిదారులుగా కొనసాగుతున్నారు. చదవండి: రెండో రోజు ప్రారంభమైన తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు గ్రేటర్లో కిరోసిన్ లబ్దిదారులు ఇలా జిల్లా మొత్తం కార్డుల సంఖ్య కిరోసిన్ కార్డులు నెలసరి కిరోసిన్ కోటా (లీటర్లలో) హైదరాబాద్ 6,36,661 1,26,214 207817.0 మేడ్చల్ జిల్లా 5,24,594 89,158 110470.0 రంగారెడ్డి జిల్లా 5,59,957 1,26,451 168225.0 -
స్వల్పంగా తగ్గిన పెట్రోలు, డీజిల్ ధరలు
అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు స్థిరంగా కొనసాగుతుండటంతో మరోసారి పెట్టోలు, డీజిలు ధరలు స్వల్పంగా తగ్గాయి. పెట్రోలు, డీజిల్లకు సంబంధించి లీటరుపై 15 పైసల వంతున ధరను ఆదివారం చమురు కంపెనీలు తగ్గించాయి. ఈ నెలలో పెట్రోలు, డీజిల్ రేట్లు తగ్గడం వరుసగా ఇది రెండో సారి. తగ్గిన ధరలతో హైదరాబాద్లో లీటరు పెట్రోలు ధర రూ. 105.26గా ఉంది. డీజిల్ ధర రూ. 96.69లుగా ఉంది. మేలో ఐదు రాష్ట్రాల ఎన్నికలు ముగిసిన తర్వాత వరుసగా పెట్రోలు, డీజిల్ ధరలను చమురు కంపెనీలు పెంచుకుంటూ పోయాయి. దీంతో దేశవ్యాప్తంగా లీటరు పెట్రోలు ధర వంద రూపాయలు దాటగా, డీజిల్ ధర సెంచరీకి చేరువైంది. అయితే ఆగస్టులో అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు పడిపోవడం ప్రారంభమైంది. బ్యారెల్ ముడి చమురు ధర 75 డాలర్ల నుంచి 64 డాలర్లకు పడిపోయింది. కొద్ది కాలంగా కొంచెం అటుఇటుగా అక్కడే కొనసాగుతోంది. దీంతో చమురు కంపెనీలు కొద్ది కొద్దిగా ధరలను తగ్గిస్తున్నాయి. చదవండి: ఇండియన్ ఆయిల్ కొత్త మస్కట్ ఇదే -
సామాన్యుడికి షాక్.. మళ్లీ పెరిగిన గ్యాస్ ధర.. ఏడాదిలో ఐదోసారి
జీడీపీ లెక్కలు బాగానే ఉన్నాయంటూ కేంద్రం శుభవార్త చెప్పిన మరుసటి రోజు సామాన్యుడికి షాక్ తగిలింది. ఎల్పీజీ గ్యాస్ ధరను చమురు కంపెనీలు మరోసారి పెంచాయి. పెరిగిన ధరతో 14.2 కేజీల సిలిండర్ ధర రూ.884.50కి చేరుకుంది. రెండు వారాల్లో రెండు సార్లు ప్రతీ పదిహేను రోజులకు ఒకసారి గ్యాస్ ధరలను చమురు కంపెనీలు సమీక్షిస్తున్నాయి. అందులో భాగంగా మార్కెట్ పరిస్థితులను బట్టి ధరలను స్థిరీకరిస్తున్నాయి. చివరి సారిగా ఆగస్టు 18న గ్యాస్ ధరను రూ. 25 పెంచాయి. రెండు వారాలు తిరిగే సరికి మరోసారి సామాన్యుడి నెత్తిన గ్యాస్ పిడుగు పడింది. దీంతో రెండు వారాల వ్యవధిలో గృహ అవసరాలకు వినియోగించే గ్యాస్ సిలిండర్ ధర రూ. 50 వరకు పెరిగింది. ఈ ఏడాది పెంపు రూ. 165.50 ఈ ఏడాది ఆరంభంలో రూ.694లుగా ఉంది. ఆ తర్వాత ఫిబ్రవరిలో, మార్చి, జూన్లలో కూడా ధరలను చమురు కంపెనీలు పెంచాయి. మొత్తంగా ఐదు సార్లు ధర పెరగగా మధ్యలో ఫిబ్రవరి, ఏప్రిల్లలో కొద్ది మేరకు ధరలను తగ్గించాయి. మొత్తంగా ఈ ఏడాది 14.2 కేజీ గ్యాస్ సిలిండర్పై రూ.165.50 వరకు ధర పెరిగింది. 2017 నుంచి బాదుడే పెట్రో ఉత్పత్తుల ధరలపై నియంత్రణను 2017లో కేంద్రం ఎత్తివేసింది. దీంతో అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు, డాలర్తో రూపాయి మారకం విలువ ఆధారంగా పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను పెట్రో ఉత్పత్తి సంస్థలు పెంచేస్తున్నాయి. ఫలితంగా పేద, మధ్యతరగతి వర్గాల ప్రజలపై తీవ్ర భారం పడుతోంది. తాజా పెంపుతో దేశంలో 29.11 కోట్ల మంది ఎల్పీజీ కస్టమర్లపై భారం పడనుంది. చదవండి: మిస్డ్ కాల్తో గ్యాస్ కనెక్షన్ -
అతి స్వల్పంగా తగ్గిన పెట్రోలు, డీజిల్ ధరలు
హైదరాబాద్: పెట్రోలు ధరల నుంచి వినియోగదారులకు చమురు కంపెనీలు స్వల్ప ఉపశమనం కలిగించాయి. 36 రోజుల సుదీర్ఘ విరామం తర్వాత లీటరు పెట్రోలు, డీజిల్లపై కేవలం 20 పైసల వంతున ఛార్జీలు తగ్గించాయి. అంతకు ముందు వరుసగా మూడు రోజుల పాటు రోజుకు 20 పైసల వంతున మొత్తం 60 పైసల వరకు లీటరు డీజిల్ ధరను తగ్గించాయి. మొత్తంగా డీజిల్ ధర 80 పైసలు, పెట్రోలు ధర 20 పైసల వంతున తగ్గింది. పశ్చిమ బెంగాల్తో పాటు జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికలు ముగిసిన తర్వాత మే నుంచి జులై 16 వరకు రోజు విడిచి రోజు అన్నట్టుగా పెట్రోలు ధరలు పెరిగాయి. ఆ తర్వాత అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గిపోవడంతో ధరల పెరుగుదలకు బ్రేక్ పడింది. ప్రస్తుతం బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధర 60 డాలర్లకు దిగువన నిలకడగా ఉండటంతో చమురు కంపెనీలు స్వల్పంగా పెట్రోలు, డీజిల్ రేట్లు తగ్గించాయి. తగ్గిన ధరతో హైదరాబాద్లో లీటరు పెట్రోలు ధర రూ. 105.60గా లీటరు డీజిల్ ధర రూ. 97.15లుగా ఉంది. చదవండి: టాటా మోటార్స్ నుంచి మైక్రో ఎస్యూవీ -
వరుసగా రెండో రోజు తగ్గిన డీజిల్ ధరలు
హైదరాబాద్: వరుసగా రెండో రోజు డీజిల్ ధరను తగ్గించాయి చమురు కంపెనీలు. లీటరు డీజిల్పై మరోసారి 20 పైసల వంతున ధర తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పడిపోవడంతో డీజిల్ ధరలు తగ్గుతున్నాయి. డీజిల్ ధరలు తగ్గిస్తోన్న చమురు కంపెనీలు పెట్రోలు ధర తగ్గించకపోవడంపై ప్రజల్లో అంసంతృప్తి నెలకొంది. ధరల తగ్గింపుకు ముందు హైదరాబాద్లో లీటరు డీజిల్ ధర రూ.97.74 ఉండగా తాజా తగ్గింపుతో రూ.97.54గా ఉంది. ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరను ఒకేసారి 25 రూపాయలు పెంచుతూ డీజిల్ ధరలు కేవలం లీటరుకు 20 పైసల వంతున తగ్గించడంపై విమర్శలు వస్తున్నాయి. మొత్తంగా చూస్తే గత నెల రోజులుగా పెట్రోలు, డీజిల్ ధరలు పెరగకుండా నిలకడగా ఉండటం వల్ల సామాన్యులకు ఎంతో కొంత ఉపశమనం కలిగిస్తోంది. -
Petrol Diesel Prices: మరోసారి పెరిగిన ధరలు
న్యూఢిల్లీ: అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలకు అనుగుణంగా ఇంధన ఛార్జీలు సవరించాలనే నిర్ణయం తీసుకున్న తర్వాత... మొదట్లో సగటున ప్రతీ పదిహేను రోజులకు ఓసారి పెట్రోలు ధర పెరిగేది. ఆ తర్వాత వారానికి పడిపోయింది. ఇప్పుడు దాదాపు రోజుకు ఒకసారి పెరుగుతూ వస్తోంది. తాజాగా మరోసారి చమురు ధరలు పెరిగాయి. గురువారం లీటర్ పెట్రోల్పై 36 పైసలు, డీజిల్పై 11 పైసలు పెంపు విధించాయి. ఇటీవల ఐదు రాష్ట్రాల ఎన్నికలు ముగిసిన తర్వాత ఇంచుమించు రోజు విడిచి రోజు పెట్రోలు ధరలు పెరుగుతూ వచ్చాయి. ఇక జులైలో అయితే ఒక్క రోజు గ్యాప్ ఇచ్చి దాదాపు ప్రతీ రోజు పెట్రోలు ధర పెరిగింది. దాదాపు అన్ని మెట్రో నగరాల్లో పెట్రోల్ లీటర్ వంద మార్క్ను దాటేసింది. ఈ నెలలో ఇది ఆరో పెంపు. పది రాష్రా్టలపై పెట్రో ఉత్పత్తుల పెంపు ప్రభావం పడింది. తాజా పెరుగుదలతో హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ ధర రూ.104.50పై కాగా, డీజిల్ ధర రూ.97.68పై.గా ఉంది. ఇక అత్యధికంగా భోపాల్లో రూ.108గా ఉండగా, డీజిల్ ధర రూ.98గా ఉంది. ముంబైలో పెట్రోల్ రూ.106- డిజీల్ రూ.92గా ఉంది. -
భగ్గుమన్న పెట్రోల్ ధరలు
ముంబై: పెట్రోలు ధరలు మరోసారి భగ్గుమన్నాయి. ఒక్క రోజుగ గ్యాప్ ఇచ్చి మరోసారి పెట్రోలు, డీజిల్ రేట్లు పెంచాయి చమురు కంపెనీలు. బుధవారం రోజు లీటరు పెట్రోలుపై రూ. 35 పైసలుచ డీజిల్పై 23 పైసల వంతున ధర పెంచుతూ ఆయిల్ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. తాజా పెంపుతో హైదరాబాద్లో పెట్రోల్ రూ104.20; డీజిల్ రూ.97.64 పైసలకు చేరుకుంది. మరోవైపు ఢిల్లీలో కూడా లీటరు పెట్రోలు ధర రూ. 100ను దాటింది. మెట్రో సిటీల్లో లీటరు పెట్రోలు ధర వందకు చేరుకున్న చివరి నగరంగా ఢిల్లీ నిలిచింది. డీజిల్పై 23 పైసలు సోమవారం ఆయిల్ కంపెనీలు కేవలం పెట్రోలు ధరను మాత్రమే పెంచి డీజిల్ ధరలు పెంచకుండా ఉపశమనం కలిగించాయి. కానీ ఆ ఆనందం ఒక్క రోజుతోనే పోయింది. బుధవారం రోజు లీటరు పెట్రోలుపై 23 పైసల వంతున ధర పెంచాయి. దీంతో తెలుగు రాష్ట్రాల్లో సెంచరీ దిశగా వడివడిగా అడుగులు డీజిల్ ధరలు అడుగులు వేస్తున్నాయి. పెరిగిన ధరలతో వివిధ నగరాల్లో లీటరు పెట్రోలు, డీజిల్ ధరల వివరాలు నగరం పెట్రోలు డీజిల్ విశాఖపట్నం 105.23 98.13 విజయవాడ 106.42 99.29 తిరుపతి 107.11 99.88 వరంగల్ 103.75 97.21 హైదరాబాద్ 104.20 97.64 -
పెరిగిన పెట్రోల్ ధర .. మరి డీజిల్ ?
ముంబై: వరుసగా మూడో రోజు పెట్రోల్ ధర పెరిగింది. లీటరు పెట్రోలుపై రూ. 37 పైసల ధర పెంచుతూ ఆయిల్ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. అయితే డీజిల్ ధర పెంచలేదు. తాజా పెంపుతో హైదరాబాద్లో పెట్రోల్ రూ103.84; డీజిల్ రూ.97.46 పైసలకు చేరుకుంది. ప్రతీ రోజు అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలకు అనుగుణంగా ఇంధన ఛార్జీలు సవరించాలనే నిర్ణయం తీసుకున్న తర్వాత... మొదట్లో సగటున ప్రతీ పదిహేను రోజులకు ఓసారి పెట్రోలు ధర పెరిగేది. ఆ తర్వాత వారానికి పడిపోయింది. ఇటీవల ఐదు రాష్ట్రాల ఎన్నికలు ముగిసిన తర్వాత ఇంచుమించు రోజు విడిచి రోజు పెట్రోలు ధరలు పెరుగుతూ వచ్చాయి. ఇక జులైలో అయితే ఒక్క రోజు గ్యాప్ ఇచ్చి దాదాపు ప్రతీ రోజు పెట్రోలు ధర పెరిగింది. పెట్రోలుపై రూ. 9.49 పెంపు ఈ ఏడాది మే 4 నుంచి పెట్రోలు ధరలు పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పటి వరకు 36 సార్లు పెట్రోలు ధరను పెంచుతూ పోయారు. మొత్తంగా రెండు నెలల కాలంలో లీటరు పెట్రోలుపై రూ. 9.49 ధరను పెంచారు. అయితే ఈ సారి డీజిల్ ధరలు పెంచకుండా స్వల్ప ఉపశమనం కలిగించాయి చమురు కంపెనీలు. పెట్రోలు ధర పెరుగుడుకు కళ్లెం వేయాలంటూ ఇక్రా వంటి సంస్థలు సూచించినా ఇటు చమురు సంస్థలు, అటు కేంద్రం నుంచి స్పందన లేదు. -
ఆగని పెట్రోల్ బాదుడు... మళ్లీ పెంపు
ముంబై: పెట్రోలు ధరలు పెరుగుతూనే ఉన్నాయి. జులైలో మూడోసారి పెట్రోలు ధరలు పెంచాయి చమురు కంపెనీలు. లీటరు పెట్రోలుపై రూ. 36 పైసలు, లీటరు డీజిల్పై 20 పైసల వంతున పెంచాయి. తాజా పెంపుతో హైదరాబాద్లో పెట్రోల్ రూ103.41; డీజిల్ రూ.97.40 పైసలకు చేరుకుంది. తిరుపతి, విజయవాడలలో డీజిల్ ధర సెంచరీకి చేరువుగా వచ్చాయి. పెట్రోలుపై రూ. 9.12 పెంపు ఈ ఏడాది మే 4 నుంచి పెట్రోలు ధరలు పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పటి వరకు 35 సార్లు పెట్రోలు ధరను పెంచుతూ పోయారు. మొత్తంగా రెండు నెలల కాలంలో లీటరు పెట్రోలుపై రూ. 9.12 ధరను పెంచారు. ఇదే సమయంలో డీజిల్ ధర లీటరుకు రూ. 8.71 పెరిగింది. గత రెండు నెలలుగా సగటున రోజు విడిచి రోజు పెట్రోలు ధరలు పెరుగుతూనే ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో వివిధ నగరాల్లో లీటరు పెట్రోలు ధరల వివరాలు రూపాయల్లో నగరం పెట్రోలు డీజిల్ హైదరాబాద్ 103.47 97.46 వరంగల్ 103.02 97.03 విశాఖపట్నం 105.04 98.44 విజయవాడ 105.72 99.12 తిరుపతి 106.41 99.70 -
Petrol Price : మేలో 14 సార్లు, జూన్లో 16 సార్లు.. మరి జులైలో ?
ముంబై : పెట్రోలు ధరలు శనివారం స్వల్పంగా పెరిగాయి. పెట్రోలు, డీజిల్లపై ఆరు పైసల వంతున ధర పెంచాయి చమురు కంపెనీలు. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత ఇప్పటి వరకు 60 రోజుల్లో 34 సార్లు పెట్రోలు, డీజిల్ ధరలు పెరిగాయి. 34 సార్లు బెంగాల్, అసోం, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి రాష్ట్రాలకు ఎన్నికల హడావుడి కొనసాగినన్నటి రోజులు దాదాపు రెండు నెలలుగా పెట్రోలు ధరలు పెరగలేదు. కానీ మే మొదటి వారంలో ఫలితాలు వెలువడిన అనంతరం పెట్రోలు ధరలు అనూహ్యంగా పెరుగుతూ పోయాయి. ఇప్పటి వరకు 60 రోజుల్లో 34 సార్లు పెట్రోలు ధరలు పెరిగాయి. ఇందులో జులైలో ఇప్పటికే రెండు సార్లు ధరలు పెరగగా జూన్లో 16 సార్లు, మేలో 14 సార్లు పెట్రోలు, డీజిల్ ధరలను పెంచాయి చమురు కంపెనీలు. పెట్రోలుపై రూ. 8.82 పెంపు ఈ ఏడాది మే 4 నుంచి పెట్రోలు ధరలు పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పటి వరకు 34 సార్లు పెట్రోలు ధరను పెంచుతూ పోయారు. మొత్తంగా రెండు నెలల కాలంలో లీటరు పెట్రోలుపై రూ. 8.82 ధరను పెంచారు. ఇదే సమయంలో డీజిల్ ధర లీటరుకు రూ. 8.51 పెరిగింది. తాజా పెంపుతో హైదరాబాద్లో పెట్రోల్ రూ103.11; డీజిల్ రూ.97.26 పైసలకు చేరుకుంది. చదవండి : New IT Rules: ఫేస్బుక్ పోస్టులపై భారీ వేటు -
ఆగని పెట్రో బాదుడు.. మరోసారి ధరల పెంపు
హైదరాబాద్ : పెట్రోలు ధరలు పైకి పెరగడమే తప్ప కిందికి చూడటం లేదు. ఒక్క రోజు వ్యవధిలో మరోసారి పెట్రోలు, డీజిల్ ధరలు పెంచాయి చమురు సంస్థలు. లీటరు పెట్రోలుపై 35 పైసలు, లీటరు డీజిల్పై 28 పైసల వంతున రేట్లు పెంచాయి. ఇప్పటికే పెట్రోలు సెంచరీ దాటగా డిజిల్ సెంచరీకి చేరువగా వచ్చింది. క్రూడ్ ఆయిల్ ధరల్లో పెద్దగా మార్పులు లేకపోయినా దేశీయంగా పెట్రోలు, డీజిల్ ధరలు పెరుగుతూనే ఉన్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెట్ క్రూడ్ ఆయిల్ధర 74.58 డాలర్లుగా నమోదు అయ్యింది. క్రితం రోజుతో పోల్చితే ధరలో మార్పు కేవలం 0.1 శాతమే ఉంది. ఐనప్పటికీ చమురు సంస్థలు ఇంధన ధరలను పెంచుతూ పోతున్నాయి. సామాన్యుల నుంచి ధనవంతుల వరకు అందరి జేబులకు చిల్లులు పెడుతూనే ఉన్నాయి. తాజాగా పెరిగిన ధరలతో వివిధ నగరాల్లో పెట్రోలు, డీజిల్ ధరలు ఇలా ఉన్నాయి. సిటీ పెట్రోలు డీజిల్ హైదరాబాద్ 102.69 97.20 విశాఖపట్నం 103.76 97.70 తిరుపతి 105.07 98.82 ఢిల్లీ 98.81 89.18 ముంబై 104.90 96.72 చెన్నై 99.80 93.72 బెంగళూరు 102.11 94.54 చదవండి : నెట్ఫ్లిక్స్లో ఈ కొత్త ఫీచర్ ఏదో బాగుందే..! -
Petrol Price: రూ.102 దాటేసింది!
సాక్షి, న్యూఢిల్లీ: ఒక రోజుగా గ్యాప్ తరువాత వరుసగా శుక్రవారం, నేడు(శనివారం) రెండు రోజూ ఇంధన ధరలు ఊపందుకున్నాయి. దేశవ్యాప్తంగా చాలా నగరాల్లో ఇప్పటికే పెట్రో ధర రూ.100 మార్క్ను దాటేసింది. తాజాగా పెట్రోల్పై లీటర్కు 28 పైసలు, డీజిల్పై 27 పైసలు పెంచుతూ ఆయిల్ కంపెనీలు నిర్ణయించాయి. దీంతో దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధర రికార్డు స్థాయికి చేరుకుంది . ఈ పెంపుతో వాణిజ్య రాజధాని ముంబైలో లీటరు పెట్రోలు ధర 102 మార్క్ను దాటగా, విజయవాడలో సుమారు 102 రూపాయలుగా ఉంది. ఇక దేశ రాజధాని నగరంలో పెట్రోల్ రూ.96.12, డీజిల్ రూ.86.98 గా ఉంది. ఈ నెలలో 12 రోజుల కాలంలో ఇప్పటివరకు ఏడు సార్లు ఇంధన ధరలు పెరిగాయి. మే 4వ తేదీ నుంచి నేటి వరకు 24 సార్లు చమురు ధరలు పెరిగాయి. తొలిసారి 100 దాటిన డీజిల్ ధర: దేశంలో తొలిసారిగా డీజిల్ ధర100 రూపాయలు దాటింది, రాజస్థాన్లో లీటరు డీజిల్ ధర ఇపుడు రూ. 100.05 వద్ద అమ్ముడవుతోంది. ప్రధాన నగరాల్లో పెట్రోలు, డీజిల్ ధరలు లీటరుకు ఢిల్లీలో పెట్రోల్ రూ.96.12, డీజిల్ రూ.86.98 ముంబైలో పెట్రోల్ రూ.102.30, డీజిల్ రూ.94.39 చెన్నైలో పెట్రోల్ రూ.97.43, డీజిల్ రూ. 91.64 కోల్కతాలో రూ.96.06 డీజిల్ రూ.89.83 హైదరాబాద్లో పెట్రోల్ రూ.99.90, డీజిల్ రూ.94.82 విజయవాడలో పెట్రోల్ రూ.101.88, డీజిల్ రూ.96.23 వైజాగ్లో పెట్రోల్ రూ.101.05, డీజిల్ రూ.95.41 చదవండి: Weekend love: ఈ వీడియోలను చివరిదాకా చూస్తే.. H1-B, వీసాల తిరస్కరణ: భారీ ఊరట -
Petrol Price Hike: 23వ సారి.. హైదరాబాద్లో సెంచరీ క్రాస్!
హైదరాబాద్: పెరగడమే కానీ తగ్గడం తనకు లేదన్నట్టుగా ఉంది పెట్రోలు ధరల పరిస్థితి. తాజాగా మరోసారి పెట్రోలు, డీజిల్ ధరలను పెంచాయి ఆయిల్ కంపెనీలు. పెట్రోలు, డీజిల్లపై లీటరుకు 29 పైసల వంతున ధర పెంచుతున్నట్టు ప్రకటించాయి. నిన్న కాక మొన్న జూన్ 9న పెట్రోలుపై లీటరుకు 23-25 పైసలు, డీజిల్పై 23-27 పైసల మేర ధరను చమురు కంపెనీలు పెంచాయి. ఒక్కరోజు గ్యాప్ ఇచ్చి వినియోగదారులపై మరోసారి భారం మోపాయి. హైదరాబాద్లో ‘సెంచరీ’ తాజా పెంపుతో హైదరాబాద్లో పెట్రోలో ధర వంద దాటనుంది. జూన్ 9న పెరిగిన పెట్రోల్ ధరలతో హైదరాబాదులో లీటరు పెట్రోలు ధర రూ.99.31, డీజిల్ రూ. 94.26గా నమోదు అయ్యింది. తాజాగా 29 పైసలు పెంచడంతో భాగ్యనగరంలో కూడా పెట్రోలు సెంచరీని దాటింది. ఇప్పటికే ఏపీలో పెట్రోలు ధరలు వందను దాటేశాయి. ధరల పెరుగుదలలో ఇదే ట్రెండ్ కొనసాగితే డీజిల్ వందను దాటడానికి ఎక్కువ రోజులు పట్టదు. ఫలితాల తర్వాత ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెలువడినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎడాపెడా పెట్రోలు ధరలు పెరుగుతూనే ఉన్నాయి. మే 4 నుంచి జూన్ 11 వరకు 23 సార్లు పెట్రోలు, డీజిల్ ధరలు పెరిగాయి. జూన్లో ఇప్పటి వరకు పెట్రోల్ రిటైల్ ధర లీటరుకు సుమారు రూ. 1.37 రూపాయలు పెరిగింది. చదవండి : ఎలక్ట్రిక్ సైకిల్... 70 కి.మీ మైలేజ్ -
Petrol, diesel prices: పెట్రో బాంబు, రికార్డు ధర
సాక్షి, ముంబై: పెరుగుతున్న ఇంధన ధరలకు అదుపులేకుండా పోతోంది. మంగళవారం స్థిరంగా ఉన్న ధరలు బుధవారం మరో రికార్డు స్థాయికి చేరాయి. పెట్రోలు, డీజిల్ ధరలను పెంచుతూ , ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీలు నిర్ణయించాయి. బుధవారం (జూన్ 9)పెట్రోలు ధరను లీటరుకు 23-25 పైసలు, డీజిల్పై 23-27 పైసలు మేర పెంచాయి. మే 4 నుంచి 22 వ పెంపు. ఈ నెలలో ఇప్పటి వరకు పెట్రోల్ రిటైల్ ధర లీటరుకు సుమారు 1.07 రూపాయలు పెరిగింది. తాజాగా పెంపుతో ఢిల్లీలో పెట్రోల్ ధర లీటరుకు రూ .95.56 (25 పైసల పెరుగుదల) డీజిల్ ధర లీటరుకు రూ .86.47 స్థాయికి చేరింది. ముంబైలో పెట్రోలు లీటరుకు 102 (రూ.101.76) రూపాయల వద్ద అత్యధిక స్థాయిని తాకింది. అలాగే దేశంలో రాజస్థాన్, శ్రీగంగానగర్లో పెట్రోలు రూ.106.64 వద్ద, డీజిల్ రూ.99.50వద్ద గరిష్ట ధరను నమోదు చేయడం గమనార్హం. దేశంలోని నగరాల్లో పెట్రోలు, డీజిల్ ధరలు లీటరుకు ముంబైలో పెట్రోలు ధర రూ.101.76 డీజిల్ రూ. 93.85 చెన్నైలో పెట్రోలు ధర రూ.96.94, డీజిల్ రూ. 91.15 బెంగళూరులో పెట్రోలు ధర రూ.99.75, డీజిల్ రూ. 91.67 కోలకతా పెట్రోలు ధర రూ. 95.52, డీజల్ రూ. 89.32 హైదరాబాదులో పెట్రోలు ధర రూ.99.31, డీజిల్ రూ. 94.26 అమరావతిలో పెట్రోలు ధర రూ101.73, డీజిల్ రూ. 96.08 విశాఖపట్టణంలో పెట్రోలు ధర రూ100.49, డీజిల్ రూ. 94.88 చదవండి: బ్యాంకుల జోరు, నిఫ్టీ ఆల్టైం హై బాబోయ్ పెట్రోల్.. భవిష్యత్తు హైపర్ ఛార్జర్లదే -
Petrol, diesel price today: పెట్రో ధరల రికార్డు
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో పెట్రోలు, డీజిల్ ధరలు సోమవారం మరింత ఎగిసాయి. ఇప్పటికే ఆరు రాష్ట్రాల్లో సెంచరీ మార్క్ దాటేసిన పెట్రోలు ధరలు రికార్డు స్తాయిల వద్ద వాహన దారుల గుండెల్లో గుబులు రేపుతున్నాయి. తాజాగా పెట్రోల్పై లీటరుకు 28 పైసలు, డీజిల్పై 27 పైసలు పెరిగినట్లు ఆయిల్ కంపెనీలు ప్రకటించాయి. దీంతో దేశ రాజధాని నగరం ఢిల్లీలో పెట్రోలు ధర రూ. 95.37 ,డీజిల్ ధర రూ. 86.28 పలుకుతోంది. ఫలితంగా గడిచిన నెల రోజుల్లో పెట్రోలు 5 రూపాయలు, డీజిల్ 6 రూపాయలు పెరిగింది. పలు నగరాల్లో పెట్రోలు , డీజిల్ ధర లీటరుకు ముంబైలో పెట్రోల్ రూ.101.52 , డీజిల్ రూ. 93.58 చెన్నైలో పెట్రోల్ రూ. 96.71, డీజిల్ రూ. 90.92 కోల్కతాలో పెట్రోల్ రూ.95.28, డీజిల్ రూ.89.07 హైదరాబాదులో పెట్రోల్ రూ .99.06 డీజిల్ రూ. 93.99 ఆరు రాష్ట్రాల్లో సెంచరీ ఆదివారం పెట్రోల్ లీటరుకు 21 పైసలు, డీజిల్ 20 పైసలు పెరిగిన సంగతి తెలిసిందే. దీంతో దేశంలోని ఆరు రాష్ట్రాలు/కేంద్రపాలితప్రాంతాల్లో పెట్రోల్ ధర రూ. 100 మార్కును దాటేసింది. రాజస్తాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, లద్దాఖ్లు ఉన్నాయి. మే 4 నుంచి ధరలు పెరగడం ఇది 21వ సారి కావడం గమనార్హం. మొత్తంగా పెట్రోల్ ధర రూ. 4.97 పెరగ్గా, డీజిల్ ధర రూ. 5.55 పెరిగింది. -
Petrol, Diesel Prices: వరుసగా రెండో రోజూ బాదుడు
సాక్షి, న్యూఢిల్లీ : పలు రాష్ట్రాల్లో సెంచరీ దాటి పరుగులు పెడుతున్న ఇంధన ధరలను వాహనదారులకు ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. వరుసగా రెండో రోజు కూడా పెట్రోలు, డీజిల్ ధరలను పెంచుతూ చమురు కంపెనీలు నిర్ణయించాయి. మంగళవారం పెట్రోల్పై 26 పైసలు, డీజిల్ 23 పైసలు పెంచాయి. తాజాగా పెరిగిన ధరలతో దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.94.49, లీటర్ డీజిల్ రూ.85.38కు చేరింది. దేశ ఆర్థిక రాజధాని ముంబై నగరంలో లీటర్ పెట్రోల్ ధర రూ.101కి చేరువైంది. అటు రాజస్థాన్లోని శ్రీగంగానగర్ జిల్లాలో ప్రస్తుతం లీటర్ పెట్రోల్ ధర రూ.105.52కు చేరగా, డీజిల్ ధర లీటరుకు ధర రూ.98.32 పలుకుతోంది. ప్రధాన నగరాల్లో పెట్రోలు, డీజిల్ ధరలు లీటరుకు ముంబైలో పెట్రోల్ రూ.100.72, డీజిల్ రూ.92.69 చెన్నైలో పెట్రోల్ రూ.95.99, డీజిల్ రూ.90.12 కోల్కతాలో పెట్రోల్ రూ.94.50, డీజిల్ రూ.88.23 బెంగళూరులో పెట్రోల్ రూ.97.64, డీజిల్ రూ.90.51 హైదరాబాద్లో పెట్రోల్ రూ.98.20, డీజిల్ రూ.93.08 అమరావతిలో పెట్రోలు రూ. 100.72, డీజిల్ రూ. 94.99 వైజాగ్లో పెట్రోలు రూ. 99.42, డీజిల్ రూ. 93.73 చదవండి : లాభాల జోరు: సరికొత్త గరిష్టానికి నిఫ్టీ -
సెంచరీ దాటేసిన పెట్రోలు: ఏయే రాష్ట్రాల్లో?
సాక్షి, న్యూఢిల్లీ : దేశంలో పెట్రోలు, డీజిల్ ధరలు మళ్లీ పెరిగాయి. మే 4 నుండి పెరుగుతూ వస్తున్న ధరలు శుక్రవారం ఎనిమిదవసారి తిరిగి వినియోగదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. శుక్రవారం పెట్రోలుపై 29 పైసలు, డీజిల్ ధరలు 34 పైసలు పెరిగాయి. తాజా పెంపుతో కొన్ని ప్రధాన నగరాల్లో పెట్రోల్ ధరలు రూ.100 దాటేశాయి. మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్ రాష్ట్రాల్లో పెట్రోల్ ధర లీటరుకు 100 రూపాయలను దాటేసింది. ముంబైలో పెట్రోల్ ధర లీటరుకు రూ .100 లకు చేరువలో ఉంది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్ ధర లీటరుకు 92.34 రూపాయలుగా ఉండగా, డీజిల్ ధర లీటరుకు 82.95 రూపాయలు పలుకుతోంది. ఈ నెల 4 నుంచి ఇప్పటి వరకు పెట్రోల్పై రూ..1.94, డీజిల్పై రూ.2.22 పెరిగింది. ముంబైలో పెట్రోల్ ధరరూ .98.65, డీజిల్రూ .90.11 చెన్నైలో పెట్రోల్ ధర రూ .94.09 రూ .87.81 . కోల్కతాలో రూ .92.44 కు లీటరుకు రూ .85.79 అమరావతిలో పెట్రోలు ధర రూ. 98.49, డీజిల్ ధర రూ. 92.39 హైదరాబాబాదులో పెట్రోలు ధర రూ. 95.97,డీజిల్ ధర రూ. 43 పెట్రోల్ 100 రూపాయలు దాటిన రాష్ట్రాలు మహారాష్ట్రలోని పర్భాని ప్రాంతంలో పెట్రోల్ లీటరుకు రూ .101, మధ్యప్రదేశ్లోని రేవాలో రూ .102.69, రాజస్థాన్లో గంగానగర్లో పెట్రోల్ ధర లీటరుకు 103.28 రూపాయలుగా ఉంది. -
Petrol Diesel Prices Hike: వరుసగా రెండో రోజు పెట్రో బాదుడు
సాక్షి, ముంబై : దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా రెండో రోజు పెరిగాయి. కొంతకాలంగా నిలకడగా ఉన్న పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరుగుదల బాట పట్టాయి. తాజాగా లీటర్ పెట్రోల్పై 15 పైసలు పెరిగింది. లీటర్ డీజిల్పై 18 పైసలు పెరిగింది. ఢిల్లీలో పెట్రోలుపై 30 పైసలు, డీజిల్ 21 చొప్పున ధర పెరిగింది దీంతో దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ. 90.55 కి చేరగా, డీజిల్ ధర రూ. 80.91కి చేరింది. ప్రధాన నగరాల్లో పెట్రోలు, డీజిల్ ధరలు లీటరుకు ముంబైలో పెట్రోల్, రూ .97.12, డీజిల్ రూ .88.19 చెన్నై పెట్రోల్ రూ .92.70, డీజిల్ రూ .86.09 కోల్కతాలో పెట్రోల్ రూ .90.92, డీజిల్రూ .83.98 హైదరాబాద్లో పెట్రోల్ ధర రూ. 94.34.డీజిల్ ధర రూ.88.46 అమరావతిలో పెట్రోల్ ధర రూ. 96.90.డీజిల్ ధర రూ.90.50 విజయవాడలో పెట్రోల్ ధర రూ. 96.49 డీజిల్ ధర రూ.90.11 -
తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు
సాక్షి,ముంబై: నాలుగు రోజుల విరామం తరువాత మళ్లీ పెట్రోలు ధరలు స్వల్పంగా క్షీణించాయి. గ్లోబల్ మార్కెట్లో క్రూడ్ ధరలు దిగి రావడంతో పెట్రోల్, డీజిల్ ధరలు మంగళవారం (మార్చి 30) స్వల్పంగా తగ్గాయి. పెట్రోల్ , డీజిల్ ధరలను తగ్గిస్తూచమురు మార్కెటింగ్ సంస్థలు నిర్ణయించాయి. పెట్రోలుపై లీటరుకు 22 పైసలు , డీజిల్పై లీటరుకు 23 పైసలు చొప్పున తగ్గించాయి. దీంతో దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్ ధర ప్రస్తుతం లీటరుకు 90.56 రూపాయలుగా ఉంది. డీజిల్ లీటరుకు 80.87 రూపాయలకు చేరింది. వివిధ మెట్రో నగరాల్లో పెట్రోలు, డీజిల్ ధరలు ముంబైలో పెట్రోల్ ధర రూ. 96.98, డీజిల్ ధర 87.96 కోల్కతాలో పెట్రోల్ రూ. 90.77 డీజిల్ ధర రూ 83.75 (సోమవారం ధర కంటే 23 పైసలు) చెన్నైలో పెట్రోల్ ధర రూ. 92.58(19 పైసలు తగ్గింది) డీజిల్ ధర రూ. 85.88 22 పైసలు తగ్గింది హైదరాబాద్ పెట్రోలు ధర రూ. 94.16, డీజిల్ రూ. 88.20 అమరావతి పెట్రోలు ధర రూ. 96.77, డీజిల్ ధర రూ. 90.28 -
వరుసగా రెండో రోజు తగ్గిన పెట్రోలు ధర
సాక్షి,న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా రెండో రోజూ తగ్గాయి. మార్చి 25, గురువారం పెట్రోల్ ధర లీటరుకు 21 పైసలు, డీజిల్పై 20 పైసలు చొప్పున తగ్గిస్తూ చమురు రంగ సంస్థలు నిర్ణయించాయి. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పడిపోవడంతో దేశీయ చమురు సంస్థలు కూడా పెట్రో ధరలను ఈ ఏడాదిలో తొలిసారిగా నిన్న(మార్చి24, బుధవారం) తగ్గించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో గురువారం కూడా ఇంధన ధరలు స్వల్పంగా తగ్గాయి. తాజా సవరణతో దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోలు ధర లీటరుకు. 90.99 నుండి లీటరుకు. 90.78 కు చేరింది. డీజిల్ 20 పైసలు తగ్గి 81.30 నుండి. 81.10 స్థాయికి చేరింది. వివిధ నగరాల్లో పెట్రోలు, డీజిల్ ధరలు లీటరుకు ముంబైలో పెట్రోలు ధర రూ. 97.19, డీజిల్ ధర 88.20 చెన్నైలో పెట్రోల్ రూ.92.77, డీజిల్ రూ.86.10 కోల్కతాలో పెట్రోల్ రూ.90.98, డీజిల్ రూ.83.98 బెంగళూరులో పెట్రోల్ రూ.94.04, డీజిల్ రూ.86.21 హైదరాబాద్లో పెట్రోల్ రూ.94.39 డీజిల్ రూ.88.45 అమరావతి పెట్రోల్ రూ.96.99, డీజిల్ రూ.90.52 -
గ్యాస్ సిలిండర్ పేలుళ్లు : జాగ్రత్తలు తీసుకోండిలా..
సాక్షి, సిటీబ్యూరో: వంట గ్యాస్ వినియోగించడంలో నిర్లక్ష్యం, భద్రతా ప్రమాణాలపై అవగాహన లోపం, గ్యాస్ లీకేజీలపై ఏమరుపాటు కారణంగా భారీ మూల్యాన్నే చెల్లించుకోవాల్సి వస్తోంది. ప్రధాన ఆయిల్ కంపెనీలు భద్రతా ప్రమాణాలను గాలికి వదిలేయడం, గ్యాస్ డిస్ట్రిబ్యూటర్లు అత్యవసర సేవల నిమిత్తం టెక్నికల్ సిబ్బందిని నియమించుకోకపోవడం వారి నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. ఎజెన్సీల వద్ద గ్యాస్ లీకేజీ, ఇతరత్రా వినియోగదారుల కాల్స్ కుప్పలు తెప్పలుగా పెండింగ్లో పడిపోతున్నాయి. డెలివరీ బాయ్స్ రిపేరు సిబ్బందిగా అవతారమెత్తి ప్రైవేటు టెక్నీషియన్స్ కంటే అదనంగా సర్వీస్ చార్జీలు వసూలు చేయడం పరిపాటిగా తయారైంది. ఒకవైపు ఆయిల్ కంపెనీల నిర్లక్ష్యం, మరోవైపు వినియోగదారుల తప్పిదాలు వంటింట్లో విస్ఫోటనాలకు దారి తీస్తున్నాయి. బంజారాహిల్స్ రోడ్ నంబర్ 11లోని ఒక గుడిసెలో గురువారం గ్యాస్ సిలిండర్ పేలింది. పేలుడు ధాటికి గుడిసె దగ్ధమైంది. ఇంట్లో ఎవరూ లేక పోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఓల్డ్బోయిన్పల్లి ఈద్గా సమీపంలోని రామకష్ణ పాఠశాల వద్ద ఒక ఇంట్లో రెండు రోజుల క్రితం గ్యాస్ సిలిండర్ పేలి ముగ్గురు తీవ్రగాయాల పాలయ్యారు. మంటల ధాటికి ఇళ్లల్లోని ఫర్నిచర్సహా ఇతర వస్తువులు కాలిబూడిదయ్యాయి. ఈ రెండు సంఘటనలను బట్టిచూస్తే వంటింట్లో వంట గ్యాస్ విస్ఫోటంగా తయారైంది. పరీక్షలో నిర్లక్ష్యం... ► వంట గ్యాస్ సిలిండర్ పరీక్షల్లో నిర్లక్ష్యం కనిపిస్తోంది. సిలిండర్ జీవిత కాలపరిమితి పదేళ్లు. ఆ తర్వాత తిరిగి పరిశీలించి సిలిండర్ ప్రమాణాల ను బట్టి మరో ఐదేళ్లు రీఫిల్లింగ్ చేయడమా? లేదా తుప్పు కింద పడేయడం చేయాల్సి ఉంటుంది. ► రీఫిల్లింగ్ జరిగే ప్రతిసారి సిలిండర్ రీఫిల్ బాడీ ఇతరత్రా వాటిని టెస్ట్ చేయాల్సి ఉంటుంది. కానీ, ఆయిల్ కంపెనీలు టెర్మినల్కు వచ్చిన సిలిండర్ను మొక్కుబడి పరిశీలనతో రీఫిల్లింగ్ చేసి సరఫరా చేస్తోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. సిలిండర్ పై డ్యూడేట్... ► వంట గ్యాస్ సిలిండర్ భద్రత ప్రమాణాలను కాలపరిమితి (డ్యూ డేట్) బట్టి గుర్తించవచ్చు. ► సిలిండర్పై త్రైమాసాకానికి ఒక కేటగిరిగా అక్షరాలు డ్యూ డేట్గా ఉంటాయి. అక్షరంతో పాటు అంకె అంటే కాలపరిమితి గడువు సంవత్సరం కూడా ఉంటుంది. ► ఉదాహరణకు సిలిండర్ పై ఏ-21 బీ-21, సీ-21, డీ-21 అనే అక్షరాలు ఉంటాయి. ఏ-అంటే జనవరి నుంచి మార్చి వరకు, బీ అంటే ఏప్రిల్ నుంచి జూన్ వరకు, సీ అంటే జూలై నుంచి సెప్టెంబర్ వరకు, డీ అంటే అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు పరిగణించాలి. పక్కన ఉన్న అంకెను సంవత్సరంగా గుర్తించాలి. ఇవీ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ♦సిలిండర్ డోర్ డెలివరీ కాగానే సీల్ కరెక్టుగా ఉందా, లేదా చూసుకోవాలి. సిలిండర్ కాలపరిమితి పరిశీలించాలి. ♦సీల్ తీయగానే ఓపెన్ రింగ్ కట్ అయినా...గ్యాస్ వాసన వచ్చినా తిరిగి సిలిండర్ వెనక్కి పంపాలి. రెగ్యులేటర్, బర్నర్ను ఎప్పటి కప్పుడు తనిఖీ చేసుకోవాలి. రెండేళ్లకు ఒకసారి స్టవ్ను మార్చు కోవాలి. ♦ వంట గ్యాస్ స్టౌ వినియోగించని సమయంలో రెగ్యులేటర్ను ఆఫ్ చేయాలి. రాత్రి పూట తప్పనిసరిగా రెగ్యులేటర్ ఆఫ్లో ఉంచాలి. ♦వంట గది తలుపుల కింద కనీసం ఒక అంగుళం ఖాళీగా ఉండే విధంగా చూడాలి. ♦ గ్యాస్ లీకేజీ జరిగినప్పుడు తప్పనిసరిగా వాసన వస్తుంది. అలాంటి సమయంలో ఎలాంటి ఏమరుపాటు పనికి రాదు. ♦ విద్యుత్ స్విచ్లు ముట్టుకోవడం, అగ్గిపుల్ల వెలిగించడం చేయకూడదు. విద్యుత్ స్విచ్లు ఆన్ చేయడం, ఆఫ్ చేయడం చేయవద్దు. స్విచ్ ఆన్ ఆఫ్ చేస్తే వచ్చే చిన్నపాటి స్పార్క్(మెరుపు) ప్రమాదానికి దారితీస్తోంది. ♦ గ్యాస్ వాసన పసిగట్టగానే తక్షణం వంటింటి తలుపులు, కిటికీలు బార్లా తెరిచి గ్యాస్ను బయటకు పంపే ప్రయత్నం చేయాలి. ♦ ఆ తర్వాత గ్యాస్ లీక్ అవుతున్నట్లు గుర్తిస్తే సిలిండర్ను బయటికి తీసుకెళ్లి బహిరంగ ప్రదేశంలో సేఫ్టీ పిన్ బిగించి ఉంచాలి. ♦ సిలిండర్ కంటే ఎత్తులో స్టవ్ ఉండాలి. సిలిండర్ను నిలువుగానే పెట్టాలి. ♦ వంట గదిలో ఫ్రిజ్ పెట్టవద్దు. అందులో ఉండే థర్మోస్టాట్ వల్ల ఆటో కటాఫ్ అవుతోంది. గ్యాస్ లీకైన సమయంలో ఇటువంటి ప్రమాదానికి దారితీస్తోంది. గుడిసెలో పేలిన సిలిండర్లు బంజారాహిల్స్: బంజారాహిల్స్ రోడ్ నెం. 11లోని ఉదయ్నగర్ బస్తీలో గురువారం ఉదయం తాళం వేసిన గుడిసెలో ప్రమాదవశాత్తు సిలిండర్లు పేలడంతో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.... ఉదయ్నగర్ బస్తీలో సావిత్రి అనే మహిళ తన ఇంటిపై గుడిసెలు వేసి అద్దెకిచ్చింది. గోపాల్–మంగమ్మ దంపతులు ఓ గుడిసెలో, నర్సింహ అనే వ్యక్తి మరో గుడిసెలో నివాసం ఉంటున్నారు. గురువారం ఉదయం వారు గుడిసెకు తాళం వేసి పనికి వెళ్లిపోయారు. ఉదయం 10 గంటల ప్రాంతంలో ఓ గుడిసెలో ప్రమాదవశాత్తు రెండు గ్యాస్ సిలిండర్లు పేలిపోయాయి. ఈ ఘటనలో ఇంటి యజమాని సావిత్రికి స్వల్ప గాయాలయ్యాయి. మరో గుడిసెలో ఉన్న సిలిండర్ పేలకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో అప్రమత్తమైన స్థానికులు ఫైర్ స్టేషన్కు సమాచారం అందించారు. సిబ్బంది అక్కడికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చారు. కాగా అప్పటికే గుడిసెలు పూర్తిగా కాలి బూడిదయ్యాయి. ఈ ఘటనలో రూ. లక్ష నగదు కాలిపోయినట్లు మంగమ్మ ఆవేదన వ్యక్తం చేసింది. కళ్లముందే డబ్బు, సామగ్రి, నిత్యావసర సరుకులు అగ్నికి ఆహుతి కావడంతో బాధితులు బోరున విలపించారు. బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
గ్యాస్ ‘బండ’ భారం.. మరో రూ.25 పెంపు
సాక్షి, హైదరాబాద్: ఒక పక్క పెట్రోల్, డీజిల్ ధరలు రాకెట్ వేగంతో దూసుకెళుతుంటే, మరో పక్క గృహావసర గ్యాస్ సిలిండర్ ధర కూడా వాటితో పోటీ పడుతోంది. ఈ నెలలోనే సిలిండర్పై రూ.75 మేర పెంచిన ఆయిల్ కంపెనీలు గురువారం మళ్లీ మరో రూ.25 మేర పెంచేశాయి. దీంతో హైదరాబాద్లో 14.2 కేజీల సిలిండర్ ధర రూ.846.50కి చేరింది. ఒక్క నెలలోనే సిలిండర్ ధర ఏకంగా రూ.100 మేర పెరిగిపోవడంతో సామాన్యుడికి చుక్కలు కనపడుతున్నాయి. 3 నెలల వ్యవధిలో రూ. 200 పెంపు నవంబర్లో సిలిండర్ ధర రూ.646.50 ఉండగా, డిసెంబర్లో ఏకంగా రూ.100 మేర పెరిగిపోయింది. దీంతో ధర రూ.746.50కి చేరింది. జన వరిలో ఈ ధరలు స్థిరంగా కొనసాగినా, ఫిబ్రవరి 4న రూ.25, 15న మరోసారి రూ.50 చొప్పున ఆయిల్ కంపెనీలు బాదేశాయి. దీంతో సిలిండర్ ధర రూ.821.50కి చేరింది. తాజాగా మళ్లీ రూ.25 పెంచడంతో అదికాస్తా రూ.846.50 అయ్యింది. ఇలా ఈ మూడు నెలల వ్యవధిలోనే ఏకంగా రూ.200 మేర పెరిగిపోయిం దన్నమాట. రాష్ట్రంలో ప్రస్తుతం 1.18 కోట్ల గృహా వసర సిలిండర్లు వినియోగంలో ఉండగా ప్రతిరోజూ సగటున 1.20 లక్షల సిలిండర్లు డెలివరీ చేస్తున్నారు. ఈ సిలిండర్పై ఇవ్వాల్సిన సబ్సిడీకి కేంద్ర ప్రభుత్వం క్రమంగా కోత పెడుతూ వస్తోంది. గత ఏడాది మార్చి ముందు వరకు ఒక్కో సిలిండర్పై రూ.220 వరకు సబ్సిడీ జమ చేసిన కేంద్రం.. ప్రస్తుతం కేవలం రూ.40 మాత్రమే జమ చేస్తోంది. అంటే వినియోగదారుడిపై సబ్సిడీ కోత భారం ప్రస్తుతం ఒక్కో సిలిండర్కు రూ.180 పడుతోందన్నమాట. దీనికి ఈ మూడు నెలల్లో పెరిగిన ధరల భారం రూ.200 కలిపితే మొత్తం రూ.380 మేర గ్యాస్ భారం పడినట్లయింది. ఓ పక్క సబ్సిడీలో కోతలు, మరోపక్క ధర పెంపు వాతలతో గృహ వినియోగదారులు లబోదిబోమంటున్నారు. -
బాబోయ్ పెట్రోలు : 11వ రోజూ వాత
సాక్షి, న్యూఢిల్లీ: వరుసగా 11వ రోజు కూడా ఇంధన ధరలను పెంచుతూ చమురు సమస్థలు నిర్ణయించాయి. శుక్రవారం పెట్రోల్, డీజిల్ ధరలు లీటరుకు పెట్రోల్పై 31 పైసలు పెంచగా, డీజిల్ 33 పైసలు చొప్పున పెరిగింది. దీంతో దేశంలోని అన్ని మెట్రో నగరాల్లోరికార్డు స్థాయిల వద్ద పెట్రో ధరలు మండిపోతున్నాయి. దేశ రాజధానిలో పెట్రోల్ ధర లీటరుకు 90.19 కు చేరుకుంది. డీజిల్ రేటు లీటరుకు. 80.60 పలుకుతోంది. రూ. 100 దాటిన రాష్ట్రాలు మరోవైపు ఇప్పటికే రాజస్థాన్లో పెట్రోల్కు లీటరుకు రూ.100 స్థాయిని దాటేసింది. కాగా గురువారం మధ్యప్రదేశ్లో కూడా పెట్రోల్ ధర లీటరుకు సెంచరీ మార్క్ను అధిగమించింది. మధ్యప్రదేశ్లోని అనుప్పూర్లో పెట్రోల్ ధర లీటరుకు రూ.100.25 దాటి పరుగులు తీయడం గమనార్హం. నేడు (శుక్రవారం) ఇక్కడ పెట్రోలు ధర రూ.100.57 వద్ద, డీజిల్ 91.04 వద్ద కొనసాగుతున్నాయి. పలు నగరాల్లో పెట్రోల్,డీజిల్ ధరలు లీటరుకు ముంబైలో పెట్రోల్ రూ. 96.32 కు, డీజిల్ రూ. 87.32 చెన్నై పెట్రోల్ రూ. 92.25, డీజిల్ రూ. 85.63 బెంగళూరు పెట్రోల్ రూ. 93.21, డీజిల్ రూ. 85.44 హైదరాబాద్ పెట్రోల్ రూ. 93.78, డీజిల్ రూ. 87.91 అమరావతి పెట్రోల్ రూ. 96.34, డీజిల్ రూ. 89.94 -
పెట్రో వాత : త్వరలో 150 రూపాయలకు?
సాక్షి, న్యూఢిల్లీ: ఇంధన ధరల సెగ కొనసాగుతోంది. వరుసగా పదవ రోజు కూడా పెరిగిన ధరలు వాహనదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. రోజు రోజుకు పెరుగుతున్న పెట్రోలు, డీజిల్ ధరల భారంపై వారి గుండెలు బేజారవుతున్నాయి. తాజాగా పెట్రోలుపై 35 పైసలు, డీజిల్పై 32-34 పైసల చొప్పున భారం పెరిగింది. దీంతో దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లో రికార్డు స్థాయిలో ధరలు కొనసాగుతున్నాయి. రోజుకు 30 పైసల చొప్పున పెట్రోలు ధర పెరుగుతూ పోతే, మరో ఆరు నెలల్లో లీటరుకు 150 రూపాయలకు చేరే అవకాశం ఉందని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. ఇప్పటికే రాజస్థాన్లోని కొన్ని ప్రాంతాల్లో పెట్రో బాదుడు సెంచరీ దాటేసిన సంగతి తెలిసిందే. మరోవైపు హద్దే లేకుండా పెరుగుతున్న ధరలపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. (పెట్రో బాదుడు : రూ.100 దాటేసింది) దేశం రాజధాని నగరం ఢిల్లీలో పెట్రోల్ ధర రూ.89.88కు చేరగా, డీజిల్ ధర రూ. 80.27గా ఉంది. వాణిజ్య రాజధాని ముంబైలో పెట్రోల్ ధర లీటరుకు రూ. 96.32 వద్ద రికార్డు స్థాయికి చేరింది. డీజిల్ ధర రూ. 87.32 గా ఉంది. పలు నగరాల్లో పెట్రోలు, డీజిల్ ధరలు లీటరుకు హైదరాబాద్ పెట్రోల్ ధర రూ.93.45 డీజిల్ ధర రూ.87.55 అమరావతి పెట్రోలు ధర రూ. 96.03, డీజిల్ ధర రూ. 89.60 కొలకత్తాలో పెట్రోల్ ధర రూ. 91.11, డీజిల్ ధర రూ.83.86 చెన్నైలో పెట్రోల్ ధర రూ. 91.98, డీజిల్ ధర రూ.85.31 బెంగుళూరులో పెట్రోల్ ధర రూ. 92.89, డీజిల్ ధర రూ. 85.09 -
భగ్గుమంటున్న పెట్రోలు, డీజిల్ ధర
సాక్షి, ముంబై : పెట్రోలు, డీజిల్ ధరలు భగ్గుమంటున్నాయి. వరుసగా తొమ్మిదవ రోజు ఈ రోజు (బుధవారం, ఫిబ్రవరి 17) కూడా ఇంధన ధరలు పరుగందుకున్నాయి. దేశవ్యాప్తంగా పెట్రోలు, డీజిల్పై లీటరుకు మరో 25 పైసల మేర ధరలను పెంచుతూ చమురు కంపెనీలు నిర్ణయించాయి. పెట్రోల్, డీజిల్ ధరలు రోజురోజుకు ఆకాశాన్నంటుతూ వాహనదారుల గుండెల్లో బాంబులు పేల్చుతున్నాయి . దీంతో వాహనాలను బయటకు తీయాలంటేనే భయపడే పరిస్థితి నెలకొంది. దేశంలోని వివిధ నగరాలలో పెట్రోల్, డీజిల్ ధరలు లీటరుకు హైదరాబాద్ పెట్రోల్ ధర రూ.93.10 డీజిల్ ధర రూ.87.20 అమరావతి పెట్రోలు ధర రూ. 95.69 డీజిల్ ధర రూ. 98.52 ఢిల్లీలో పెట్రోల్ ధర రూ. 89.54, డీజిల్ ధర రూ. 79.95 కొలకత్తాలో పెట్రోల్ ధర రూ. 90.78, డీజిల్ ధర రూ.83.54 ముంబైలో పెట్రోల్ ధర రూ. 96.00, డీజిల్ ధర రూ. 86.98 చెన్నైలో పెట్రోల్ ధర రూ. 91.68, డీజిల్ ధర రూ.85.01 బెంగుళూరులో పెట్రోల్ ధర రూ. 92.54, డీజిల్ ధర రూ. 84.75 -
ఏడో రోజూ పెట్రో మంట
సాక్షి, న్యూఢిల్లీ : పెట్రో ధర మంటలు వినియోగదారులను వణికిస్తున్నాయి. వరుసగా ఏడో రోజు కూడా ధరలను ప్రభుత్వ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు నిర్ణయించాయి. దీంతో సోమవారం (ఫిబ్రవరి 15) దేశ వ్యాప్తంగా వరుసగా ఏడవ రోజు పెట్రోల్, డీజిల్ ధరలను పెంచాయి. పెట్రోల్ ధర 23-26 పైసలు, డీజిల్పై 28 నుంచి 30 పైసల మేర ధరలు పెరిగాయి. తాజా పెంపుతో ఢిల్లీలో పెట్రోల్ ధర లీటరుకు రూ.88.73కు పెరగ్గా డీజిల్ లీటరుకు రూ .79.35 (29 పైసల పెరుగుదల)కు చేరుకుంది. గత ఏడు రోజుల్లో, పెట్రోల్ ధర లీటరుకు 2.06 రూపాయలు పెరగగా, డీజిల్ రేటు లీటరుకు 2.56 రూపాయలు పెరిగింది. పలు నగరాల్లో పెట్రోలు ,డీజిల్ ధరలు లీటరుకు ముంబై పెట్రోల్ రూ .95.46, డీజిల్ రూ .86.34 కోల్కతాలో పెట్రోల్ రూ. 90.25, డీజిల్ రూ .82.94 చెన్నైలో పెట్రోల్ రూ. 91.19, డీజిల్ రూ .84.44 హైదరాబాద్లో పెట్రోల్ రూ. 92.53, డీజిల్ రూ.86.55 అమరావతిలో పెట్రోల్ రూ. 95.13, డీజిల్ రూ. 88.63 -
ఐదో రోజూ ఆగని సెగ : పెట్రో ధరలు ఆల్టైం హై
సాక్షి, ముంబై: పెట్రోల్, డీజిల్ ధరల బాదుడు వరుసగా ఐదో రోజు కొనసాగుతోంది. వినియోగదారుల గుండెలు గుభిల్లుమనేలా ఇంధన ధరలు ఆల్టైమ్ గరిష్ఠ స్థాయికి చేరుకున్నాయి. గత మంగళవారం నుంచి పరుగు తీస్తున్న ధరలు శనివారం కూడా అదే రేంజ్లో పెరిగాయి. వివిధ నగరాల్లో 30 నుంచి 51 పైసలు, డీజిల్పై 36 పైసల నుంచి 60 పైసల మేర పెంచుతూ ఆయిల్ కంపెనీలు నిర్ణయించాయి. దీంతో వాహనదారులు బెంబేలెత్తిపోతున్నారు. (Petrol Diesel Prices : వాహనదారులకు చుక్కలే!) ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు లీటరుకు ఢిల్లీలో పెట్రోల్ రూ.88.44, డీజిల్ రూ.78.74 ముంబైలో పెట్రోల్ రూ.94.93, డీజిల్ రూ.85.70 కోల్కతాలో పెట్రోల్రూ.89.73, డీజిల్రూ. 82.33 చెన్నైలో పెట్రోల్ రూ.90.70, డీజిల్ రూ.83.86 బెంగళూరులో పెట్రోల్ రూ.91.40, డీజిల్ రూ.83.47 హైదరాబాద్లో పెట్రోల్ రూ.91.96, డీజిల్ రూ. రూ.85.89 అమరావతిలో పెట్రోల్ ధర రూ.94.58 డీజిల్ రూ.87.99 మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు (క్రూడాయిల్) ధరలు పెరిగాయి. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్కు 2.49 శాతం పెరుగుదలతో 62.66 డాలర్లకు చేరింది. డబ్ల్యూటీఐ క్రూడాయిల్ ధర బ్యారెల్కు 2.54 శాతం పెరుగుదలతో 59.72 డాలర్లు చేరుకుంది. (పెట్రోలుపై రూ. 5 తగ్గించిన బీజేపీ సర్కార్) -
పెట్రో మంట : వాహనదారులకు చుక్కలే!
సాక్షి, ముంబై: వరుసగా రికార్డు స్థాయికి చేరుతున్న ఇంధన ధరలు వాహనదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలను శుక్రవారం (ఫిబ్రవరి 12) వరుసగా నాలుగో రోజూ పెంచారు. దేశంలోని ప్రధాన నగరాల్లో పెట్రోల్ రేటును లీటరుకు 26-29 పైసలు పెంచగా, డీజిల్ ధర 34-38 పైసలు చొప్పున పెరిగి పెరిగింది. గత 12 రోజుల్లో దేశ రాజధానిలో పెట్రోల్ లీటరుకు రూ.4.13, డీజిల్ రూ.4.26 పెరిగింది. ఫిబ్రవరిలో ధరలు పెరగడం ఇది ఆరోసారి. దీంతో ఢిల్లీలో పెట్రోలు 88 రూపాయల మార్క్ను అధిగమించాయి. (మూడో రోజూ బాదుడు : వాహనదారులు బెంబేలు) ప్రధాన నగరాల్లో పెట్రోలు, డీజిల్ ధరలు లీటరుకు ఢిల్లీలో పెట్రోల్ లీటర్కు 88.14, డీజిల్ రూ.78.38 ముంబైలో పెట్రోల్ రూ.94.64, డీజిల్ రూ.85.32, చెన్నైలో పెట్రోల్ రూ.రూ.90.44, డీజిల్ రూ.85.32, బెంగళూరులో పెట్రోల్ రూ.91.09, డీజిల్ రూ.83.09 కోల్కతాలో పెట్రోల్ రూ రూ. 89.44, డీజిల్ ధర రూ .81.96 హైదరాబాద్లో పెట్రోలు రూ. 91.65, డీజిల్ రూ.85.50 అమరావతిలో పెట్రోలు రూ. 94.28, డీజిల్ రూ. 87.62 -
కొనసాగుతున్న పెట్రో సెగ
సాక్షి, ముంబై: ఇంధన ధరలసెగ కొనసాగుతోంది. వరుసగా రెండవ రోజు బుధవారం (ఫిబ్రవరి 10) నాటి పెంపుతో పెట్రోల్, డీజిల్ రికార్డు స్థాయిలను తాకాయి. దేశవ్యాప్తంగా పెట్రోల్ ధరలను లీటరుకు 26-30 పైసలు పెంచగా, దేశంలోని ప్రధాన మెట్రో నగరాల్లో డీజిల్ ధరను 24-29 పైసలు చొప్పునపెంచుతూ ఆయిల్ కంపెనీ నిర్ణయించాయి. (పెట్రో షాక్: రికార్డు ధరలు) ఢిల్లీలో పెట్రోల్ రేట్లు లీటరుకు రూ .87.30 కు చేరుకోగా, పెట్రోల్ ధర లీటరుకు రూ .77.73 కు పెరిగింది. మంగళవారం రేటుతో పోలిస్తే 29 పైసలు పెరిగిన తరువాత ముంబైలో లీటరు పెట్రోల్కు 94.12 రూపాయలు , డీజిల్ ధర రూ .84.63 గా ఉంది. ప్రధాన నగరాల్లో పెట్రోల్ , డీజిల్ ధరలు లీటరుకు కోల్కతాలో పెట్రోల్ ధర రూ .88.92 డీజిల్ ధర రూ .81.31 చెన్నైలో పెట్రోల్ ధర రూ .89.96 డీజిల్ ధర రూ . 82.90 బెంగళూరులో పెట్రోల్ రూ.90.53 డీజిల్ రూ.82.40 హైదరాబాదులో పెట్రోల్ ధర రూ. 91.09, డీజిల్ ధర రూ. 84.79 (27పైసలు పెంపు) అమరావతిలో పెట్రోల్ రూ. 93.74, డీజిల్ రూ. 86.94 (27పైసలు పెంపు) -
పెట్రో షాక్: రికార్డు ధరలు
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ నింగిని చూస్తున్నాయి రెండు రోజుల స్వల్ప విరామం తరువాత తాజాగా రికార్డు స్థాయికి చేరిన ఇంధన ధరలు వినియోగదారులకు షాకిస్తున్నాయి. నేడు (మంగళవారం) పెట్రోల్పై 36 పైసలు, డీజిల్పై 38 పైసలు చొప్పున పెంచుతూ చమురుకంపెనీలు నిర్ణయించాయి. గత 30 రోజులలో మునుపెన్నడూ లేని విధంగా ధరలు పెరిగాయి. జనవరి 6 నుంచి ఇప్పటివరకు పెట్రోల్, డీజిల్ ధర లీటరుకు రూ.3కు పైగా పెరగడం గమనార్హం. తాజా పెంపుతో దేశ రాజధానిలో ఆల్ టైమ్ గరిష్ట స్థాయికి చేరాయి. ఢిల్లీలో లీటరు పెట్రోల్ రూ .87.30 కాగా, డీజిల్ ధర రూ .77.48గా ఉంది. ముంబైలో లీటరుకు రూ .93.83. డీజిలు ధర రూ .84.36 పలుకుతోంది. ప్రధాన నగరాల్లో పెట్రోల్ , డీజిల్ ధరలు లీటరుకు చెన్నైలో పెట్రోల్ ధర రూ .89.70, డీజిల్ రూ .82.66 కోల్కతాలో పెట్రోల్ రూ .88.63, డీజిల్ ధర రూ .81.06 బెంగళూరులో పెట్రోల్ రూ.90.22 డీజిల్ రూ.82.13 హైదరాబాద్లో పెట్రోల్ రూ.90.78 డీజిల్ రూ. 84.52 అమరావతిలో పెట్రోల్ రూ. 93.44, డీజిల్ రూ. 86.68 అటు అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు గరిష్టానికి చేరాయి. మంగళవారం 13 నెలల గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. బ్రెంట్ బ్యారెల్ ధర 60 డాలర్లు దాటేసింది. సోమవారం 2 శాతం పెరిగి ఏడాదిలోనే అత్యధిక స్థాయిని తాకాయి. -
పెట్రో ధరల మోత : రికార్డు హై
సాక్షి, ముంబై: దేశవ్యాప్తంగా ఇంధన సెగలు కొనసాగుతున్నాయి. అంతర్జాతీయంగా చమురు ధరలు పెరగడంతో శుక్రవారం (ఫిబ్రవరి, 5) దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు మరో కొత్త గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. తాజా ప్రధాన మెట్రో నగరాల్లో పెట్రోల్ ధరలను లీటరుకు 26-30 పైసలు పెంచగా, డీజిల్ ధరను 29-32 పైసలు పెరిగింది. తాజా రికార్డు ధరలతో వాహనదారులు బెంబేలెత్తుతున్నారు. (అదే జోష్, అదే హుషారు : పరుగే పరుగు) ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వెబ్సైట్ గణాంకాల ప్రకారం ఢిల్లీలో పెట్రోల్ ధర లీటరుకు రూ.86.95 కు పెరిగింది. డీజిల్ లీటరుకు రూ.77.13గా ఉంది. దేశవ్యాప్తంగా చమురు మార్కెటింగ్ కంపెనీలు (ఓఎంసిలు) వరుసగా రెండవ రోజు రిటైల్ ధరలను పెంచడం గమనార్హం. ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధర లీటరుకు హైదరాబాద్లో పెట్రోల్ రూ.90.42, డీజిల్ రూ. 84.14 అమరావతిలో పెట్రోల్ రూ. 93.09, డీజిల్ రూ. 86.31 బెంగళూరులో పెట్రోల్ రూ.89.85 డీజిల్ రూ.81.76 ముంబైలో పెట్రోల్ రూ.93.49, డీజిల్ రూ.83.99 చెన్నైలో పెట్రోల్ రూ.89.39, డీజిల్ రూ.82.33 కోలకతాలో పెట్రోల్ రూ.88.30 డీజిల్ రూ.80.71 -
సామాన్యుడికి షాక్ : వంట గ్యాస్ ధర పెంపు
సాక్షి, న్యూఢిల్లీ: ఒకవైపు పెట్రో మంట, మరోవైపు వంట గ్యాస్ ధర పెంపు సామాన్య ప్రజల్లో గుండెల్లో బాంబులై పేలుతున్నాయి. దేశంలో ఇప్పటికే నింగిని తాకిన పెట్రో ధరలతో ప్రజలు నానా తంటలు పడుతుంటే తాజాగా పెరిగిన వంట గ్యాస్ సిలిండర్ ధర సెగలు మరో షాకిచ్చాయి. బడ్జెట్ రోజు ఫిబ్రవరి 1న వంట గ్యాస్ ధరలను యథాతథంగా ఉంచినా, తాజాగా రాయితీ సిలిండర్ ధరను పెంచుతూ చమురు కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. ఈ రోజు (గురువారం)నుండి కొత్త రేట్లు అమల్లోకి వచ్చాయి. ఈ పరిణామంతో వంట గ్యాస్ సిలిండర్ కూడా గుదిబండగా పరిణమించింది. చమురు సంస్థలు విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం, ఎల్పీజీ సిలిండర్ ధర తాజాగా 25 రూపాయలు పెరిగింది. వాణిజ్య సిలిండర్ ధరలను 184 రూపాయలు చొప్పున పెంచింది. ప్రస్తుత ధరల పెంపు తరువాత హైదరాబాద్లో వినియోగదారులు సిలిండర్కు రూ.771.50 చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పటివరకు ఈ ధర రూ.746.50గా ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో 14.2 కిలోలు సిలిండర్ ధర రూ .664 నుంచి రూ. 719కి పెరిగింది. కోల్కతాలో రూ.745.50, ముంబైలో రూ.719, చెన్నైలో రూ.735కి చేరింది. -
రెండో రోజూ పెట్రో సెగ
సాక్షి, న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా చమురు ధరలు భగ్గుమనడంతో వరుసగా రెండో రోజుకూడా దేశీయంగా పెట్రోధరలు పెరిగాయి. శనివారం ఇంధన ధరలను మరో 25 పైసలు పెంచాయి. నిన్న లీటర్ పెట్రోల్, డీజిల్పై 25 పైసల చొప్పున వడ్డించిన సంగతి తెలిసిందే. తాజా పెంపుతో ఢిల్లీతోపాటు, దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు రికార్డుస్థాయికి చేరాయి. హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ ధర రూ.90 కి చేరువ కావడం, అమరావతిలో 92 స్తాయిని టచ్ చేయడంంగమనార్హం. (పెట్రో ధరలు భగ్గు) దేశ రాజధాని నగరంలో ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.85.70కు, డీజిల్ ధర రూ.75.88 ముంబైలో పెట్రోల్ రూ. 92.28, డీజిల్ రూ.82.66 చెన్నైలో పెట్రోల్ లీటరుకు రూ.88.38, డీజిల్ రూ.82.23 కోల్కతాలో పెట్రోల్ రూ.87.11, డీజిల్ రూ.79.48 హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ ధర రూ. 89.15 డీజిల్ ధర రూ. 82.80 అమరావతిలో పెట్రోల్ రూ. 91.94 డీజిల్ రూ.85.10 -
పెట్రోల్ ధర ఆల్టైమ్ రికార్డ్
సాక్షి, హైదరాబాద్: పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా పెరుగుతున్నాయి. గతంలో మునుపెన్నడూ లేని విధంగా రికార్డులు సృష్టిస్తూ ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. తాజాగా బుధవారం లీటర్ పెట్రోల్ ధర రూ.91.85కి చేరింది. దీనికి పోటీగా డీజిల్ ధర రూ.83.87కి వచ్చింది. ఈ ధరలు రాజస్థాన్ రాజధాని జైపూర్లో నమోదయ్యాయి. దేశంలోనే అత్యధిక ధరలు జైపూర్లో ఉన్నాయి. వారం రోజుల పాటు స్థిరంగా ఉన్న పెట్రో ధరలను పెంచుతూ దేశీయ చమురు కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. దీంతో పెట్రోల్, డీజిల్ ధరలు 25 పైసల వరకు పెరిగాయి. పెరిగిన ధరలతో దేశ రాజధాని న్యూఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.84.45కు పెరిగింది. డీజిల్ రూ.74.38 నుంచి రూ.74.63కు చేరింది. ఇక ధరల్లో రెండోస్థానంగా దేశ ఆర్థిక రాజధాని ముంబై ఉంది. ముంబైలో పెట్రోల్ ధర రూ.91.07కు చేరగా, డీజిల్ ధర రూ.81.34గా ఉన్నది. వాస్తవంగా గతంలో పెట్రోల్, డీజిల్ ధరలపై చమురు కంపెనీలు ప్రతి 15 రోజులకు ఒకసారి ధరలను నిర్ణయించేవి. కానీ నరేంద్ర మోదీ ప్రభుత్వం 2017 జూన్ 15వ తేదీ నుంచి పెట్రోల్, డీజిల్ ధరలను రోజువారీగా పెంచడం.. తగ్గించడం చేస్తోంది. చమురు కంపెనీలు పెట్రో ధరలను ప్రతి రోజు సమీక్షించి ధరలను నిర్ణయిస్తాయి. లాక్డౌన్ తర్వాత దేశంలో పెట్రోల్ ధరలు అత్యధిక స్థాయికి చేరుకున్నాయి. ప్రధాన నగరాల్లో ధరలు ఇలా ఉన్నాయి నగరం పెట్రోల్ (రూ.) డీజిల్ (రూ.) చెన్నై 87.18 79.95 కోల్కతా 85.92 78.22 హైదరాబాద్ 87.85 81.45 బెంగళూరు 87.30 79.14 జైపూర్ 91.85 83.87 (దేశంలోనే అత్యధికం) -
పెట్రో ధరల మోత
సాక్షి, న్యూఢిల్లీ: స్వల్ప విరామం తరువాత పెట్రో ధరల మోత శుక్రవారం కూడా డీజిల్, పెట్రోల్ ధరలు పెరిగాయి. పెట్రోల్ ధర 17 పైసల నుండి 20 పైసల వరకు పెరిగింది. డీజిల్ ధర కూడా 21 నుండి 24 పైసల వరకు పెరిగింది. ఐఓసీఎల్ వెబ్సైట్ ప్రకారం ప్రధాన మెట్రోనగరాల్లో పెట్రో ధరలు ఇలా ఉన్నాయి. ప్రధాన మెట్రో నగరాల్లో పెట్రోలు,డీజిల్ ధరలు ఢిల్లీ: పెట్రోలు ధర లీటరుకు రూ. 82.86 డీజిలు ధర రూ 73.07రూపాయలు ముంబై : పెట్రోలు ధర లీటరుకు రూ. 89.52 డీజిలు ధర 79.66 రూపాయలు చెన్నై: పెట్రోలు ధర లీటరుకు రూ. 85.76 డీజిలు ధర 78.45 రూపాయలు కోల్కతా : పెట్రోలు ధర లీటరుకు రూ. 84.37 డీజిలు ధర 76.64 రూపాయలు హైదరాబాద్ : పెట్రోలు ధర లీటరుకు రూ. 86.18, డీజిలు ధర 79.73 రూపాయలు అమరావతి: పెట్రోలు ధర లీటరుకు రూ. 89.00, డీజిలు ధర 82 రూపాయలు విశాఖపట్టణం: పెట్రోలు ధర లీటరుకు రూ. 87.77, డీజిలు ధర 80.89 రూపాయలు -
పెరిగిన వంట గ్యాస్ ధర
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో వరుసగా చమురు ధరలు వరుసగా పెంచుతూ వస్తున్న పెట్రో కంపెనీలు తాజాగా గ్యాస్ సిలిండర్ రేట్లను పెంచాయి. ఇప్పటికే ధరలమోత, పెరుగుతున్న ద్రవ్యోల్బణం మద్య దేశంలో వంట గ్యాస్ భారం కూడా పెరగనుంది. తాజాపెంపుతో ఒక్కో సిలిండర్పై రూ.50 భారం పడనుంది. కొత్త ధరలు ఈ రోజు (డిసెంబర్,2)నుండి అమల్లోకి వచ్చాయి. ఇప్పటికే పెట్రో ధరల సెగతో ఇబ్బంది పడుతున్న సామాన్యులపై మరో పిడుగు పడింది. ఈ పెంపుతో హైదరాబాద్లో సిలిండర్ ధర రూ.646.50గా ఉండగా తాజా పెంపుతో రూ.696.5చేరినట్టు తెలుస్తోంది. అలాగే తాజా నివేదికల ప్రకారం దేశ రాజధాని ఢిల్లీలో రాయితీ సిలిండర్ రూ.644కు పెరిగింది. దేశంలోని ఒక్కో రాష్ట్రంలో ఎల్పీజీ ధరలు ఒక్కో రకంగా ఉండటంతో సిలిండర్ ధరల్లో హెచ్చు తగ్గులు ఉంటాయి. అయితే దేశంలోని అతిపెద్ద చమురు మార్కెటింగ్ సంస్థ ఐఓసీ వెబ్సైట్లో ఇచ్చిన ధర ప్రకారం ఢిల్లీలో ధరలు వంట గ్యాస్ ధరలు స్థిరంగా ఉన్నాయి. 14.2 కిలోల సబ్సిడీ గ్యాస్ సిలిండర్ 594 రూపాయలుగా ఉండగా ముంబైలో సిలిండర్ ధర రూ .594. చెన్నైలో 610 రూపాయలు, కోల్కతాలో రూ. 620 గా ఉంది. కమర్షియల్ సిలిండర్ ధర పెంపు 19 కిలోల వాణిజ్య సిలిండర్ల ధర పెరిగింది. చెన్నైలో అత్యధికంగా సిలిండర్కు 56 రూపాయల చొప్పున భారం పడగా ఢిల్లీ, కోల్కతా, ముంబై నగరాలలో 55 రూపాయలు పెరిగింది. -
ఆర్టీసీకి ఆయిల్ చిక్కులు
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీకి చమురు సమస్య నెలకొంది. ప్రస్తుతం ఆదాయం చాలా తక్కువగా ఉండటంతో రెండు నెలలుగా చమురు సంస్థలకు డీజిల్ తాలూకు పూర్తి బిల్లులు చెల్లించలేక పోతోం ది. దీంతో దాదాపు రూ.70 కోట్ల వరకు బకాయిలు ఏర్పడ్డాయి. ఇంతపెద్ద మొత్తంలో బకాయిలు పేరుకుపోవడంతో చమురు సంస్థలు బిల్లుల కోసం ఒత్తిడి చేస్తున్నాయి. ఈ మొత్తాన్ని ఒకేసారి చెల్లించే పరిస్థితి లేకపోవడంతో చమురు సర ఫరాను నిలిపేయనున్నట్లు ఆ సంస్థలు హెచ్చరిం చాయి. ఒకట్రెండు రోజులు నిలిపేశాయి కూడా. దీంతో ఆర్టీసీలో ఆందోళన మొదలైంది. చమురు సంస్థల ప్రతినిధులతో చర్చించి కొంతమేర చెల్లిం చేందుకు సిద్ధమయ్యింది. దీంతో తాత్కాలి కంగా సరఫరాను ఆయా సంస్థలు పునరుద్ధరిం చాయి. పక్షం రోజుల్లో బిల్లులు చెల్లించే హామీతో సరఫరా ను పునరుద్ధరించినట్లు తెలిసింది. ఆలోగా డబ్బు లు చెల్లించకుంటే డీజిల్ సరఫరాను ఆపేయను న్నట్టు ఆయిల్ కంపెనీలు హెచ్చరించాయి. 4.5 కోట్లకు చేరుకున్న ఆదాయం.. లాక్డౌన్తో బస్సు సర్వీసులు నిలిచిపోవటంతో ఆర్టీసీకి ఆదాయం లేకుండా పోయింది. దాదాపు రెండున్నర నెలలు చిల్లిగవ్వ ఆదాయం లేదు. మే చివరలో జిల్లా బస్సు సర్వీసులు మొదలైనా కరో నా కేసుల తీవ్రత కారణంగా జనం బస్సులెక్కేం దుకు భయపడ్డారు. ఆక్యుపెన్సీ రేషియో 25 శాతంగా ఉండటంతో నామమాత్రపు ఆదాయంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. గత పక్షం రోజులుగా ప్రయాణికుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. ప్రస్తుతం ఆక్యుపెన్సీ రేషియో 55 శాతానికి చేరడంతో రోజువారీ ఆదాయం రూ.4 కోట్లను మించుతోంది. మూడు రోజుల క్రితం సిటీ బస్సులు ప్రారంభమయినా.. పావు శాతమే తిరుగుతుండటంతో రూ.30 లక్షల ఆదాయం ఉంటోంది. కార్గో బస్సుల రూపంలో రూ.10 లక్షల అదనపు ఆదాయం సమకూరుతోంది. ఇవి తప్ప ఆర్టీసీ వద్ద వేరే నిధులు లేకపోవటంతో చమురు » కాయిలు తీర్చేందుకు ఇబ్బందికర పరిస్థితి నెలకొంది. 2.6 కోట్ల లీటర్ల చమురు ఖర్చు... ప్రస్తుతం ఆర్టీసీ నిత్యం 16.6 లక్షల కిలోమీటర్ల మేర బస్సులను తిప్పుతోంది. దీనికి 2.6 కోట్ల లీటర్ల చమురు ఖర్చవుతోంది. గతంలో ఎప్పటి కప్పుడు బిల్లులు చెల్లించే పద్ధతి ఉండేది. ఇప్పుడు రోజుకు కొంతమేర మాత్రమే చెల్లిస్తున్నా రు. దీంతో ఎక్కువ మొత్తం పేరుకుపోతూ రూ.70 కోట్లకు బకాయి చేరుకుంది. ఆర్టీసీకి ఇతర ఆదా యం లేకపోవటంతో చమురు కంపెనీలు కూడా ఆలోచనలో పడ్డాయి. గతంలో ఎప్పుడూ లేనట్టు ఒత్తిడి పెంచి, ఆర్టీసీ చరిత్రలో తొలిసారి చమురు సరఫరాను నిలిపివేయటంలాంటి సీరియస్ నిర్ణ యం తీసుకున్నాయి. ఈ కారణంగానే ఆదాయం పెంపునకు సిటీలో ఆగమేఘాల మీద బస్సు సర్వీ సులు ప్రారంభించాల్సి వచ్చింది. క్రమంగా వీటి సంఖ్యను పెంచుతూ ఆదాయాన్ని పెంచుకు నేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. దయతో వ్యవహరించండి.. లాక్డౌన్ వేళ సర్వీసులు పూర్తిగా నిలిచిపోవటంతో ఆర్టీసీ ఆర్థిక పరిస్థితి బాగా దెబ్బతింది. ఈ నేపథ్యంలో బిల్లులు చెల్లించలేదని చమురు సరఫరా నిలిపివేసేలా ఆ సంస్థలు వ్యవహరించటం పట్ల విమర్శలు వ్యక్తమవుతున్నాయి. చమురు కంపెనీలకు అతిపెద్ద వినియోగదారు ఆర్టీసీనే. నిత్యం లక్షల లీటర్ల డీజిల్ వినియోగించే ఆర్టీసీ విషయంలో కంపెనీలు ఆచితూచి వ్యవహరించాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇటీవల స్వయంగా ఆర్టీసీ సొంతంగా పెట్రోలు బంకులు స్థాపించి చమురు కంపెనీలకు డీలర్గా మారిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ప్రజా సేవలో ఉండే ఆర్టీసీ విషయంలో కంపెనీలు దయతో వ్యవహరించాలని పేర్కొంటున్నారు. -
రెండో రోజూ దిగొచ్చిన పెట్రోల్ ధర!
సాక్షి, న్యూఢిల్లీ : దేశీయంగా ఇంధన ధరలు వరుసగా రెండో రోజు కూడా దిగి వచ్చాయి. లీటరు పెట్రోలుపై 18 పైసలు, డీజిల్ పై 24 పైసల మేరకు ధరను తగ్గిస్తున్నట్టు ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు మంగళవారం వెల్లడించాయి. ఈ తగ్గింపుతో హైదరాబాద్ లో పెట్రోలు ధర రూ. 84.75కు డీజిల్ ధర రూ. 79.08 గా ఉది. దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోలుపై 17 పైసలు, డీజిల్ పై 22 పైసల మేరకు ధరలు తగ్గాయి. గత రెండు రోజులలో, పెట్రోల్ డీజిల్ ధర ఢిల్లీలో వరుసగా 31 పైసలు 37 పైసలు తగ్గింది. అమరావతిలో పెట్రోలు ధర రూ. 86.34 డీజిల్ ధర 80.27 రూపాయలు ఢిల్లీ పెట్రోల్ ధర లీటరు రూ .81.55, డీజిల్ లీటరు రూ .72.56 ముంబైలో పెట్రోల్ రూ. 88.21 డీజిల్ ధర 79.05 రూపాయలు చెన్నైలో పెట్రోల్ రూ. 84.57 డీజిల్ 77.91 రూపాయలు మరోవైపు ఇంటర్నేషనల్ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు తగ్గుముఖం పట్టాయి. డిమాండ్ క్షీణించడంతో బ్రెంట్ క్రూడాయిల్ ధర 3 సెంట్లు లేదా 0.1 శాతం తగ్గి 39.58 డాలర్ల వద్ద ఉంది. దీంతో దేశీయంగా పె ట్రోలు ధరలు మరింత దిగి వచ్చే అవకాశం కనిపిస్తోంది. (ఇంధన ధరల పెంపుపై దాఖలైన పిటిషన్ కొట్టివేత) -
పెట్రోలు ధర జోరు
సాక్షి, న్యూఢిల్లీ: స్వల్ప విరామం తరువాత పెట్రోలు ధరలు మళ్లీ జోరందుకున్నాయి. వరుసగా రెండో రోజు శుక్రవారం కూడా పెట్రోలు ధరను పెంచుతూ ప్రభుత్వ చమురు మార్కెటింగ్ సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. మెట్రో నగరాల్లో లీటరు పెట్రోలు ధరపై 11 పైసలు వరకు పెంచాయి. హైదరాబాదులో 11 పైసలు, ముంబై, కోల్కతాలో పెట్రోల్ ధర 10 పైసలు పెరగగా, చెన్నైలో 9 పైసలు పెరిగింది. 13 రోజుల్లో చమురు లీటరు పెట్రోలు ధర 1.51 పైసలు పెరిగింది. మరోవైపు గత కొన్ని రోజులుగా స్థిరంగా ఉన్న డీజిల్ ధరలు ప్రస్తుతం యథాతథంగా కొనసాగుతూనే ఉన్నాయి. (హైదరాబాద్లో రూ. 85 దాటిన పెట్రోలు ) తాజా పెంపుతో దేశ రాజధాని ఢిల్లీలో లీటరు పెట్రోల్ ధర 81.94 రూపాయలకు చేరింది. డీజిల్ ధర రూ.73.56 పైసలుగా ఉంది. హైదరాబాద్ లో పెట్రోలు ధర లీటరుకు రూ. 85.15 చెన్నైలో పెట్రోలు ధర లీటరుకు రూ. 84.91 -
హైదరాబాద్లో రూ. 85 దాటిన పెట్రోలు
సాక్షి, ముంబై : ఒక రోజు విరామం తర్వాత గురువారం మెట్రో నగరాల్లో పెట్రోలు మళ్లీ ధరలు పెరిగాయి. పెట్రోలు ధర లీటరుకు సుమారు 10 పైసలు చొప్పున పెరగ్గా, డీజిల్ రేట్లు యథాతథంగా ఉన్నాయి. దీంతో హైదరాబాద్లో పెట్రోలు ధరలీటరుకు 85 రూపాయల మార్క్ ను దాటేసింది. (చదవండి: వరుసగా ఆరో రోజు పెట్రో బాదుడు) దేశ రాజధానిలో పెట్రోల్ రేటు లీటరుకు 81.83 కు చేరింది. ముంబైలో పెట్రోల్ ధర లీటరుకు రూ .88.48 గా ఉంది. కోల్కతాలో 83.33 రూపాయలు, బెంగళూరులో 84.49 రూపాయలు, హైదరాబాద్లో లీటరుకు 85.04 రూపాయలుగాను ఉంది. మరోవైపు డీజిల్ ధర ఢిల్లీలో లీటరుకు 73.56 రూపాయలు, ముంబైలో 80.11రూపాయలు, చెన్నైలో 78.86 రూపాయలు, కోల్కతాలో 77.06 రూపాయలు, హైదరాబాద్లో లీటరుకు రూ 80.17 రూపాయలు పలుకుతోంది. -
వరుసగా ఆరో రోజు పెట్రో బాదుడు
సాక్షి, ముంబై : వరుస బాదుడు తరువాత మధ్యలో కాస్త శాంతించినా పెట్రో ధరలు మళ్లీ ఊపందుకున్నాయి. గత ఐదురోజులుగా భగ్గుమంటున్న పెట్రోలు ధర వరుసగా ఆరో రోజు మంగళవారం కూడా పెరిగింది. ఆగస్టు 16 నుండి చమురు కంపెనీలు (ఆగస్టు 19 తప్ప) మెట్రోల్లో పెట్రోల్ ధరలను పెంచుతున్నాయి. అయితే, దాదాపు ఒక నెలరోజుల నుంచి డీజిల్ ధరలో మార్పులేదు. మంగళవారం ఢిల్లీ, కోల్కతా, బెంగళూరు, హైదరాబాద్ నగరాల్లో పెట్రోల్ రేటు 9-11 పైసలు పెరిగింది. పెట్రోల్ ధర లీటరుకు ఢిల్లీలో 81.73రూపాయలు ముంబైలో 88.39 రూపాయలు చెన్నైలో 84.73 రూపాయలు కోల్కతాలో 83.24 రూపాయలు హైదరాబాద్లో 84.94 రూపాయలు బెంగళూరులో 84.39 రూపాయలు డీజిల్ ధర లీటరుకు ఢిల్లీలో 73.56 రూపాయలు ముంబైలో 80.11 రూపాయలు చెన్నైలో 78.86 రూపాయలు కోల్కతాలో 77.06 రూపాయలు హైదరాబాద్లో 80.17 రూపాయలు బెంగళూరులో 77.88 రూపాయలు ఆసియా , ఐరోపాలో కరోనా వైరస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో యుఎస్ గల్ఫ్ తీరంలో వ్యాపారులు భారీగా ఉత్పత్తి కోతలు విధించడంతో ముడి చమురు ధరలు మండుతున్నాయని రాయిటర్స్ తెలిపింది. -
మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
సాక్షి, న్యూఢిల్లీ : పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరిగాయి. వరుస ధరల పరుగుకు ఒక రోజు విరామం అనంతరం నేడు (సోమవారం) పెట్రో, డీజిల్ ధరలను పెంచుతూ ప్రభుత్వరంగ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. రోజువారీ సమీక్షలో భాగంగా లీటర్ పెట్రోల్పై 5 పైసలు, డీజిల్పై 13 పైసలు పెంచాయి. దీంతో దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర .80.43 రూపాయలు, లీటర్ డీజిల్ ధర 80.53రూపాయలకు చేరింది. ఢిల్లీలో శనివారం, పెట్రోల్ లీటరుకు 80.38 రూపాయలు, డీజిలు ధర 80.40 రూపాయలుగా ఉంది. దీంతో ఇప్పటివరకు డీజిల్పై మొత్తం 10 రూపాయల 39 పైసలు, పెట్రోల్పై 9 రూపాయల 23 పైసలు పెరిగాయి. ప్రధాన నగరాల్లో పెట్రోలు, డీజిల్ ధరలు లీటరుకు న్యూఢిల్లీ : పెట్రోలు 80.43 రూపాయలు, డీజిల్ 80.53 రూపాయలు ముంబై : పెట్రోలు 87.19 రూపాయలు, డీజిల్ 78.83 రూపాయలు చెన్నై: పెట్రోలు 83.63, డీజిల్ 77.72 రూపాయలు హైదరాబాద్ : పెట్రోలు 83.49 రూపాయలు, డీజిల్ 78.69 రూపాయలు అమరావతి : పెట్రోలు 83.82 రూపాయలు, డీజిల్ 78.98 రూపాయలు -
21వ రోజు.. ఆగని పెట్రో, డీజిల్ ధరలు
ఢిల్లీ : దేశంలో వరుసగా 21వ రోజు కూడా పెట్రో, డీజిల్ ధరలు పెరిగాయి. రోజువారీ సమీక్షలో భాగంగా దేశీయ చమురు కంపెనీలు శనివారం లీటర్ పెట్రోల్పై 25 పైసలు, డీజిల్పై 21 పైసలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. దీంతో దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర 80.38 రూపాయలు, లీటర్ డీజిల్ ధర 80.40 రూపాయలకు చేరింది. దీంతో 21 రోజుల్లో డీజిల్పై మొత్తం 10.27 రూపాయలు, పెట్రోల్పై 9.18 రూపాయలు పెరిగాయి. లాక్డౌన్ నిబంధనలను పూర్తిగా ఎత్తివేసిన తర్వాత జూన్ 7 నుంచి దేశంలో వరుసగా పెట్రో ధరలు పెరుగుతూనే ఉన్నాయి. దీంతో జూన్ 1న లీటర్ పెట్రోల్ ధర 71 రూపాయలు ఉండగా, ప్రస్తుతం అది 80.33 రూపాయలకు చేరింది. కరోనా నేపథ్యంలో రోజురోజుకు పెట్రో, డీజిల్ ధరలు పెరిగిపోతుండడంపై వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 20 రోజైన శుక్రవారం పెట్రోల్పై 21 పైసలు, డీజిల్పై 17 పైసలు పెంచిన సంగతి తెలిసిందే. -
ఢిల్లీ: పెట్రోల్తో పోటీ పడిన డీజిల్ ధర
న్యూఢిల్లీ : వరుసగా 18వ రోజు దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. దీంతో బుధవారం దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్, డీజిల్ ధరలు దాదాపు ఒకే ధర పలుకుతున్నాయి. అక్కడ లీటర్ పెట్రోల్ ధర 79.88 రూపాయలుగా కాగా, డీజిల్ ధర 79.40 రుపాయలుగా ఉంది. అంటే ఒక్క రోజులో లీటర్ డీజిల్పై ధర 48 పైసలు పెరిగింది. 18 రోజుల వ్యవధిలో ఢిల్లీలో లీటర్ పెట్రోల్పై 9.41రూపాయలు, డీజిల్ 9.58 రూపాయలు పెరిగాయి. ఇంటర్నేషనల్ బెంచ్మార్క్ రేట్ల ప్రకారం ఎక్కడైనా పెట్రోల్ ధర డీజిల్ కంటే ఎక్కువగా ఉంటుంది. కానీ ఢిల్లీ ప్రభుత్వం డీజిల్పై వ్యాట్ను భారీగా పెంచడంతో దేశ రాజధానిలో పెట్రోల్ కంటే డీజిల్ ఖరీదుగా మారింది. అయినప్పటికీ ఇతర మెట్రో నగరాలైన కోల్కత్తా, ముంబై , చెన్నైలలో డీజిల్ రేట్ల కంటే పెట్రోల్ ధరలు అధికంగా ఉన్నాయి. (లాక్డౌన్ వేళ పెట్రో సెగలు) ప్రపంచవ్యాప్తంగా రవాణా, పారిశ్రామిక కార్యకలాపాలపై పరిమితులను సడలించడంతో ఇంధన ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. జూన్ 7 కు ముందు లాక్డౌన్ కారణంగా 82 రోజుల పాటు దేశంలో పెట్రోల్, డీజిల్ ధరల్లో ఎటువంటి మార్పులు చోటుచేసుకోలేదు. మెట్రో నగరాల్లో బుధవారం పెట్రోల్ ధరలు మారకుండా డీజిల్ ధరలను పెంచడంతో లీటర్ పెట్రోల్, డీజిల్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. (వరుసగా 17వ రోజూ పెట్రో వడ్డన) నగరం పెట్రోల్ డీజిల్ ఢిల్లీ 79.76 79.88 కోల్కత్తా 81,45 75,06 ముంబై 86,54 78,22 చెన్నై 83,04 77,17 (సోర్స్: ఇండియన్ ఆయిల్) -
ఇంధన ధరలు: 16 రోజుల్లో రూ.8 మేర పెంపు
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా 16వ రోజు పెరిగాయి. సోమవారం పెట్రోల్పై 33 పైసలు, డీజిల్పై 55 పైసలను చమురు సంస్థలు పెంచాయి. దీంతో గత 16 రోజుల్లో పెట్రోల్పై రూ.8.36 పైసలు, డీజిల్పై రూ.8.82 పైసలు ధరలు పెరిగాయి. రెండు వారాలుగా పెరుగుతూ వస్తున్న ఇంధన ధరలు వాహనదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. పెంచిన ధరల ప్రకారం దేశంలోని ప్రధాన మెట్రో నగరాల్లో పరిశీలిస్తే.. లీటర్ పెట్రోల్ ధర : చెన్నైలో 82.58 రూపాయలు బెంగుళూరు 81.81 రూపాయలు ఢిల్లీలో 79.23 రూపాయలు కోల్కతా 80.95 రూపాయలు ముంబైలో 86.04 రూపాయలు హైదరాబాద్లో 82.25 రూపాయలు లీటర్ డీజిల్ ధర : చెన్నైలో 75.80 రూపాయలు బెంగుళూరు 74.43 రూపాయలు ఢిల్లీలో 78.27 రూపాయలు కోల్కతాలో 73.61 రూపాయలు ముంబైలో 76.69 రూపాయలు హైదరాబాద్లో 7.49 రూపాయలకు చేరుకున్నాయి. -
15 రోజుల్లో రూ.8 పెరిగిన పెట్రోల్ ధర
సాక్షి, ఢిల్లీ : దేశంలో పెట్రో, డీజిల్ ధరల పెరుగుదల పరంపర కొనసాగుతూనే ఉంది. ఆదివారమైన 15వ రోజు కూడా పెట్రోల్, డీజిల్ ధరలను చమురు సంస్థలు పెంచాయి. పెట్రోల్పై లీటర్కు 35 పైసలు, డీజిల్పై లీటరుకు 56 పైసలు పెంచాయి. గడిచిన 15 రోజుల్లో లీటర్ పెట్రోల్కు 8.03 రూపాయలు, డీజిల్ 8.27 రూపాయల మేర పెరిగాయి. పెంచిన ధరల ప్రకారం దేశంలోని ప్రధాన మెట్రో నగరాల్లో పరిశీలిస్తే.. లీటర్ పెట్రోల్ ధర : చెన్నైలో 82.27 రూపాయలు ఢిల్లీలో 78.88 రూపాయలు కోల్కతా 80.62 రూపాయలు ముంబైలో 85.70 రూపాయలు హైదరాబాద్లో 81.88 రూపాయలు లీటర్ డీజిల్ ధర : చెన్నైలో 75.29 రూపాయలు ఢిల్లీలో 77.67 రూపాయలు కోల్కతాలో 73.07 రూపాయలు ముంబైలో 76.11 రూపాయలు హైదరాబాద్లో 75.91రూపాయలకు చేరుకున్నాయి. -
పెట్రోల్, డీజిల్ ధర పైపైకి
సాక్షి, న్యూఢిల్లీ : దేశీయంగా ఇంధన ధరలు పెరుగుతూనే వస్తున్నాయి. వరుసగా 14వ రోజు శనివారం కూడా పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. గత రెండు వారాలుగా పెరుగుతూ వస్తున్న ఇంధన ధరలు వినియోగదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. ఢిల్లీలో లీటరు పెట్రోల్ ధర 51 పైసలు, డీజిల్ ధర 61 పైసలు చొప్పున పెరిగింది. (13వ రోజూ పెరిగిన పెట్రో ధరలు) ప్రధాన నగరాల్లో పెట్రోలు, డీజిలు ధరలు లీటరుకు న్యూఢిల్లీ : పెట్రోలు రూ. 78.88, డీజిల్ రూ.77.67 ముంబై : పెట్రోలు రూ. 85.70, డీజిల్ రూ.75.11 చెన్నై: పెట్రోలు ధరూ. 82.27 డీజిల్ రూ.75.29 హైదరాబాద్ : పెట్రోలు రూ. 81.88, డీజిల్ రూ.75.91 అమరావతి : పెట్రోలు రూ. 82.27 డీజిల్ రూ.76.30 Petrol and diesel prices at Rs 78.88/litre (increase by Re 0.51) and Rs 77.67/litre (increase by Re 0.61), respectively in Delhi today. Price of petrol & diesel has increased by Rs 5.88/litre & Rs 6.50/litre respectively since 9th June in the national capital. pic.twitter.com/H8EsN02msX — ANI (@ANI) June 20, 2020 -
13వ రోజూ పెరిగిన పెట్రో ధరలు
సాక్షి, న్యూఢిల్లీ: దేశీయంగా పెట్రోలు, డీజిలు ధరలు పెరుగుతూనే ఉన్నాయి. వరుసగా 13వ రోజు నేడు (శుక్రవారం) కూడా పెట్రో ధరలు పెరుగుదలను నమోదు చేశాయి. పెట్రోలుపై 55 పైసలు, డీజిల్పై 63 పైసలు చొప్పున ప్రభుత్వ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు తాజాగా ధరలను పెంచాయి. ప్రధాన నగరాల్లో పెట్రోలు, డీజిలు ధరలు లీటరుకు న్యూఢిల్లీ : పెట్రోలు రూ. 78.37, డీజిల్ రూ.77.06 ముంబై : పెట్రోలు రూ. 85.21, డీజిల్ రూ.75.53 చెన్నై: పెట్రోలు ధరూ. 81.82, డీజిల్ రూ.74.77 హైదరాబాద్ : పెట్రోలు రూ. 81.36, డీజిల్ రూ.75.31 అమరావతి : పెట్రోలు రూ. 81.76, డీజిల్ రూ.75.73 -
లీటరు రూ. 80 దాటిన పెట్రోలు
సాక్షి, ముంబై: పెట్రోల్, డీజిల్ ధరలు బుధవారం కూడా పెరిగాయి. పెట్రోలుపై 55 పైసలు, డీజిలుపై 60 పైసలు చొప్పున ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు ధరలను పెంచాయి. ఇంధన ధరలు వరుసగా పెరుగుతూ వస్తున్నాయి. తాజా పెంపుతో గత 11 రోజులుగా పెట్రోలుపై రూ. 6.02, డీజిల్ పై రూ. 6.40 పెరిగినట్టయింది. (పదవ రోజూ పెట్రో షాక్) ప్రధాన నగరాల్లో పెట్రోలు, డీజిలు ధరలు లీటరుకు న్యూఢిల్లీ : పెట్రోలు ధర రూ. 77.28, డీజిల్ రూ.75.79 ముంబై : పెట్రోలు ధర రూ. 84.15, డీజిల్ రూ.74.32 చెన్నై: పెట్రోలు ధర రూ. 80.86 డీజిల్ రూ.73.69 హైదరాబాద్ : పెట్రోలు ధర రూ.80.22, డీజిల్ రూ.74.07 అమరావతి : పెట్రోలు ధర రూ. 80.66 డీజిల్ రూ.74.54 -
పదవ రోజూ పెట్రో షాక్
సాక్షి, న్యూఢిల్లీ: పెట్రో ధరల పెంపు మంగళవారం కూడా కొనసాగింది. వరుసగా పదవ రోజు కూడా నింగిని చూస్తున్న ధరలు వినియోగదారులను బెంబేలెత్తిస్తున్నాయి. తాజాగా పెట్రోలు పై 40-47 పైసలు, డీజిల్ పై 48-57 పైసలు పెరిగింది. రాబోయే కొద్ది రోజుల్లో ఇంధన రేట్లు మరింత పెరిగే అవకాశం ఉందని తాజా నివేదికల ద్వారా తెలుస్తోంది. ఈ 10 రోజుల్లో పెట్రోల్ ధర లీటరుకు రూ. 5.45 , డీజిల్ ధర లీటరుకు రూ. 5.8 (ఢిల్లీ రేట్లు) పెరిగింది. దీంతో పెట్రోలు ,డీజిల్ ధరలు ఈ ఏడాది గరిష్టానికి చేరాయి. (టాటా మోటార్స్ : ఉద్యోగులపై వేటు) ప్రధాన నగరాల్లో పెట్రోలు, డీజిలు ధరలు లీటరుకు న్యూఢిల్లీ : పెట్రోలు ధర రూ. 76.73, డీజిల్ రూ.75.19 ముంబై : పెట్రోలు ధర రూ. 83.62, డీజిల్ రూ.73.75 చెన్నై: పెట్రోలు ధర రూ. 80.37, డీజిల్ రూ.73.17 హైదరాబాద్ : పెట్రోలు ధర రూ.79.65, డీజిల్ రూ.73.49 అమరావతి : పెట్రోలు ధర రూ. 80.11 డీజిల్ రూ.73.97 -
పెట్రో వాత : ఎంత పెరిగింది?
సాక్షి, న్యూఢిల్లీ : పెట్రో ధరల సెగ కొనసాగుతోంది. వరుసగా తొమ్మిదవ రోజు కూడా పెట్రోల్, డీజిల్ ధరలు సోమవారం మరింత భగ్గుమన్నాయి. డీజిల్ ధర లీటరుకు 59 పైసలు , పెట్రోల్ 46 పైసలు చొప్పున పెరిగాయి. గత తొమ్మిది రోజుల్లో పెట్రోల్ ధరల లీటరుకు రూ. 5, డీజిల్ లీటరుకు రూ .5.23 పెరిగింది. ముడి చమురు రేట్లు క్షీణిస్తున్నప్పటీకి, దేశీయంగా ఇంధర ధరలు రికార్డు స్థాయికి చేరాయి. ప్రధాన నగరాల్లో పెట్రోలు, డీజిలు ధరలు లీటరుకు న్యూఢిల్లీ : పెట్రోలు ధర రూ. 76.26, డీజిల్ రూ.74.62 ముంబై : పెట్రోలు ధర రూ. 83.17, డీజిల్ రూ.73.21 చెన్నై: పెట్రోలు ధర రూ. 79.96, డీజిల్ రూ.72.69 హైదరాబాద్ : పెట్రోలు ధర రూ.79.17, డీజిల్ రూ.72.93 అమరావతి : పెట్రోలు ధర రూ. 79.64, డీజిల్ రూ.73.44 -
లాక్డౌన్ వేళ పెట్రో సెగలు
సాక్షి, న్యూఢిల్లీ : పెట్రోల్, డీజిల్ ధరలు ఆదివారం వరుసగా ఎనిమిదో రోజూ భారమయ్యాయి. పెట్రోల్ లీటర్కు 62 పైసలు, డీజిల్ లీటర్కు 64 పైసల మేర పెరగడంతో ఎనిమిది రోజుల్లో పెట్రోల్ ధర లీటర్కు 4.52 రూపాయలు, డీజిల్ ధర లీటర్కు 4.64 రూపాయలకు ఎగిసింది. అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలకు అనుగుణంగా ధరలను చమురు కంపెనీలు సవరించాయి. తాజా పెంపుతో హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ 78.03 రూపాయలకు చేరగా, ఢిల్లీలో 75.78 రూపాయలకు ఎగబాకింది. లాక్డౌన్ వేళ ప్రజల ఆదాయం దిగజారిన సమయంలో పెట్రో ధరల పెంపుపై సామాన్యులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇక ఆర్థిక కార్యకలాపాలు ఇప్పుడిప్పుడే ఊపందుకుంటున్న క్రమంలో పెట్రోల్, డీజిల్ ధరల పెంపు ఆందోళనకరమని శివసేన నేత ప్రియాంక చతుర్వేది ట్వీట్ చేశారు. చదవండి : పెట్రోలు : మధ్యప్రదేశ్ కీలక నిర్ణయం -
ఆగని పరుగు : పెట్రో సెగ
సాక్షి, న్యూఢిల్లీ : పెట్రోలు ధరలు వరుసగా 7వ రోజు కూడా పెరుగుదలను నమోదు చేశాయి. ప్రభుత్వ చమురు సంస్థలు శనివారం కూడా ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. పెట్రోల్ ధరను లీటరుకు 58 పైసలు, డీజిల్ ధరను 59 పైసలు చొప్పున పెంచాయి. తాజా పెంపుతో ఏడు రోజుల్లో పెట్రోల్ ధర లీటరుకు రూ. 3.90, డీజిల్ ధర లీటరుకు రూ. 4.01 ఎగిసింది. ప్రధాన నగరాల్లో తాజా పెట్రోల్, డీజిల్ ధరలు లీటరుకు ఢిల్లీ : పెట్రోల్ రూ. 75.16, డీజిల్ రూ. 73.39 ముంబై: పెట్రోల్ రూ. 82.10, డీజిల్ రూ.72.03 చెన్నై: పెట్రోల్ రూ. 78.99, డీజిల్ రూ. 71.64 బెంగళూరు: పెట్రోల్ రూ.77.59, డీజిల్ రూ. 69.78 హైదరాబాద్: పెట్రోల్ రూ.78.03, డీజిల్ రూ. 71.73 అమరావతి : పెట్రోల్ రూ.78.53, డీజిల్ రూ.72.28 -
వామ్మో! పెట్రో బాదుడు
సాక్షి, న్యూఢిల్లీ : పెట్రోలు ధరలు వరుసగా ఆరో రోజు కూడా పెరుగుదలను నమోదు చేశాయి. శుక్రవారం ప్రభుత్వ చమురు సంస్థలు పెట్రోల్ ధరను లీటరుకు 57 పైసలు, డీజిల్ ధరను 59 పైసలు పెంచేసాయి. తాజా పెంపుతో ఆరు రోజుల్లో పెట్రోల్ ధర లీటరుకు రూ. 3.31, డీజిల్ ధర లీటరుకు రూ. 3.42 ఎగిసింది. (పెట్రో వడ్డింపు : ఎంత పెరిగిందంటే) ప్రధాన నగరాల్లో తాజా పెట్రోల్, డీజిల్ ధరలు లీటరుకు ఢిల్లీ : పెట్రోల్ రూ. 74.57 డీజిల్ రూ. 72.81 ముంబై: పెట్రోల్ రూ. 81.53. డీజిల్ రూ.71.48 చెన్నై: పెట్రోల్ రూ. 78.47. డీజిల్ రూ. 71.14 బెంగళూరు: పెట్రోల్ రూ.76.98. డీజిల్ రూ. 69.22 హైదరాబాద్: పెట్రోల్ రూ. 77.41. డీజిల్ రూ. 71.16 అమరావతి : పెట్రోల్ రూ.77.94, డీజిల్ రూ. 71.69 చదవండి : స్టాక్ మార్కెట్ భారీ పతనం -
పెట్రో వడ్డింపు : ఎంత పెరిగిందంటే
సాక్షి, న్యూఢిల్లీ : ఇంధన ధరలు గురువారం కూడా పెరిగాయి. వరుసగా ఐదవ రోజు కూడా పెట్రోల్ డీజిల్ ధరలను ప్రభుత్వ చమురు కంపెనీలు పెంచాయి. పెట్రోల్ , డీజిల్ రెండింటిపైనా లీటరుకు 60 పైసలు చొప్పున వడ్డించాయి. దీంతో గత ఐదు రోజులలో పెట్రోల్ ధర లీటరుకు రూ.2.74, డీజిల్ ధర రూ. 2.83 (ఢిల్లీ) మేర పెరగడం గమనార్హం. (పెట్రో షాక్ : నాలుగో రోజూ) ప్రధాన నగరాల్లో పెట్రోలు, డీజిల్ ధరలు లీటరుకు ఢిల్లీ : పెట్రోలు రూ. 74. డీజిల్ రూ. 72.22 ముంబై: పెట్రోల్ రూ. 80.98. డీజిల్ రూ. 70.92 చెన్నై: పెట్రోల్ రూ. 77.96. డీజిల్ రూ.70.64 బెంగళూరు: పెట్రోల్ రూ. 76.39. డీజిల్ రూ. 68.66 హైదరాబాద్: పెట్రోల్ రూ.76.82. డీజిల్ రూ. 70.59 అమరావతి : పెట్రోల్ రూ.77.36. డీజిల్ రూ. 71.18 -
వరుసగా రెండో రోజూ పెట్రో షాక్
సాక్షి, న్యూఢిల్లీ: అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పుంజుకోవడంతో దేశీయంగా వరుసగా రెండో రోజు కూడా ఇంధన ధరలు వినియోగదారులకు షాకిచ్చాయి. 83 రోజుల విరామం తర్వాత ప్రభుత్వ యాజమాన్యంలోని చమురు సంస్థలు రోజువారీ ధరల సవరణల నేపథ్యంలో పెట్రోల్, డీజిల్ ధర లీటరుకు 60 పైసల చొప్పున వరుసగా రెండో రోజు కూడా పెంచాయి. ప్రముఖ నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు హైదరాబాద్ : పెట్రోల్ రూ.75.22, డీజిల్ రూ. 69 అమరావతి : పెట్రోల్ రూ.75.82, డీజిల్ రూ. 69.65 చెన్నై : పెట్రోల్ రూ. 76.60 , డీజిల్ రూ. 69.25 న్యూఢిల్లీ : పెట్రోల్ రూ.72.46 డీజిల్ రూ. 70.59 ముంబై : పెట్రోల్ రూ.79.49, డీజిల్ రూ. 69.37 -
ఉక్కు ఒప్పందం!
సాక్షి, అమరావతి : వైఎస్సార్ జిల్లా కడపలో నిర్మించే స్టీల్ ప్లాంట్కు జాతీయ ఖనిజాభివృద్ధి సంస్థ (ఎన్ఎండీసీ) నుంచి ఇనుప ఖనిజం సరఫరాకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. ఈమేరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేసిన విజ్ఞప్తి పట్ల కేంద్ర పెట్రోలియం, సహజవాయువు, ఉక్కు, గనుల శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సానుకూలంగా స్పందించారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం, ఎన్ఎండీసీ మధ్య త్వరలో ఒప్పందం కుదరనుంది. శుక్రవారం సచివాలయంలో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు, ఉక్కుశాఖ ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు సమావేశమయ్యారు. ఆయా శాఖలకు సంబంధించి పలు అంశాలపై చర్చించారు. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలను తీసుకున్నారు. రాష్ట్రానికి పూర్తి సహాయ సహకారాలు అందించేందుకు సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ప్రకటించారు. వచ్చే ఐదేళ్లలో ఏపీకి పెట్రోలియం, సహజవాయువులు, ఉక్కు రంగాల్లో రూ.2 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు రానున్నాయని, తద్వారా రాష్ట్ర ఆదాయం పెరగడంతో పాటు పెద్ద ఎత్తున యువతకు ఉద్యోగావకాశాలు లభిస్తాయని తెలిపారు. ఈ భేటీలో ముఖ్యాంశాలు ఇవీ... 16,554 మత్స్యకార కుటుంబాలకు రూ.81 కోట్లు తూర్పు గోదావరి జిల్లా పోలవరం మండలం భైరవపాలెంలో జీఎస్పీసీ లిమిటెడ్ చేపట్టిన ఆఫ్ షోర్ డ్రిల్లింగ్ వల్ల 16,554 మత్స్యకార కుటుంబాలకు చెల్లించాల్సిన రూ.81 కోట్ల పరిహారం పెండింగ్లో ఉందని, దీన్ని వెంటనే మంజూరు చేయాలని అధికారులు విజ్ఞప్తిచేశారు. ఈ పరిహారం చెల్లించేందుకు వెంటనే చర్యలు తీసుకోవాలని కేంద్ర మంత్రి ప్రధాన్ ఓఎన్జీసీ అధికారులను ఆదేశించారు. సీఎస్ఆర్ నిధులు ఇచ్చేందుకు ఓకే చమురు, గ్యాస్ కంపెనీలు ఏపీలో తమ టర్నోవర్కు తగినట్టుగా కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్) కింద నిధులు ఇవ్వాలన్న విజ్ఞప్తిపై కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించారు. రాష్ట్రంలో ఆయా కంపెనీల టర్నోవర్ మేరకు సీఎస్ఆర్ నిధులు ఇచ్చేలా చూస్తామని చెప్పారు. రాయల్టీలో వాటా ఇవ్వాలని వినతి చమురు, గ్యాస్ వెలికితీత కంపెనీలు చెల్లిస్తున్న రాయల్టీలో ఏపీకి వాటా ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. ఆఫ్షోర్లో చమురు, గ్యాస్ వెలికితీత వల్ల పరిసర ప్రాంతాలపై కాలుష్య ప్రభావం పడుతోందని, తీర ప్రాంతాల్లో ప్రాసెసింగ్ ప్లాంట్ల వల్ల పర్యావరణ పరంగా క్లిష్ట పరిస్థితులు ఏర్పడుతున్నాయని, భారీ వాహనాల రాకపోకలతో రోడ్లు దెబ్బతింటున్నాయని, ప్రజలు, మత్స్యకారుల జీవనోపాధికి కూడా ఇబ్బంది తలెత్తుతోందని రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర మంత్రి దృష్టికి తెచ్చింది. పెట్రో కాంప్లెక్స్కు ప్రణాళిక ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం క్రూడాయిల్ రిఫైనరీ, పెట్రో కెమికల్ కాంప్లెక్స్ తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని, కాకినాడలో దీన్ని నెలకొల్పేందుకు సత్వరమే చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ అధికారులు కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేశారు. దీనిపై పెట్రోలియం శాఖ, రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో అత్యున్నతస్థాయి సంయుక్త కమిటీని ఏర్పాటు చేస్తామని కేంద్ర మంత్రి ప్రదాన్ తెలిపారు. పెట్రో కాంప్లెక్స్ ఏర్పాటుకు తగిన ప్రణాళిక సిద్ధం చేస్తామని చెప్పారు. రెండు చోట్ల పెట్రోలియం ఎక్స్లెన్స్ కేంద్రాలు కాకినాడ, రాజమహేంద్రవరం ప్రాంతాల్లో పెట్రోలియం ఎక్స్లెన్స్ సెంటర్ ఏర్పాటుకు కృషి చేస్తామని «కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సమావేశంలో హామీ ఇచ్చారు. సమస్యల పరిష్కారంపై కృతజ్ఞతలు పైపులైన్ల ఏర్పాటులో సమస్యలను తొలగించడంతోపాటు దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న సమస్యల పరిష్కారంపై ఓఎన్జీసీ, హెచ్పీసీఎల్ చైర్మన్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. తూర్పు తీరంలో పెట్టుబడులకు ఆసక్తి దేశానికి తూర్పు తీరంలో ఉన్న ఏపీలో పెట్రో రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు ప్రపంచ ప్రఖ్యాత కంపెనీలు ముందుకు వస్తున్నాయని ప్రధాన్ తెలిపారు. వచ్చే ఐదేళ్లలో పెట్రోలియం, సహజవాయువు, ఉక్కు రంగాలకు సంబంధించి దాదాపు రూ.2 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు రానున్నట్టు వెల్లడించారు. విశాఖలో విస్తరణ ప్రాజెక్టులు, కాకినాడలో పెట్రో కాంప్లెక్స్ ఏర్పాటు ద్వారా, కడపలో స్టీల్ ప్లాంట్ రూపంలో ఏపీకి భారీగా పెట్టుబడులు వస్తాయని ప్రధాన్ చెప్పారు. పరిశ్రమల ఏర్పాటు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పారదర్శకంగా ఉందని ప్రశంసించారు. ఏది కావాలన్నా సమకూరుస్తాం.. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం కావాలన్నా అందించడానికి సిద్ధంగా ఉన్నామని ముఖ్యమంత్రి జగన్ తెలిపారు. పరిశ్రమల ఏర్పాటు విషయంలో సానుకూల దృక్పథంతో ఉంటామని, ఏది కావాలన్నా చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. సమావేశంలో కేంద్ర ఉక్కుశాఖ కార్యదర్శి బినోయ్రాయ్, పెట్రోలియంశాఖ సంయుక్త కార్యదర్శి అమర్నాథ్, ఎన్ఎండీసీ సీఎండీ ఎన్.బైజేంద్రకుమార్, గెయిల్ సీఎండీ అశుతోష్ కర్ణాటక్, ఓఎన్జీసీ సీఎండీ శశిశంకర్, హెచ్పీసీఎల్ సీఎండీ ముఖేష్ కుమార్ సురానా, ఆర్ఐఎన్ఎల్ సీఎండీ పి.కె.రథ్ తదితరులు పాల్గొన్నారు. సచివాలయం వద్ద ఇన్చార్జ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్కుమార్ ప్రసాద్ కేంద్ర మంత్రి ప్రధాన్కు పుష్పగుచ్ఛంతో స్వాగతం పలికారు. సమావేశం ముగిసిన తర్వాత కేంద్ర మంత్రి ప్రదాన్ను ముఖ్యమంత్రి జగన్ తాడేపల్లిలోని తన నివాసంలో మెమెంటోతో సత్కరించి విందు ఇచ్చారు. ఎన్ఎండీసీతో త్వరలో ఎంవోయూ పునర్విభజన చట్టం ప్రకారం కడప స్టీల్ప్లాంట్ను కేంద్రం ఏర్పాటు చేయాల్సి ఉందని, దీనికోసం ప్రపంచ ప్రఖ్యాత ఉక్కు కంపెనీలతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతోందని సమావేశంలో అధికారులు వివరించారు. ప్లాంట్ నిర్వహణలో స్థిరత్వం సాధించేందుకు నిరంతరాయంగా ఇనుప ఖనిజాన్ని సరఫరా చేయాలని కోరారు. దీనిపై కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సానుకూలంగా స్పందించారు. రాష్ట్ర ప్రభుత్వంతో ఎన్ఎండీసీ ఒప్పందం చేసుకుంటుందని చెప్పారు. ఈమేరకు త్వరలో ఎంఓయూ కుదుర్చుకోవాలని ఉక్కుశాఖ అధికారులను ఆదేశించారు. ఏపీ అభివృద్ధికి సహకరించండి కేంద్ర మంత్రి ప్రధాన్ను కోరిన గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ఆంధ్రప్రదేశ్కు రావాల్సిన నిధులు, ప్రాజెక్టులపై ప్రత్యేక శ్రద్ధ చూపించాలని గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ కేంద్ర మంత్రి ధర్మేంద ప్రధాన్ను కోరారు. విభజనతో నష్టపోయిన ఏపీ అభివృద్ధికి సహకరించాలన్నారు. ధర్మేంద్ర ప్రధాన్ శుక్రవారం గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ను మర్యాదపూర్వకంగా కలిశారు. కేజీ బేసిన్, విశాఖ స్టీల్ప్లాంట్ను సందర్శించాలని ఈ సందర్భంగా ఆయన గవర్నర్ను కోరారు. విశాఖలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం, ఎనర్జీ సంస్థలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై భేటీలో చర్చించారు. -
ఎయిర్ ఇండియాకు మరో షాక్
సాక్షి, న్యూఢిల్లీ : సంక్షోభంలో కూరుకుపోయిన ప్రభుత్వరంగ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియాను కష్టాలు వీడటం లేదు. విమానాలకు ఉపయోగించే ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ను సమకూర్చే చమురు కంపెనీలకు రూ 4500 కోట్ల మేర చెల్లింపులు బకాయి ఉండటంతో ఆయా సంస్థలు ఇంధన సరఫరాలను నిలిపివేశాయి. ఏడు నెలల నుంచి తమకు రావాల్సిన బకాయిలను ఎయిర్ ఇండియా క్లియర్ చేయలేదని చమురు కంపెనీల ఉన్నతాదికారులు పేర్కొన్నారు. బకాయిలు పేరుకుపోవడంతో కొచ్చి, పుణే, పాట్నా, రాంచీ, వైజాగ్, మొహాలీ విమానాశ్రయాల్లో జెట్ ఇంధన సరఫరాను నిలిపివేయాలని ఐఓసీ, బీపీసీఎల్, హెచ్పీసీఎల్లు నిర్ణయించాయి. జెట్ ఇంధనం కొనుగోలు చేసిన 90 రోజుల వరకూ చెల్లింపులు జరిపేలా ఎయిర్ ఇండియాకు క్రెడిట్ వ్యవధి ఉన్నా ఎయిర్ ఇండియా సకాలంలో చెల్లింపులు జరపడంలేదని, క్రెడిట్ వ్యవధి ఇప్పుడు 200 రోజులు దాటినా చెల్లింపులు లేవని చమురు కంపెనీలకు చెందిన ఓ సీనియర్ అధికారి పేర్కొన్నారు. మూడు ప్రభుత్వ రంగ చమురు కంపెనీలకు ఎయిర్ ఇండియా రూ 4500 కోట్ల మేర బకాయిలు పడింది. భారీ బకాయిలు ఉన్నా ఎయిర్ ఇండియా ప్రస్తుతం కేవలం రూ 60 కోట్లు చెల్లించేందుకే ముందుకు వచ్చిందని మరో అధికారి వెల్లడించారు. మూడు చమురు సంస్ధలు కలిపి బకాయిలపై గత వారం ఎయిర్ ఇండియాకు లేఖ రాశాయి. తక్షణమే బకాయిలు క్లియర్ చేయకుంటే జెట్ ఇంధన సరఫరాను నిలిపివేస్తామని ఈ లేఖలో ఎయిర్ ఇండియాను ఆయా కంపెనీలు హెచ్చరించాయి. బకాయిల చెల్లింపులపై సమగ్ర ప్రణాళికతో ముందుకు రావడంలో విఫలమవడంతో ఎయిర్ ఇండియాకు ఇంధన సరఫరాలను నిలిపివేయాలనే నిర్ణయం తీసుకోక తప్పలేదని మూడు ప్రభుత్వ రంగ చమురు సంస్థలు వెల్లడించాయి. కాగా ఎయిర్ ఇండియా నిర్వహణ సామర్ధ్యం మెరుగ్గా ఉన్న సంస్థ రుణ భారం రూ 58,000 కోట్లకు పైగా చేరిందని ఎయిర్ ఇండియా ప్రతినిధి పేర్కొన్నారు. నిధుల సమీకరణ సంక్లిష్టంగా మారడంతో చెల్లింపులు, రుణాల క్లియరెన్స్లో ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆ ప్రతినిధి వెల్లడించారు. -
ఐబీ హెచ్చరికల నేపథ్యంలో డీజీపీ సమీక్ష
-
ఐబీ హెచ్చరికల నేపథ్యంలో డీజీపీ సమీక్ష
సాక్షి, కాకినాడ: ఐబీ హెచ్చరికల నేపథ్యంలో ఏపీ పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. తూర్పు తీరంలో ఉన్న ఆయిల్, గ్యాస్ కంపెనీల భద్రతపై ఏపీ డీజీపీ ఠాకూర్ ఆదివారం సమీక్షించారు. ఈ నేపథ్యంలో కాకినాడలో ఆయన పోలీసులు అధికారులతో మాట్లాడారు. మరోవైపు ఏవీబీ బోర్డర్లో జరిగిన ఘటనలపై డీజీపీ, ఇతర అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి పరిస్థితులను తెలుసుకున్నారు. ప్రస్తుతం ఏవోబీలో పరిస్థితి ప్రశాంతంగా ఉందన్నారు. ఇటీవల ఎన్నికల పోలింగ్లో జరిగిన ఘటనలు, కౌంటింగ్ భద్రతపై ఎలాంటి చర్యలు తీసుకోవాలో అధికారులకు సూచించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన డీజీపీ ఆర్పీ ఠాకూర్ భద్రతా కారణాలరిత్యా కొన్ని వివరాలు వెల్లడించలేమని తెలిపారు. ఐబీ హెచ్చరికల నేపథ్యంలో గాడిమొగ రిలియన్స్ గ్యాస్ టెర్మినల్తోపాటుగా పలు చమురు క్షేత్రాల్లో ఆయన పర్యటించారు. ఘర్షణలపైనా సమీక్ష.. ఎన్నికల సందర్భంగా జిల్లాలో చోటుచేసుకున్న ఘర్షణలపై సమీక్షించామని తెలిపారు. కేసుల నమోదు, చార్జ్షీట్లపై యంత్రాంగానికి సూచనలు చేశామని, కౌంటింగ్ భద్రతపై ఎటువంటి చర్యలు చేపట్టాలో అధికారులకు సూచించామని తెలిపారు. గత ఎన్నికలకు ముందు ఒడిషాలోని నందాపూర్ మావోయిస్టు కమిటీ సభ్యులు విధ్వంసం సృష్టించేందుకు మన రాష్ట్ర సరిహద్దుల్లోకి వచ్చారని, ఎన్నికలు ముగిసిన తరువాత తిరిగి వెళ్తుండగా భద్రతా బలగాలకు తారసపడడంతో ఎన్కౌంటర్ జరిగిందని, ప్రస్తుతం ఏవోబీలో పరిస్థితి ప్రశాంతంగా ఉందని తెలిపారు. -
ఏడాది కనిష్టానికి ‘పెట్రోల్’
న్యూఢిల్లీ: పెట్రోల్, డీజిల్ ధరలు ఆదివారం మరింత తగ్గాయి. పెట్రోల్ లీటర్కు 22 పైసలు తగ్గడంతో దేశ రాజధానిలో రూ.69.26 నుంచి ఈ ఏడాదిలోనే కనిష్ట స్థాయి రూ.69.04కు చేరుకుంది. డీజిల్ ధర కూడా లీటరుపై 23 పైసలు తగ్గడంతో రూ.63.32 నుంచి తొమ్మిది నెలల కనిష్ట స్థాయి రూ.63.09కి దిగి వచ్చిందని ప్రభుత్వరంగ ఆయిల్ సంస్థలు తెలిపాయి. ప్రస్తుత అంచనాల ప్రకారం వచ్చే కొద్ది రోజుల్లో పెట్రో ధరలు మరింతగా తగ్గే అవకాశముందని వెల్లడించాయి. ఆగస్టు 15వ తేదీన పెట్రోల్ ధర ఢిల్లీలో రూ.77.14, ముంబైలో రూ.84.58, డీజిల్ లీటర్ ఢిల్లీలో రూ.68.72, ముంబైలో రూ.72.96గా ఉండగా 16వ తేదీ నుంచి పైకి ఎగబాకడం ప్రారంభించి, అక్టోబర్ 4వ తేదీన రికార్డు స్థాయికి ఢిల్లీలో రూ.91.34, ముంబైలో రూ.84కు చేరుకుంది. అదే రోజు డీజిల్ ధర కూడా ఢిల్లీలో లీటర్కు రూ.75.45, ముంబైలో రూ.80.10కు చేరుకుంది. ఆ తర్వాత అంతర్జాతీయంగా చమురు ధరలు క్రమంగా తగ్గడంతో ఆ ప్రభావం దేశీయంగా పడింది. హైదరాబాద్లో..: ప్రస్తుతం హైదరాబాద్లో పెట్రోల్ ధర లీటరుకు రూ.73.22కు చేరింది. అక్టోబరులో రూ.89.06 ధరతో రికార్డు సృష్టించిన పెట్రోల్ ధర నవంబర్ నాటికి రూ.84.14కు చేరింది. డిసెంబర్ మొదటివారంలో రూ.76.89 ఉన్న ధర చివరి వారంలో మరో రూ.3.67 తగ్గడం విశేషం. డీజిల్ ధర లీటరుకు ప్రస్తుతం రూ.68.67కు చేరింది. అక్టోబర్లో లీటరు డీజిల్ ధర రూ.82.33 కాగా, నవంబర్ నెలలో 80.20కు చేరింది. -
15 రోజుల్లోపే మళ్లీ పెరిగిన వంటగ్యాస్ ధర
సాక్షి,న్యూఢిల్లీ: వంటగ్యాస్ ధర మళ్లీ పెరిగింది. ప్రతీ నెల పెరిగే వంటగ్యాస్ సిలిండర్ ధర ఈ నెలలో కేవలం 9 రోజుల్లోనే రెండవసారి పెరిగింది. ఎల్పీజీ డీలర్లకు ఇచ్చే కమిషన్ను ప్రభుత్వం పెంచడంతో వంటగ్యాస్ ధరను సిలిండర్కు రూ. 2.08 చొప్పున పెంచుతున్నట్లు ప్రభుత్వ రంగ ఇంధన సరఫరాదారులు ఓ ప్రకటనలో తెలిపారు. తాజా పెంపుతో ఒక్కో సిలిండర్ ధర రూ. 507.42కు చేరింది. డీలర్ల కమిషన్ ప్రస్తుతం వంటగ్యాస్ డీలర్లకు 14.2కేజీల సిలిండర్కు రూ.48.89, 5కేజీల సిలిండర్కు రూ. 24.20 చొప్పున కమిషన్ ఇస్తున్నారు. అయితే దీన్ని పెంచాలని చమురు మంత్రిత్వ శాఖ తాజాగా ఆదేశాలు జారీ చేసింది. దీంతో 14.2కేజీల సిలిండర్కు రూ. 50.58, 5 కేజీల సిలిండర్కు రూ. 25.29 చొప్పున కమిషన్ ఇవ్వాలి. 14.2 కిలోల సిలిండర్కు 20.50 డెలివరీ ఛార్జ్ ఉంటుంది. అయితే పంపిణీదారుల ప్రాంగణంనుంచి సిలిండర్ను నేరుగా తీసుకుంటే డెలివరీ ఛార్జినుంచి మినహాయింపు వుంటుందని ఇంధన సరఫరాదారులు తమ ప్రకటనలో పేర్కొన్నారు. కాగా ఈ నెలలో వంటగ్యాస్ ధర పెరగడం ఇది రెండో సారి. నవంబరు 1వ తేదీనే రాయితీ గ్యాస్ సిలిండర్పై రూ. 2.94 పెంచుతున్నట్లు ఇంధన సరఫరాదారులు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది జూన్ నుంచి ప్రతినెలా వంటగ్యాస్ ధర పెరుగుతూ వస్తోంది. ఈ క్రమంలో ఆరు నెలల్లో రూ. 16.21 మేర ధర పెరిగింది. -
తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు
న్యూఢిల్లీ: గత రెండు నెలలుగా ఎడాపెడా పెరిగిన చమురు ధరల నుంచి సామాన్యులకు పండుగ రోజు కొంత ఊరట లభించింది. వరుసగా రెండో రోజుల పాటు పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గిస్తూ ప్రభుత్వ రంగ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. అంతర్జాతీయంగా బ్యారెల్ ముడి చమురు ధర 85 డాలర్ల నుంచి 80 డాలర్లకు పడిపోవటంతో పాటు డాలర్తో రూపాయి మారకం విలువ కొంత పెరగటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించాయి. గురువారం లీటరు పెట్రోలుపై 21 పైసలు, డీజిల్పై 11 పైసలు తగ్గించగా శుక్రవారం ఢిల్లీలో లీటర్ పెట్రోల్పై 24 పైసలు, డీజిల్పై 10 పైసలు తగ్గించాయి. దీంతో ఇక్కడ లీటర్ పెట్రోల్ ధర రూ.82.38, డీజిల్ రూ. 75.48గా ఉంది. మరోవైపు దేశ ఆర్థిక రాజధాని ముంబైలో శుక్రవారం పెట్రోల్పై 24 పైసలు, డీజిల్పై 11 పైసలు తగ్గింది. దీంతో లీటర్ పెట్రోల్ రూ. 87.84, డీజిల్ రూ. 79.13కు చేరుకుంది. ఈ నెల 5న లీటరు పెట్రోల్, డీజిల్పై రూ.2.50 (ఎక్సైజ్ సుంకం రూ.1.50, చమురు కంపెనీల సబ్సిడీ రూపాయి) తగ్గిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. కేంద్రంలో ఎన్డీయే సర్కారు అధికారం చేపట్టిన తర్వాత 2014 నుంచి 2016 మధ్య కాలంలో లీటర్ పెట్రోల్పై ఎక్సైజ్ సుంకాన్ని రూ. 11.77, డీజిల్పై 13.47 రూపాయాలు పెంచింది. -
రేట్ల తగ్గింపు ప్రతికూలమే
హైదరాబాద్: పెట్రోల్, డీజిల్ రేట్లను రూ. 2.50 మేర తగ్గిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయంతో చమురు మార్కెటింగ్ కంపెనీల (ఓఎంసీ) మార్జిన్లపై ప్రతికూల ప్రభావం పడుతుందని రేటింగ్ ఏజెన్సీ మూడీస్ సోమవారం తెలిపింది. దీనివల్ల ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ రంగంలోని మూడు సంస్థల (ఐవోసీఎల్, హెచ్పీసీఎల్, బీపీసీఎల్) మొత్తం ఎబిటా మార్జిన్లు రూ.6,500 కోట్ల మేర తగ్గే అవకాశం ఉందని వివరించింది. ఇది గత ఆర్థిక సంవత్సరంలో వాటి ఎబిటాలో దాదాపు 9 శాతం. 2018 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ రంగ చమురు కంపెనీల ఎబిటా రూ. 69,200 కోట్లు. అయితే, ప్రతికూల ప్రభావాలు ఎలా ఉన్నా.. ఈ ఆర్థిక సంవత్సరంలో మూడు ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీలు అధిక ఎబిటానే నమోదు చేసే అవకాశం ఉందని నివేదికలో మూడీస్ పేర్కొంది. అమ్మకాల పరిమాణం పెరగడం, రిఫైనింగ్ మార్జిన్లు స్థిరంగా ఉండటం, రూపాయి మారకం విలువ క్షీణత ఇందుకు దోహదపడగలవని వివరించింది. అంతర్జాతీయంగా ముడిచమురు రేట్లు భారీగా పెరగడం, దేశీ కరెన్సీ విలువ పడిపోవడం తదితర పరిణామాల నేపథ్యంలో భారత్లో పెట్రోల్, డీజిల్ రేట్లు సైతం గణనీయంగానే పెరిగాయి. అయితే, ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుండటంతో పెట్రోల్, డీజిల్ రేట్లను రూ. 2.50 మేర తగ్గిస్తున్నట్లు అక్టోబర్ 4న కేంద్రం ప్రకటించింది. లీటరుకు ఎక్సైజ్ సుంకాన్ని రూ. 1.50 తగ్గించిన కేంద్రం.. మరో రూ. 1 మేర రేటు తగ్గింపు భారాన్ని భరించాల్సిందిగా చమురు మార్కెటింగ్ కంపెనీలను ఆదేశించింది. దేశీయంగా రిటైల్ ఇంధన అమ్మకాల్లో 95 శాతం మార్కెట్ వాటా ఉన్న ఓఎంసీల రుణపరపతికి ఈ నిర్ణయం ప్రతికూలమని మూడీస్ పేర్కొంది. పెరిగిన ముడిచమురు రేట్ల భారాన్ని కొనుగోలుదారులకు పూర్తి స్థాయిలో బదలాయించకపోవడం వల్ల వాటి ఆదాయాలు దెబ్బతింటాయని వివరించింది. -
పెట్రో ధరలకు మళ్లీ రెక్కలు
న్యూఢిల్లీ: పెట్రో ఉత్పత్తుల ధరలను కేంద్రం రూ.2.5 మేర తగ్గించిందని సంతోషించేలోపే ప్రభుత్వ ఆయిల్ కంపెనీలు వినియోగదారులకు మళ్లీ షాకిచ్చాయి. ఆదివారం లీటర్ పెట్రోల్పై 14 పైసలు, డీజిల్పై 29 పైసలు పెంచు తూ నిర్ణయం తీసుకున్నాయి. తాజా పెంపుతో ముంబైలో లీటర్ పెట్రోల్ రూ.87.29కి చేరుకోగా, డీజిల్ రూ.77.06కు పెరిగింది. దీంతో పెట్రోల్ ధరలు మళ్లీ మూడువారాల గరిష్టానికి చేరుకున్నట్లయింది. పెట్రోలియం ఉత్పత్తులపై రూ.2.5ను తగ్గిస్తూ అక్టోబర్ 4న కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా ప్రభుత్వ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు శనివారం లీటర్ పెట్రోల్పై 18 పైసలు, డీజిల్పై 29 పైసలను పెంచా యి. తాజా నిర్ణయంతో 2014 నుంచి ఇప్పటివ రకూ పెట్రోల్పై రూ.11.77, డీజిల్పై రూ.13.47ను ప్రభుత్వం పెంచినట్లయింది. కాగా, రానున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే కేంద్రం రూ.2.5 మేర ధరల్ని తగ్గించిందని కాంగ్రెస్ ఆరోపించింది. -
‘పెట్రో’ ధరలకు మళ్లీ రెక్కలు
సాక్షి, హైదరాబాద్/న్యూఢిల్లీ: పెట్రోల్, డీజిల్ ధరల పెంపుతో ఇప్పటికే అల్లాడుతున్న సామాన్య ప్రజలకు ప్రభుత్వ ఆయిల్ కంపెనీలు మరోసారి షాకిచ్చాయి. ఆదివారం లీటర్ పెట్రోల్పై 12 పైసలు, డీజిల్పై 10 పైసలు పెంచాయి. దీంతో దేశరాజధానిలో లీటర్ పెట్రోల్ ధర రూ.80.50కు చేరగా, డీజిల్ రూ.72.61కు చేరి ఆల్టైం రికార్డును సృష్టించాయి. ఆగస్టు 15 నుంచి ఇప్పటివరకూ లీటర్ పెట్రోల్పై రూ.3.42, డీజిల్పై రూ.3.84ను ఆయిల్ కంపెనీలు పెంచాయి. ప్రస్తుతం ఆయిల్ రిఫైనరీల వద్ద లీటర్ పెట్రోల్ రూ.40.50, డీజిల్ రూ.43గా ఉంటోంది. కేంద్ర ప్రభుత్వం విధిస్తున్న ఎక్సైజ్ సుంకాలతో పాటు ఆయా రాష్ట్రాలు విధిస్తున్న వ్యాట్ను తగ్గించకపోవడంతో తాజాగా చమురు ధరలు చుక్కల్ని తాకుతున్నాయి. ప్రస్తుతం కేంద్రం లీటర్ పెట్రోల్పై రూ.19.48, డీజిల్పై రూ.15.33 ఎక్సైజ్ సుంకాన్ని విధిస్తోంది. ఇక మహారాష్ట్రలోని ముంబైలో పెట్రోల్పై అత్యధికంగా 39.12 శాతం వ్యాట్ విధిస్తుండగా, తెలంగాణలో డీజిల్పై అత్యధికంగా 26 శాతం వ్యాట్ విధిస్తున్నారు. 2014–15లో రూ.99,184 కోట్లుగా ఉన్న కేంద్ర ఎక్సైజ్ రాబడి..2017–18 నాటికి రూ.2,29,019 కోట్లకు ఎగబాకింది. రాష్ట్రాల వ్యాట్ 2014–15లో రూ.1,37,157 కోట్ల నుంచి 2017–18 నాటికి రూ.1,84,091 కోట్లకు పెరిగింది. రాజస్తాన్లో పెట్రోల్, డీజిల్ ధరల నుంచి ఉపశమనం కల్పించేందుకు 4 శాతం వ్యాట్ను తగ్గిస్తున్నట్లు ఆ రాష్ట్ర సీఎం వసుంధరా రాజే తెలిపారు. దీంతో పెట్రోల్, డీజిల్ ధరలు లీటర్కు రూ.2.4 మేర తగ్గుతాయన్నారు. మరోవైపు పెట్రోల్, డీజిల్ ధరల్ని తగ్గించేందుకు అన్ని అవకాశాలను పరిశీలిస్తున్నట్లు మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ తెలిపారు. -
ఎల్పీజీ ధరలకు మళ్లీ రెక్కలు
న్యూఢిల్లీ: అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా ప్రభుత్వరంగ చమురు సంస్థలు ఎల్పీజీ ధరల్ని పెంచాయి. ప్రభుత్వం సబ్సిడీపై అందజేస్తున్న ఒక్కో ఎల్పీజీ సిలిండర్పై రూ.2.71 పెంచినట్లు ప్రభుత్వరంగ సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్(ఐవోసీ) శనివారం తెలిపింది. ఒక్కో సబ్సిడీయేతర సిలిండర్పై రూ.55.50 పెంచింది. తాజా పెంపుతో ఢిల్లీలో సబ్సిడీ ఎల్పీజీ సిలిండర్ ధర రూ.493.55కు చేరుకుంది. శనివారం అర్ధరాత్రి నుంచి ఈ పెంపు అమల్లోకి వచ్చింది. సవరించిన ఎల్పీజీ(సబ్సిడీలేని) ధరలపై జీఎస్టీ విధించడంతోనే తాజాగా గ్యాస్ ధరలు పెరిగాయని ఐవోసీ తెలిపింది. అంతర్జాతీయంగా సహజవాయువు ధరల పెంపు, డాలర్తో రూపాయి విలువ బలహీనపడటం ఇందుకు మరో కారణం. -
పెట్రోల్, డీజిల్ ధరలపై ఊరట
న్యూఢిల్లీ : రికార్డు స్థాయిల్లో నమోదైన పెట్రోల్, డీజిల్ ధరలపై ఆయిల్ కంపెనీలు గత కొన్ని రోజులుగా ఊరట కల్పిస్తూ వస్తున్నాయి. వరుసగా 11వ రోజు పెట్రోల్, డీజిల్ ధరలను ఆయిల్ కంపెనీలు తగ్గించాయి. లీటరు పెట్రోల్పై 40 పైసలు, లీటరు డీజిల్పై 30 పైసలు ధర తగ్గించినట్టు తెలిసింది. ఈ తగ్గింపు గత 10 రోజుల పోలిస్తే నేడే అత్యధిక తగ్గింపు. నేటి ఉదయం 6 గంటల నుంచి ఈ తగ్గింపు అమల్లోకి వచ్చింది. తాజా తగ్గింపుతో న్యూఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ. 77.02గా నమోదైంది. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ధరల ప్రకారం.. ముంబైలో లీటరు పెట్రోల్ ధర రూ. 84.84గా, కోల్కతాలో రూ. 79.68, చెన్నైలో రూ. 79.95గా, హైదరాబాద్లో రూ.81.59గా ఉంది. ఇక డీజిల్ ధరలు కూడా 30 పైసలు తగ్గడంతో, లీటర్ డీజిల్ ధర న్యూఢిల్లీలో రూ. 68.28గా, ముంబైలో రూ. 72.70గా, కోల్కతాలో రూ. 70.83గా, చెన్నైలో రూ. 72.08గా, హైదరాబాద్లో రూ.74.22గా నమోదైంది. మొత్తంగా ఈ పదకొండు రోజుల్లో లీటర్ పెట్రోల్ ధర రూ. 1.42, డీజిల్ ధర రూ. 1.03 తగ్గింది. అయితే ధరలు పెంచేటప్పుడు భారీగా పెంపును చేపట్టిన ఆయిల్ కంపెనీలు, తగ్గించేటప్పుడు చాలా మెల్లగా చేపడుతున్నాయని వాహనదారులు వాపోతున్నారు. -
పెట్రో వాత: దీర్ఘకాల పరిష్కారం త్వరలో
పుణె : పెట్రోల్, డిజిల్ ధరలపై దీర్ఘకాలిక పరిష్కారం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని కేంద్ర మానవ వనురుల శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ తెలిపారు. శనివారం పుణెలో విలేకరులతో మాట్లాడుతూ.. ధరలు పెరగడంలో రాష్ట్రాలకు కూడా వాటా ఉందని, వారు కూడా పన్నులు విధిస్తున్నారన్నారు. ఈ విషయంలో రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వంతో కలిసొస్తేనే పరిష్కారం లభిస్తుందని తెలిపారు. ఆ దిశగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలతో సంప్రదింపులు జరుపుతోందన్నారు. గత యూపీఎ ప్రభుత్వ హయాంలో పెట్రోల్ ధరలు నియంత్రణ తప్పాయని ఆరోపించారు. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ అయిల్ ధరలు పెరగడంతోనే ఈ పరిస్థితి ఏర్పడిందన్నారు. గతేడాది నుంచి ఆయిల్ కంపెనీలు రోజువారి ధరల సవరణ చేపట్టిన విషయం తెలిసిందే. గత రెండు వారాలుగా పెట్రోల్, డిజిల్ ధరలు వాహనదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. అంతర్జాతీయంగా ఆయిల్ కంపెనీలు పెంచేటప్పుడు భారీగా పెంచడం, తగ్గించేటప్పుడు మాత్రం పైసల చొప్పున పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించడంపై పలు విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. కాగా వరుసగా నాలుగో రోజు కూడా పెట్రోల్, డీజిల్ ధరలు శనివారం మరో 9 పైసలు తగ్గాయి. దీంతో పెట్రోల్పై 23 పైసలు, డీజిల్పై 20 పైసలు ధర తగ్గింది. ఇది ఇలా ఉంటే రికార్డ్ స్థాయిల్లో ఉన్న లీటర్ పెట్రోల్, డీజిల్ ధరలను కేవలం పైసల్లో తగ్గించడంతో పండుగ చేసుకుంటామని సోషల్ మీడియా వేదికగా వాహనదారులు సెటైర్లు వేస్తున్నారు. -
4 రోజుల్లో పెట్రోల్, డీజిల్ ఎంత తగ్గాయో తెలుసా?
న్యూఢిల్లీ : వాహనదారులకు ఆయిల్ కంపెనీలు పైసా పైసా ముష్టి వేస్తున్నాయి. పెంచేటప్పుడు భారీగా పెంచేసి, తగ్గించేటప్పుడు పైసల చొప్పున పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గిస్తున్నాయి. వరుసగా నాలుగో రోజు పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గాయి. ఎంత అనుకుంటున్నారు? అది కేవలం 9 పైసలు మాత్రమే. దీంతో నాలుగు రోజుల పాటు వరుస తగ్గింపుతో పెట్రోల్పై 23 పైసలు, డీజిల్పై 20 పైసలు ధర తగ్గింది. న్యూఢిల్లీలో ప్రస్తుతం లీటరు పెట్రోల్ ధర రూ.78.20గా, లీటరు డీజిల్ ధర రూ.69.11గా పలుకుతోంది. సమీక్షించిన ధరల ప్రకారం ఇతర మెట్రో నగరాల్లో పెట్రోల్ రేట్లు ఈ విధంగా ఉన్నాయి. కోల్కతాలో రూ.80.84గా, ముంబైలో రూ.86.01గా, చెన్నైలో రూ.81.19గా నమోదయ్యాయి. అదేవిధంగా డీజిల్ ధర కోల్కతాలో రూ.71.66గా, ముంబైలో రూ.73.58గా, చెన్నైలో రూ.72.97గా రికార్డయ్యాయి. మే 30 ముష్టివేసినట్టు ఒక్క పైసా ధర తగ్గించిన ఆయిల్ కంపెనీలు, ఆ తర్వాత రోజు పెట్రోల్ ధరపై 7 పైసలు, డీజిల్పై 5 పైసల తగ్గింపును చేపట్టాయి. ఆ తర్వాత కూడా ఇదే మాదిరి పెట్రోల్పై 6 పైసలు, డీజిల్పై 5 పైసలు తగ్గించాయి. ఇలా.. సింగిల్ డిజిట్లో పైసల లెక్కనే తగ్గిస్తున్నాయి.. కానీ వాహనదారులపై ఆయిల్ కంపెనీలు కనీస కనికరం చూపించడం లేదు. ఆయిల్ కంపెనీలు చేపడుతున్న ఈ పైసల తగ్గింపుపై వాహనదారులు మండిపడుతున్నారు. పైసా పైసా కూడగట్టుకుని అపార్ట్మెంట్లు కట్టించుకోవాలా? అంటూ ప్రశ్నిస్తున్నారు. మరికొందరైతే, ఈ పైసలను మ్యూచువల్ ఫండ్స్లో పొదుపు చేసుకోవాలా? అంటూ ఛలోక్తులు కురిపిస్తున్నారు. ఈ పైసాతో నేను వెంటనే డిస్కొంట్ రేట్లలో కారు కొంటాను.. త్వరపడండి.. ట్యాంకు ఫుల్ చేసుకోండి అంటూ సోషల్ మీడియాలో ఫుల్గా కామెంట్లు పేలుతున్నాయి. -
వరుసగా రెండో రోజు తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు
న్యూఢిల్లీ : వరుసగా రెండో రోజు ఆయిల్ కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాయి. వినియోగదారులకు ముష్టి వేసిన మాదిరిగా నిన్న(బుధవారం) 1 పైసా మాత్రమే తగ్గించిన ఆయిల్ కంపెనీలు, నేడు కూడా అదే ధోరణిలో లీటరు పెట్రోల్పై 7 పైసలు, లీటరు డీజిల్పై 5 పైసలు ధరలు తగ్గించినట్టు తెలిసింది. అంతర్జాతీయంగా ఆయిల్ రేట్లు తగ్గుతున్న క్రమంలో దేశీయంగా కూడా ధరలను మెల్లమెల్లగా తగ్గిస్తున్నట్టు పేర్కొన్నాయి. దీంతో ఢిల్లీలో లీటరు పెట్రోల్ ధర రూ.78.42 నుంచి రూ.78.35కు దిగొచ్చింది. అదేవిధంగా డీజిల్ ధర కూడా లీటరు రూ.69.25గా నమోదైంది. ఈ ధర బుధవారం రూ.69.30గా ఉంది. ఎడతెడపి లేకుండా.. వరుసగా 16 రోజుల పాటు పెరిగిన ఇంధన ధరలు, ప్రస్తుతం వరుసగా రెండో రోజూ తగ్గాయి. 16 రోజుల పాటు వరుసగా ధరలు పెరగడంతో, లీటరు పెట్రోల్పై రూ.3.8, డీజిల్పై రూ.3.38 ధర పెరిగింది. పెంచేటప్పుడు రూపాయల్లో బాదేసి, తగ్గించేటప్పుడు ఒక్క పైసా రెండు పైసలు తగ్గించి జనం సంబురాలు చేసుకోండంటూ ఆయిల్ కంపెనీలు ప్రకటనలు ఇస్తున్నాయంటూ ప్రజలు మండిపడుతున్నారు. పెట్రోల్, డీజిల్ ధరలకు తాము శాశ్వత పరిష్కారం కనుగొంటామని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. -
పెట్రోల్ 1 పైసా తగ్గింది
న్యూఢిల్లీ: వరుసగా 16 రోజులు పెరుగుతూ వచ్చిన పెట్రో ధరలకు బ్రేక్ పడింది. బుధవారం పెట్రోల్, డీజిల్ ధరలను లీటర్కు ఒక పైసా తగ్గిస్తున్నట్టు చమురు సంస్థలు ప్రకటించాయి. ప్రభుత్వ రంగ చమురు సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్(ఐవోసీ) తొలుత లీటర్కు 60 పైసల చొప్పున పెట్రో ధరలను తగ్గిస్తున్నట్టు తెలిపింది. గత ఏడాది జూన్లో రోజువారీ ధరల సవరణ విధానాన్ని ప్రవేశపెట్టినప్పటి నుంచి ఇదే భారీ తగ్గింపు. ఇలా ప్రకటించిన కొద్ది గంటలకే సాంకేతిక లోపం కారణంగా అలా వచ్చిందని.. వాస్తవానికి తగ్గించింది ఒక పైసా మాత్రమే అని చమురు సంస్థలు స్పష్టంచేశాయి. సాంకేతిక లోపం వల్లే..: ఐవోసీ తగ్గించిన మొత్తం 1 పైసానే అని, క్లరికల్ ఎర్రర్ కారణంగా మే 25 నాటి ధర.. బుధవారం నాటి ధరగా ప్రకటించామని, వాస్తవానికి తగ్గించింది ఒక పైసానే అని ఐవోసీ సీనియర్ అధికారి ఒకరు చెప్పారు. తర్వాత ఐవోసీ దీనిపై ఓ ప్రకటన చేసింది. ఒక పైసా తగ్గింపు అనంతరం ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ. 78.42కు, లీటర్ డీజిల్ ధర రూ. 69.30కి తగ్గింది. ప్రస్తుతం అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు తగ్గుముఖం పడుతున్నాయని, డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ బలపడుతోందని, దీంతో దిగుమతుల ధర తగ్గుతుందని, దీని ఫలితంగా రానున్న రోజుల్లో పెట్రో ధరలు కూడా తగ్గుతాయని ఆయన పేర్కొన్నారు. మే 12న కర్ణాటక ఎన్నికలు ముగిసిన తర్వాత నుంచి 16 రోజులుగా పెట్రో ధరలు పెరుగుతూ వస్తున్నాయి. ఈ పక్షం రోజుల్లో పెట్రోల్ ధర లీటర్కు రూ. 3.80.. డీజిల్ ధర లీటర్కు రూ.3.38 పెరిగింది. పిల్ల చేష్టలా ఉంది: రాహుల్ పెట్రో ధరలను ఒక పైసా తగ్గించడంతో ప్రధాని మోదీపై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ మండిపడ్డారు. ప్రజలను వేళాకోళం చేయడానికి మోదీ ఈ ఐడియా వేయలేదు కదా అని ఎద్దేవా చేశారు. ఇది పిల్ల చేష్టలా.. చౌకబారుగా ఉందని విమర్శించారు. ‘డియర్ పీఎం. ఈ రోజు పెట్రోల్, డీజిల్ ధరలను మీరు ఒక పైసా తగ్గించారు. ఒక్క పైసానా..!?? ప్రజలను వేళాకోళం చేయడానికి మీరు వేసిన ఐడియా కాదు కదా ఇది. ఇది పిల్ల చేష్టలా.. చౌకబారుగా ఉంది’ అని ట్వీట్ చేశారు. పెట్రో ధరలను రూ. 1 తగ్గించిన కేరళ తిరువనంతపురం: కేరళ సీఎం విజయన్ తమ రాష్ట్రంలో పెట్రో ధరలను లీటర్కు రూ. 1 తగ్గిస్తున్నట్టు ప్రకటించారు. జూన్ 1 నుంచి ఇది అమలవుతుందని చెప్పారు. ఈ తగ్గింపు కారణంగా రాష్ట్ర ప్రభుత్వంపై ఏటా రూ.509 కోట్ల భారం పడుతుందని విజయన్ చెప్పారు. -
పెట్రోల్, డీజిల్ ధరలు ఎందుకు మారడం లేదు?
ఇటీవల పెట్రోల్, డీజిల్ ధర మంట తెలిసిందే. గత వారం క్రితం రికార్డు స్థాయిల్లో ఈ ధరలు పెరుగుతూ వచ్చాయి. దీనికి కారణం అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడమేనని ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు చెబుతున్నాయి. కానీ గత ఆరు రోజులుగా పెట్రోల్, డీజిల్ ధరల్లో ఎలాంటి మార్పు కనిపించడం లేదు. అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు పైకి ఎగుస్తున్న, దేశీయంగా మాత్రం ఎలాంటి ప్రభావం కనిపించడం లేదు. విడ్డూరమని అనిపించినా ఇది నిజం. త్వరలో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఇంధన ధరల సవరణ వద్దని ప్రభుత్వం చమురు కంపెనీలను కోరగా, ప్రభుత్వ ఆదేశాలను అవి పాటిస్తున్నట్టు సమాచారం. ఏప్రిల్ 24 నుంచి ఈ ధరల్లో మార్పు లేదు. అప్పటి నుంచి లీటరు పెట్రోల్ ధర ఢిల్లీలో రూ.74.63, కోల్కత్తాలో రూ.77.32, ముంబైలో రూ.82.48, చెన్నైలో రూ.77.43గా ఉన్నాయి. బెంగళూరులో ఒక్క లీటరు పెట్రోల్ ధర రూ.75.82గా ఉంది. బెంగళూరులోని 28 అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు మొత్తంగా 224 సెగ్మెంట్లలో మే 12న పోలింగ్ జరుగబోతోంది. ఈ సమయంలో ధరల పెంపు అంత మంచిది కాదని ప్రభుత్వం భావిస్తోంది. గత వారం క్రితం వరకు భారీగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతుండటంతో, నరేంద్ర మోదీ ప్రభుత్వంపై విపక్షాలు మండిపడ్డాయి. పెట్రోల్, డీజిల్ ధరలు పెంపును ప్రధానమైన అంశంగా తీసుకున్న విపక్షాలు, కర్నాటక ఎన్నికల్లో ప్రచార అస్త్రంగా కూడా మలుచుకున్నాయి. దీంతో గత ఆరు రోజుల నుంచి పెట్రోల్, డీజిల్ ధరల పెంపును ప్రభుత్వం చేపట్టడం లేదు. పెట్రోలు ధరల్లో మార్పు ఎందుకు లేదన్న విషయమై అటు ప్రభుత్వ రంగ చమురు సంస్థల నుంచి గానీ, ఇటు ప్రభుత్వ పెద్దల నుంచి కానీ ఎలాంటి స్పందన లేదు. ఇక ఎన్నికలు ముగియగానే, ఒక్కసారే ధరలను పెంచుతూ చమురు కంపెనీలు నిర్ణయం తీసుకుంటాయని తెలుస్తోంది. గత సంవత్సరం జూలై నుంచి పరిశీలిస్తే పెట్రోలు ధర రూ. 11కు పైగా, డీజిల్ ధర రూ. 12కు పైగా పెరిగిన సంగతి తెలిసిందే. ఎన్నికల ముందు పెట్రోలు, డీజిల్ ధరలను పెంచవద్దని చమురు కంపెనీలకు ప్రభుత్వం నుంచి ఆదేశాలు వెళ్లడం సర్వసాధారణమే. ఉత్తరప్రదేశ్, గుజరాత్ ఎన్నికల సమయంలో కూడా పెట్రోలు, డీజిల్ ధరలను కొంతకాలం సవరించలేదు. -
భగ్గుమంటున్న పెట్రో ధరలు
సాక్షి, హైదరాబాద్: పెట్రో ఉత్పత్తుల ధరలు భగ్గుమంటున్నాయి. ధరలు పెరుగుతున్నది పైసల్లోనే అయినా రికార్డు స్థాయికి చేరుకుంటున్నాయి. రోజువారీ ధరల సవరణ వినియోగదారుల పాలిట శాపంగా తయారైంది. కేవలం పది రోజుల్లో లీటర్ పెట్రోల్ ధరపై 63 పైసలు, డీజిల్పై 86 పైసలు పెరిగింది. ఇప్పటికే దేశంలో డీజిల్ ధర టాప్గా మారగా, పెట్రోల్ రెండో స్థానంలో కొనసాగుతోంది. గత జూన్ వరకు ప్రతి పక్షం రోజులకోసారి ధరలు సమీక్షించిన చమురు సంస్థలు.. ఆ తర్వాత ఆ విధానానికి స్వస్తి పలికాయి. మార్కెట్ ధరలకు అనుగుణంగా ప్రతి రోజూ ధరలను నిర్ణయిస్తున్నాయి. నూతన విధానం అమల్లోకి వచ్చి న తొలి పక్షం రోజుల్లో ధరలు తగ్గగా.. తర్వాత క్రమంగా విజృంభించాయి. పెట్రో ఉత్పత్తుల ధరల దూకుడుకు పన్నుల మోత, రవాణా చార్జీల ప్రభావం కనిపిస్తోంది. రికార్డు స్థాయిలో పెట్రోల్.. ప్రస్తుతం పెట్రోల్ ధర లీటర్ రూ.78.90కు చేరింది. గత నెలాఖరులో రూ.77.89గా ఉన్న ధర.. ఆ తర్వాత పైసలు పైసలు పెరుగుతూ వచ్చింది. నెల ప్రారంభంలో వరసగా మూడు రోజులపాటు 11 నుంచి 19 పైసలకు పెరిగి ఆ తర్వాత ఒక పైసా నుంచి 5 పైసల పెంపు వరకు పరిమితమైంది. మధ్యలో మూడు రోజులు ధరలో ఎలాంటి మార్పు లేకపోగా రెండ్రోజులు మాత్రం తగ్గుముఖం పట్టింది. ఆ తర్వాత పైసలు పైసలు పెరుగుతూ గత మూడు రోజుల నుంచి విజృంభించింది. మరోవైపు డీజిల్ ధర టాప్గా మారింది. ప్రస్తుతం లీటర్ ధర రూ.71.44 పైసలు పలుకుతోంది. ధరల సవరణ సమయంలో డీజిల్ లీటర్ ధర రూ.59ç.30 పైసలు ఉండగా ఆ తర్వాత వెనక్కి తిరిగి చూడలేదు. డీజిల్ ధర ఆల్టైం రికార్డుగా తయారైంది. ప్రతి నిత్యం విక్రయం ఇలా.. హైదరాబాద్లో పెట్రోల్ ఉత్పత్తుల విక్రయాలు అధికంగా ఉంటాయి. నగరంలో సుమారు 50 లక్షలకు పైగా వాహనాలు ఉండగా, మరో పది లక్షల వాహనాల వరకు నగరానికి రాకపోకలు సాగిస్తుంటాయి. నగరంలో మూడు ప్రధాన ఆయిల్ కంపెనీలకు చెందిన సుమారు 460 పెట్రోల్, డీజిల్ బంకులు ఉండగా వాటి ద్వారా నిత్యం 40 లక్షల లీటర్ల పెట్రోల్, 30 లక్షల లీటర్ల డీజిల్ అమ్ముడుపోతుంది. ఆయిల్ కంపెనీల టెర్మినల్స్ నుంచి నిత్యం పెట్రోల్ బంకులకు 150 నుంచి 170 ట్యాంకర్ల ద్వారా ఇంధనం సరఫరా అవుతుంది. ఒక్కొక్క ట్యాంకర్ సగటున 12 వేల లీటర్ల నుంచి 20 వేల లీటర్ల వరకు సామర్థ్యం కలిగి ఉంటుంది. -
డీజిల్ గుబేల్..!
సాక్షి, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో టాప్ గేర్లో దూసుకుపోతున్నాయి. హైదరాబాద్లో డీజిల్ ధర ఆల్టైం రికార్డు స్థాయికి చేరుకుంది. పెట్రోల్ కూడా దానిని అనుసరిస్తూ భగ్గుమంటోంది. రోజు వారీ ధరల సవరణ పేరిట పెట్రో ధరలను పైసా.. పైసా పెంచుతున్న చమురు సంస్థలు.. వినియోగదారునిపై సైలెంట్గా బాదేస్తున్నాయి. ఈ నెల మొదట్లో డీజిల్ ధరను లీటర్కు మూడు నుంచి 19 పైసల చొప్పున పెంచిన ఆయిల్ కంపెనీలు.. రెండు రోజుల క్రితం మూడు పైసలు తగ్గించాయి. మళ్లీ ఇప్పుడు డీజిల్ ధర తారస్థాయికి చేరింది. దీంతో హైదరాబాద్లో లీటర్ డీజిల్ ధర రూ.70.58కు చేరింది. ఇక లీటర్ పెట్రోల్ ధర రూ.78.27గా ఉంది. పక్షం నుంచి రోజులకు.. గతేడాది వరకు ప్రతి పక్షం రోజులకోసారి పెట్రో ధరలు సమీక్షించిన చమురు సంస్థలు.. గత జూన్ నుంచి ఆ విధానానికి స్వస్తి పలికాయి. మార్కెట్ ధరలకు అనుగుణంగా ఏ రోజుకు ఆ రోజు ధరలను నిర్ణయిస్తున్నాయి. నూతన విధానం అమల్లోకి వచ్చిన తొలి పక్షం రోజులూ ధరలు తగ్గగా.. ఆ తర్వాత క్రమంగా పెరుగుతూ వస్తున్నాయి. తాజాగా కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం రోజువారీగా పెట్రో ఉత్పత్తుల ధరలు పెంచొద్దని చమురు సంస్థలకు సూచనలు జారీ చేసింది. చమురు సంస్థలు మాత్రం కేంద్రం ఆదేశాలు తమకు అందలేదని చెపుతూ ధరలను పెంచుతున్నాయి. డీజిల్ రూ.70.58.. పెట్రోల్ రూ.78.27 తెలంగాణ–ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో డీజిల్ ధర మోతెక్కుతోంది. హైదరాబాద్లో ప్రస్తుతం లీటర్ డీజిల్ ధర రూ.70.58గా ఉంది. రోజువారీ ధరల సవరణ విధానం ప్రారంభమైన సమయంలో లీటర్ డీజిల్ ధర రూ.59.30గా ఉంది. ఆ తర్వాత క్రమంగా పెరుగుతూ అక్టోబర్ నాటికి రూ.64.02కి చేరింది. మార్చి నెలఖారులో రూ.69.97కు పెరిగింది. ఇక హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ ధర ప్రస్తుతం రూ.78.27గా ఉంది. గత జూన్లో రూ.69.56గా ఉన్న పెట్రోల్ ధర ఆ తర్వాత రోజువారీ ధర సవరణలతో పైసా పైసా పెరిగుతూ వచ్చింది. గత నెలఖారులో రూ.77.89గా ఉంటే.. ఈ నెలలో రూ.78.36 వరకు పెరిగి ఆ తర్వాత హెచ్చుతగ్గులతో కొనసాగుతోంది. పెట్రో ధరల దూకుడుకు పన్నుల మోత, రవాణా చార్జీల బాదుడు కూడా తోడవుతోంది. తెలుగు రాష్ట్రాలు పెట్రో ఉత్పత్తులపై వ్యాట్ విధింపులో దేశంలోనే రెండో స్థానంలో ఉండటం గమనార్హం. పన్నులు తగ్గిస్తే ధరలు తగ్గుతాయి.. పన్నుల వల్ల పెట్రో ధరలు ఎగబాకుతున్నాయి. ఖజానా నింపేందుకు ప్రజలపై పన్ను రుద్దేస్తున్నారు. పెట్రో ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తెస్తే ధరలు దిగిరావడం ఖాయం. కేంద్రం దీనిపై పునరాలోచించాలి. – రియాజ్ ఖాద్రీ, చైర్మన్, ట్యాక్స్ పేయర్స్ అసోసియేషన్, తెలంగాణ–ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలకు గుణపాఠం తప్పదు.. కేంద్రం పెట్రో ధరలు పెంచి సామాన్యుల నడ్డివిరుస్తోంది. పెట్రో ధరలు దిగిరావాల్సిందే. లేకుంటే రాబోయే ఎన్నికల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు గుణపాఠం తప్పదు. – జగదీశ్, ఉప్పుగూడ, హైదరాబాద్ ప్రజలను పిచ్చోళ్లను చేస్తోంది.. ఒకేసారి రూపాయల్లో పెంచితే తెలిసిపోతుందని.. రోజూ పైసల్లో పెంచుతూ అమాయక ప్రజల్ని ప్రభుత్వం పిచ్చివారిని చేస్తోంది. ఇదే పరిస్థితి కొనసాగితే వాహనాలను ఇళ్లలో నుంచి తీయాలంటేనే ప్రజలు భయపడే రోజులు వస్తాయి. – ఉదయ్, క్యాబ్ డ్రైవర్ -
పెట్రోల్ రేట్లలో కేంద్రం జోక్యం లేదు
న్యూఢిల్లీ: కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని పెట్రోల్, డీజిల్ రేట్లను పెంచొద్దంటూ చమురు కంపెనీలకు ప్రభుత్వం ఆదేశించిందన్న వార్తలపై కేంద్ర చమురు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ స్పందించారు. చమురు మార్కెటింగ్ సంస్థలకు ప్రభుత్వం అలాంటి ఆదేశాలేమీ ఇవ్వలేదని స్పష్టం చేశారు. ‘‘ఇంధన రంగంలో పోటీని పెంచేందుకే ధరలపై ప్రభుత్వం నియంత్రణను ఎత్తివేసింది. అంతర్జాతీయ చమురు ధరలకు అనుగుణంగా రేట్లు సవరించుకునేలా దేశీ ఆయిల్ కంపెనీలకు స్వేచ్ఛనివ్వడం వ్యూహాత్మకమైన నిర్ణయం’’ అన్నారాయన. రేట్లను పెంచొద్దంటూ ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదంటూ చమురు కంపెనీలు కూడా స్పష్టం చేసిన సంగతి ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. ప్రభుత్వ రంగ చమురు సంస్థలు గతేడాది జూన్ నుంచీ రోజువారీ రేట్లు సవరిస్తున్న సంగతి తెలిసిందే. అయితే, ప్రస్తుతం అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు భారీగా పెరుగుతున్నా ఇవి పెట్రోల్ రేటును 4 పైసలు, డీజిల్ ధరను 3 పైసలు తగ్గించడం చర్చనీయాంశమయింది. గతేడాది డిసెంబర్లో గుజరాత్ ఎన్నికల సమయంలో కూడా ఇండియన్ ఆయిల్ వంటి ప్రభుత్వ రంగ చమురు సంస్థలు ఆ నెల ప్రథమార్థంలో ప్రతి రోజూ 1–3 పైసల మేర రేట్లు తగ్గించాయి. డిసెంబర్ 14న ఎన్నికలు అయిపోయిన వెంటనే రేట్లు పెరగడం మళ్లీ మొదలైంది. -
ఈ నెలలో సబ్సిడీ గ్యాస్ ధర ఎంత పెరిగింది?
న్యూఢిల్లీ: గత 17 నెలలుగా వంటగ్యాస్ సిలిండర్ ధరలను ప్రతినెలా పెంచుతూ వచ్చిన చమురు సంస్థలు డిసెంబర్లో తాత్కాలిక విరామం ఇచ్చాయి. బహిరంగంగా చెప్పకపోయినప్పటికీ గుజరాత్ ఎన్నికలే దీనికి కారణమనీ, ప్రభుత్వమే ఆ మేరకు చమురు సంస్థలను కోరిందని తెలుస్తోంది. వంటగ్యాస్ సిలిండర్లపై అన్ని రాయితీలను 2018 మార్చికల్లా ఎత్తివేయాలనీ, అందుకోసం ప్రతినెలా ధర పెంచుతూ పోవాలని కేంద్రం గతేడాది చమురు సంస్థలను ఆదేశించింది. దీంతో గతేడాది జూలై నుంచి ఈ ఏడాది నవంబర్ వరకు ప్రతి నెలా రూ.2 తో మొదలుకొని రూ.4.50 వరకు చమురు సంస్థలు సిలిండర్ల ధర పెంచుతూ వచ్చాయి. ఏడాదిన్నరలో రాయితీ సిలిండర్ ధర రూ.76.50 పెరిగింది. డిసెంబర్లో రాయితీ సిలిండర్ ధరను పెంచలేదని ఓ అధికారి చెప్పారు. రాయితీయేతర సిలిండర్ ధరను మాత్రం డిసెంబర్ 1న రూ.5 పెంచాయి. ప్రస్తుతం ఢిల్లీ మార్కెట్ ప్రకారం 14.2 కేజీల రాయితీ సిలిండర్ ధర రూ.496, రాయితీయేతర సిలిండర్ ధర రూ.747గా ఉంది. దేశంలో 18.11 కోట్ల గ్యాస్ కనెక్షన్లు ఉండగా వాటిలో 3 కోట్లు ప్రధాన మంత్రి ఉజ్వల యోజన కింద అత్యంత పేద మహిళలకు మంజూరైనవి. -
గ్యాస్ సిలిండర్ ధర రూ.86 పెంపు
-
గ్యాస్ సిలిండర్ ధర రూ.86 పెంపు
న్యూఢిల్లీ: అంతర్జాతీయ మార్కెట్లో నెలకొన్న పరిస్థితులకు అనుగుణంగా సబ్సిడీయేతర వంటగ్యాస్ (ఎల్పీజీ) సిలిండర్ ధరను చమురు కంపెనీలు రూ.86 పెంచాయి. దీంతో ఏడాదిలో 12 సబ్సిడీ సిలిండర్ల కోటా పూర్తిచేసుకున్న వారు, సబ్సిడీని వదులుకున్న వారు ఇకపై ఢిల్లీలో 14.2 కిలోల సబ్సిడీయేతర సిలిండర్కు రూ.737.50 చెల్లించాల్సి ఉంటుంది. సబ్సిడీ గ్యాస్ సిలిండర్ ధరను కూడా చమురు కంపెనీలు 13 పైసలు పెంచాయి. దీంతో 14.2 కిలోల సబ్సిడీ గ్యాస్ సిలిండర్ ధర 434.93కి చేరింది. విమానయాన రంగంలో వినియోగించే ఏవియేషన్ టర్బైన్ ఇంధనం(ఏటీఎఫ్) ధరను కిలో లీటర్కు రూ.214 పెంచారు. దీంతో ఇది రూ.54293.38కి చేరింది. మార్చి 1 నుంచే పెరిగిన ధరలు అమల్లోకి వచ్చాయి. -
పెట్రోల్ బంక్ల మూసివేత నిర్ణయం లేనట్లే!
ముంబై / హైదరాబాద్: కమీషన్ పెంపు వ్యవహరంపై ఆయిల్ కంపెనీలకు, పెట్రోల్ బంక్ డీలర్లకు మధ్య నెలకొన్న వివాదం ఎట్టకేలకు పరిష్కారం అయింది. ఆయిల్ అమ్మకాలపై వచ్చే కమీషన్ ను పెంచడానికి కంపెనీలు అంగీకరించడంతో పెట్రోల్ బంక్ ల డీలర్లు ఆందోళనలను విరమించేందుకు రంగం సిద్ధమైంది. ఒక లీటరు ఆయిల్ పై పెట్రోల్ బంకుల డీలర్లకు లభించే కమీషన్ ను మరో 10 పైసలు పెంచేందుకు ఆయిల్ కంపెనీలు అంగీకరించాయి. ముంబైలో డీలర్లకు, ఆయిల్ కంపెనీలకు మధ్య శుక్రవారం జరిగిన చర్చలు సఫలం కావడంతో ఇండియన్ పెట్రోల్ బంక్ డీలర్ల కన్సార్టియం (సీఐపీడీ) తన కార్యాచరణను ఉపసంహరించుకోనుంది. అంతకుముందు.. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకే మాత్రమే బంక్ లు తెరిచి ఉంచుడం, ప్రభుత్వ సెలవు దినాల్లోనూ బంకులు మూసివేడంలాంటి తీవ్ర నిర్ణయాలను సీఐపీడీ ప్రకటించింది. దీంతో హైదరాబాద్ కు చెందిన డీటర్లు కూడా ఆ నిర్ణయాలను అమలుచేయనున్నట్లు శుక్రవారం రాత్రి మీడియాకు వెల్లడించారు. ఇది జరిగిన కొద్ది సేపటికే ముంబైలో చర్చలు సఫలం అయినట్లు సమాచారం అందింది. దీంతో వాహనదారులకు ఇబ్బందులు తప్పినట్లయింది. -
పెట్రోల్ బంక్ల మూసివేత నిర్ణయం లేనట్లే!
-
మళ్లీ పెట్రో బాదుడు
న్యూఢిల్లీ: పెట్రో, డీజిల్ ధరల్ని మంగళవారం మరోసారి పెంచారు. లీటర్ పెట్రోల్పై రూ.2.58, డీజిల్పై రూ.2.26 పెంచుతూ ఆయిల్ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. మే 17నే ధరల్ని పెంచిన కంపెనీలు, ఒకే నెలలో రెండోసారి పెంచి మరింత భారం మోపాయి. తాజా ధరల ప్రకారం ఢిల్లీలో లీటర్ పెట్రోల్కు రూ.65.60, డీజిల్ రూ.53.93 వసూలు చేస్తారు. పెంచిన ధరలు మంగళవారం అర్ధరాత్రి నుంచే అమల్లోకి వచ్చాయి. ముడిచమురు ధరల్లో మార్పులు, డాలర్ మారకం విలువల వల్లే ధరలు పెంచినట్లు ఐఓసీ పేర్కొంది. -
మళ్లీ భగ్గుమన్న ‘పెట్రో’ ధరలు
లీటర్ పెట్రోల్పై రూ.3.02, డీజిల్పై రూ. 2.17 పెంపు జిల్లా వాహనదారులపై రోజుకు రూ. 22లక్షల భారం తిరుపతి మంగళం: పెట్రోల్ , డీజిల్ ధరలు మరోసారి భగ్గుమన్నాయి. లీటరు పెట్రోల్పై రూ.3.02లు, డీజిల్పై రూ.2.17లు పెంచుతూ బుధవారం ఆయిల్ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. ఈ ధరలు బుధవారం అర్ధరాత్రి నుంచి అమలులోకి రానున్నట్లు తెలిపాయి. జిల్లాలో సుమారు 46లక్షల వాహనాలు ఉన్నాయి. ఇండియన్ కార్పొరేషన్, హిందూస్థాన్ లిమిటెడ్, భారత్ పెట్రోలియం కంపెనీలు రోజుకు పెట్రోల్ 3.6 లక్షల లీటర్లు, డీజల్ 4.8లక్షల లీటర్లను విక్రయిస్తున్నాయి. ప్రస్తుతం పెట్రోల్ లీటర్ ధర రూ.61.97లు, డీజిల్ లీటర్ ధర రూ.52.10లు ఉన్నాయి. పెరిగిన ధరలతో పెట్రోల్ లీటరు రూ.64.99లు, డీజల్ లీటరు రూ. 54.27లు అయ్యింది. పెరిగిన ధరల కారణంగా జిల్లాలోని వాహనదారులపై రోజుకు సగటున రూ.22లక్షల భారం పడనుంది. మళ్లీ పెట్రోలు, డీజిలు ధరల పెరుగుదలపై సామాన్య, మధ్య తరగతి ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
పెట్రో ధరల పెంపు అన్యాయం : వైఎస్సార్సీపీ
హైదరాబాద్ : ఇప్పటికే పెరిగిన నిత్యావసర ధరలతో ప్రజలు సతమతమవుతున్న నేపథ్యంలో పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెంచడం అన్యాయమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పేర్కొంది. వెంటనే కేంద్ర ప్రభుత్వం ధరల పెంపు నిర్ణయాన్నివెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేసింది. అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గుతున్న ధరలు పెంచడం దారుణమని... ధరల పెంపును వైఎస్సార్ సీపీ తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపింది. లీటరు పెట్రోల్ ధర ఏకంగా రూ.3.07, డీజిల్ రూ.1.90 పెంచుతున్నట్లు కేంద్ర ప్రభుత్వ రంగ చమురు సంస్థలు గురువారం నిర్ణయించాయి. పెంచిన ధరలు గురువారం అర్ధరాత్రి నుంచి అమల్లోకి రానున్న విషయం తెలిసిందే. -
భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
న్యూఢిల్లీ : వాహనదారులకు భారీ షాక్. ఇప్పటికీ పెరిగిన ధరలతో సతమతం అవుతున్న ప్రజలకు ఇప్పుడు పెట్రోల్, డీజిల్ ధరలు మరింతగా పెరిగాయి. లీటరు పెట్రోల్ ధర ఏకంగా రూ.3.07, డీజిల్ రూ.1.90 పెరిగింది. కేంద్ర ప్రభుత్వ రంగ చమురు సంస్థలు ఈ మేరకు నిర్ణయించాయి. పెంచిన ధరలు గురువారం అర్ధరాత్రి నుంచి అమల్లోకి రానున్నాయి. కొత్త ధరల ప్రకారం నాలుగు ప్రధాన నగరాల్లో లీటర్ పెట్రోల్ ఢిల్లీలో రూ.59.68, కోల్కతాలో రూ.63.76, ముంబయి రూ.65.79, చెన్నైలో రూ.59.13 పైసలకు పెరగనుంది. చివరిగా చమురు ధరలు ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ పార్లమెంట్ లో బడ్జెట్ ప్రవేవపెట్టిన ఫిబ్రవరి 29న పెట్రోల్ ధర తగ్గగా, డీజిల్ ధర పెరిగిన విషయం తెలిసిందే. -
రూ.3.02 తగ్గిన పెట్రోల్ ధర
డీజిల్పై రూ.1.47 పెంపు న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా పెట్రోల్ ధరలు లీటరుకు రూ. 3.02 తగ్గగా.. డీజిల్ రూ. 1.47 పెరిగినట్లు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ) ప్రకటించింది. మారిన ధరలు సోమవారం అర్థరాత్రినుంచి అమల్లోకి వచ్చాయి. ఫిబ్రవరి నెలలో పెట్రోల్ ధరలు తగ్గటం, డీజిల్ ధరలు పెరగటం ఇది రెండోసారి. కాగా, కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక పెట్రో ఉత్పత్తుల ధరలు తగ్గటం ఇది ఏడోసారి. ఫిబ్రవరిలో పెట్రోల్ ధరలు తగ్గినా అది నామమాత్రంగానే ఉన్నాయి. ఫిబ్రవరి 1న పెట్రోల్ ధర నాలుగు పైసలు, 18న 32 పైసలు తగ్గగా.. డీజిల్ ఫిబ్రవరి 1న మూడు పైసలు తగ్గగా.. ఫిబ్రవరి 18న 28 పైసలు పెరిగింది. అంతర్జాతీయంగా పెట్రో ఉత్పత్తుధరలు తగ్గటం, డాలర్తో రూపాయి మారక విలువ స్వల్పంగా తగ్గటంతో పాటు పదిహేనురోజులకోసారి ఇంధన సరఫరా కంపెనీల సమీక్ష సమావేశంలో తీసుకున్న నిర్ణయాల వల్లే ధరల్లో మార్పులు తీసుకువచ్చినట్లు ఐఓసీ తెలిపింది. పెట్రోల్పై ఎక్సైజ్ డ్యూటీ ఒక రూపాయి పెరగగా.. డీజిల్పై 1.5 రూపాయలు పెరిగింది. దీని ద్వారా ఈ ఆర్థిక సంవత్సరంలో కేంద్రానికి 3200 కోట్ల ఆదాయం సమకూరనుంది. గత నవంబర్ నుంచి పెట్రో ఉత్పత్తులపై ఎక్సైజ్ సుంకం పెంచటం ఇది ఐదోసారి కావటం విశేషం. మారిన ధరలతో హైదరాబాద్లో రూ. 63.52 ఉన్న పెట్రోల్ ధర రూ. 60.33కు తగ్గగా.. రూ.48.51 ఉన్న డీజిల్ రూ. 50.09కు లభించనుంది. -
ప్లీజ్... సబ్సిడీ వదులుకోండి
‘మీ వార్షిక ఆదాయం రూ.10లక్షలు దాటిందా, అయితే వంటగ్యాస్ సబ్సిడీని వదులుకోండి’ అంటూ ఆయిల్ కంపెనీలు వంటగ్యాస్ వినియోగదారులకు ఎస్ఎమ్ఎస్లు పంపుతున్నాయి. చెన్నై: భారత దేశంలోని వంటగ్యాస్ వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం చాలా కాలంగా సబ్సిడీని అందజేస్తోంది. సబ్సిడీపై సరఫరా అవుతున్న వంటగ్యాస్ సిలిండర్లు డీలర్ల సాక్షిగా పక్కదారి పట్టిపోయేవి. బ్లాక్లో అమ్ముకోవడం, గృహ అవసరాలకు వినియోగించే సిలిండర్లను వాణిజ్య అవసరాలకు సరఫరా చేయడం ద్వారా డీలర్లు భారీగా అక్రమాలకు పాల్పడేవారు. అలాగే ఒకే ఇంటి యజమాని పేరున అనేక కనెక్షన్లు ఉండేవి. ఇలాంటి అక్రమాల కారణంగా వంట గ్యాస్ సబ్సిడీ మొత్తం అయిల్ కంపెనీలకు, ప్రభుత్వానికి భరించలేని భారంగా మారింది. ఈ భారం నుండి తప్పించుకునేందుకు ఏడాదికి పరిమితమైన సంఖ్యలోనే సిలిండర్లను సరఫరా చేస్తామని గత యూపీఏ ప్రభుత్వం ప్రకటించింది. ఈ నిర్ణయంపై వినియోగదారుల నుండి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఆ తరువాత కేంద్రంలో కొత్తగా అధికారం చేపట్టిన బీజేపీ ప్రభుత్వం వంటగ్యాస్ సబ్సిడీ దుర్వినియోగంపై దృష్టి సారించింది. అక్రమ కనెక్షన్లు అరికట్టేందుకు సరికొత్త విధానాన్ని అమలులోకి తెచ్చింది. వంటగ్యాస్ సబ్సిడీని వినియోగదారుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమచేసే విధానాన్ని గత ఏడాది జనవరిలో ప్రవేశపెట్టింది. ప్రభుత్వానికి భారంగా పరిణమించిన వంటగ్యాస్ సబ్సిడీ నుంచి విముక్తి పొందేందుకు ప్రయత్నాలు చేస్తోంది. పేదలు, మధ్యతరగతి వారిని దృష్టిలో ఉంచుకుని మంజూరు చేస్తున్న సబ్సిడీని ధనవంతులు పొందడం సరికాదని ప్రభుత్వం భావిస్తోంది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఇప్పటికే దేశవ్యాప్తంగా 50 లక్షల మందికి పైగా వినియోగదారులు తమ సబ్సిడీ నుండి స్వచ్చందంగా విరమించుకుంటున్నట్లు ప్రకటించారు. అయినప్పటికీ సబ్సిడీ నుంచి మరింతమంది వైదొలగాలని కేంద్రం ఆశిస్తోంది. వార్షిక ఆదాయం రూ.10 లక్షలను దాటిన వినియోగదారులను వంటగ్యాస్ సబ్సిడీ నుంచి మినహాయించాలని నిర్ణయించుకుంది. ఈ నిర్ణయం మేరకు ఆయిల్ కంపెనీలు వంటగ్యాస్ వినియోగదారులకు ఎస్ఎమ్ఎస్లు పంపడం ప్రారంభించాయి. రూ.10 లక్షల వార్షిక ఆదాయం దాటిన వారికి వంట గ్యాస్ సబ్సిడీ సౌకర్యం లేదు, ఈ పరిధిలోకి వచ్చిన వారు తమ వివరాలను గ్యాస్ డీలర్కు సమర్పించి సబ్సిడీ నుంచి వైదొలగండి అంటూ ఎస్ఎమ్ఎస్ల ద్వారా అయిల్ కంపెనీలు విజ్ఞప్తి చేస్తున్నాయి. ఈ విషయంపై ఇండియన్ ఆయిల్ చెన్నై శాఖ జనరల్ మేనేజర్ సబితా నటరాజన్ మాట్లాడుతూ, వంటగ్యాస్ వినియోగదారులకు ముంబయిలోని తమ కేంద్ర కార్యాలయం నుండి ఈ మేరకు ఎస్ఎమ్ఎస్లు పంపడం బుధవారం నుంచి ప్రారంభమైందని తెలిపారు. ఈ కార్యక్రమం ముందుగానే తీసుకున్న నిర్ణయం ప్రకారం జరుగుతోందని చెప్పారు. -
నిమిషానికి రూ 3,36,420 లాభం
న్యూయార్క్: ఒకప్పుడు చమురు కంపెనీలు సంపాదించిన లాభాల కన్నా ఇప్పుడు ఐటి దిగ్గజాలు ఎక్కువగా సంపాదిస్తున్నాయి. ఆపిల్, అల్ఫాబెట్, మైక్రోసాఫ్ట్, ఫేస్బుక్...నాలుగు సంస్థలు కలసి క్షణానికి 1,26,000 రూపాయలను, నిమిషానికి 88,20,000 రూపాయలను ఆర్జిస్తున్నాయి. లాభాల్లో వీటిలో అన్నింటికన్నా ముందున్నది ఆపిల్ సంస్థ. గతేడాదిలో ఈ సంస్థ 3,36,420 కోట్ల రూపాయల లాభాలను గడించింది. ఐఫోన్ అమ్మకాలు రికార్డు స్థాయిలో అమ్ముడుపోవడం వల్లనే సంస్థకు ఎక్కువ లాభాలు వచ్చాయి. గతేడాది చివరి త్రైమాసికంలో ఆపిల్ సంస్థకు 10,85,400 కోట్ల రూపాయల లాభం వచ్చింది. అదే మైక్రోసాఫ్ట్కు గతేడాది డెసెంబర్ 31వ తేదీ నాటికి 31,000 కోట్ల రూపాయల లాభాలను గడించింది. ఫేస్బుక్ గతేడాదిలో 6,300 కోట్ల రూపాయల లాభాలను సంపాదించింది. అల్ఫాబెట్, ఆపిల్ మార్కెట్ను అధిగమించి ముందుకు దూసుకెళుతోంది. ఈ వారంలో దాని రెవెన్యూ 547.1 బిలియన్ డాలర్లకు చేరుకొంది. ఏడాది మొత్తంగా లాభాల వివరాలు తెలియాల్సి ఉంది. ఈ మేరకు పెన్నీ స్టాక్స్ ల్యాబ్ ఓ చార్ట్ను రూపొందించింది. టెక్నాలజీ సంస్థలు ఇంత పెద్ద మొత్తంలో లాభాలను గడిస్తూ ముందుకు దూసుకెళ్లడం ప్రపంచ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నానికి దారితీస్తుందని ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రజల మధ్య ఆర్థిక అంతరాలు మరింత పెరిగిపోవడం సమాజంలో అసహన పరిస్థితులకు దారితీయవచ్చని వారు భావిస్తున్నారు. -
తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు
న్యూఢిల్లీ: పెట్రోల్, డీజిల్ ధరలు సోమవారం స్వల్పంగా తగ్గాయి. పెట్రోల్ ధర లీటర్కు 58 పైసలు, డీజిల్ ధర లీటర్కు 25 పైసలు చొప్పున తగ్గాయి. కొత్త ధరలు ఈ రోజు అర్ధరాత్రి నుంచి అమల్లోకి వస్తాయి. చమురు కంపెనీలు ప్రతి 15 రోజులకు ఓసారి సమావేశమై.. పెట్రోల్, డీజిల్ ధరలను సమీక్షిస్తున్న విషయం తెలిసిందే. 15 రోజుల క్రితం పెట్రోల్, డీజిల్ ధరలు స్వల్పంగా పెరిగాయి. పెట్రోల్ లీటర్ కు 36 పైసలు, డీజిల్ లీటరుకు 87 పైసలు చొప్పున పెరిగాయి. అంతర్జాతీయ ముడిచమురు ధరలు స్వల్పంగా తగ్గడంతో పెట్రోల్, డీజిల్ ధరలు ఈసారి తగ్గాయి. -
పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
-
పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
న్యూఢిల్లీ: పెట్రోల్, డీజిల్ ధరలు ఆదివారం స్వల్పంగా పెరిగాయి. పెట్రోల్ లీటర్ కు 36 పైసలు, డీజిల్ లీటరుకు 87 పైసలు చొప్పున పెరిగాయి. పెరిగిన ధరలు అర్ధరాత్రి నుంచి అమల్లోకి రానున్నాయి. అంతర్జాతీయ ముడిచమురు ధరలు స్వల్పంగా పెరుగడంతో ఈ మేరకు మార్పులు చేశారు. గత ఐదు నెలల్లో పెట్రోల్ ధర పెరగడం ఇదే ప్రథమం కాగా.. గత అక్టోబర్ నెల నుంచి డీజిల్ ధర మూడుసార్లు స్వల్పంగా పెరిగింది. దేశ రాజధాని ఢిల్లీలో లీటరు పెట్రోల్ ధర రూ. 60.70 ఉండగా.. పెంపుతో అది రూ. 61.06గా మారనుందని, అదేవిధంగా లీటరు డీజిల్ ధర రూ. 45.93 నుంచి రూ. 46.80లకు పెరగనుందని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ తెలిపింది. అంతర్జాతీయ పెట్రోల్, డీజిల్ ధరలు, రూపాయి-డాలర్ మారక విలువతో ముడిపడి ఉండటంతో మారక విలువలో వచ్చిన మార్పు వల్లే తాజాగా తలెత్తిన భారాన్ని వినియోగదారులకు బదిలీ చేసినట్టు ఆ సంస్థ ఓ ప్రకటనలో వెల్లడించింది. 15 రోజుల క్రితం పెట్రోల్, డీజిల్ ధరలు స్వల్పంగా తగ్గిన సంగతి తెలిసిందే. చమురు కంపెనీలు 15 రోజులకు ఓసారి సమావేశమై.. పెట్రోల్, డీజిల్ ధరలను సమీక్షిస్తున్న విషయం తెలిసిందే. -
పెట్రోల్, డీజిల్పై ఎక్సైజ్ సుంకం పెంపు
న్యూఢిల్లీ: లీటర్ పెట్రోల్పై రూ.1.60, లీటర్ డీజిల్పై 40పైసలు ఎక్సైజ్ సుంకాన్ని కేంద్రం శనివారం పెంచింది. శనివారం అర్ధరాత్రి నుంచే ఇది అమల్లోకి వచ్చింది. సుంకం పెంపు కారణంగా తమపై భారాన్ని ప్రభుత్వరంగ చమురు సంస్థలు వినియోగదారులపై మోపలేదు. పెట్రోల్, డీజిల్ ధరలు యథాతథంగా ఉంటాయని ప్రముఖ చమురు సంస్థ అధికారి ఒకరు తెలిపారు. 2015-16 ఆర్థిక సంవత్సరంలో పెట్రోలియంరంగం నుంచి సుంకం వసూళ్లను పెంచుకునేందుకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. తాజా పెంపుతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మిగిలిన కాలంలో మరో రూ.3,200 కోట్లు వచ్చే వీలుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికే రూ.33,042 కోట్లు వచ్చాయి. గత ఆర్థిక సంవత్సరం మొత్తంగా రూ.99,184కోట్లు వచ్చాయి. అన్బ్రాండెడ్ లేదా సాధారణ పెట్రోల్పై లీటర్కు బేసిక్ ఎక్సైజ్ సుంకం రూ.5.46 నుంచి రూ.7.05కు పెరిగింది. -
ఆవిరైపోతున్న పెట్రోల్
- పెరిగిన వినియోగం - ట్యాంక్ ఫుల్ చేస్తే ముప్పు - ఆయిల్ కంపెనీల హెచ్చరిక సాక్షి, సిటీ బ్యూరో: మహానగరంలో పెట్రోల్ వినియోగం పెరిగింది. రోజు రోజుకూ పెరుగుతున్న ఉష్ణోగ్రతల కారణంగా వాహనాల్లోని ఇంధనం సగటున 20 శాతం ఆవిరైపోతోంది. దీంతో మైలేజీ తగ్గిపోయి వాహనదారులు ఇబ్బందిపడుతున్నారు. గత పక్షం రోజులుగా పెట్రోల్, డీజీల్ అమ్మకాలు పెరిగాయి. సాధరణంగా సెలవుల కారణంగా పెట్రో అమ్మకాలు అధికంగా ఉండే అవకాశాలు ఉండగా, తాజాగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు వాటిపై ప్రభావం చూపుతున్నాయి. మహానగరం పరిధిలో మూడు ప్రధాన ఆయిల్ కంపెనీలకు చెందిన సుమారు 460 పెట్రోల్, డీజిల్ బంకులు ఉండగా, ప్రతీ రోజు సగటున 30 లక్షల లీటర్ల పెట్రోల్, 33 లక్షల లీటర్ల డీజిల్ అమ్మకాలు జరుగుతుంటాయి. అయితే, వారం రోజులుగా 30 శాతం అధికంగా పెట్రోల్ అమ్మకాలు పెరిగాయని బంక్ నిర్వాహకులు చెప్తున్నారు. మరోవైపు ఆయిల్ కంపెనీలు పెట్రోల్ బంక్ల వద్ద ప్రమాద హెచ్చరికల బోర్డులు ప్రదర్శిస్తున్నాయి. పెరుగుతున్న ఉష్ణోగ్రతలను దృష్టిలో పెట్టుకొని వాహనాల ట్యాంకుల్లో సగం మాత్రమే పెట్రోల్ నింపాలని, లేకపోతే ట్యాంక్ పేలిపోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నాయి. ట్యాంక్ నిండుగా నింపటం వల్ల ఐదు ట్యాంకులు పేలాయని పేర్కొంటున్నాయి. తగ్గిన సరఫరా.... ప్రధాన ఆయిల్ కంపెనీల నుంచి నగ రంలోని పెట్రోల్ బంకులకు ఇంధనం సరఫరా తగ్గుముఖం పట్టింది. మహారాష్ట్రలో గల రెండు ఆయిల్ కంపెనీల టెర్మినల్స్లో పనులు సాగుతున్న కారణంగా డిమాండ్కు సరిపడా పెట్రోల్ సరఫరా కావడం లేదని పెట్రోల్ బంకుల డీలర్ల సంఘం ప్రతినిధి ఒకరు తెలిపారు. సాధారణంగా ఆయిల్ కంపెనీల టెర్మినల్స్ నుంచి ప్రతిరోజు 150 నుంచి 170 ట్యాంకర్లు ద్వారా నగరంలోని బంకులకు ఇంధనం సరఫరా అవుతుంది. ఒక్కొక్క ట్యాంకర్ 12 వేల లీటర్ల నుంచి 20 వేల లీటర్ల వరకు సామర్థ్యం కలిగి ఉంటుంది. అయితే, సరఫరా తగ్గడంతోనగరంలో కొంత ఇంధనం కొరత కనిపిస్తోంది. -
తగ్గనున్న పెట్రోల్, డీజిల్ ధరలు
న్యూఢిల్లీ: పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గనున్నాయి. లీటరుపై రూ. 2 వరకు తగ్గనున్నాయని సమాచారం. అందుకోసం అయిల్ కంపెనీలు బుధవారం సమావేశకానున్నాయి. పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపుపై ఈ సమావేశంలో అయిల్ కంపెనీలు ఓ నిర్ణయం తీసుకోనున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు బ్యారల్ ధర రూ. 45 డాలర్లుకు చేరింది. ఈ నేపథ్యంలో అయిల్ ధరలు తగ్గించాలని సదరు కంపెనీలు నిర్ణయించాయి. అయితే వచ్చే నెల 7న దేశ రాజధాని హస్తిన అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. దాంతో ఆ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని అయిల్ ధరలు తగ్గించాలని మోదీ ప్రభుత్వం భావిస్తుందని ప్రతిపక్షలు ఆరోపణలు చేస్తున్నాయి. -
నిలిచిన స్పైస్జెట్ విమాన సర్వీసులు!
న్యూఢిల్లీ : పీకల్లోతు నష్టాల్లో ఉన్న స్పైస్జెట్ సేవలు బుధవారం నిలిచిపోయాయి. ఇంధనం సరఫరా చేయరాదని ఆయిల్ కంపెనీలు నిర్ణయించటంతో స్పైస్ జెట్ విమానాలన్నీ హ్యాంగర్లకే పరిమితమైయ్యాయి. కాగా స్పైస్జెట్ను ఒడ్డున పడేసేందుకు సహకరించాలని పౌరవిమానయాన శాఖ బ్యాంకులను కోరింది. దాదాపు 600 కోట్ల రూపాయల్ని వర్కింగ్ కేపిటల్గా ప్రొవైడ్ చేయాలని సూచించింది. ఈ మొత్తానికి సంస్థ చైర్మన్ కళానిధి మారన్ వ్యక్తిగత గ్యారెంటీగా ఉంటారని కూడా తెలిపింది. రూ. 200 కోట్ల బకాయిలను చెల్లించడానికి కొంత వెసులుబాటును స్పైస్జెట్కు ఇస్తూ ఎయిర్పోర్ట్స్ అధారిటీ ఆఫ్ ఇండియా(ఏఏఐ) సోమవారం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. మరిన్ని నిధులను స్పైస్జెట్కు అందిస్తానని సన్ గ్రూప్ ప్రమోటర్లలలో ఒకరైన కళానిధి మారన్ వ్యక్తిగత పూచీకత్తు నివ్వడంతో ఏఏఐ ఈ నిర్ణయం తీసుకుంది. మరో వైపు గట్టెక్కేందుకు తాము దీర్ఘకాలిక వ్యూహం సిద్ధం చేస్తున్నామని... దానికి ఎనిమిది వారాల సమయం పడుతుందని స్పైస్ జెట్ ప్రభుత్వానికి తెలిపింది. స్పైస్జెట్ సంక్షోభం అటు స్టాక్ మార్కెట్పై ప్రభావం చూపింది. స్పైస్ జెట్ షేర్ దాదాపు ఆరున్నర శాతం పతనమైంది. ఆయిల్ కంపెనీలు, ఎయిర్పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియాకు స్పైస్జెట్ దాదాపు రెండు వేల కోట్ల రూపాయల బకాయి పడింది. -
ఇక సబ్సిడీపై 5 కేజీల ఎల్పీజీ సిలిండర్లు
న్యూఢిల్లీ : వంటగ్యాస్ వినియోగదారులకు మరింత సౌకర్యవంతమైన సేవలు అందించడానికి చమురు కంపెనీలు ముందుకు వస్తున్నాయి. ప్రస్తుతం చమురు కంపెనీలు గృహవినియోగదారులకు 14.2 కేజీల సిలిండర్లను ఏడాదికి 12 చొప్పున సబ్సిడీ రేటుకు అందిస్తుండడం తెలిసిందే. తాజాగా ఈ కంపెనీలు 5 కేజీల చిన్న సిలిండర్లనూ సబ్సిడీ ధరకు అందిస్తున్నాయి. ఒక్కో సిలిండర్కు రూ.155 సబ్సిడీ(ఢిల్లీ రేటు) ధరపై ఏడాదికి 34 సిలిండర్లు సరఫరా చేసేందుకు కంపెనీలు కొత్త సేవలను అందుబాటులోకి తెచ్చాయి. పెట్రోలియం మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ బుధవారం రాజ్యసభలో ఈ విషయం తెలిపారు. . 5 కేజీల సిలిండర్లు 34 దాటితేమాత్రం ఒక్కో దానికి రూ.351 చెల్లించి(ఢిల్లీలో ధర) కొనుగోలు చేయాల్సి ఉంటుంది. -
పెట్రోల్, డీజిల్పై ఎక్సైజ్ సుంకం పెంపు
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా కొనసాగుతున్న ముడి చమురు ధరల తగ్గుదలను ఎక్సైజ్ సుంకం రూపంలో సర్దుబాటు చేయాలని ఆయిల్ కంపెనీలు నిర్ణయించాయి. డీజిల్, పెట్రోల్పై లీటరుకు రూ. 1.50 మేర ఎక్సైజ్ సుంకాన్ని పెంచాలని నిర్ణయం తీసుకున్నాయి. ఈ పెంపుతో రూ. 13 వేల కోట్లు వార్షిక ప్రాతిపదికన ప్రభుత్వ ఖజానాకు చేరనుంది. అయితే ఈ పెంపు వల్ల పెట్రోల్, డీజిల్ రిటైల్ అమ్మకాల రేట్లలో మార్పురాదు. ఈ ఎక్సైజ్ సుంకం పెంపుతో సాధారణ, అన్ బ్రాండెడ్ లీటర్ పెట్రోల్పై ప్రస్తుతం ఉన్న సుంకం రూ. 1.20 నుంచి రూ. 2.70కి, బ్రాండెడ్ పెట్రోల్పై రూ. 2.35 నుంచి 3.85కు అన్ బ్రాండెడ్ లీటర్ డీజిల్పై రూ. 1.46 నుంచి రూ. 2.96కు, బ్రాండెడ్ డీజిల్పై రూ. 3.75 నుంచి రూ. 5.25కు పెరగనున్నాయని ప్రభుత్వం పేర్కొంది. ప్రాథమిక ఎక్సైజ్ డ్యూటీ, రోడ్ సెస్, ప్రత్యేక అదనపు ఎక్సైజ్ డ్యూటీ కలుపుకొంటే లీటర్ సాధారణ పెట్రోల్పై మొత్తం ఎక్సైజ్ సుంకం రూ. 4.96కు, సాధారణ డీజిల్పై సుంకం రూ. 10.70లకు చేరుకుంటుంది. బ్రాండెడ్ పెట్రోల్ లీటర్కు రూ. 11.85 కు, బ్రాండెడ్ డీజిల్ రూ. 7.25కు పెరగనుంది. ఐఓసీ చైర్మన్ బి. అశోక్ మాట్లాడుతూ.. పెరిగిన రేట్ల ప్రభావం వినియోగదారుడిపై పడదని, అంతర్జాతీ యంగా తగ్గిన రేట్లను ఎక్సైజ్ సుంకం పెంపు ద్వారా సర్దుబాటు చేస్తున్నామని చెప్పారు. -
తగ్గనున్న పెట్రోల్ ధర!
హైదరాబాద్: పెట్రోల్ ధర మరోసారి తగ్గే అవకాశం కనిపిస్తోంది. ఆగస్టు 1న రూపాయి 9 పైసలు తగ్గిన లీటర్ పెట్రోల్ ధర ఈసారి ఏకంగా రెండున్నర రూపాయలు తగ్గే అవకాశాలు ఉన్నాయని ఆయిల్ రంగ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడాయిల్ ధర 105 డాలర్లు కూడా దిగిపోయి 104 డాలర్లకు సమీపంలోకి వచ్చింది. ఈ కారణంగా ఆయిల్ కంపెనీలకు పెట్రోల్ మీద ఇప్పుడు లాభాలు వస్తున్నాయి. ఈ లాభాల్ని చాలా వరకు వినియోగదారులకే అందించాలని ఆయిల్ కంపెనీలు యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా పెట్రోల్ ధరను భారీగా తగ్గించాలని భావిస్తున్నట్లు సమాచారం. పైగా అదే రోజు ఎర్రకోట నుంచి ప్రధాని నరేంద్ర మోడీ కొన్ని కీలక ప్రకటనలు చేస్తారని వార్తలు వస్తున్నాయి. ఆ నేపథ్యంలో ఆయిల్ కంపెనీలు కూడా తమ వంతుగా పెట్రోల్ ధరను రెండున్నర రూపాయలు తగ్గించే అవకాశం ఉంది. నిజానికి డాలర్తో పోలిస్తే రూపాయి విలువ 70 పైసలు పతమమైంది. అలా కాకుండా ఉంటే పెట్రోల్ ధర 3 రూపాయలు దాకా తగ్గేదని చమురు కంపెనీల వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. -
పెట్రో పిడుగు
విజయనగరం కంటోన్మెంట్ : రైలు ప్రయాణ ఛార్జీలు పెరిగి వారం కూడా గడవకముందే కేంద్రప్రభుత్వ సూచనలతో పెట్రో ధరలు కూడా భగ్గుమన్నాయి. పెట్రోలు, డీజిల్ ధరలు పెంచుతూ సోమవారం రాత్రి ఆయిల్ కంపెనీలు పెట్రోల్ బంక్లకు ఉత్తర్వులు విడుదల చేశాయి. పెరిగిన ధరలు, పన్నులెంత వసూలు చేయాలనే సూచనలున్న మెసేజ్లు పంపాయి. ఈ ధరల పెంపు సోమవారం అర్ధరాత్రి నుంచే అమలులోకి వస్తున్నాయని ఆయిల్ కంపెనీలు ప్రకటించాయి. పెట్రో ధరల పెంపు వల్ల జిల్లా వాసులు నెలకు రూ. అరకోటికి పైగా భారాన్ని మోయాల్సి వస్తోంది. పెట్రోల్, డీజిల్ ధరలు పెంచడం వల్ల సమాంతరంగా రవాణా ఛార్జీలు పెరిగి నిత్యావసరాల ధరలు, ఇతర ప్రయాణ ఛార్జీలు పెరిగి సామాన్య జీవనం ఆర్థికంగా కుంగిపోయే పరిస్థితులు ఏర్పడతాయి. సామాన్యుడి నడ్డి విరవడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం పాలన సాగిస్తోందన్న విమర్శలు అప్పుడే వెల్లువెత్తున్నాయి. గత నెల 25నుంచే రైలు ఛార్జీలు పెరిగాయి. వాటిని ప్రజలు ఇంకా మర్చిపోకపోకముందే పెట్రో ధరలు పెంచడంతో ప్రజలపై తీవ్ర ఆర్థికభారం పడనుంది. జిల్లాలో 95 పెట్రోల్ బంక్లున్నాయి. వీటి ద్వారా ప్రతీ రోజూ 48 వేల నుంచి 50 వేల లీటర్ల దాకా పెట్రోల్ విక్రయాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం పెంచిన ఛార్జీలను పరిశీలిస్తే పెట్రోల్ లీటరుకు రూ. 1:69 పైసలు పెరిగింది. దీనికి వ్యాట్ అదనంగా ఉంటుంది. వ్యాట్ పెట్రోల్పై 31 శాతం వసూలు చేస్తారు. వ్యాట్తో కలిపి లీటర్ పెట్రోల్ ధర 2.20 రూపాయలకు చేరుకోనుంది. దీంతో రోజుకు 50 వేల లీటర్ల పెట్రోల్ విక్రయాల ప్రకారం నెలకు రూ. 33 లక్షల భారం పడుతోంది. అదేవిధంగా డీజిల్ ధరలు కూడా లీటరుకు 50 పైసల చొప్పున పెరిగింది. దీనికి వ్యాట్ 28 శాతం వసూలు చేస్తారు. దీంతో లీటరుకు వినియోగదారునిపై 62 పైసల భారం పడుతుంది. ప్రతీ నెలా జిల్లాలోని అన్ని బంకుల్లో కలిపి లక్షా 20 వేల లీటర్ల డీజెల్ విక్రయాలు జరుగుతాయి. ఈ లెక్కన ప్రతీ నెలా రూ.21.60 లక్షల భారం పడుతోంది. పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల వల్ల వినియోగదారులపై ప్రతీ నెలా రూ.54.60 లక్షల భారం పడుతోంది. పెట్రోల్, డీజిల్ ధరల పెంపుతో సమాంతరంగా పలు నిత్యావసర సరుకుల ధరలు, ప్రయాణ ఛార్జీలు పెరిగిపోతాయని వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. విక్రయాలు నిలిపివేసిన బంక్ యజమానులు పెట్రో ధరలు పెరగడంతో బంక్ యజమానులు సోమవారం రాత్రి నుంచి విక్రయాలను నిలిపివేశారు. లీటరుకు 2రూపాయల 20 పైసలు పెరగడంతో కనీసం ఎంతో కొంత లాభపడొచ్చనే ఉద్దేశంతో అర్ధరాత్రికి ముందుగానే పెట్రోల్ అమ్మకాలను ఆపేశారు. దీంతో చాలామంది వినియోగదారులు, ద్విచక్రవాహన దారులు ఇబ్బందులు పడ్డారు. -
తగ్గిన పెట్రోల్ ధర, లీటర్ పై 75 పైసలు తగ్గింపు!
పెట్రోల్ ధరను తగ్గిస్తూ దేశీయ చమురు కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. లీటర్ పెట్రోల్ పై 75 పైసలు తగ్గిస్తూ చమురు కంపెనీలు ఓ ప్రకటన చేశాయి. డీజిల్ ధరలో ఎలాంటి మార్పులు ఉండవని చమురు కంపెనీ నిర్వహకులు ప్రకటనలో వెల్డడించారు. తగ్గిన పెట్రోల్ ధర సోమవారం అర్ధరాత్రి నుంచే అమలులోకి రానున్నాయి. తగ్గిన ధర ప్రకారం మెట్రో నగరాలైన ఢిల్లీలో 72.26, కోల్ కతాలో 80.13, ముంబైలో 80.89, చెన్నై లో 75.49 ఉంటాయని చమురు కంపెనీలు తెలిపాయి. -
ఇతర నగరాల్లో రియల్ దూకుడు!
అభివృద్ధిలో వెనకబడిన ఉత్తరాంధ్ర జిల్లాలకు ఏకైక ఆశాదీపం... పరిశ్రమలతో నిండిన విశాఖే. సింగపూర్ను పోలిన వనరులు, సౌకర్యాలూ ఇక్కడున్నాయి. చుట్టూ సముద్రం, భారీ నౌకలు కూడా వచ్చే అవకాశమున్న రెండు రేవులు, చమురు కంపెనీలు, షిప్యార్డ్, విమాన సేవలు, ఉక్కు ఉత్పత్తి పరిశ్రమలు, వేల కోట్ల ఫార్మా ఎగుమతులు, ఖండాలు దాటుతోన్న ఐటీ సేవలు, ఏడాది పొడవునా బారులు తీరే పర్యాటకులు ఇదీ క్లుప్తంగా విశాఖపట్నం అంటే. ఏడాదిగా విశాఖలో స్థిరాస్తి ధరల్లో కనీసం 25 శాతం పెరుగుదల కనిపిస్తోందని క్రెడాయ్ విశాఖపట్నం సెక్రటరీ కోటేశ్వరరావు చెప్పారు. 2006లో రూ.25 వేలున్న గజం స్థలం ధర ఇప్పుడు రూ.50 వేలకు పైగానే పలుకుతోందని పేర్కొన్నారు. సిటీ నుంచి 15 కి.మీ. దూరంలో ఉండే మధురవాడ, ఎండాడ, మురళీనగర్ వంటి ప్రాంతాల్లో చ.అ. ధర రూ.2,500గా, నర్సింహానగర్, అక్కయపాలెం, అబీద్నగర్ వంటి ప్రాంతాల్లో రూ.3,500లు, బీచ్రోడ్, బాలాజీనగర్, పాండురంగాపురం వంటి ప్రాంతాల్లో రూ.4000గా ఉందని తెలిపారు. అయితే రాజకీయ అనిశ్చితి కారణంగా విశాఖలో ధరలు పెరిగాయని, మరో ఆరేడు నెలల్లో ధరలు స్థిరపడే అవకాశముందని ఆయన చెప్పారు. ఐటీ జోరు.. విశాఖపట్నంలో ఐటీ అభివృద్ధికి ఎలాంటి ఢోకాలేదని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే హైదరాబాద్ తర్వాత ఐటీ పెట్టుబడులు వచ్చేది విశాఖకే. ఇప్పటికే ఇక్కడ 70 ఐటీ కంపెనీలు, 90 ఫార్మా కంపెనీలున్నాయి. వీటి వార్షిక టర్నోవర్ ఏటా రూ.1,450 కోట్లుగా ఉంది. ప్రత్యేక హోదా కారణంగా భారీస్థాయిలో పన్ను మినహాయింపులు లభిస్తాయని కనుక కొత్త కంపెనీలు కార్యకలాపాలు ప్రారంభించే అవకాశాలున్నట్లు నిపుణులు అంచనావేస్తున్నారు. మరో 50 కంపెనీలు విశాఖకు చేరేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. రుషికొండలో మూడు ఐటీ సెజ్లు ఏర్పాటు కానున్నాయి. సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా రెండో సెంటర్ను కూడా ఇక్కడే ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. అభివృద్ధికి ఢోకాలేదు.. విశాఖ నుంచి కాకినాడకు పీసీపీఐఆర్ ప్రాజెక్ట్ పనులు జరుగుతున్నాయి. ఇందులో చమురు ఆధారిత కంపెనీలు భారీగా రానున్నాయి. పది మండలాల్లో విస్తరించనున్న ఈ జోన్లో వివిధ కంపెనీలు రానున్నాయి. పీసీపీఐఆర్ కంపెనీలకు పన్ను రాయితీలు వర్తిస్తుండగా ఇప్పుడు ప్రత్యేక హోదాతో జోన్కు మరింత డిమాండ్ పెరగనుంది. వైజాగ్, గంగవరం పోర్టులకు తోడు నక్కపల్లి, భీమిలిలోనూ పోర్టులు రావచ్చని నిపుణులు చెబుతున్నారు. సిటీ నుంచి 20 కి.మీ. దూరంలో 20 వేల ఎకరాల ప్రభుత్వ భూమితో పాటు ప్రభుత్వ భవనాలూ అందుబాటులో ఉన్నాయి. అవసరమైతే అటవీ భూమిని సైతం డీ నోటిఫై చేస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించినందువల్ల మరో 5 వేల ఎకరాలు అందుబాటులోకి వచ్చే అవకాశాలున్నాయి. పారిశ్రామిక రాజధాని.. ‘విశాఖపట్నం’ జనాభా: 21 లక్షలు విస్తీర్ణం: 550 చ.కి.మీ. ఐటీ, ఫార్మా కంపెనీలు: 160 ఎస్ఈజెడ్లు: 4, పోర్టులు: 2 స్థిరాస్తి ధరలు 40 శాతం వరకూ పెరిగాయి {పాంతాన్ని బట్టి చ.అ. ధర రూ.2,000 నుంచి రూ.4,000 వరకూ ఉంది. -
నిత్యం పెట్రో దోపిడీ రూ.కోటి
‘పంపింగ్ జంపింగ్’తో బంకుల నయా‘వంచన’ ఐదేళ్లుగా పలురకాల ఇం‘ధన’ మోసాలు వాహన చోదకుల జేబులకు భారీగా చిల్లు పట్టని తూ.కొ. సివిల్ సప్లై శాఖలు సాక్షి, సిటీబ్యూరో: ‘గ్రేటర్’ పరిధిలో పలు బంకులు రోజుకు రూ. 95.88 లక్షల మోసానికి పాల్పడుతూ వాహనదారుల జేబులకు చిల్లు పెడుతున్నాయి. గత ఐదేళ్ల నుంచి పెట్రోల్ బంకుల రిమోట్ మోసాలు చాప కింద నీరులా సాగుతున్నట్లు బహిర్గతమైంది. సాక్షాత్తు పెట్రోల్ బంకుల డీలర్లే తప్పు మాది కాదు.. ఆయిల్ కంపెనీలదంటూ మోసాలను అంగీకరించడం విస్మయానికి గురిచేస్తోంది. ప్రధాన ఆయిల్ కంపెనీలే మోసాలకు సహకరించే డిస్పెన్సింగ్ యూనిట్లతోపాటు రిమోట్లను సరఫరా చేస్తున్నట్లు డీలర్లు స్పష్టంచేయడం నయా‘వంచన’ను తేటతెల్లం చేస్తుంది. రాష్ట్రం మొత్తంమీద పెట్రోల్ వినియోగంలో సగం వాటా గల మహాన గరంలో బంకుల నయామోసాలు వినియోగదారుల కోట్లాది రూపాయలను కొల్లగొడుతున్నాయి. మహానగరంలో సుమారు 330 పెట్రోల్ బంకులు ఉండగా.. ప్రతిరోజు సగటున 30 లక్షల లీటర్ల పెట్రోల్ అమ్ముడుపోతుందన్నది అంచనా. బంకుల్లో ఫిల్లింగ్ మిషన్ పైకి అంతా సవ్యంగానే కనిపించినప్పటికీ రిమోట్ కంట్రోల్ ద్వారా రీడింగ్ను జంపింగ్ చేయిస్తే కనీసం ప్రతి వెయ్యి లీటర్లుకు 40 లీటర్ల ఇంధనం తక్కువగా పంపింగ్ జరుగుతుంది. ఈ లెక్కన నగరంలో ప్రతిరోజు 30 లక్షల లీటర్లకు గాను 1.20 లక్షల లీటర్లు తక్కువగా పంపింగ్ జరగుతున్నట్లు అంచనా. ప్రస్తుతం పెట్రోల్ లీటర్ ధర రూ. 79.90. దీని ప్రకారం లెక్కిస్తే.. రోజుకు పెట్రోల్ మోసం విలువ రూ.95.88 లక్షలు. గత ఐదేళ్లుగా సాగుతున్న పెట్రోల్ మోసాల దోపిడీని లెక్కిస్తే... మహా నగరవాసుల కళ్లు బైరు కమ్మడం ఖాయం. తనిఖీ భయంతో సమ్మెకు దిగి.. ఈ నేపథ్యంలో తూనికలు, కొలతల శాఖ వరుస ఆకస్మిక దాడులతో బెంబేలెత్తిన పెట్రోలియం డీలర్లు ఎలాంటి ముందస్తు నోటీసు ఇవ్వకుండా మెరుపు సమ్మెకి దిగి.. ఇరవై నాలుగు గంటల తర్వాత తామంతట తామే బేషరతుగా సమ్మెను విరమిస్తున్నట్లు ప్రకటించారు. నయామోసాల తప్పు తమది కాదు.. ఆయిల్ కంపెనీలదంటూనే తక్షణమే రిమోట్లను సరెండర్ చేసి ప్రభుత్వం ఆమోదం లేని డిస్పెన్సింగ్ యూనిట్లను మార్పు చేసుకుంటామని లిఖిత పూర్వకంగా తూనికల కొలతల శాఖ ఉన్నతాధికారులకు హామీ ఇచ్చారు. నివ్వెరపర్చిన నయామోసాలు.. మహానగరంలో బంకుల నయామోసాలు నివ్వెరపర్చాయి. ఇప్పటివరకు పెట్రో ఫిల్లింగ్ మిషన్లలో చేతివాటం ప్రదర్శించి హెచ్చు తగ్గులతో మోసాలకే పాల్పడే బంకులు.. ఏకంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని అనువుగా మార్చుకొని స్టాఫ్వేర్నే కంట్రోల్ చేసే విధానానికి దిగడం విస్మయానికి గురిచేసింది. సరిగ్గా నెలరోజుల క్రితం సైబరాబాద్ ప్రత్యేక పోలీసులు బృందం చేతిలో ఒక నకిలీ సాఫ్ట్వేర్ ముఠా చిక్కడంతో పెట్రో చిప్ల మోసాల వ్యవహారం బయటపడింది. ఎస్ఓటీ పోలీసులు సుమారు 11 ఫిల్లింగ్ స్టేషన్లలో అమర్చిన చిప్లను తొలగించి నిందితులను కటకటాల వెనక్కి పంపించారు. తూ.కొ. శాఖ కు కేసు బదిలీచేసి మరో 70 బంకుల్లో చిప్లు ఉన్నట్లు అనుమానాలు వ్యక్తం చేసినా ఫలితం లేదు. తూ.కొ. శాఖ తీరిక చేసుకొని మొక్కుబడిగా కొన్ని బంకులను తనిఖీ చేయగా మరో కొత్త తరహా మోసం బయటపడటం ఖంగు తినిపించింది. కంచే చేను మేస్తే.. సాక్షాత్తు ప్రధాన ఆయిల్ కంపెనీలే మోసాలకు సహకరించే డిస్పెన్సింగ్ యూనిట్లతోపాటు రిమోట్లను సరఫరా చేయడం విస్మయపర్చింది. ముంబైలోని టట్సునో ఇండియా ప్రయివేటు లిమిటేడ్, డ్రెసర్వేన్ కంపెనీలు ఉత్పిత్తిచేసిన డిస్పెన్సింగ్ యూనిట్లతోపాటు రిమోట్లను తమ డీలర్లకు హెచ్పీసీఎల్, బీపీసీఎల్, ఐవోసీతో పాటు మరో ప్రయివేటు షెల్ కంపెనీ కూడా సరఫరా చేసింది. దీంతో రెండు కంపెనీలు ఉత్పత్తి చేసిన డిస్పెన్సింగ్ యూనిట్లపై తూ. కొ. అధికారులు దృష్టి సారించారు. రాష్ట్రస్థాయిలో వాటిని సరఫరా చేసే డిస్ట్రిబ్యూటర్ కోసం ఆరా తీసి రెండు రోజుల క్రితం దాడులు నిర్వహించగా.. రిమోట్ అమ్మకాల వ్యవహారం బయటపడింది. సుమారు 250 వరకు రిమోట్లు సరఫరా జరిగినట్లు విచారణలో తెలింది. దీంతో తూ.కొ. ఉన్నతాధికారులు విస్తృత దాడులకు ఆదేశించడంతో పెట్రో బంకుల డీలర్లు వేధింపులంటూ సమ్మెకు దిగి పెట్రో బంకులను బంద్ చేసి తప్పులను కప్పిపుచ్చుకునేందుకు ప్రయత్నించి అభాసుపాలయ్యారు. ఆర్టీసీకి పెరిగిన ఆదాయం సుమారు 24 గంటల పాటు నగరంలో పెట్రోల్ బంకులు మూతపడడంతో ఆర్టీసీ బస్సులకు అనూహ్యంగా ఆదరణ పెరిగింది. ఆదివారం ఉదయం నుంచి సోమవారం మధ్యాహ్నం వరకు బంకులు మూతపడడంతో చాలామంది వాహ నదారులు బస్సులను ఆశ్ర యించారు. దీంతో సాధారణ రోజుల్లో రూ.2.6 కోట్లు లభిస్తుండగా.. ఆదివారం ఒక్క రోజు రూ.3 కోట్ల వరకు వచ్చినట్లు ఆర్టీసీ అధికారవర్గాలు పేర్కొన్నాయి. ప్రతి రోజు 35 లక్షల మంది సిటీ బస్సుల్లో ప్రయాణిస్తున్నారు. బంకుల మూసివేత దృష్ట్యా 5 లక్షల మంది అదనంగా పయనించినట్లు ఆర్టీసీ అంచనా. చంచల్గూడ వద్ద జనజాతర.. చంచల్గూడ: తూనికలు, కొలతల శాఖ దాడులను నిరసిస్తూ నగరంలోని పెట్రోల్ బంకుల యజమానులు బంద్ పాటించిన నేపథ్యంలో చంచల్ గూడలోని జైళ్ల శాఖకు చెందిన పెట్రోల్ బంకు మాత్రం వినియోగదారుల సౌకర్యార్థం ఇంధనం విక్రయించారు. ఆదివారం సాయంత్ర 6 నుంచి 9 గంటల వరకు రూ. 4 లక్షల ఇంధనం విక్రయించినట్లు బంకు ఇన్చార్జి, డిప్యూటీ జైలర్ గణేష్బాబు సూచనప్రాయంగా తెలిపారు. సాధారణ రోజుల్లో 14 వేల లీటర్ల పెట్రోల్, 8 వేల లీటర్ల డీజిల్ అమ్మకాలు జరుగుతున్నాయి. సమ్మె ప్రభావం వల్ల అదనంగా 6 వేల లీటర్ల పెట్రోల్ విక్రయించినట్లు తెలిపారు.ఆ ప్రాంతం మొత్తం జనంతో కిక్కిరిసింది. కలెక్టర్ సీరియస్ పెట్రోల్ బంకు డీలర్ల మెరుపు సమ్మెతో ప్రజలు ఇబ్బందులకు గురికావడంపై హైదరాబాద్ జిల్లా కలెక్టర్ సీరియస్ ఆయ్యారు. సోమవారం పెట్రోల్ డీలర్ల సమ్మెపై గవర్నర్ మౌఖిక ఆదేశాలు రాష్ట్ర ముఖ్యకార్యదర్శి ద్వారా అందడటంతో కలెక్టర్ హుటాహుటిన సివిల్సప్లై, తూనికలు కొలతల శాఖ అధికారులతోపాటు ఆయిల్ కంపెనీలు, డీలర్ సంఘం ప్రతినిధులను పిలిపించి చర్చించారు. పెట్రోలియం డీలర్లు ఎలాంటి ముందస్తు నోటీసు ఇవ్వకుండా సమ్మెకు దిగి బంకులు బంద్ పాటించడమేమిటని ప్రశ్నించారు.ప్రభుత్వ ఆమోదం లేని పరికరాలు వినియోగించడం చట్టవిరుద్దమన్నారు. సివిల్స్ సప్లై, తూనికలు, కొలతల శాఖ అధికారులు సమన్వయంతో ఆయిల్ కంపెనీలతో చర్చించి సమస్య పరిష్కరించాలని సూచించారు. పెట్రోల్ బంకుల బంద్ పునరావృతం కాకుండా చూడాలని కోరారు. -
ఈ బంధం విడిపోనుంది..
గ్యాస్కు ఆధార్ లింకు తొలగింపు ఒకట్రెండు రోజుల్లో ఆయిల్ కంపెనీలకు ఆదేశాలు మార్చి 1 నుంచి పాతపద్ధతిలో సబ్సిడీ సిలిండర్లు ? సాక్షి,సిటీబ్యూరో: వంటగ్యాస్ వినియోగదారులకు శుభవార్త. గ్యాస్కు ఆధార్ లింకు తెగిపోనుంది. ఇన్నాళ్లు ముప్పుతిప్పులు మూడుచెరువుల నీళ్లు తాగించిన ఆధార్ లింకును తొలగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఒకట్రెండురోజుల్లో ఆయిల్ కంపెనీలకు ఆదేశాలు రానున్నాయి. దీంతో మార్చి1 నుంచి పాతపద్ధతిలో సబ్సిడీ ధరకే సిలిండర్లను అందజేసే అవకాశాలు ఉన్నాయని గ్యాస్ డీలర్ల సంఘం ప్రతినిధి ఒకరు సూచనప్రాయంగా తెలిపారు. హైదరాబాద్-రంగారెడ్డి జిల్లాల్లో వంటగ్యాస్కు ఆధార్ అనుసంధానంతో ప్రత్యక్ష ప్రయోజన పథకం(డీబీటీ) అమలు ప్రారంభమై 9 నెలలు కావొస్తున్నా..మొదటి మూడునెలలపాటు మినహాయింపు కాలంగా పరిగణించారు. దీంతో ఆధార్ అనుసంధాన ం కానీ వారికి కూడా సబ్సిడీ సిలిండర్లను సరఫరా చేశారు. గతేడాది సెప్టెంబర్ 1 నుంచి పూర్తిస్థాయి డీబీటీ అమలుకావడంతో డొమెస్ట్రిక్ వినియోగదారులకు తిప్పలు తప్పలేదు. సబ్సిడీ వంటగ్యాస్కు డీబీటీ పథకం వర్తింపుతో సిలిండర్ ధర సైతం నిలకడ లేకుండా మార్కెట్ ధర ప్రకారం కొనుగోలు చేయాల్సి వచ్చింది. ఎల్పీజీ కనెక్షన్లను ఆధార్,బ్యాంకు ఖాతాలతో అనుసంధానం చేసుకున్న వినియోగదారులకు సబ్సిడీ సొమ్ము నగదుగా బదిలీ దేవుడేరుగు కానీ, అనుసంధానానికి దూరంగా గల వినియోగదారులు గత ఆర్నెళ్లుగా అదనపుభారం మోయక తప్పలేదు. సబ్సిడీ నష్టం రూ.204.92 కోట్లు : జంటజిల్లాల్లో ఆధార్తో అనుసంధానంకాని సుమారు 27.26శాతం మంది గ్యాస్ వినియోగదారులు సబ్సిడీకి దూరమై రూ.204.92 కోట్ల వరకు నష్టపోయారు. మొత్తం మీద 28.21 లక్షల ఎల్పీజీ వినియోగదారులు ఉండగా, అందులో ఆధార్తో 82 శాతం, బ్యాంకుతో 72.74 శాతం మాత్రమే అనుసంధానమయ్యారు. అంటే సుమారు 9.26 శాతంమంది వినియోగదారులు తమ ఎల్పీజీని ఆధార్తో అనుసంధానం చేసుకున్నప్పటికీ బ్యాంకు ఖాతాలతో అనుసంధానం చేసుకోలేకపోయారు. దీంతో రెండిటితో అనుసంధానమైన వారికే డీబీటీ వర్తించినట్లయ్యింది. ఇదిలావుంటే దేశవ్యాప్తంగా పలు నగరాల్లో గ్యాస్కు ఆధార్ అనుసంధానం, బ్యాంకుల్లో సబ్సిడీ నగదు జమకాకపోవడం..జనాగ్రహం గ్రహించిన కేంద్రం గతనెల చివర్లో సబ్సిడీవంటగ్యాస్కు ఆధార్ ముడిని తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నప్పటికీ ఆయిల్ కంపెనీలకు ఆదేశాలు అందలేదు. ఒకట్రెండు రోజుల్లో ఆదేశాలు జారీకానుండడంతో మార్చి 1 నుంచి పాతపద్ధతిలో సబ్సిడీ ధరకు సిలిండర్లు సరఫరా కానున్నాయి. -
అంతా ‘గ్యాస్’
నగదు బదిలీ పథకంలో కొన్ని సమస్యలు తలెత్తాయి. ఆధార్ సంఖ్యకు, బ్యాంకు ఖాతాలకు కొన్నిచోట్ల అనుసంధానం పూర్తి కాలేదు. వినియోగదారులు ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని సమీక్షిస్తున్నాం. వంట గ్యాస్ రాయితీ సిలిండర్ల పరిమితిని ఏడాదికి 9 నుంచి 12కు పెంచాం. ఆధార్తో సంబంధం లేకుండా వినియోగదారులు గతంలో మాదిరే రాయితీపై వంటగ్యాస్ సిలిండర్లు పొందవచ్చు. - వీరప్ప మొయిలీ, కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి సాక్షి, కర్నూలు: వినియోగదారులతో కేంద్ర ప్రభుత్వం, ఆయిల్ కంపెనీలు ఆడుకుంటున్నాయి. పెట్రోల్, డీజిల్ ధరలు పెంచినప్పుడల్లా కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని అర్ధరాత్రి నుంచే అమలు చేసే ఆయిల్ కంపెనీలు.. వంట గ్యాస్ విషయంలో మీనమేషాలు లెక్కిస్తున్నాయి. విద్యార్థుల ఉపకార వేతనాలు, పింఛన్లు, రేషన్కార్డులు, పట్టాదార్ పాస్ పుస్తకాలు.. ఇలా అన్ని పథకాలకు ప్రభుత్వం ఆధార్తో లంకె పెట్టింది. ఈ కోవలోనే ఆధార్ నెంబర్లు అందజేయని వినియోగదారులకు రాయితీ సిలెండర్లు ఇవ్వబోమని భయపెట్టడంతో గ్యాస్ ఏజెన్సీల వద్ద ప్రజలు క్యూ కట్టారు. జిల్లా మొత్తం మీద 5.04 లక్షల గ్యాస్ కనెక్షను ఉండగా దాదాపు 3 లక్షల కనెక్షన్లకు ఆధార్ అనుసంధానం పూర్తయింది. వివిధ కారణాలతో ఇప్పటికీ 2 లక్షల మంది ఆధార్ నెంబర్లు అందజేయలేకపోయారు. అయితే ప్రభుత్వం 2014 జనవరి నుంచి నగదు బదిలీని ప్రారంభించింది. దీంతో ఒక్కో వినియోగదారుడు గ్యాస్ సిలెండర్ కోసం రూ.1,235 చెల్లించాల్సి వచ్చింది. ఇలా చెల్లించిన వారి ఖాతాలో మొదట రూ.435.. ఆ తర్వాత మిగిలిన రాయితీ మొత్తం జమ అవుతుందని డీలర్లు చెబుతున్నా.. ఎప్పుడనే విషయంలో స్పష్టత కరువైంది. సిలెండర్ బుక్ చేసుకున్న నెల రోజులకు కూడా రాయితీ సొమ్ము జమ కాకపోవడంతో వినియోగదారులు తమ అవస్థలు ఎవరికి చెప్పుకోవాలో తెలియక తికమకపడుతున్నారు. ఈ దృష్ట్యా గ్యాస్ సిలెండర్లకు ఆధార్ లింకును ఉపసంహరించుకున్నట్లు కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి వీరప్ప మొయిలీ పది రోజుల క్రితం ప్రకటించారు. ఇందుకు అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన వెల్లడించారు. అయితే ఇప్పటికీ ఆదేశాలు అమల్లోకి రాకపోవడంతో వినియోగదారుల అవస్థలు వర్ణనాతీతంగా ఉంటున్నాయి. ఇదే సమయంలో అధికార యంత్రాంగం ఆధార్ అనుసంధానంపై ముందుకు సాగుతోంది. జిల్లాలో ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వ నిర్ణయం అమల్లోకి రాకపోవడం గందరగోళ పరిస్థితులకు కారణమవుతోంది. అసలు రాయితీ గ్యాస్ సిలెండర్లు ఏడాదికి 12 ఇస్తారా, లేదా అనే విషయంపైనా స్పష్టత కరువైంది. జిల్లా గ్యాస్ డీలర్లు మాత్రం ఆయిల్ కంపెనీల ఆదేశాలతో ఆధార్ నమోదును వేగవంతం చేస్తున్నారు. ఈ విషయంలో గ్యాస్ ఏజెన్సీలు, వినియోగదారుల మధ్య తరచూ వివాదాలు చోటు చేసుకుంటున్నాయి. కేంద్ర ప్రభుత్వం ప్రకటించినా అమలు చేయకపోవడం ఏమిటని ప్రజలు నిలదీస్తున్నారు. ఇందుకు డీలర్లు తమకు అధికారికంగా ఎలాంటి ఉత్తర్వులు అందలేదని సమాధానమిస్తున్నారు. ఫలితంగా ప్రజల్లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఉత్తర్వులు అందలేదు: కె.కన్నబాబు, జేసీ, కర్నూలు కేంద్ర ప్రభుత్వ నిర్ణయం మీడియా ద్వారానే తెలుసుకున్నాం. సిలెండర్లకు ఆధార్తో లింకు వద్దే విషయమై స్పష్టమైన ఉత్తర్వులు ఇప్పటి వరకు అందలేదు. ఉత్తర్వులు అందిన తర్వాత గ్యాస్ ఏజెన్సీలకు విషయాన్ని తెలియజేసి అందుకు అనుగుణంగా చర్యలు తీసుకుంటాం. -
గ్యాస్ ధర పెంపు
ఆదిలాబాద్, న్యూస్లైన్ : చమురు కంపెనీలు గ్యాస్ సిలిండ ర్ ధరను పెంచాయి. వినియోగదారులపై కొరడా ఝుళిపించాయి. ఇటీవల డీజిల్ ధరను పెంచిన విషయం మరువక ముందే సిలిండర్ ధరను పెంచి భారం మోపాయి. ఆదిలాబాద్లో రూ.1,041 నుంచి రూ.1,107 కు పెంచారు. సబ్సిడీ సిలెండర్లతోపాటు వాణిజ్య సిలిండర్ల ధర కూడా పెంచారు. పెంచిన ధరలు ఈనెల 1వ తేదీ నుంచి అమలలోకి వచ్చాయి. వినియోగదారుడు సిలిండర్ తీసుకునేటప్పుడు అదనంగా రూ.66 చెల్లించాలి. కాగా వినియోగదారుడు సిలిండర్ తీసుకున్న తర్వాత బ్యాంకులో జమయ్యే సబ్సిడీ రూ.575 నుంచి రూ.633కు పెరిగింది. సబ్సిడీ రూ.58 పెరిగింది. తద్వారా పెంచిన సబ్సిడీ సిలిండర్ ధర కారణంగా వినియోగదారునిపై సుమారు రూ.8 భారం పడనుంది. నెలకు సుమారు రూ.22 లక్షలు, ఏడాదికి రూ. 2.50 కోట్లు అదనంగా వినియోగదారులు చెల్లించాలి. సబ్సిడీ సిలిండర్లు ఏడాదికి తొమ్మిదే పరిమితి ఉండడంతో ఆ తర్వాత తీసుకునే సిలిండర్ పరంగా వినియోగదారునికి కష్టాలు తప్పవు. పెరిగిన మొత్తం ధర భరించాల్సి వస్తుంది. ఆ విధంగా చూస్తే ప్రజలకు ఇది భారమే. కాగా వాణిజ్య సిలిండర్(19 కేజీ) ధరను రూ.1,773 నుంచి రూ.1,883కు పెంచారు. రూ.110 పెరగడంతో వాణిజ్య సిలిండర్ వినియోగదారులపై భారం పెరిగింది. 75 శాతం ఆధార్ సీడింగ్ పూర్తి జిల్లాలో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్(ఐఓసీ) 9 ఏజెన్సీలు, హిందూస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్(హెచ్పీసీ) 12 ఏజెన్సీలు, భారత్ పెట్రోలియం కార్పొరేషన్(బీపీసీ) 11 ఏజెన్సీలు ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా 75 శాతం ఆధార్ సీడింగ్ పూర్తయింది. ఆధార్ సీడింగ్ కాని సబ్సిడీ సిలిండర్ వినియోగదారులకు సబ్సిడీ మినహాయించి నేరుగా వచ్చే ధరకే సిలిండర్ ఇస్తున్నారు. ఈ వినియోగదారులకు ఇదివరకు రూ.415 పై సబ్సిడీ సిలిండర్ ఇస్తుండగా ప్రస్తుతం రూ.419కి పెంచారు. ఇది ఆధార్ నమోదు చేసుకున్న వారికి, నమోదు చేసుకోని వారికి ధరల పరంగా వ్యత్యాసం ఉండడంతో వినియోగదారుల్లో గందరగోళం వ్యక్తమవుతోంది. కట్టెల పొయ్యే దిక్కు.. నా పేరు లక్ష్మి, మాది ఆదిలాబాద్ పట్టణంలోని పీహెచ్ కాలనీ. సర్కారు గ్యాస్ ధర పెంచిందని వినడంతో గుండె దడేల్ మంది. ఇప్పటికే కరెంటు, నిత్యావసర వస్తువులు, పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడంతో సతమతం అవుతున్నాము. ఇప్పుడు ప్రభుత్వం గ్యాస్ ధర పెంచి మరోమారు భారం వేసింది. వంటింట్లోకి వెళ్లాలంటేనే భయమవుతుంది. గ్యాస్ వాడకం కష్టమే. ఇక కట్టెల పొయ్యే మేలు. -
చమురు కంపెనీలకు రూ. 17 వేల కోట్ల సబ్సిడీ
న్యూఢిల్లీ: ఇండియన్ ఆయిల్ (ఐవోసీ) తదితర ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ సంస్థలకు కేంద్రం రూ. 17,772 కోట్ల నగదు సబ్సిడీని గురువారం మంజూరు చేసింది. సెప్టెంబర్ త్రైమాసికంలో డీజిల్, వంటగ్యాస్ వంటి ఉత్పత్తులను మార్కెట్ రేటు కన్నా తక్కువగా విక్రయించినందు వల్ల ఎదురైన ఆదాయ నష్టాలను భర్తీ చేసుకునేందుకు చమురు కంపెనీలకు ఇది ఉపయోగపడనుంది. ప్రభుత్వం నిర్దేశించిన రేట్లకు విక్రయించడం వల్ల మూడు ప్రభుత్వ రంగ సంస్థలు బ్రిటిష్ పెట్రోలియం (బీపీసీఎల్), హిందుస్తాన్ పెట్రోలియం (హెచ్పీసీఎల్), ఐవోసీ సుమారు రూ. 35,328 కోట్ల ఆదాయాలను నష్టపోవాల్సి వచ్చింది. ఇందులో సుమారు రూ. 16,730 కోట్లను చమురు ఉత్పత్తి సంస్థలు ఓఎన్జీసీ, గెయిల్ సమకూరుస్తుండగా.. మిగతాది కేంద్రం నగదు సబ్సిడీ కింద అందిస్తోంది. రూ. 8,772 కోట్ల సబ్సిడీని బుధవారమే ఆమోదించిన ఆర్థిక శాఖ, గురువారం మరో రూ. 9,000 కోట్లను ఆమోదించిందినట్లు అధికార వర్గాలు తెలిపాయి. -
పెట్రోల్పై తగ్గింపు... డీజిల్పై పెంపు
-
పెట్రోల్పై తగ్గింపు... డీజిల్పై పెంపు
న్యూఢిల్లీ: పెట్రోల్, డీజిల్ ధరలను ప్రభుత్వరంగ చమురు సంస్థలు గురువారం స్వల్పంగా సవరించాయి. పెట్రోల్పై లీటరుకు రూ. 1.15 చొప్పున ధరను తగ్గించి అదే సమయంలో డీజిల్పై లీటరుకు 50 పైసల చొప్పున ధర పెంచాయి. వివిధ రాష్ట్రాల్లో వ్యాట్ లేదా స్థానిక పన్నుల్లో తేడాల వల్ల ఈ ధరల్లో వ్యత్యాసాలు వెల్లడించాయి. సవరించిన ధరలు గురువారం అర్ధరాత్రి నుంచే అమల్లోకి వచ్చాయి. అంతర్జాతీయ మార్కెట్లో పెట్రోల్ బ్యారెల్కు 113 డాలర్ల నుంచి 112 డాలర్లకు తగ్గడంతోపాటు డాలర్తో రూపాయి మారకపు విలువ కాస్త బలపడటంతో పెట్రోల్ ధరను తగ్గించినట్లు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఓ ప్రకటనలో తెలిపింది. అయితే డీజిల్ రిటైల్ విక్రయాలపై నష్టాలను పూడ్చుకునేందుకు ధరను ప్రతి నెలా స్వల్ప మొత్తాల్లో పెంచుకోవచ్చంటూ కేంద్ర ప్రభుత్వం జనవరిలో ఇచ్చిన అనుమతి నేపథ్యంలో డీజిల్ ధరను పెంచినట్లు వివరించింది. పెట్రోల్ ధరలను తగ్గించడం ఈ నెలలో ఇది రెండోసారి. అక్టోబర్ 1న పెట్రోల్పై లీటరుకు రూ. 3.05 చొప్పున చమురు సంస్థలు ధరను తగ్గించాయి. మరోవైపు డీజిల్ ధరలను పెంచడం ఈ ఏడాది జనవరి 17 నుంచి ఇది 10వసారి. కాగా, సబ్సిడీయేతర వంటగ్యాస్ సిలిండర్ ధరను చమురు సంస్థలు రూ. 49.50 చొప్పున తగ్గించాయి. దీంతో ఢిల్లీలో 14.2 కేజీల సిలిండర్ ధర రూ. 954.50కి తగ్గింది. ప్రధాన నగరాల్లో పెట్రోల్ ధరలు నగరం పాత ధర కొత్త ధర హైదరాబాద్ 79.08 77.57 విశాఖపట్నం 77.77 76.27 విజయవాడ 78.15 76.60 వరంగల్ 78.56 77.25 తిరుపతి 78.64 77.23 -
మళ్లీ పెట్రోల్ వాత
న్యూఢిల్లీ: తగ్గుతుందనుకున్న పెట్రోల్ ధర మళ్లీ పెరిగింది. లీటర్కు రూ.1.63 చొప్పున పెంచుతూ చమురు కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. శుక్రవారం అర్ధరాత్రి నుంచే కొత్తరేట్లు అమల్లోకి రానున్నాయి. దీనిపై వ్యాట్ లేదా స్థానిక అమ్మకపు పన్ను అదనం. తాజా పెరుగుదలతో గత జూన్ నుంచి ఇప్పటివరకు లీటర్ పెట్రోల్ ఏకంగా రూ.10.80 మేరకు (వ్యాట్ అదనం) పెరిగినట్టయింది. పెట్రోల్ ధర గత మూడున్నర నెలల్లో పెరగడం ఇది ఏడోసారి. వాస్తవానికి ఈ నెల 15/16 తేదీల్లో పెట్రోల్ ధర కొంత తగ్గవచ్చనే వార్తలు వెలువడ్డాయి. గత కొద్దిరోజులుగా రూపాయి విలువ పెరుగుతున్న నేపథ్యంలో ఈ మేరకు ఆశాభావం వ్యక్తమైంది. కానీ ఊహించనిరీతిలో నిర్ణీత తేదీకంటే ముందే చమురు కంపెనీలు పెంపును ప్రకటించాయి. ఈ నెల మొదట్లో రూపాయి విలువ క్షీణతను ఇందుకు సాకుగా చూపాయి. పెట్రోల్ అంతర్జాతీయ సగటు ధరలు పెరిగాయని దేశంలోనే అతిపెద్ద చమురు కంపెనీ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ) పేర్కొంది. అదే సమయంలో సగటు మారకపు రేటు తగ్గిందని తెలిపింది. ఈ రెండు కారణాల దృష్ట్యా పెట్రోల్ ధరను లీటర్కు రూ.1.63 చొప్పున పెంచాల్సి వచ్చిందని ఐఓసీ వివరించింది. గత జూన్ 1న వ్యాట్ కాకుండా 75 పైసల మేరకు పెరిగిన పెట్రోల్ ధర అదే నెల 16న రూ.2, 29న రూ.1.82, జూలై 15న రూ.1.55, ఆగస్టు 1న 70 పైసలు, సెప్టెంబర్ 1న రూ.2.35 మేరకు పెరిగింది. ఇలావుండగా త్వరలోనే డీజిల్ ధర ఒకేసారి లీటర్కు రూ.3-5 మేరకు, ఎల్పీజీ ధర సిలిండర్కు రూ.50 చొప్పున పెరిగే అవకాశాలున్నాయి. -
మళ్లీ పెట్రో వడ్డన
ఆదిలాబాద్, న్యూస్లైన్ : పెట్రోల్ ధర మళ్లీ భగ్గుమంది. నాలుగు నెలల్లో ఇది ఏడో సారి పెరగడం. లీటర్కు రూ. 1.63 పైసలు పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. శుక్రవారం అర్ధరాత్రి నుంచి పెరిగిన ధరలు అమల్లోకి వచ్చాయి. పెరిగిన ధర ప్రకారం ఆదిలాబాద్లో ప్రస్తుతం పెట్రోల్ ధర లీటర్కు రూ.81.65 పైసలు ఉండ గా రూ.83.28 పైసలకు చేరుకుంది. దీనికి స్థానిక పన్నులు అదనంగా కలవనున్నాయి. సెప్టెంబర్ 1న ప్రభుత్వం పె ట్రోల్పై రూ. 2.35 పైసలు పెంచింది. తాజాగా మళ్లీ పెంచడంతో పెట్రోల్ వినియోగదారులపై భారం పడనుంది. రూ.9 కోట్ల భారం జిల్లాలో సుమారు 100కుపైగా పెట్రోల్ బంక్లు ఉండగా వీటిలో నిత్యం 1.50 లక్షల లీటర్ల పెట్రోల్ వినియోగం జరుగుతుంది. ఈ లెక్కన పెంచిన రూ.1.63 పైసల లెక్కల ప్రకారం రోజుకు రూ.2.44లక్షలు, నెలకు రూ.73.35లక్షలు, ఏడాదికి రూ.8.80 కోట్లు వినియోగదారులపై అదనంగా భారం పడుతుంది. ప్రభుత్వం ఎడాపెడా పెట్రోల్ ధరలు పెంచుతుండటంతో వినియోగదారులు బెంబేలెత్తిపోతున్నారు. రానున్న రోజుల్లో డీజిల్పై భారీగా లీటర్కు రూ.5 పెంచనున్నట్లు వార్తలు వస్తున్నాయి. గ్యాస్ ధర కూడా పెంచనున్నారని చెబుతుండటంతో వినియోగదారుల్లో ధరల గుబులు నెలకొంది. ఇదిలా ఉంటే పెంచిన పెట్రోల్ ధరపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. యూపీఏ సర్కార్ ప్రజలపై భారం మోపుతుందని ధ్వజమెత్తుతున్నారు. ఇప్పటికే నిత్యావసర సరుకుల ధరలు నింగినంటాయని, పెట్రోల్ ధరలు పదేపదే పెంచుతుండటంతో వాహనాలు నడపలేని పరిస్థితులు ఉన్నాయని పేర్కొంటున్నారు.