పదవ రోజూ పెట్రో షాక్

Petrol diesel price hiked by more than Rs 5 in 10 days - Sakshi

పదిరోజులుగా పెట్రోలు ధరల పరుగు

కొనసాగనున్న ధరల పెంపు

ఏడాది గరిష్టానికి ఇంధన ధరలు  

సాక్షి,  న్యూఢిల్లీ: పెట్రో ధరల పెంపు మంగళవారం కూడా కొనసాగింది. వరుసగా  పదవ రోజు కూడా నింగిని చూస్తున్న ధరలు వినియోగదారులను బెంబేలెత్తిస్తున్నాయి. తాజాగా పెట్రోలు పై 40-47 పైసలు, డీజిల్ పై 48-57 పైసలు పెరిగింది. రాబోయే కొద్ది రోజుల్లో ఇంధన రేట్లు మరింత పెరిగే అవకాశం ఉందని తాజా నివేదికల ద్వారా తెలుస్తోంది. ఈ 10 రోజుల్లో పెట్రోల్ ధర లీటరుకు రూ. 5.45 , డీజిల్ ధర లీటరుకు రూ. 5.8  (ఢిల్లీ రేట్లు) పెరిగింది.  దీంతో  పెట్రోలు ,డీజిల్ ధరలు ఈ  ఏడాది గరిష్టానికి  చేరాయి.  (టాటా మోటార్స్ : ఉద్యోగులపై వేటు)

ప్రధాన నగరాల్లో పెట్రోలు, డీజిలు ధరలు లీటరుకు 
న్యూఢిల్లీ : పెట్రోలు ధర  రూ. 76.73, డీజిల్  రూ.75.19
ముంబై :  పెట్రోలు ధర  రూ. 83.62, డీజిల్  రూ.73.75
చెన్నై: పెట్రోలు ధర  రూ. 80.37, డీజిల్  రూ.73.17

హైదరాబాద్ : పెట్రోలు ధర  రూ.79.65, డీజిల్  రూ.73.49
అమరావతి : పెట్రోలు ధర  రూ. 80.11 డీజిల్  రూ.73.97

 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top