Today Petrol And Diesel Prices Hiked In Delhi | ఏడో రోజూ పెట్రో మంట - Sakshi
Sakshi News home page

ఏడో రోజూ పెట్రో మంట

Feb 15 2021 8:09 AM | Updated on Feb 15 2021 1:55 PM

Petrol diesel prices hiked for 7th day straight - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ :  పెట్రో ధర మంటలు  వినియోగదారులను వణికిస్తున్నాయి. వరుసగా  ఏడో రోజు కూడా ధరలను ప్రభుత్వ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు నిర్ణయించాయి. దీంతో సోమవారం (ఫిబ్రవరి 15) దేశ వ్యాప్తంగా వరుసగా ఏడవ రోజు పెట్రోల్, డీజిల్ ధరలను పెంచాయి. పెట్రోల్ ధర 23-26 పైసలు, డీజిల్‌పై 28 నుంచి 30 పైసల మేర ధరలు పెరిగాయి. తాజా పెంపుతో ఢిల్లీలో పెట్రోల్ ధర లీటరుకు రూ.88.73కు పెరగ్గా డీజిల్ లీటరుకు రూ .79.35 (29 పైసల పెరుగుదల)కు చేరుకుంది. గత ఏడు రోజుల్లో, పెట్రోల్ ధర లీటరుకు 2.06 రూపాయలు పెరగగా, డీజిల్ రేటు లీటరుకు 2.56 రూపాయలు పెరిగింది.

పలు నగరాల్లో పెట్రోలు ,డీజిల్‌ ధరలు లీటరుకు
ముంబై  పెట్రోల్‌ రూ .95.46, డీజిల్ రూ .86.34
కోల్‌కతాలో పెట్రోల్  రూ. 90.25, డీజిల్ రూ .82.94
చెన్నైలో  పెట్రోల్ రూ. 91.19, డీజిల్ రూ .84.44 

హైదరాబాద్‌లో పెట్రోల్ రూ. 92.53, డీజిల్ రూ.86.55
అమరావతిలో  పెట్రోల్ రూ. 95.13, డీజిల్ రూ. 88.63

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement