breaking news
Nepal flash floods
-
చిన్న మంచు ముక్కకే నేపాల్ మునిగితే... హిమాలయాలు కరిగితే...? నేపాల్ వరదల వెనుక రహస్యం?
-
సైన్స్కు అర్థం కాని కైలాస రహస్యం..
-
నేపాల్లో భారీ వరద బీభత్సం.. ప్రాణాలు కాపాడుకునేందుకు పరుగులు!
-
ప్రకృతి పరీక్ష.. మానస సరోవర్ యాత్ర ఎందుకంత ప్రత్యేకం?
నేపాల్–టిబెట్ సరిహద్దు ప్రాంతంలో సంభవించిన ఆకస్మిక వరదలు తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. ఈ ప్రకృతి విపత్తులో పలువురు ప్రాణాలు కోల్పోగా.. వందలాది మంది ఆచూకీ తెలియక కుటుంబాల్లో ఆందోళన నెలకొంది. ఈ ప్రాంతానికి వెళ్లిన భారతీయ యాత్రికుల్లోనూ పలువురి జాడ కోసం ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా కైలాస్ మానస సరోవర్ యాత్రకు వెళ్లిన యాత్రికుల పరిస్థితి ఆందోళన కలిగిస్తోంది. అయితే..ప్రపంచంలోని అత్యంత పవిత్రమైన ఆధ్యాత్మిక యాత్రల్లో ఒకటిగా పేరొందిన కైలాస్ మానస సరోవర్ యాత్రకు భారత్తో పాటు నేపాల్, చైనా, అమెరికా, యూరప్ తదితర దేశాల నుంచి ప్రతి ఏడాది వేలాది మంది భక్తులు తరలివెళ్తారు. కఠినమైన భౌగోళిక పరిస్థితులు ఉన్నప్పటికీ.. ఈ యాత్రపై భక్తుల్లో ఉన్న విశ్వాసం అసాధారణం.శివుని నివాసంగా..హిందూ సంప్రదాయం ప్రకారం కైలాస్ పర్వతం పరమశివుడి నివాసంగా భావిస్తారు. మంచుతో కప్పుకున్న ఈ పర్వతాన్ని భక్తులు కేవలం ఓ పర్వతంగా కాకుండా.. దైవ స్వరూపంగా దర్శిస్తారు. శివుడు, పార్వతీదేవి ఇక్కడ నివసిస్తారని పురాణాల్లో ప్రస్తావనలు ఉన్నాయి. కైలాస్ పర్వతం పక్కనే ఉన్న మానస సరోవర్ సరస్సు కూడా అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. ఈ సరస్సులో స్నానం చేయడం వల్ల పాపాలు తొలగిపోతాయని, ఆధ్యాత్మిక ప్రశాంతత లభిస్తుందని భక్తుల నమ్మకం.ప్రపంచంలోనే ప్రత్యేకమైన సరస్సుసముద్ర మట్టానికి దాదాపు 15 వేల అడుగుల ఎత్తులో ఉన్న మానస సరోవర్ ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మంచినీటి సరస్సుల్లో ఒకటి. చుట్టూ మంచు పర్వతాలు, నిర్మలమైన ఆకాశం, ప్రశాంతమైన వాతావరణం ఈ ప్రాంతానికి ప్రత్యేక ఆకర్షణను తెచ్చిపెడతాయి. ఉదయం సూర్యకిరణాలు సరస్సు నీటిపై పడే దృశ్యం అద్భుతంగా ఉంటుందని యాత్రికులు చెబుతారు. ప్రకృతి అందాలు, ఆధ్యాత్మిక అనుభూతి రెండూ కలిసే అరుదైన ప్రదేశంగా మానస సరోవర్కు గుర్తింపు ఉంది.ఎందుకు ఈ సమయంలోనే యాత్ర?కైలాస్ మానస సరోవర్ యాత్రకు కూడా ఓ ప్రత్యేకమైన కాలం ఉంటుంది. సాధారణంగా మే నుంచి సెప్టెంబర్ వరకు ఈ యాత్రకు అనుకూల సమయంగా భావిస్తారు. శీతాకాలంలో మంచు తీవ్రత పెరిగి పర్వత మార్గాలు మూసుకుపోవడంతో యాత్ర దాదాపు అసాధ్యంగా మారుతుంది. వేసవి ప్రారంభం నుంచి వర్షాకాలం ముగిసే వరకు మంచు కరుగుతుంది.. మార్గాలు అందుబాటులోకి వస్తాయి. ముఖ్యంగా నిర్మలమైన వాతావరణంలో కైలాస్ పర్వత దర్శనం, మానస సరోవర్ అందాలను ఆస్వాదించేందుకు వేలాది మంది భక్తులు ఈ కాలంలోనే యాత్రకు బయల్దేరుతారు. అయితే హిమాలయ ప్రాంతంలో వాతావరణం ఎప్పుడు ఎలా మారుతుందో చెప్పలేం. అనుకూలమైన సీజన్లోనూ ఆకస్మిక వర్షాలు, వరదలు, కొండచరియలు విరిగిపడటం వంటి ప్రకృతి సవాళ్లు యాత్రికులకు పరీక్షగా మారుతున్నాయి.కఠినమైన ప్రయాణం.. అయినా తగ్గని భక్తిమానస సరోవర్ యాత్ర సాధారణ ప్రయాణం కాదు. అత్యంత ఎత్తైన పర్వత మార్గాలు, తక్కువ ఆక్సిజన్, ప్రతికూల వాతావరణ పరిస్థితులు యాత్రికులకు సవాళ్లుగా నిలుస్తాయి. శారీరకంగా, మానసికంగా సిద్ధంగా ఉన్నవారే ఈ యాత్రను పూర్తి చేయగలరు. భారత ప్రభుత్వం కూడా ప్రత్యేక మార్గాల ద్వారా ఈ యాత్రను నిర్వహిస్తుంది. ఉత్తరాఖండ్లోని లిపులేఖ్ మార్గం, నేపాల్ మార్గాల ద్వారా యాత్రికులు టిబెట్లోని కైలాస్ ప్రాంతానికి చేరుకుంటారు.అనేక మతాలకు పవిత్ర స్థలంకైలాస్ పర్వతం కేవలం హిందువులకే కాదు.. జైనులు, బౌద్ధులు, టిబెటన్ సంప్రదాయాలను అనుసరించే వారికి కూడా పవిత్రమైన ప్రాంతం. జైన సంప్రదాయం ప్రకారం తొలి తీర్థంకరుడు రిషభదేవుడు ఈ ప్రాంతంతో సంబంధం కలిగి ఉన్నారని విశ్వసిస్తారు. బౌద్ధులు కూడా కైలాస్ను పవిత్ర పర్వతంగా గౌరవిస్తారు.ప్రకృతి సవాళ్లు.. పెరుగుతున్న ఆందోళనలుఇటీవల కాలంలో హిమాలయ ప్రాంతాల్లో వాతావరణ మార్పుల ప్రభావం పెరుగుతోంది. ఆకస్మిక వర్షాలు, మంచు కరుగుదల, కొండచరియలు విరిగిపడటం వంటి ఘటనలు యాత్రికులకు ప్రమాదంగా మారుతున్నాయి. అయినప్పటికీ.. జీవితంలో ఒక్కసారైనా కైలాస్ మానస సరోవర్ను దర్శించాలనే ఆకాంక్షతో భక్తులు ఈ సాహస యాత్రను కొనసాగిస్తున్నారు.కైలాస్ మానస సరోవర్ యాత్ర కేవలం ఓ ప్రయాణం కాదు.. అది భక్తి, నమ్మకం, ప్రకృతి మధ్య జరిగే ఓ ఆధ్యాత్మిక అనుభవం. అందుకే ఎన్నో కష్టాలు, ప్రమాదాలు ఉన్నప్పటికీ ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది మనసుల్లో ఈ యాత్రకు ప్రత్యేక స్థానం కొనసాగుతోంది. -
చైనాకు తెలిసిన నేపాల్ను హెచ్చరించలేదా? చైనా పాపమే .. నేపాల్ కి శాపమా?
-
యాక్షన్ ప్లాన్ ఏది?.. నేపాల్లో తమిళ యాత్రికుల మిస్సింగ్
నేపాల్–టిబెట్ సరిహద్దులో సంభవించిన భారీ ఆకస్మిక వరదలు తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. మృతుల సంఖ్య పెరుగుతుండగా.. అక్కడికి వెళ్లిన భారతీయ యాత్రికుల ఆచూకీ తెలియక కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా కైలాస్ మానస సరోవర్ యాత్రకు వెళ్లిన తమిళ యాత్రికుల పరిస్థితిపై ఆ రాష్ట్రంలో ఆందోళన నెలకొంది.కుంభకోణానికి చెందిన సూపర్ ట్రావెల్ ఏజెన్సీ ద్వారా మొత్తం 57 మంది తమిళ యాత్రికులు మానస సరోవర్ యాత్రకు వెళ్లినట్లు ఇప్పటికే అక్కడి అధికారులు ప్రకటించారు. వీరిలో 20 మంది సురక్షితంగా ఉన్నట్లు సమాచారం అందగా.. మరో 37 మంది ఆచూకీ ఇంకా తెలియాల్సి ఉంది. అయితే టీవీకే సర్కార్ ఈ మధ్యాహ్నాం దాకా ఎలాంటి హెల్ప్లైన్ ఏర్పాటు చేయకపోవడంపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పించాయి.ఏం చర్యలు తీసుకున్నారు?ఈ వ్యవహారంపై తమిళనాడు టీవీకే ప్రభుత్వాన్ని ప్రతిపక్షాలు నిలదీశాయి. అసెంబ్లీలో ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ మాట్లాడుతూ.. నేపాల్లో చిక్కుకున్న తమిళ యాత్రికుల కోసం ప్రభుత్వం తీసుకున్న చర్యలపై ప్రశ్నించారు. “ఎంతమంది యాత్రికులు గల్లంతయ్యారు? ప్రభుత్వ హెల్ప్లైన్కు ఎన్ని కాల్స్ వచ్చాయి? ఇప్పటివరకు ఎలాంటి చర్యలు చేపట్టారు?” అని ప్రభుత్వాన్ని నిలదీశారు.అన్నాడీఎంకే నేత ఎడప్పాడి కె. పళనిస్వామి కూడా ఆ 57 మంది తమిళ యాత్రికులను సురక్షితంగా తీసుకురావాలని డిమాండ్ చేశారు. మరోవైపు టీవీకే మిత్రపక్షం కాంగ్రెస్ పార్టీ.. నేపాల్లో చిక్కుకున్న యాత్రికుల రక్షణ కోసం ప్రత్యేక హెలికాప్టర్ పంపాలని కోరింది.LoP Udhayanidhi Stalin in Tamil Nadu Assembly on Nepal floods: "Many Tamils who went missing in Nepal are still unreachable. How many calls were received on the Government helpline? What action has been taken? - Udhayanidhi questions.""All 57 Tamils must be rescued and brought… https://t.co/wENvCSTZUl— ANI (@ANI) August 27, 202657 కాదు.. 106 మందితమిళనాడు మంత్రి రాజ్మోహన్ అసెంబ్లీలో మాట్లాడుతూ.. పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నామని, అక్కడి అధికార యంత్రాగంతో ఎప్పటికప్పుడు సమన్వయం జరుపుతున్నామని తెలిపారు. కుంభకోణం ట్రావెల్ ఏజెన్సీ ద్వారా 57 మంది వెళ్లగా.. చెన్నైకి చెందిన మరో ట్రావెల్ ఏజెన్సీ ద్వారా మరో 49 మంది యాత్రికులు మానస సరోవర్ యాత్రకు వెళ్లినట్లు సమాచారం ఉందన్నారు. వారి వివరాలను కూడా సేకరిస్తున్నట్లు తెలిపారు.చివరి ఫోన్ కాల్.. నో రెస్పాన్స్తమ కుటుంబ సభ్యుల నుంచి చివరిసారిగా వచ్చిన ఫోన్ కాల్ తర్వాత యాత్రికుల బంధువుల్లో ఆందోళన మరింత పెరిగింది. విష్ణు రామస్వామి అనే వ్యక్తి మాట్లాడుతూ.. తన తల్లి, ఇద్దరు సోదరీమణులు యాత్రలో ఉన్నారని తెలిపారు. “ఆగస్టు 23న వారు బయలుదేరారు. ఢిల్లీ, ఖాట్మండు చేరుకున్న తర్వాత ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం ఫోన్ చేసేవారు. ఆగస్టు 26 ఉదయం 6.15 గంటలకు చివరిసారి మాట్లాడారు. తాము క్షేమంగానే ఉన్నామని చెప్పారు. ఆ తర్వాత ఫోన్ సంబంధాలు తెగిపోయాయి” అని ఆందోళన వ్యక్తం చేశారు.విజయ్ అత్యవసర సమావేశంఅసెంబ్లీలో నేపాల్ వరదల మిస్సింగ్పై ఆందోళనలు వ్యక్తం అయ్యాక.. ముఖ్యమంత్రి విజయ్ ఎమర్జెన్సీ రివ్యూ మీటింగ్ నిర్వహించారు. ఉన్నతాధికారులతో మాట్లాడిన ఆయన.. అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు.Nepal tragedy - Cm instructions Chief Minster of Tamil Nadu conducted a review meeting to oversee the relief measures post the Nepal tragedy CM has instructed Thiru Ashish Kumar, IAS, Resident Commissioner,TN House, New Delhi along with a team to proceed to Kathmandu to… pic.twitter.com/EqYLS4YzyF— Vignesh Theni (@Vignesh_twitz) August 27, 2026ఆచూకీ కోసం ప్రయత్నాలునేపాల్–టిబెట్ సరిహద్దు ప్రాంతంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. గల్లంతైన భారతీయుల వివరాలను సేకరించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నేపాల్ అధికారులతో సమన్వయం చేస్తున్నాయి. చాలామంది యాత్రికుల బృందాలు వరదల కంటే ముందే ఆ ప్రాంతాన్ని దాటినట్లు సమాచారం అందుతోంది. దీంతో యాత్రికుల సురక్షిత తరలింపుపై కుటుంబాలు ఆశగా ఎదురుచూస్తున్నాయి.ఇదీ చదవండి: విపత్తుల నేపాల్.. ఆ ట్రాక్ రికార్డు అంత ఘోరం మరి! -
నేపాల్ వరదలకు అసలు కారణమేంటి? మరో ముప్పు ఎందుకు?
-
నేపాల్ వరదల్లో.. ఏపీ, తెలంగాణ యాత్రికులు గల్లంతు
-
నేపాల్ వరదలు.. DRDO మాజీ ఛైర్మన్ సతీష్ రెడ్డి దంపతులు సురక్షితం
టిబెట్: నేపాల్లో సంభవించిన భారీ వరదలు,మంచుచరియల విరిగిపడిన ఘటనలో డీఆర్డీఓ మాజీ ఛైర్మన్ జి. సతీష్ రెడ్డి దంపతులు సురక్షితంగా బయటపడ్డారు.హైదరాబాద్ నుంచి మానస సరోవర్ యాత్రకు వెళ్లిన 31 మంది సభ్యుల యాత్రికుల బృందంలో సతీష్ రెడ్డి దంపతులు కూడా ఉన్నారు. వీరు మానస సరోవర్ యాత్రకోసం సతీష్ రెడ్డి బృందం వెళ్లిన కొన్నిగంటల్లోనే వరదలు వచ్చాయి. నిన్న ఉదయమే వరదలు సంభవించి ప్రాంతాన్ని దాటి వచ్చారు. సతీష్ రెడ్డి బృందం ఆ ప్రాంతాన్ని దాటిన కొన్ని గంటలకే అక్కడ వరదలు సంభవించడం, పెద్ద ఎత్తున మంచుకొండ చరియలు విరిగిపడటంతో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.ఈ ప్రమాదం నుంచి తమ బృందమంతా క్షేమంగా బయటపడినట్లు సతీష్ రెడ్డి స్వయంగా వెల్లడించారు. ‘మేం 31 మంది యాత్రకు వెళ్లాం. భారీ మంచుకొండ చరియ విరిగిపడి వరదలు ముంచెత్తాయి. అయితే, మేము ఆ ప్రాంతాన్ని సకాలంలో దాటడంతో ప్రాణాపాయం తప్పింది. అందరం సురక్షితంగా ఉన్నాం. ప్రస్తుతం టిబెట్లోని సాగా అనే ప్రాంతంలో ఉన్నాం. ఇక్కడి నుంచి వెనక్కి వచ్చేందుకు ప్రయత్నిస్తున్నాం. త్వరలోనే భారత్కు చేరుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నాం’ అని ఆయన తెలిపారు. -
నేపాల్ ఫ్లాష్ఫ్లడ్స్.. ఆ ఆరోపణల్ని ఖండించిన చైనా
ఫ్లాష్ఫ్లడ్స్పై ఉద్దేశపూర్వకంగానే తమ దేశం ముందస్తు హెచ్చరికలు జారీ చేయలేదన్న నేపాల్ అధికారుల ఆరోపణలను చైనా ఖండించింది. ఇలాంటి ఆరోపణల వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని.. ప్రస్తుత పరిస్థితుల్లో పరస్పర సహకారం మాత్రమే అవసరమని అభిప్రాయపడింది. అలాగే.. నేపాల్ జలవిలయంపై జరుగుతున్న ఓ ఫేక్ ప్రచారాన్ని కూడా తోసిపుచ్చింది.నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన భారీ ఆకస్మిక వరదలపై నేపాల్లోని చైనా రాయబార కార్యాలయం గురువారం స్పందిచింది. తమ దేశం ముందస్తు హెచ్చరికలు ఇవ్వలేదన్న ఆరోపణలను తోసిపుచ్చింది. ఇలాంటి ఆరోపణల వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని, ప్రస్తుత పరిస్థితుల్లో సహకారంతోనే ప్రాణాలను కాపాడగలమని పేర్కొంది. ‘‘ప్రస్తుత పరిస్థితుల్లో పరస్పర ఆరోపణల కంటే సహాయక చర్యలకు ప్రాధాన్యం ఇవ్వాలి. బాధితులను ఆదుకోవడం, సహాయక చర్యలను వేగవంతం చేయడమే ప్రధాన లక్ష్యంగా ఉండాలి’’ అని పేర్కొంది.అలాగే చైనా వైపు ఉన్న ఓ డ్యామ్ కూలిపోయి.. నేపాల్లో ఈ విధ్వంసం జరిగిందన్న ఆరోపణలను బీజింగ్ ఖండించింది. ఈ వాదనలు పూర్తిగా అవాస్తవమని, ‘ఫేక్ న్యూస్’ అని ఖాట్మాండులోని చైనా రాయబార కార్యాలయం ఒక ప్రకటనలో పేర్కొంది.భూకంపం.. హిమపాతమే కారణం: చైనాఆగస్టు 26 ఉదయం భూకంపమో, భూకంపం మాదిరిగా మంచు ఫలకాలు కూలిపోవడం వల్లనో.. భారీగా మంచు, రాళ్లు, మట్టి, నీరు కలిసి ఒక్కసారిగా దిగువ ప్రాంతాలకు ప్రవహించడంతో ఫ్లాష్ఫ్లడ్స్ విపత్తు చోటుచేసుకుందని పేర్కొంది. రసువాగఢి-కెరుంగ్ సరిహద్దు ప్రాంతంలో ఇరుదేశాల వైపునా ఈ ప్రభావం కనిపించిందని చైనా వెల్లడించింది.175 మంది మృతి.. వందలాది మంది గల్లంతుహిమాలయ ప్రాంతంలో సంభవించిన ఈ ఆకస్మిక వరదలు తీవ్ర విధ్వంసం సృష్టించాయి. నీరు, మట్టి, రాళ్లు, మంచు కలిసి వచ్చిన భారీ ప్రవాహం గ్రామాలను ముంచెత్తింది. ఇప్పటివరకు 175 మందికి పైగా మృతి చెందినట్లు సమాచారం. 1,300 మందికి పైగా ఆచూకీ తెలియాల్సి ఉంది. రోడ్లు, భవనాలు, ఇతర మౌలిక సదుపాయాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.నేపాల్ వైపు భిన్న వాదనలువర్షం లేకున్నా.. మెరుపు వరదలు ముంచెత్తడంపై రకరకాల థియరీలు తెరపైకి వచ్చాయి. తొలుత భూకంపమే కారణమని అనుమానాలు వ్యక్తమైనా.. అమెరికా భూగర్భ సర్వే సంస్థ (USGS) తాజా విశ్లేషణలో అది భూకంపం కాదని, గ్లేసియర్ కూలిపోవడం వల్లే భారీ ప్రకంపనలు, ఫ్లాష్ఫ్లడ్స్ సంభవించాయని వెల్లడించింది. భారత్కు చెందిన ఇస్రో మాత్రం తన ఉపగ్రహ చిత్రాల విశ్లేషణతో.. వరదలకు ముందు సంభవించిన భూకంపం.. గ్లేసియర్ కూలిపోవడానికి ట్రిగ్గర్గా మారి ఉండొచ్చని అంచనా వేస్తోంది.మరోవైపు నేపాల్లో ఈ ఘటనపై పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. వరదలు టిబెట్ సరిహద్దు నుంచి నేపాల్ జిల్లాలకు చేరేందుకు రెండుగంటల సమయం పట్టిందని.. ఆ గ్యాప్లో చైనా నుంచి ముందస్తు హెచ్చరిక అందలేదని, దీనివల్ల నష్టం మరింత పెరిగిందన్న ఆరోపణలు వినిపించాయి. అయితే చైనా ఆరోపణలను తోసిపుచ్చుతోంది. ఇరు దేశాల మధ్య విపత్తులపై సహకార వ్యవస్థ ఉన్నప్పటికీ.. సరిహద్దు ప్రాంతాల్లో ఆకస్మిక వరదలు, హిమపాతం వంటి ప్రమాదాలపై ముందస్తు హెచ్చరికలు ఇచ్చే ప్రత్యేక ద్వైపాక్షిక ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ మాత్రం లేదని తెలుస్తోంది.Deeply saddened by the devastating natural disaster in the Gyirong–Rasuwagadhi border region, which has caused significant casualties and losses on both the Chinese and Nepali sides.My deepest condolences to those who lost their lives, and my sincere sympathies to their…— Ambassador Zhang Maoming (@PRCAmbNepal) August 27, 2026రంగంలోకి దిగిన చైనానేపాల్–టిబెట్ సరిహద్దులో సంభవించిన భారీ వరదలు, కొండచరియల విరిగిపడిన ఘటనపై చైనా త్వరగతిన స్పందించింది. ఈ విపత్తులో తమ వైపు కూడా నష్టం జరిగిందని పేర్కొంటూ.. సహాయక చర్యలను వేగవంతం చేసింది. చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ సహాయక చర్యలను ముమ్మరం చేయాలని, గల్లంతైన వారి కోసం గాలింపు కొనసాగించాలని ఆదేశించారు. చైనా ప్రభుత్వం సరిహద్దు ప్రాంతమైన టిబెట్లో అత్యవసర ప్రతిస్పందన చర్యలు చేపట్టింది. రెస్క్యూ బృందాలు, వైద్య సిబ్బందిని రంగంలోకి దించింది. టెంట్లు, దుప్పట్లు, ఇతర సహాయక సామగ్రిని తరలించడంతో పాటు అత్యవసర నిధులను కూడా కేటాయించింది.ఇదీ చదవండి: చైనా బ్రహ్మరాక్షసితో భారత్కే పెనుముప్పు? -
మా వాళ్లు ఎలా ఉన్నారో?
సాక్షి, హైదరాబాద్: నేపాల్లో సంభవించిన ఆకస్మిక వరద నగరవాసులకు ఆందోళన కలిగిస్తోంది. వృత్తి, వ్యాపార, పర్యాటక, ఆధ్యాత్మిక యాత్ర కోసం వెళ్లిన తమవాళ్లకు సంబంధించిన సమాచారం కోసం వారి కుటుంబ సభ్యులు, బంధువులు ఆర్తిగా ఎదురుచూస్తున్నారు. వీరికి ఏ హానీ కలగకుండా తిరిగి రావాలంటూ మొక్కుకుంటున్నారు. నగరం నుంచి నేపాల్ వెళ్లినవారు 150 మందిపైనే ఉంటారని తెలుస్తోంది. నేపాల్కు వీసా లేకుండా అధికారిక గుర్తింపు కార్డులు చూపించి వెళ్లే అవకాశం ఉంది. దీంతో భారతీయులు పర్యాటకంతో పాటు వృత్తి, వ్యాపార, ఆధ్యాత్మిక యాత్రలకు వెళుతున్నారు.అనేక కారణాల వల్ల నగరం నుంచి నేపాల్ ఉత్తర ప్రాంతానికి వెళ్లేవారి సంఖ్య నిత్యం ఎక్కువగా ఉంటుంది. ఒక్కమాటలో చెప్పాలంటే తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్లే వారిలో అత్యధికులు హైదరాబాద్ నుంచే ఉంటారు. వీరిలో కొందరు ట్రావెల్ ఏజెన్సీల ద్వారా వెళ్తుండగా మరికొందరు కుటుంబ సభ్యులతో కలిసి సొంతంగా వెళ్తుంటారు. ఇలాంటివారితో పాటు సఫారీలు, ట్రెక్కింగ్స్ కోసం వెళ్లే వారి సంఖ్య గణనీయమే. వర్షాకాలం నేపథ్యంలో ట్రెక్కింగ్కు వెళ్లేవారి సంఖ్య తగ్గినా, మిగిలిన పనులపై వెళ్లేవారు పదులు, వందల్లోనే ఉంటారు.ఆకస్మిక వరదల వార్త దావానలంలా వ్యాపించడంతో వీరందరి కుటుంబాల్లో ఉత్కంఠ, ఆత్రుత నెలకొంది. నేపాల్ యాత్రకు వెళ్లినవారిని సంప్రదించడానికి ప్రయత్నించగా అనేకమంది ఫోన్లు బుధవారం అర్ధరాత్రి వరకు పని చేయలేదు. కొందరి ఫోన్లు రింగ్ అవుతున్నా సమాధానం ఉండట్లేదు. ఈ పరిణామాలు నగరంలోని వారి కుటుంబీకుల్లో ఆందోళన మరింత పెంచుతోంది. చాలామంది తమవారిని తీసుకెళ్లిన, పంపిన ట్రావెల్ ఏజెన్సీలు, వ్యక్తుల వద్దకు పరుగులు పెట్టారు. 31 మంది క్షేమం చిక్కడపల్లి: నగరం నుంచి కైలాస మానస సరోవర్ యాత్రకు వెళ్లిన 31 మంది క్షేమంగా ఉన్నారు. ఈ నెల 18న వీరి యాత్ర ప్రారంభమైంది. ప్రస్తుతం టిబెట్ వైపు ఉన్నారు. అయితే, వీరు ప్రయాణించి వచ్చిన ప్రాంతం వరదల్లో కొట్టుకుపోయింది. చైనా అనుమతిస్తే 29వ తేదీన కొడారి మార్గం నుంచి ఖాట్మాండుకు చేరుకుని, అక్కడినుంచి భారత్లోకి రానున్నారు. ఈ విషయాన్ని యాత్రకు వెళ్లిన ఎమ్మెస్ రామారావు ట్రస్టు చైర్మన్ పోలాప్రగడ శ్రీనివాస్ స్వామి ఫోన్ ద్వారా వెల్లడించారు. 2013లో ఉత్తరాఖండ్లో వచ్చిన ఆకస్మిక వరదలు నగరం నుంచి చార్ధామ్ యాత్రకు వెళ్లినవారిపై తీవ్ర ప్రభావం చూపాయి. పదుల సంఖ్యలో నగరవాసులు చనిపోగా, ఇంకొందరు గల్లంతయ్యారు. 2014లో హిమాచల్ప్రదేశ్ మండి జిల్లాలోని బియాస్ నది వద్ద జలవిద్యుత్ ప్రాజెక్టు అధికారులు ముందస్తు హెచ్చరికలు లేకుండా రిజర్వాయర్ గేట్లను తెరవడంతో నగరం నుంచి విహార యాత్రకు వెళ్లిన ఇంజనీరింగ్ విద్యార్థులు పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు. తాజాగా నేపాల్ ఆకస్మిక వరదల వార్త విన్న నగరవాసులు పై రెండు ఉదంతాలను గుర్తు చేసుకుంటున్నారు. నాటి బీభత్సాన్ని తలచుకుని ఆందోళన చెందుతున్నారు. ఈ మూడు దుర్ఘటనలూ హిల్ స్టేషన్లలో జరిగినవే కావడంతో మరింత కంగారు పడుతున్నారు. చదవండి: నేపాల్ భీకర వరదలు.. ఏరియల్ వ్యూలో.. -
నేపాల్ భీకర వరదలు.. ఏరియల్ వ్యూలో..
ఖాట్మండు: నేపాల్లో మంచు, బురద, భారీ రాళ్లతో విరుచుకుపడిన ఆకస్మిక వరదలు సృష్టించిన భయానక విధ్వంసం ఏరియల్ దృశ్యాల్లో స్పష్టంగా కనిపించింది. బుధవారం సంభవించిన ఈ జల ప్రళయానికి ఇప్పటివరకు 165 మంది ప్రాణాలు కోల్పోగా, 1,300 మందికి పైగా గల్లంతయ్యారు. పైనుంచి చూసిన దృశ్యాల ప్రకారం చైనా-నేపాల్ సరిహద్దుల్లోని రసువా జిల్లాతో పాటు సమీప ప్రాంతాల్లో గ్రామాలు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయి, రహదారులు ధ్వంసమై మానవ నివాసాల ఆనవాళ్లే లేకుండా పోయాయి. టిబెట్లో పుట్టిన భోటే కోశి నది పెను ఉధృతితో ముంచుకొచ్చి ఈ భారీ నష్టాన్ని మిగిల్చింది. రసువాకు దాదాపు 50 కిలోమీటర్ల దూరంలోని నువాకోట్లో నది తన మార్గాన్ని మార్చుకోవడంతో నివాస ప్రాంతాలన్నీ బురద దిబ్బలుగా మారిన దృశ్యాలు ఏరియల్ వీక్షణలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. VIDEO | Nuwakot, Nepal: Aerial views reveal the extent of devastation after Nepal flash floods.#NepalFloodNews #NepalTragedy(Source: AFP/Only for use in India)(Full video available on PTI Videos - https://t.co/d8jp61yd2p) pic.twitter.com/XlPVqQEdet— Press Trust of India (@PTI_News) August 27, 2026 -
ముందే తెలిసినా చెప్పలేదా?.. చైనా అసలేం చేసింది?
నేపాల్లోని రసువాలో బుధవారం ఒక్కసారిగా విరుచుకుపడిన భారీ వరదలు తీవ్ర విధ్వంసం సృష్టించాయి. అయితే ఇంతటి విపత్తు సంభవించే అవకాశం గురించి నేపాల్, చైనా ప్రభుత్వాలకు ముందస్తు సమాచారం ఎందుకు అందలేదు? ఇప్పుడు ఇదే ప్రధాన ప్రశ్నగా మారింది. సరిహద్దు ప్రాంతాల్లో వాతావరణ, జలవనరుల సమాచారాన్ని పరస్పరం పంచుకునే వ్యవస్థ ఉన్నప్పటికీ.. తాజా విపత్తుపై ఎలాంటి ముందస్తు హెచ్చరిక అందలేదని నేపాల్ జలవిజ్ఞాన, వాతావరణ శాఖ వెల్లడించడం మరింత ఆందోళన కలిగిస్తోంది.రసువాలో బుధవారం ఉదయం ఒక్కసారిగా తీవ్ర వరదలు రావడంతోనే లోతట్టు ప్రాంతాల ప్రజలను ప్రభుత్వం అప్రమత్తం చేసింది. అప్పటికే వరద ఉధృతి భారీగా పెరిగి నదీ పరివాహక ప్రాంతాల్లో విధ్వంసం మొదలైంది. వరదల కారణంగా ప్రాణ, ఆస్తి నష్టం భారీగా నమోదైంది. జలవిద్యుత్ ప్రాజెక్టులు, వంతెనలు, రహదారులు దెబ్బతిన్నాయి.BIG ALLEGATION ON CHINA | Nepal FloodsQuestions are being raised over whether Nepal received timely information about the flood situation from China.Nepali media reports, citing Chinese media, claim that flooding hit Tibet’s Kerung County around 10:30 AM local time, more than… pic.twitter.com/BywSpR5CtK— The Bharat Post (@TheBharatPost__) August 27, 2026అసలు వరదలకు కారణమేంటి?టిబెట్లో ఏదైనా హిమానీనదం, హిమనద సరస్సు లేదా నదీ వ్యవస్థలో ఆకస్మిక మార్పు జరిగితే.. దాని ప్రభావం నేపాల్పై పడే అవకాశం ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో ముందుగానే సమాచారం అందితే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే అవకాశం ఉంటుంది. కానీ తాజా ఘటనలో అలాంటి ముందస్తు సమాచారం లేకపోవడంతో నష్టం మరింత పెరిగిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చైనా, నేపాల్ మధ్య వాతావరణ సంబంధిత సమాచారాన్ని పంచుకునేందుకు ఒక యంత్రాంగం ఉంది. కానీ ఆ వ్యవస్థ ఉన్నప్పటికీ తాజా వరదలపై ముందస్తు సమాచారం రాలేదని నేపాల్ అధికారులు చెబుతున్నారు.ఇది ఇప్పుడు రెండు దేశాల మధ్య సమాచార మార్పిడిపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. టిబెట్లో విపత్తుకు సంబంధించిన సంకేతాలు ముందుగానే గుర్తించినా.. అవి నేపాల్కు చేరలేదా? లేక అక్కడ అలాంటి సమాచారం అందుబాటులో లేదా? అన్నది తేలాల్సి ఉంది. విపత్తు తర్వాత సమాచారం అందడం వల్ల ప్రయోజనం పరిమితమవుతుందని నిపుణులు చెబుతున్నారు. సరిహద్దు ప్రాంతాల్లో హిమానీనదాలు, నదులు, హిమనద సరస్సులపై నిరంతర పర్యవేక్షణ అవసరమని సూచిస్తున్నారు.🔴 Les images en provenance du #Népal sont terrifiantes. Le séisme d’une magnitude de 4,4 qui s’est produit la nuit dernière au Tibet a déclenché des #avalanches de glace et des #glissements de terrain. Ils ont formé des embâcles sur les rivières de la région qui ont fini par… pic.twitter.com/XIdlQ76gii— Guillaume Woznica (@GWoznica) August 26, 2026ముందస్తు హెచ్చరిక వ్యవస్థ ఏర్పాటు చేయాలి..భోటేకోశి నది వరదల అనంతరం రూపొందించిన నివేదికలో కూడా ఇదే అంశాన్ని ప్రస్తావించారు. చైనా-నేపాల్ సరిహద్దుల్లో ప్రమాదకర ప్రాంతాలను గుర్తించి అంతర్గత ముందస్తు హెచ్చరిక వ్యవస్థను ఏర్పాటు చేయాలని సూచించారు. హిమానీనదాలు, హిమనద సరస్సులు, నదుల్లో ఆకస్మిక మార్పులను ముందుగానే గుర్తించి సమాచారం అందించే వ్యవస్థ ఉంటే.. ప్రజలను అప్రమత్తం చేయడంతో పాటు ప్రాణ, ఆస్తి నష్టాన్ని గణనీయంగా తగ్గించవచ్చని నిపుణులు చెబుతున్నారు.చైనాతో అధికారిక ఒప్పందం అవసరమా?విపత్తు నిర్వహణ రంగ నిపుణులు చైనా, నేపాల్ ప్రభుత్వాలు ఈ అంశంపై అధికారికంగా ముందుకు రావాలని సూచిస్తున్నారు. సరిహద్దు ప్రాంతాల్లో వరదలు, హిమానీనదాల విస్ఫోటనాలు, ఇతర ప్రకృతి విపత్తులకు సంబంధించిన సమాచారాన్ని తక్షణమే పరస్పరం పంచుకునేలా ప్రత్యేక అవగాహన ఒప్పందం (MOU) చేసుకోవాలని సూచనలు వస్తున్నాయి. అవసరమైతే ఉపగ్రహాల ద్వారా పర్యవేక్షణ కేంద్రాలను ఏర్పాటు చేసి.. టిబెట్ వైపు జరిగే పరిణామాలను నిరంతరం గమనించాలని నిపుణులు అంటున్నారు. టిబెట్లో జరిగే ఏ చిన్న మార్పు అయినా నేపాల్లోని నదులపై ప్రభావం చూపే అవకాశం ఉన్నందున ముందస్తు సమాచారం అత్యంత కీలకమని చెబుతున్నారు.చదవండి: నేపాల్ విలయం.. చైనా బ్రహ్మరాక్షసితో యమడేంజర్చైనా అధ్యక్షుడు, ప్రధాని స్పందననేపాల్ విపత్తు జరిగిన కొన్ని గంటలకే చైనా ప్రభుత్వం కూడా స్పందించింది. టిబెట్లో పూర్తిస్థాయి సహాయక చర్యలు చేపట్టాలని చైనా ప్రధాని లీ కెకియాంగ్ ఆదేశించినట్లు ప్రభుత్వ మీడియా సీసీటీవీ వెల్లడించింది. అలాగే వరద నియంత్రణ పరిస్థితి అత్యంత క్లిష్టంగా మారే అవకాశం ఉందని చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ అధికారులను అప్రమత్తం చేసినట్లు సమాచారం. అన్ని విభాగాలు, సంబంధిత సంస్థలు హై అలర్ట్లో ఉండాలని, ప్రమాదాలను గుర్తించి వాటిని పరిష్కరించే చర్యలను వేగవంతం చేయాలని ఆయన సూచించినట్లు తెలిసింది.ఆలస్యమైన సమాచారం.. పెరిగిన నష్టం?నేపాల్ నిపుణుల ప్రధాన ఆందోళన ఇదే. విపత్తు జరిగిన తర్వాత సమాచారం అందడం కాదు.. విపత్తు రాకముందే సమాచారం అందాలి. ముఖ్యంగా చైనా-నేపాల్ సరిహద్దుల్లోని హిమానీనదాలు, నదులు, హిమనద సరస్సులు అత్యంత ప్రమాదకర ప్రాంతాలు కావడంతో ముందస్తు హెచ్చరిక వ్యవస్థ లేకపోతే ఇలాంటి ఘటనలు మరింత ప్రాణ, ఆస్తి నష్టాన్ని మిగిల్చే ప్రమాదం ఉంది. అందుకే తాజా వరదలు కేవలం ప్రకృతి విపత్తుగానే కాకుండా.. చైనా-నేపాల్ మధ్య సరిహద్దు సమాచార మార్పిడి వ్యవస్థలో ఉన్న లోపాలను బయటపెట్టిన ఘటనగా నిపుణులు భావిస్తున్నారు. భవిష్యత్తులో ఇలాంటి విపత్తులు పునరావృతం కాకుండా రెండు దేశాలు ఎంత త్వరగా సమన్వయ వ్యవస్థను బలోపేతం చేస్తాయన్నదే ఇప్పుడు కీలకంగా మారింది. -
నేపాల్ విలయం.. చైనా బ్రహ్మరాక్షసితో యమడేంజర్
హిమాలయాల్లో ప్రకృతి ప్రకోపం మరోసారి భయాందోళనలు రేపుతోంది. నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన ఆకస్మిక వరదలు, హిమపాతం ఘటనలు అక్కడి భౌగోళిక సున్నితత్వాన్ని(ఎక్కువ భూకంపాల ముప్పు) ప్రపంచానికి గుర్తు చేసింది. ఈ విపత్తు నేపథ్యంలోనే చైనా నిర్మిస్తున్న ప్రపంచంలోనే అతిపెద్ద జలవిద్యుత్ ప్రాజెక్టు మెడోగ్ డ్యామ్పై కొత్త ఆందోళనలు మొదలయ్యాయి.అరుణాచల్ప్రదేశ్ సరిహద్దుకు సమీపంలోని టిబెట్లో బ్రహ్మపుత్ర నదిపై చైనా నిర్మిస్తున్న ఈ భారీ ప్రాజెక్టును కొందరు నిపుణులు ‘వాటర్ బాంబ్’గా అభివర్ణిస్తుంటారు. అభ్యంతరాలను పట్టించుకోకుండా చైనా దీనిని దూకుడుగా ముందుకు తీసుకెళ్తుండడం మొదటి నుంచే ఆందోళన రేకెత్తిస్తోంది. పైగా భూకంపాలకు అత్యంత సున్నితమైన హిమాలయ ప్రాంతంలో ఇంత భారీ నిర్మాణం భవిష్యత్తులో భారత్ ఈశాన్య ప్రాంతాలకు ముప్పుగా మారే అవకాశం ఉందని కూడా చెబుతున్నారు.నేపాల్ వరదలతో పెరిగిన ఆందోళనఇటీవల నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన ఆకస్మిక వరదలు తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి. 160 మంది మరణించారు. వందల మంది జలప్రళయంలో గల్లంతు అయ్యారు. తొలుత భూకంపం ధాటికి వరదలు ముంచెత్తాయని నిపుణులు భావించినా.. మంచు ఫలకాలు విరిగిపడటం వల్ల భారీగా నీరు నదుల్లోకి చేరి వరద పోటెత్తిందని ఓ అంచనాకు వచ్చారు. ఆ రీజియన్లలో ఆనకట్టలు ఎక్కువగా ఉండడం కూడా ఈ విపత్తునకు మరో ప్రధాన కారణంగా మారింది.ఇక హిమాలయాలు ప్రపంచంలోనే అత్యంత చురుకైన భూకంప ప్రాంతాల్లో ఒకటి. చిన్న స్థాయి భౌగోళిక మార్పులు కూడా భారీ ప్రకృతి విపత్తులకు దారితీసే అవకాశం ఉండటంతో.. ఈ ప్రాంతాల్లో చేపడుతున్న భారీ నిర్మాణాలపై ఎప్పటి నుంచో నిపుణులు హెచ్చరికలు చేస్తున్నారు.చైనా మెగా డ్యామ్ ఇదే..చైనా టిబెట్లోని యార్లంగ్ త్సాంగ్పో నదిపై మెడోగ్ జలవిద్యుత్ ప్రాజెక్టును నిర్మిస్తోంది. ఇదే నది భారత్లోకి ప్రవేశించిన తర్వాత సియాంగ్గా, ఆ తర్వాత బ్రహ్మపుత్రగా మారుతుంది. సుమారు 60 వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యంతో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టు పూర్తయితే.. చైనాలోని త్రీ గోర్జెస్ డ్యామ్ను మించి ప్రపంచంలోనే అతిపెద్ద జలవిద్యుత్ ప్రాజెక్టుగా నిలిచే అవకాశం ఉంది. 2033 నాటికి దీన్ని అందుబాటులోకి తీసుకురావాలని చైనా లక్ష్యంగా పెట్టుకుంది.భూకంప జోన్లో భారీ నిర్మాణంమెడోగ్ డ్యామ్ నిర్మిస్తున్న ప్రాంతం భౌగోళికంగా అత్యంత సున్నితమైనది. ఈ ప్రాంతంలో క్రియాశీల ఫాల్ట్ లైన్లు ఉన్నట్లు కొన్ని భౌగోళిక అధ్యయనాలు సూచించాయి. భూకంపాలు సంభవించే ప్రాంతంలో ఇంత భారీ డ్యామ్ నిర్మాణం ప్రమాదకరమని నిపుణులు అంటున్నారు. ఏదైనా ప్రకృతి విపత్తు సంభవిస్తే భారీ స్థాయిలో నీటి ప్రవాహం దిగువ ప్రాంతాలకు చేరే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.భారత్కే ఎందుకు ముప్పు?యార్లంగ్ త్సాంగ్పో నది దిగువ ప్రాంతంలో భారత్ ఉండటమే ప్రధాన కారణం. టిబెట్లో నది ప్రవాహంపై చైనా నియంత్రణ పెరిగితే.. భవిష్యత్తులో నీటి లభ్యత, వరదల నిర్వహణపై ప్రభావం పడే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. భారీ వర్షాల సమయంలో డ్యామ్ నుంచి ఒక్కసారిగా నీటిని విడుదల చేస్తే అరుణాచల్ప్రదేశ్, అసోం రాష్ట్రాల్లో వరద ముప్పు పెరిగే అవకాశం ఉందన్న ఆందోళనలు ఉన్నాయి. మరోవైపు నీటి ప్రవాహాన్ని నియంత్రిస్తే వ్యవసాయం, పర్యావరణ వ్యవస్థలపై ప్రభావం పడవచ్చని చెబుతున్నారు.‘ఈశాన్యంపై కన్నేసిన నీటి ఆయుధం’?వ్యూహాత్మక నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఈ ప్రాజెక్టు కేవలం విద్యుత్ ఉత్పత్తి కోసం మాత్రమే కాదు. నదీ ప్రవాహంపై ఆధిపత్యం సాధించే వ్యూహంలో భాగంగానూ దీనిని చూడాల్సి ఉందని అంటున్నారు. చైనా చేతుల్లో బ్రహ్మపుత్ర ఎగువ ప్రవాహ నియంత్రణ ఉండటం భారత్కు వ్యూహాత్మక సవాలుగా మారవచ్చని హెచ్చరిస్తున్నారు. అయితే చైనా మాత్రం ఈ ప్రాజెక్టు ప్రధానంగా విద్యుత్ ఉత్పత్తి, అభివృద్ధి లక్ష్యాలతోనే చేపడుతున్నట్లు చెబుతోంది.భారత్ వ్యూహం సిద్ధంచైనా ప్రాజెక్టు నేపథ్యంలో భారత్ కూడా నీటి భద్రతపై దృష్టి పెట్టింది. అరుణాచల్ప్రదేశ్లో సియాంగ్ నదిపై సుమారు 11 వేల మెగావాట్ల సామర్థ్యంతో బహుళ ప్రయోజన ప్రాజెక్టును ప్రతిపాదించింది. ఈ ప్రాజెక్టు ద్వారా నీటి నిల్వ, వరద నియంత్రణ, విద్యుత్ ఉత్పత్తి వంటి లక్ష్యాలను సాధించాలని భారత్ భావిస్తోంది.భారత్, చైనా మధ్య అంతర్జాతీయ నదులపై సమగ్ర నీటి భాగస్వామ్య ఒప్పందం లేకపోవడం మరో ఆందోళన. ఎగువ ప్రాంతాల్లో జరిగే మార్పులపై ముందస్తు సమాచారం అందడం దిగువ దేశాలకు అత్యంత అవసరం. ప్రకృతి విపత్తులను పూర్తిగా నివారించలేకపోయినా.. ముందస్తు హెచ్చరికలు, పారదర్శక సమాచార మార్పిడి ద్వారా నష్టాన్ని తగ్గించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.భవిష్యత్తు ఎలా?ఒకవైపు హిమాలయాల్లో పెరుగుతున్న ప్రకృతి విపత్తులు.. మరోవైపు ప్రపంచంలోనే అతిపెద్ద డ్యామ్ నిర్మాణం.. ఈ రెండు అంశాలు కలిపి కొత్త చర్చకు దారితీశాయి. చైనా మెడోగ్ ప్రాజెక్టు నిజంగా ప్రమాదమా? లేదంటే అభివృద్ధి ప్రాజెక్టా? అన్నది కాలమే నిర్ణయిస్తుంది. కానీ హిమాలయాల సున్నిత పరిస్థితులు, బ్రహ్మపుత్ర ప్రాధాన్యం దృష్ట్యా అప్రమత్తత మాత్రం తప్పనిసరి. నేపాల్-టిబెట్ ప్లాష్ఫ్లడ్లు సంభవించిన వేళ చైనా ‘బ్రహ్మరాక్షసి’ మెగా డ్యామ్.. భారత్కు ‘వాటర్ బాంబ్’ ముప్పుగా మారుతుందా? అనే ప్రశ్న ఇప్పుడు మరోసారి తెరపైకి వచ్చింది.ఇది చదవండి: భూకంపం కాదు.. నేపాల్ వరదలపై అమెరికా సంచలన ప్రకటన -
నేపాల్ వరదలు: సరిహద్దుల్లో స్తంభించిన వ్యాపారం
నౌతన్వా (మహారాజ్గంజ్): నేపాల్లో సంభవించిన భారీ వరదల ప్రభావం భారత్-నేపాల్ సరిహద్దుల్లోని వాణిజ్యంపై తీవ్రంగా పడింది. వరదల కారణంగా ప్రధాన రవాణా మార్గాలు దెబ్బతినడంతో సోనౌలీ, భగవాన్పుర్, ఠూఠీబారీ వంటి సరిహద్దు పట్టణాల్లో వ్యాపార కార్యకలాపాలు దాదాపు నిలిచిపోయాయి. సాధారణ రోజుల్లో ఎప్పుడూ రద్దీగా ఉండే ఈ మార్కెట్లు నేపాల్ నుంచి వచ్చే వినియోగదారులు లేక బోసిపోయాయి.సోనౌలీ మార్కెట్ వ్యాపారం భారత్, నేపాల్ రెండు దేశాల కస్టమర్లపైనే ప్రధానంగా ఆధారపడి ఉంటుంది. నేపాల్లో వరద పరిస్థితుల దృష్ట్యా అక్కడి ప్రజలు భారత సరిహద్దు వైపు రావడం తగ్గిపోయింది. దీంతో దుకాణాల వద్ద సందడి కనిపించక, వ్యాపారులు వినియోగదారుల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. భగవాన్పుర్, ఠూఠీబారీ మార్కెట్లలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. నేపాల్ నుంచి కొనుగోలుదారులు రాకపోవడంతో దుస్తులు, నిత్యావసర సరుకులు, ఎలక్ట్రానిక్స్ వంటి అన్ని రకాల విక్రయాలు భారీగా పడిపోయాయి.సరిహద్దుల్లో రాకపోకలు స్తంభించడం వల్ల చిన్న, పెద్ద వ్యాపారులందరూ తీవ్రంగా నష్టపోతున్నారు. సరిహద్దు దకాణాలకు నేపాల్ వినియోగదారులే కీలకమని, రాకపోకలు దెబ్బతిన్నప్పుడు వ్యాపారంపై ప్రత్యక్ష ప్రభావం పడుతుందని స్థానిక వర్తకులు తెలిపారు. నేపాల్లో పరిస్థితులు త్వరగా చక్కబడి, రాకపోకలు పునరుద్ధరణ జరకపోతే రానున్న రోజుల్లో మరింత భారీ నష్టం వాటిల్లుతుందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఇది కూడా చదవండి: నేపాల్కు 10 టన్నుల అత్యవసర సాయం పంపిన భారత్ -
నేపాల్లో భీకర విషాదం.. సురక్షితంగా తెలుగు యాత్రికులు
టిబెట్: పవిత్ర మానస సరోవర్ యాత్ర నిమిత్తం నేపాల్ పర్యటనకు వెళ్లిన తెలుగు రాష్ట్రాల యాత్రికులు క్షేమంగా ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ యాత్రకు వెళ్లిన తెలుగు యాత్రికులంతా దాదాపు 15 వేల అడుగుల ఎత్తులో ఉన్న ఒక హోటల్లో సురక్షితంగా ఆశ్రయం పొందుతున్నారు. హైదరాబాద్ నుంచి నేపాల్ వెళ్లిన ఈ యాత్రికులందరూ ప్రాణాపాయం లేకుండా పూర్తి సురక్షితంగా ఉన్నట్లు సమాచారం అందింది.అయితే, నేపాల్ ప్రకృతి ప్రకోపానికి సంభవించిన భారీ వరదల కారణంగా అక్కడ రోడ్డు మార్గాలు పూర్తిగా దెబ్బతినడంతో రాజధాని కాఠ్మాండ్కు చేరుకోవడంలో యాత్రికులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీనికి తోడు యాత్రికుల వీసాలన్నీ ట్రావెల్ ఏజెన్సీల వద్దే ఉండిపోవడంతో స్వస్థలాలకు తిరిగి రావడంలో స్వల్ప జాప్యం జరుగుతున్నట్లు తెలుస్తోంది.వాస్తవానికి ఈ యాత్రికులంతా సెప్టెంబర్ 1వ తేదీన భారతదేశానికి తిరిగి రావాల్సి ఉంది. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో యాత్రికులు స్వల్ప ఆందోళనకు గురవుతున్నప్పటికీ, వారంతా క్షేమంగా ఉన్నారని అధికారులు, ట్రావెల్ ఆపరేటర్లు ధృవీకరించారు. యాత్రికులను త్వరగా సురక్షితంగా స్వస్థలాలకు రప్పించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం. ఈ వార్తకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.చైనాలోని టిబెట్ ప్రాంతంలో ఉన్న హిమాలయాల్లో, సముద్ర మట్టానికి సుమారు 15,000 అడుగుల ఎత్తులో ఉన్న ఈ పవిత్ర ప్రాంతం వద్దే హిందువులు అత్యంత పవిత్రంగా భావించే కైలాస పర్వతం ఉంది. ఈ యాత్రకు సాధారణంగా భారత్ లేదా నేపాల్ మీదుగా టిబెట్లోకి ప్రవేశిస్తుంటారు. నేపాల్ రాజధాని కాఠ్మాండ్ నుంచి రోడ్డు లేదా వాయు మార్గాల ద్వారా యాత్రికులు ఇక్కడికి చేరుకుంటారు. -
నేపాల్కు 10 టన్నుల అత్యవసర సాయం పంపిన భారత్
న్యూఢిల్లీ: టిబెట్ సరిహద్దు ప్రాంతంలో సంభవించిన ఆకస్మిక వరదలతో అతలాకుతలమైన నేపాల్కు భారత్ బాసటగా నిలిచింది. 10 టన్నుల మానవతా సాయం, అత్యవసర ఔషధాలతో కూడిన మొదటి విడత సహాయక సామగ్రిని భారత వైమానిక దళం ప్రత్యేక విమానంలో నేపాల్కు తరలించింది. ఈ విపత్తులో 95 మంది మరణించగా, భారీగా ఆస్తి నష్టం సంభవించింది. పరిస్థితి తీవ్రతపై భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, నేపాల్ ప్రధాని బాలేంద్ర షాతో ఫోన్లో మాట్లాడి అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కష్టకాలంలో నేపాల్ ప్రజలకు భారత్ అండగా ఉంటుందని, సహాయక చర్యల్లో ఇరు దేశాల బృందాలు సమన్వయంతో పనిచేస్తున్నాయని ప్రధాని మోదీ పేర్కొన్నారు.భారత్ తరఫున 10 టన్నుల విపత్తు సహాయక సామగ్రి, మందులను పంపినట్లు విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్. జైశంకర్ వెల్లడించారు. బాధితులకు, మృతుల కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు.Dispatched 10 tonnes of HADR assistance and essential medicines to support Nepal’s response to the devastating floods.Our thoughts are with the bereaved families and all those affected. In face of this challenge, India stands with Nepal and its people. pic.twitter.com/FUJdkJzi1o— Dr. S. Jaishankar (@DrSJaishankar) August 26, 2026ఢిల్లీ సమీపంలోని హిండన్ ఎయిర్బేస్ నుంచి రాత్రి సుమారు 8:35 గంటలకు బయల్దేరిన ఐఏఎఫ్ ‘సి-130జె’ (C-130J) విమానం ఖాట్మండుకు చేరుకుంది. ఇందులో తాత్కాలిక గుడారాలు, దుప్పట్లు, హైజీన్ కిట్లు, సోలార్ దీపాలు, అత్యవసర మందులు ఉన్నాయి. అవసరమైతే మరిన్ని సహాయక చర్యల కోసం సి-17, సి-130 రవాణా విమానాలతో పాటు రెస్క్యూ ఆపరేషన్లకు హెలికాప్టర్లను సిద్ధంగా ఉంచినట్లు భారత వైమానిక దళం తెలియజేసింది.ఇది కూడా చదవండి: ఉపగ్రహ చిత్రాల్లో నేపాల్ జల ప్రళయం.. -
ఉపగ్రహ చిత్రాల్లో నేపాల్ జల ప్రళయం..
రసువా: నేపాల్లోని రసువా తదితర జిల్లాల్లో సంభవించిన ఆకస్మిక వరదల విధ్వంస తీవ్రతను ‘ప్లానెట్ ల్యాబ్స్’ విడుదల చేసిన ఉపగ్రహ చిత్రాలు కళ్లకు కట్టాయి. ఆగస్టు 23, 25 నాటి సాధారణ స్థితికి, వరదల అనంతరం ఆగస్టు 26న తీసిన చిత్రాలకు మధ్య ఉన్న వ్యత్యాసం అక్కడి విపత్తు తీవ్రతను తేటతెల్లం చేస్తోంది. మనకామన, ఖడ్గ భంజ్యాంగ్ వంటి గ్రామాలు, నేపాల్-చైనా సరిహద్దు లోయలు, భోటేకోశీ నది పరివాహక ప్రాంతాల్లోని మౌలిక సదుపాయాలు, జలవిద్యుత్ కేంద్రాలు, రహదారులు వరద ప్రవాహానికి తీవ్రంగా దెబ్బతిన్న దృశ్యాలు శాటిలైట్ చిత్రాల్లో కనిపిస్తున్నాయి.ఈ ఆకస్మిక వరదల ధాటికి ఇప్పటివరకు 98 మంది మృతి చెందగా, వందలాది మంది గల్లంతయ్యారు. గల్లంతైన సుమారు 400 మందిలో 105 మంది భారతీయులు, 37 మంది ప్రవాస భారతీయులు ఉన్నట్లు నేపాల్ టూరిజం బోర్డు వెల్లడించింది. హిమనీనదం పేలడం లేదా మంచు చరియలు విరిగిపడి నదీ ప్రవాహాన్ని అడ్డుకోవడం వల్లే ఒక్కసారిగా ఈ భారీ వరద ఉప్పొంగి ఉండవచ్చని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.వరద ప్రవాహం గండక్ నది ద్వారా దిగువకు వచ్చే అవకాశం ఉండటంతో భారత్లోని బిహార్, ఉత్తరప్రదేశ్ సరిహద్దు ప్రాంతాల్లో ఎన్డీఆర్ఎఫ్ బలగాలను అప్రమత్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ నేపాల్ ప్రభుత్వానికి సంఘీభావం తెలుపుతూ అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేశారు.ఇది కూడా చదవండి: 1934 భూకంపం నుంచి 2026 వరదల వరకు.. -
1934 భూకంపం నుంచి 2026 వరదల వరకు..
హిమాలయ పర్వత శ్రేణుల్లో ఒదిగివున్న నేపాల్ మరోసారి ప్రకృతి ప్రకోపానికి నిలువునా వణికిపోయింది. తాజాగా సంభవించిన ఆకస్మిక వరదలు పలు ప్రాంతాలను ముంచెత్తడంతో గ్రామాలు క్షణాల్లో కొట్టుకుపోయాయి. ఇప్పటివరకు దాదాపు 95 నుండి 100కు పైగా మృతదేహాలను సహాయక బృందాలు వెలికితీయగా, వేలాది మంది గల్లంతైనట్లు సమాచారం అందుతోంది. ప్రకృతి విలయాలకు నేపాల్ గురికావడం ఇదే మొదటిసారి కాదు.. 1934 నాటి భీకర భూకంపం నుండి నేటి వరదల వరకు ఈ హిమాలయ దేశం మృత్యు చరిత్రను మోస్తూనే ఉంది.1934 నాటి పెను విషాదం: నేపాల్-బీహార్ మహా భూకంపంనేపాల్ చరిత్రలోనే అత్యంత వినాశకరమైన విపత్తుగా 1934 జనవరి 15న వచ్చిన భూకంపం నిలిచింది. రిక్టర్ స్కేలుపై 8.0 తీవ్రతతో మధ్యాహ్నం 2:13 గంటలకు సంభవించిన ఈ ప్రకంపనల కేంద్రం మౌంట్ ఎవరెస్ట్కు దక్షిణాన 9.5 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. ఉత్తర బీహార్, నేపాల్ సరిహద్దులను కుదిపేసిన ఈ ఘోర విపత్తులో దాదాపు 10,700 నుండి 12,000 మంది ప్రాణాలు కోల్పోయారు. వేలాది గ్రామాలు భూస్థాపితమై చరిత్రలో చీకటి అధ్యాయంగా మిగిలిపోయాయి.1988 భూకంపం.. 1993 వరదల తాండవం1988 ఆగస్టు 20న ఉదయ్పూర్ జిల్లా కేంద్రంగా 6.9 తీవ్రతతో వచ్చిన భూకంపం నేపాల్, బీహార్ సరిహద్దుల్లో 1,003 మందిని బలితీసుకుంది. ఆ తర్వాత, 1993 జూలై 19-20 తేదీల్లో కురిసిన కుండపోత వర్షాలు వెయ్యేళ్లలో ఎన్నడూ చూడని జలప్రళయాన్ని సృష్టించాయి. ఈ వరదలు, కొండచరియలు విరిగిపడటంతో బాగ్మతి బ్యారేజీతో సహా ప్రధాన మౌలిక సదుపాయాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. 700 మందికి పైగా జనం జలసమాధి అయ్యారు.2014-2015 ప్రకృతి ప్రకోపం: గూర్ఖా భూకంప విధ్వంసం2014 ఏప్రిల్లో ఖుంబు ఐస్ఫాల్ వద్ద సంభవించిన హిమపాతంలో 16 మంది షెర్పా గైడ్లు మరణించగా, అదే ఏడాది ఆగస్టులో సున్కోషి నదికి అడ్డంగా కొండచరియలు విరిగిపడి 150 మందికి పైగా చనిపోయారు. ఇక 2015 ఏప్రిల్ 25న వచ్చిన గూర్ఖా భూకంపం రాజధాని ఖాట్మండును చావుకేకలతో నింపింది. ఈ భయంకర విపత్తు నేపాల్, భారత్, చైనా, బంగ్లాదేశ్లలో కలిపి 8,962 మంది ప్రాణాలను హరించగా, దాదాపు 22 వేల మంది క్షతగాత్రులయ్యారు.2017 నుంచి 2024 వరకు ఎడతెగని విలయం2017 వర్షాకాలంలో నేపాల్ దక్షిణాన ఉన్న తెరాయ్ ప్రాంతాన్ని ముంచెత్తిన వరదల్లో 140 మందికి పైగా మరణించారు. 2023 నవంబర్ 3న జాజర్కోట్ జిల్లాలో 5.7 తీవ్రతతో సంభవించిన భూకంపం 153 మందిని బలితీసుకుంది. అలాగే, 2024 సెప్టెంబరులో ఖాట్మండు లోయ, బాగ్మతి ప్రాంతాల్లో రికార్డు స్థాయి వర్షాలు కురవడంతో సంభవించిన వరదలు, కొండచరియల విలయానికి 240 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు.ప్రస్తుత జల విలయంతాజాగా 2026 ఆగస్టులో విరుచుకుపడిన వరదల్లో పదుల సంఖ్యలో గ్రామాలు నేలమట్టమయ్యాయి. నదులు ఉప్పొంగి ఉగ్రరూపం దాల్చడంతో ఇప్పటివరకు 95 మందికి పైగా శవాలు లభ్యమయ్యాయి. ఇంకా 133 మంది భారతీయులతో సహా పలువురి ఆచూకీ లభించలేదు. సహాయక చర్యలు కొనసాగుతున్నప్పటికీ ప్రతికూల వాతావరణం కారణంగా మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఎందుకు పదేపదే విధ్వంసం?వాతావరణ మార్పుల ముప్పు ఎక్కువగా ఉన్న ప్రపంచ దేశాల జాబితాలో నేపాల్ 4వ స్థానంలో ఉంది. భౌగోళికంగా సున్నితమైన హిమాలయ ప్రాంతం కావడంతో కొండచరియలు విరిగిపడటం, మెరుపు వరదలు ఇక్కడ సర్వసాధారణంగా మారాయి. ఇంత తీవ్రమైన ముప్పు పొంచి ఉన్నప్పటికీ, దేశంలో ఆధునిక వాతావరణ హెచ్చరిక వ్యవస్థలు సరిగా లేకపోవడమే ప్రాణ, ఆస్తి నష్టాలు విపరీతంగా పెరగడానికి ప్రధాన కారణంగా నిలుస్తోంది.ఇది కూడా చదవండి: మథురలో అరుదైన రాఖీ సంప్రదాయం! -
నేపాల్ వరదలు: బాధితుల కోసం తెలంగాణ హెల్ప్లైన్ నెంబర్లు
కఠ్మాండూ: దేవభూమి నేపాల్లో వరద బీభత్సం నింపిన పెను విషాదంలో 157మంది ప్రాణాలు కోల్పోయారు. వందల సంఖ్యలో స్థానికులు, పర్యాటకులు గల్లంతయ్యారు.రాజధాని కఠ్మాండూకు ఉత్తరాన ఉన్న రసువా జిల్లాలో బుధవారం ఉదయం ఆకస్మికంగా విరుచుకుపడిన వరదతో పలు గ్రామాలు కొట్టుకుపోయాయి. ఒక జలవిద్యుత్ కేంద్రం కొట్టుకుపోవడంతో పాటు పలు నిర్మాణాలకు భారీ నష్టం వాటిల్లింది. ఈ వరద టిబెట్ నుంచి నేపాల్ వైపు ప్రవహించే బోటేకోషిలో పడిన మంచు కరగడం వల్ల వచ్చినట్టు అధికారులు చెప్పారు. అయితే భూకంపం కారణంగా సంభవించిన హిమపాతమే ఈ వరదలకు కారణమని నేపాల్ విదేశాంగ మంత్రి తెలిపారు.నేపాల్-టిబెట్ సరిహద్దు ప్రాంతాన్ని తాకిన ఆకస్మిక వరదల కారణంగా కనీసం 157 మంది మరణించారు.వందలాది మంది గల్లంతయ్యారు. గల్లంతైన వారిలో కైలాష్ మానస సరోవరానికి వెళ్లిన కనీసం 133 మంది భారతీయ యాత్రికులు ఉన్నారు.నేపాల్ పోలీసులు 157 మృతదేహాలను వెలికితీశారు. వరద ముప్పు ప్రాంతాల కుటుంబాలను తరలించేందుకు అధికారులు కృషి చేస్తున్నారు. పర్యాటక మంత్రిత్వ శాఖ ప్రకారం, విపత్తు సంభవించిన కొన్ని గంటల తర్వాత, 341 మంది విదేశీయులతో సహా సుమారు 403 మంది పర్యాటకుల ఆచూకీ తెలియలేదు. గల్లంతైన విదేశీయులలో 142 మంది భారతీయులతో పాటు ఆస్ట్రేలియా, బ్రిటన్, మలేషియా, నెదర్లాండ్స్, పోర్చుగల్, దక్షిణాఫ్రికా, దక్షిణ కొరియా, అమెరికా చెందిన వారు కూడా ఉన్నారని నేపాల్ పర్యాటక శాఖ వెల్లడించింది తెలిపింది.ప్రధానమంత్రి బాలేంద్ర షా సహాయక చర్యలకు ప్రభుత్వ వనరులన్నింటినీ కేటాయిస్తామని హామీ ఇవ్వగా, నేపాల్ సహాయక బృందాలు బురద కింద పూడిపోయిన మృతదేహాలను వెలికితీయడం, క్షతగాత్రులను రక్షించే చర్యలను ముమ్మరం చేస్తున్నాయి.తెలంగాణ వాసుల కోసం ప్రత్యేక హెల్ప్లైన్మరోవైపు నేపాల్ వరదల్లో చిక్కుకున్న తెలంగాణ వాసుల కోసం ప్రత్యేక హెల్ప్లైన్ ఏర్పాటు చేసింది. నేపాల్ పరిస్థితులపై ఎప్పటికప్పుడు పర్యవేక్షణకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఈ మేరకు తెలంగాణ వాసులకు అవసరమైన సహాయం అందించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. సీఎం ఆదేశాలతో తెలంగాణ భవన్లో ప్రత్యేక సమన్వయ కేంద్రాన్ని అధికారులు ఏర్పాటు చేశారు. విదేశాంగ శాఖ ఖాట్మండులోని భారత రాయబార కార్యాలయంతో తెలంగాణ భవన్ అధికారుల సమన్వయం చేసుకుంన్నారు. నేపాల్లో ఉన్న తెలంగాణ యాత్రికులు, పర్యాటకుల కుటుంబ సభ్యులు హెల్ప్లైన్ను సంప్రదించాలని ఢిల్లీలోని తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన హెల్ప్లైన్ను సంప్రదించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. బాధితుల పేరు, పాస్పోర్ట్, మొబైల్, నేపాల్లోని ప్రాంత వివరాలు అందించాలని సూచించారు. ట్రావెల్/టూర్ ఆపరేటర్, కుటుంబ సభ్యుల సంప్రదింపు వివరాలు ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం సూచించింది. అందిన విజ్ఞప్తులను కేంద్ర ప్రభుత్వానికి, భారత రాయబార కార్యాలయానికి చేరవేయనున్నారు.తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన ఈ 9871999044, 9949351270, 9618597969 హెల్ప్లైన్ నంబర్లకు ఫోన్ చేయాలని తెలిపారు. -
Nepal Flash Floods: అప్పుడే అయిపోలేదు.. మరోసారి డేంజర్ బెల్
నేపాల్-టిబెట్ సరిహద్దు ప్రాంతంలో ప్రకృతి ప్రకోపం బీభత్సం సృష్టించింది. రాసువా జిల్లాలో బుధవారం సంభవించిన ఆకస్మిక వరదల్లో 162 మంది మృతి చెందారు(ఇప్పటిదాకా). వందలాది మంది ఆచూకీ తెలియకపోవడంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు.. అందులో కైలాస్ మానస సరోవర్ యాత్రకు వెళ్లిన 133 మంది భారతీయ యాత్రికులు గల్లంతైనట్లు సమాచారం.భోట్ కోషి, త్రిశూలి నదీ వ్యవస్థల్లో ఒక్కసారిగా వచ్చిన వరదలు భారీగా మట్టి, రాళ్లు, బండరాళ్లను కొట్టుకొచ్చాయి. ఉదయం 9 గంటల సమయంలో టిబెట్ వైపు నుంచి వచ్చిన భారీ నీటి ప్రవాహం నేపాల్లోని రాసువా, ధాదింగ్, నువాకోట్ జిల్లాలను తీవ్రంగా ప్రభావితం చేసింది. అనేక గ్రామాలు, రహదారులు, వంతెనలు ధ్వంసమయ్యాయి. వరదల ధాటికి నేపాల్లో రవాణా, విద్యుత్ మౌలిక వసతులు తీవ్రంగా దెబ్బతిన్నాయి. కనీసం 19 వంతెనలు కొట్టుకుపోయినట్లు అధికారులు తెలిపారు. రాసువాగఢి సరిహద్దు మార్గం కూడా ధ్వంసమైంది. ఎనిమిది జలవిద్యుత్ ప్రాజెక్టులు దెబ్బతిన్నట్లు సమాచారం. ఇందులో రాసువాగఢి, సంజెన్ ఖోలా, అప్పర్ త్రిశూలి-3ఏ వంటి కీలక ప్రాజెక్టులు ఉన్నాయి.Ground level footage shows people running for their lives as a sudden flash flood tears through the Nepal–Tibet region pic.twitter.com/kTY1bg2HJJ— Surajit (@surajit_ghosh2) August 26, 2026మరో వరద ముప్పు.. ఐసీఎంఓడీ హెచ్చరికహిమాలయ ప్రాంతాలపై అధ్యయనం చేసే అంతర్జాతీయ సంస్థ ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఇంటిగ్రేటెడ్ మౌంటెన్ డెవలప్మెంట్ (ICIMOD) కీలక హెచ్చరిక జారీ చేసింది. వరదకు కారణమైన ప్రాంతంలో ఇంకా ఓ భారీ నీటి అడ్డంకి కొనసాగుతోందని, అది తెగిపోతే మరోసారి భారీ వరద సంభవించే ప్రమాదం ఉందని తెలిపింది.ఐసీఎంఓడీ వాతావరణ, పర్యావరణ ప్రమాదాల వింగ్ చీఫ్ కియాంగ్గాంగ్ జాంగ్ మాట్లాడుతూ.. గతేడాది వరదలు సంభవించిన ప్రాంతమే మళ్లీ ప్రమాదంలో ఉందన్నారు. లెండే ఖోలా ప్రాంతంలో మంచు-రాళ్ల కొండచరియలు విరిగిపడటం వల్ల ఈ విపత్తు సంభవించి ఉండొచ్చని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. అయితే కారణం ఇంకా పూర్తిగా నిర్ధారణ కాలేదని తెలిపారు.గతేడాది కూడా ఇదే లెండే ఖోలా ప్రాంతం భారీ వరదలకు గురైంది. 2025 జూలైలో టిబెట్ సరిహద్దు సమీపంలో గ్లేసియర్ సరస్సు తెగిపోవడం వల్ల ఒక్కసారిగా భారీగా నీరు, బురద, రాళ్లు దిగువకు ప్రవహించాయి. ఈ వరద భోటే కోషి నదిలో కలసి రాసువా ప్రాంతంలో తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. ఆ వరదల్లో 15 మంది దాకా మరణించారు. రాసువాగఢి సరిహద్దు వంతెన, రహదారులు, పలు మౌలిక వసతులు దెబ్బతిన్నాయి. ఈ ఘటన నుంచి కోలుకోకముందే ఇప్పుడు అదే ప్రాంతంలో మరోసారి వరద ముప్పు పొంచి ఉండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు.నిమిషాల్లోనే పెరిగిన నదీ ప్రవాహంఅయితే తాజా ఫ్లాష్ఫ్లడ్స్కు తీవ్రతకు నదుల్లో నీటి మట్టాలు రికార్డు స్థాయిలో పెరిగాయి. త్రిశూలి నదిలోని గల్చి ప్రాంతంలో కేవలం 30 నిమిషాల్లోనే నీటిమట్టం 9 మీటర్ల మేర పెరిగింది. మాలేఖు ప్రాంతంలో 7 మీటర్ల మేర పెరిగినట్లు అధికారులు గుర్తించారు. ఇంత వేగంగా నీటి మట్టం పెరగడం వల్ల పర్వత ప్రాంతాల్లో భారీగా పేరుకుపోయిన నీరు, మట్టి, మంచు ఒక్కసారిగా దిగువ ప్రాంతాలకు వచ్చినట్లు నిపుణులు భావిస్తున్నారు.భూకంపం కాదు.. కొండచరియల కదలికగా గుర్తింపుతొలుత ఈ విపత్తుకు కారణం భూకంపం అయి ఉండొచ్చని అనుమానాలు వ్యక్తమైనా.. అమెరికా జియోలాజికల్ సర్వే (USGS) విశ్లేషణలో కీలక విషయం వెలుగులోకి వచ్చింది. 5.2 తీవ్రతతో నమోదైన సీస్మిక్ సంకేతాలు వాస్తవానికి భూకంపం వల్ల కాకుండా భారీ కొండచరియలు విరిగిపడటం వల్ల ఏర్పడినవిగా గుర్తించారు. ఆ ప్రాంతంలో భారీగా మంచు, రాళ్లు కదలడంతో భూకంప తరంగాల్లాంటి సంకేతాలు నమోదైనట్లు శాస్త్రవేత్తలు తెలిపారు.మంచు కొండ కూలి.. లోయలోకి దూసుకొచ్చిన విపత్తుశాటిలైట్ చిత్రాల ఆధారంగా నిపుణులు చేస్తున్న ప్రాథమిక అంచనాల ప్రకారం.. హిమనదంలోని దిగువ భాగం విరిగిపడి వందల మీటర్ల ఎత్తు నుంచి లోయలోకి పడిపోయి ఉండొచ్చని భావిస్తున్నారు. ఈ మంచు-రాళ్ల భారీ దిబ్బ లెండే ఖోలా నదిలో పడటంతో ఒక్కసారిగా నీరు, బురద, భారీ బండరాళ్లతో కూడిన వరద ప్రవాహం దిగువకు దూసుకెళ్లినట్లు అనుమానిస్తున్నారు.Glacier Lake Bursts in Tibet, Sending a Massive Flood Toward Nepal! 🤯A sudden glacier lake outburst in Tibet unleashed a powerful surge of water and debris, triggering severe flooding downstream in Nepal’s Koshi River system. The sheer force of nature is terrifying…— Horizon Wire (@HorizonWireHW) August 27, 2026చైనా వైపునా విధ్వంసం.. గ్యిరోంగ్ పోర్టుకు భారీ నష్టంవరద ప్రభావం నేపాల్కే పరిమితం కాలేదు. టిబెట్లోని గ్యిరోంగ్ ప్రాంతం కూడా తీవ్రంగా దెబ్బతింది. మట్టి, రాళ్ల ప్రవాహంతో రహదారులు, కమ్యూనికేషన్ వ్యవస్థలు, విద్యుత్ సరఫరా దెబ్బతిన్నాయి. చైనా అధికారులు గ్యిరోంగ్ పోర్టు ప్రాంతంలో సహాయక చర్యలు చేపట్టారు. సరిహద్దు మార్గాలు పూర్తిగా ధ్వంసం కావడంతో సహాయక బృందాలకు చేరుకోవడం కష్టంగా మారింది.భారతీయ యాత్రికుల కోసం ఆందోళనవరదల్లో గల్లంతైన వారిలో పెద్ద సంఖ్యలో విదేశీ పర్యాటకులు ఉన్నారు. నేపాల్ పర్యాటక శాఖ ప్రకారం 400 మందికి పైగా పర్యాటకుల ఆచూకీ కొంతకాలం తెలియలేదు. ఇందులో 133 మంది భారతీయ కైలాస్ మానస సరోవర్ యాత్రికులు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. మరో 57 మంది ఎన్నారైలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. గల్లంతైన వారిని గుర్తించేందుకు నేపాల్ రక్షణ బృందాలు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టాయి. బురదలో కూరుకుపోయిన వారిని వెలికితీసేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.నేపాల్కు భారత్ సాయంవిపత్తు నేపథ్యంలో భారత్ వెంటనే స్పందించింది. సహాయక సామగ్రి, వైద్య పరికరాలతో కూడిన విమానాన్ని భారత వైమానిక దళం నేపాల్కు పంపించింది. 10 టన్నుల సహాయ సామగ్రిని తరలించినట్లు సమాచారం. భారత ప్రదాని నరేంద్ర మోదీ జలప్రళయంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధితులకు అండగా ఉంటామని ప్రకటించారు. ‘‘ప్రజలు ఎదుర్కొంటున్న నష్టం ఎంతో బాధాకరం. ప్రభుత్వం తన పూర్తి వనరులతో సహాయక చర్యలు చేపడుతోంది’’ అని తెలిపారు.తొమ్మిది మంది దక్షిణ కొరియా కార్మికులు గల్లంతువరద ప్రభావిత ప్రాంతాల్లో విదేశీయులు కూడా చిక్కుకున్నారు. నేపాల్లోని ఓ జలవిద్యుత్ ప్రాజెక్టులో పనిచేస్తున్న తొమ్మిది మంది దక్షిణ కొరియా కార్మికులు గల్లంతైనట్లు ఆ దేశ విదేశాంగ శాఖ వెల్లడించింది. మరో పది మంది వరద ప్రాంతాల్లో చిక్కుకున్నట్లు తెలిపింది. వారిని రక్షించేందుకు ప్రత్యేక బృందాలను పంపిస్తోంది.కైలాస్ యాత్రకు తీవ్ర అంతరాయంనేపాల్-టిబెట్ సరిహద్దు మార్గం మూసుకుపోవడంతో కైలాస్ మానస సరోవర్ యాత్రపై తీవ్ర ప్రభావం పడింది. రాసువాగఢి-కెరుంగ్ మార్గం పూర్తిగా దెబ్బతింది. వంతెనలు కొట్టుకుపోవడం, రహదారులు ధ్వంసం కావడంతో యాత్రికుల రాకపోకలు నిలిచిపోయాయి. మరోవైపు ప్రైవేటు మార్గాల్లో వెళ్లిన వందలాది మంది యాత్రికుల కాంటాక్ట్ తెగిపోవడంతో ఆచూకీ కోసం అధికారులు ప్రయత్నిస్తున్నారు.ఇషా ఫౌండేషన్కు చెందిన 77 మంది యాత్రికులపై ఆందోళనకైలాస్ మానస సరోవర్ యాత్రలో ఉన్న ఇషా ఫౌండేషన్కు చెందిన 77 మంది సభ్యులు టిబెట్లోని గ్యిరోంగ్ ఇమ్మిగ్రేషన్ కేంద్రంలో ఉన్న సమయంలో వరదలు సంభవించాయని ఆ సంస్థ తెలిపింది. వారి పరిస్థితి, ఆచూకీపై అధికారిక సమాచారం అందలేదని సంస్థ వ్యవస్థాపకుడు సద్గురు తెలిపారు. తమ బృందాలు అధికారులతో కలిసి సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయని చెప్పారు.భారత్లోనూ అప్రమత్తత.. బిహార్, యూపీకి వరద అలర్ట్నేపాల్ నుంచి వచ్చే వరద నీటితో భారత్లోని సరిహద్దు రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. బిహార్లో గండక్ నది పరివాహక ప్రాంతాల్లో అధికారులు పర్యవేక్షణ పెంచారు. వాల్మీకినగర్ బ్యారేజీ వద్ద నీటి ప్రవాహాన్ని అధికారులు పరిశీలిస్తున్నారు. ఉత్తరప్రదేశ్లోని మహారాజ్గంజ్, కుషీనగర్ జిల్లాల్లోనూ అలర్ట్ జారీ చేశారు.ప్రస్తుత వరదతో ప్రమాదం ముగిసిపోలేదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. లెండే ఖోలా ప్రాంతం ఎగువన ఇంకా నీటి అడ్డంకి కొనసాగుతున్నట్లయితే అది ఎప్పుడైనా తెగిపోయి మరో భారీ వరదకు కారణమయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. అందుకే భోటే కోషి, త్రిశూలి నదీ పరివాహక ప్రాంతాల్లోని ప్రజలను అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.ఇదీ చదవండి: విమానంలో వచ్చి.. మనిషిని చంపిన దోమ!! -
నేపాల్లో భూకంపం.. వరద విలయం.. 157 మందికిపైగా జలసమాధి!
కఠ్మాండు/బీజింగ్/న్యూఢిల్లీ: ప్రకృతి ప్రకోపం ధాటికి నేపాల్ చివురుటాకులా వణికిపోయింది. రాజధాని కఠ్మాండు సమీపంలోని రాసువా, దాడింగ్ జిల్లాల ఎగువ ప్రాంతంలో బుధవారం ఉదయం సంభవించిన భూకంపం తర్వాత పెను ఉపద్రవాన్ని మోసుకొచ్చింది. ఉదయం 8.37 గంటలకు టిబెట్ సరిహద్దు ప్రాంతంలో కొడారీ అనే చోట భూమికి 77 కిలోమీటర్ల లోతులో రిక్టర్ స్కేల్పై 4.4 తీవ్రతతో సంభవించిన భూకంపం ధాటికి హిమాలయ పర్వతప్రాంతంలోని కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో ఆ కొండల మీది గ్లేసియర్(హిమానీనదాలు)లోని భారీ స్థాయిలో మంచు ఒక్కసారిగా దిగువన ఉన్న భోటె కోశీ నదిలో పడింది. దీంతో మంచు కరిగి అనూహ్య రీతిలో నదీ ప్రవాహం, నీటి మట్టం పెరిగాయి. దీంతో మెరుపు వరదలు సంభవించి లోతట్టు ప్రాంతాలను ముంచెత్తాయి. నది ఉగ్రరూపం దాల్చి దిగువన ఉన్న రాసువా, ధాడింగ్ జిల్లాల్లో నదీ పరీవాహక ప్రాంతాల్లోని వందలాది ఇళ్లు, డజను జలవిద్యుత్ ప్రాజెక్టులు, వంతెనలు, రహదారులు, దుకాణ సముదాయాలను సర్వనాశనం చేసింది. 42 కి.మీ.ల పొడవైన కీలక బేద్రావతి–రసువాగఢి రోడ్డు కొట్టుకుపోయింది. నేపాల్ పర్వతప్రాంత రమణీయతను చూసేందుకు దేశవిదేశాల నుంచి తరలివచ్చిన పర్యాటకులు ఈ మెరుపు వరదల్లో జలసమాధి అయ్యారు. 157 మందికిపైగా చనిపోయారని స్థానిక మీడియాలో కథనాలు వెలువడ్డాయి. 750 మందికిపైగా పర్యాటకులు, స్థానికుల జాడ గల్లంతైంది. జాడ తెలీకుండా పోయిన వారిలో 133 మంది భారతీయులు, 37 మంది ప్రవాస భారతీయులు ఉన్నట్లు టూరిస్ట్ కంపెనీలు, స్థానిక యంత్రాంగం గణాంకాలను బట్టి తెలుస్తోంది. నువాకోట్, ఛిటావన్ జిల్లాల్లోనూ మెరుపు వరదల భీభత్సం ఎక్కువగాఉంది. వరద ఉధృతికి సమీపంలోని ఇళ్లు, హోటళ్లు, ఇతర నిర్మాణాలు పేకమేడల్లా కూలాయి. కార్లు, ఇతర వాహనాలు ప్రవాహంలో కొట్టుకుపోయాయి. అసలేం జరుగుతుందో తెలిసేలోపే అమాంతం వరద ముంచెత్తి జనం జలసమాధి అయిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. నేపాల్–చైనా సరిహద్దులోని రసువాగఢి చెక్పోస్ట్లో రెండంతస్తుల భవంతిని వరదనీరు రెప్పపాటులో సర్వనాశనం చేసిన వీడియో సోషల్మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. వరదధాటికి ఇక్కడ నేపాల్–చైనా భూతల మార్గం పూర్తిగా ధ్వంసమైంది. వరద ఉధృతికి నామరూపాలు కోల్పోయి, బురదలో కూరుకుపోయి ఆ ప్రాంతాలన్నీ భీతావహంగా మారాయి. ఎటు చూసినా అడుగుల ఎత్తులో పేరుకుపోయిన బురద, సాయం కోసం అరి్థస్తున్న జనం హాహాకారాలతో ఆ ప్రాంతాల్లో విషాద వాతావరణం రాజ్యమేలుతోంది. భోటె కోశీ నదీజలాలు తర్వాత తిబూరే ప్రాంతంలో త్రిశూలి నదిలోకి రావడంతో దాని కారణంగానూ ఒకింత విధ్వంసం పెరిగింది. బుధవారం రాత్రినాటికి ఏడు జిల్లాల్లో 95 మృతదేహాలను స్వా«దీనం చేసుకున్నారు. బిహార్, యూపీలో అలర్ట్ నేపాల్ వరద నీటితో గండక్ నదిలో నీటి మట్టం పెరిగే ఆస్కారం ఉండటంతో బిహార్, ఉత్తర ప్రదేశ్లో స్థానికయంత్రాంగాలు నదీపరీవాహక ప్రాంతాలోని ప్రజలను అప్రమత్తంచేశాయి. దిగువ ప్రాంతాల నుంచి ఎగువ ప్రాంతాలకు తరలిపోవాలని అధికారులు సూచించారు. అవసరమైతే తగు సాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని బిహార్ ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరికి కేంద్ర హోం మంత్రి అమిత్ షా భరోసా ఇచ్చారు. గండక్ నదిపై ఒక బరాజ్లో 36 గేట్లను ఎత్తి నీళ్లను కిందకు వదిలేస్తున్నారు. వరదనీటి ముప్పు ఉండే ఉత్తరప్రదేశ్లోని మహారాజ్గంజ్, కుషీనగర్ జిల్లాలోని నదీ పరీవాహక ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలని అధికారులు, సహాయక బృందాలకు యూపీ సీఎం యోగి సూచించారు. చైనా ఆపన్న హస్తంతమ అధీనంలోని టిబెట్లోని సరిహద్దు ప్రాంతాల్లోనూ ఈ వరద విలయం ఎక్కువగా ఉండటంతో చైనా అధ్యక్షుడు జిన్పింగ్ విస్తృతస్థాయిలో అన్వేషణ, సహాయక చర్యలు చేపట్టాలని ఆర్మీకి ఆదేశాలిచ్చారు.మానస సరోవర్ యాత్రికులు సైతంఅమెరికా, మలేసియా, బ్రిటన్, దక్షిణాఫ్రికా, ఆ్రస్టేలియా, నెదర్లాండ్స్, దక్షిణకొరియా పర్యాటకుల జాడ తెలీడంలేదని నేపాల్ టూరిజం బోర్డ్ తెలిపింది. టిబెట్లోని కైలాస్ మానస సరోవర్ను దర్శించుకునేందుకు యాత్రకు వచ్చిన 77 మంది భారతీయుల జాడ సైతం తెలీడంలేదని సామ్రాట్ టూర్స్ అండ్ ట్రావెల్ ఏజెన్సీ వెల్లడించింది. దీంతో భారతీయుల జాడ కనిపెట్టి ఎలాగైనా క్షేమంతా స్వదేశానికి తీసుకొచ్చేందుకు మోదీ సర్కార్ నడుం బిగించింది. నేపాల్ అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నట్లు అక్కడి భారతీయ రాయబార కార్యాలయం భరోసా ఇచ్చింది. 341 మంది పర్యాటకులు, 291 మంది విదేశీయులు, 62 మంది నేపాలీల జాడ తెలీడంలేదని నేపాల్ టూరిజం బోర్డ్ ప్రకటించింది. 24న నేపాల్ పర్యటనకు వెళ్లిన పశ్చిమబెంగాల్లోని ఆరామ్బాగ్కు చెందిన 65 మంది పర్యాటకులు సైతం వరద ప్రాంతంలో చిక్కుకున్నట్లు వార్తలొచ్చాయి.పూర్తి సాయం చేస్తాం: ప్రధాని మోదీ వరద విలయం వార్త తెలియగానే నేపాల్ ప్రధాని బాలేంద్రకు భారత ప్రధాని మోదీ ఫోన్చేసి మాట్లాడారు. మృతులకు తన ప్రగాఢ సానుభూతి వ్యక్తంచేస్తున్నట్లు ఆయనతో మోదీ చెప్పారు. మిత్రదేశమైన నేపాల్కు అన్ని రకాల సహాయ సహకారాలు అందించేందుకు సదాసిద్ధంగా ఉన్నట్లు మోదీ హామీ ఇచ్చారు. ఆ మేరకు ఇప్పటికే భారత వాయుసేన విమానాల్లో అత్యవసర ఉపకరణాలు, ఔషధాలు, ఆహారం, ఇతర సామగ్రిని నేపాల్కు తరలిస్తున్నారు. కష్టకాలంలో నేపాలీ సోదర, సోదరీమణులకు అండగా ఉంటామని తర్వాత మోదీ ‘ఎక్స్’లో ఒక పోస్ట్పెట్టారు. జాతీయ విపత్తు స్పందన దళం(ఎన్డీఆర్ఎఫ్) బలగాలు సైతం నేపాల్కు తరలివెళ్లే ఆస్కారముంది. అదనపు సాయం కోసం సీ–17 గ్లోబ్మాస్టర్, లాక్హీడ్ సీ–130 రవాణా విమానాలను సిద్ధంగా ఉంచారు. మరోవైపు భారీ సంఖ్యలో భారతీయులు నేపాల్లో గల్లంతుకావడం, వరద ప్రాంతాల్లో చిక్కుకోవడంతో వారిని సురక్షితంగా స్వదేశానికి తీసుకొచ్చేలా చర్యలు చేపట్టాలని మోదీ సర్కార్కు విపక్ష కాంగ్రెస్ సూచించింది.రంగంలోకి నేపాల్ ఆర్మీ... విషయం తెల్సి నేపాల్ సైన్యం, సాయుధ పోలీస్ బలగాలు, నేపాల్ పోలీసులు, జాతీయ విపత్తు స్పందన బలగాలు, అగ్నిమాపక సిబ్బంది, డ్రోన్లు మెరుపు వేగంతో రంగంలోకి దిగి బాధితులను కాపాడేందుకు అన్వేషణ, సహాయక చర్యలను యుద్ధప్రాతిపదికన కొనసాగిస్తున్నాయి. వీళ్లను కాపాడే క్రమంలో ఇప్పటికే 80 మంది భద్రతా బలగాలు, 44 నేపాల్ సైనికులు సైతం గల్లంతైనట్లు నేపాల్ విదేశాంగ మంత్రి శిశిర్ ఖనాల్ ఆ దేశ పార్లమెంట్లో ప్రకటించారు. త్రిశూలి ప్రాంతంలో 80 మందిని ఆర్మీ హెలికాప్టర్లు కాపాడాయి. ఇప్పటిదాకా 300 మందిని కాపాడినట్లు ప్రధాని బాలేంద్ర తెలిపారు. గాయపడిన వారిని సమీప ఎగువ ప్రాంతాల్లోని ఆస్పత్రుల్లో చేరి్పంచి చికిత్స అందిస్తున్నారు. అయితే వరద ప్రభావిత ప్రాంతాలు పర్వతసానువుల వద్ద ఉండటంతో సహాయక చర్యలు క్లిష్టంగా మారాయి. రాసువా ప్రాంతంలో కుంభవృష్టి కారణంగా మెరుపు వరదలు వచ్చాయన్న వార్తల్లో నిజం లేదని మంత్రి శిశిర్ స్పష్టంచేశారు. పరిస్థితిని దేశ ప్రధాని బాలేంద్ర షా ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. -
నేపాల్లో మెరుపు వరద బీభత్సం.. బిహార్ హై అలర్ట్
నేపాల్లోని ఎగువ పరీవాహక ప్రాంతాల్లో సంభవించిన ఆకస్మిక వరదల నేపథ్యంలో బిహార్ ప్రభుత్వం అప్రమత్తమైంది. ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి అత్యవసరం సమావేశం నిర్వహించారు. నేపాల్ నుంచి వరద నీరు వచ్చే ప్రమాదం పొంచి ఉండటంతో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సిద్ధంగా ఉండాలని సీఎం ఆదేశించారు. బిహార్లోని డ్యామ్లు, కరకట్టలపై 24 గంటల నిఘా ఉంచాలని అధికారులను అప్రమత్తం చేశారు.ఈ వరదల కారణంగా గండక్ నదిలో నీటిమట్టం పెరిగే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. పాట్నాలోని సంకల్ప్ ఆడిటోరియంలో జరిగిన ఉన్నతస్థాయి సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. వరద ప్రభావిత ప్రాంతాలు, వరద ముప్పు ఉన్న ప్రాంతాల్లోని జిల్లా అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గండక్ నదికి సంబంధించి ముఖ్యంగా పశ్చిమ చంపారన్, తూర్పు చంపారన్, గోపాల్గంజ్, సారణ్, ముజఫర్పూర్, వైశాలి జిల్లాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆయన ఆదేశించారు.నేపాల్లో మెరుపు వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. 16 మంది మృతి చెందగా.. 36 మంది గాయపడ్డారు. 400 మందికి పైగా టూరిస్టులు గల్లంతయ్యారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. పర్యాటకుల్లో దాదాపు 100 మందికి పైగా భారతీయులు ఉన్నారు. భూకంపంతో మంచు చరియలు విరిగిపడి బోటే కోసి నదిలో వరద ప్రవాహం పెరిగింది. టిబెట్ నుంచి నేపాల్ వైపు సరిహద్దుల గుండా వరద పరుగులు ప్రవహించింది. వరద ప్రవాహం పొంగి పట్టణాలు, గ్రామాలను నది ముంచెత్తింది. సెకండ్ల వ్యవధిలో దూసుకొచ్చిన వరద ప్రవాహంతో జనం కొట్టుకుపోయారు. వరదలకు టిబెట్-నేపాల్ సరిహద్దు రోడ్లు, కమ్యూనికేషన్ వ్యవస్థ దెబ్బతింది.ఇదీ చదవండి: విమానంలో వచ్చి మనిషిని చంపిన దోమ -
నేపాల్లో జల ప్రళయం.. 500 మంది గల్లంతు
కాట్మాండు: నేపాల్ జల ప్రయళం సృష్టించింది. మెరపు వరదలు బీభత్సం సృష్టించాయి. ఫలితంగా వందలాది మంది స్థానికులతో పాటు ఇతర దేశాల పర్యాటకులు వరదల్లో గల్లంతైనట్లు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. రసువా జిల్లాలో భోటేకోషి నదిలో సంభవించిన ఆకస్మిక వరదల నేపథ్యంలో నేపాల్ పర్యాటక బోర్డు అధికారిక ప్రకటన విడుదల చేసింది. ప్రకటనలో బుధవారం ఉదయం 8:30 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రభావిత ప్రాంతాల్లో ఉన్న పర్యాటకుల ఆచూకీ కోసం ట్రావెల్ ఏజెన్సీలు, పర్యాటక పోలీసులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. వివిధ ట్రావెల్ కంపెనీల నుంచి అందిన ప్రాథమిక సమాచారం ప్రకారం మొత్తం 384 మంది ప్రయాణికులు గల్లంతైనట్లు పర్యాటక శాఖ గుర్తించింది. వీరిలో 291 మంది విదేశీయులు కాగా, 93 మంది నేపాల్ జాతీయులు ఉన్నారు. గల్లంతైన విదేశీ పర్యాటకులలో భారతీయులు అధికంగా ఉన్నట్లు సమాచారం. ప్రాథమిక నివేదిక ప్రకారం.. నేపాల్ మెరుపు వరదలు సృష్టించిన బీభత్సంలో మొత్తం 100కి పైగా భారతీయులు ఉన్నట్లు తెలుస్తోంది.ఇక నేపాల్ వరదలతో బిహార్,ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. నేపాల్ త్రిసూలీ పరివాహక ప్రాంతాల్లో హైఅలర్ట్ జారీ చేశాయి. స్థానికుల్ని సురక్షిత ప్రాంతాల వైపు తరలిస్తున్నాయి. టిబెట్ సరిహద్దు ప్రాంతంలో సంభవించిన ఆకస్మిక వరదలు నేపాల్లో తీవ్ర విధ్వంసం సృష్టించాయి. పలు గ్రామాలు, హైడ్రో పవర్ ప్రాజెక్టుల నిర్మాణ ప్రదేశాలు వరద నీటిలో కొట్టుకుపోగా, 28 మంది భద్రతా సిబ్బంది గల్లంతయ్యారు. పెద్ద ఎత్తున ప్రాణ, ఆస్తి నష్టం సంభవించి ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు. నదీ తీర ప్రాంతాల ప్రజలు వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని విజ్ఞప్తి చేశారు.రసువా పర్వత జిల్లా పరిధిలోని శ్యాప్రు బేసి, తిమురే ప్రాంతాలు వరద ధాటికి తీవ్రంగా ప్రభావితమయ్యాయి. భోటే కోశి నదీ పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. గ్రామాలు, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు కొట్టుకుపోయినట్లు ప్రాథమిక సమాచారం ఉందని, నష్టం తీవ్రతపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని జిల్లా అధికారి నరేంద్ర పరియార్ పేర్కొన్నారు.ఈ విపత్తుపై ప్రధాని బాలేంద్ర షా స్పందిస్తూ.. సహాయక చర్యల్లో పోలీస్, సైనిక బలగాలను రంగంలోకి దించినట్లు వెల్లడించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులను ఆదేశించారు. కాగా, గల్లంతైన 28 మంది భద్రతా సిబ్బందిలో 19 మంది నేపాల్ పోలీస్ విభాగానికి, తొమ్మిది మంది ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ (ఏపీఎఫ్)కు చెందినవారు ఉన్నారు. రసువాగఢీ పోలీస్ పోస్టులోని 22 మందిలో 13 మంది ఆచూకీ లభించలేదు. శ్యాబ్రూబేసి ప్రాంతంలో ఆరుగురు పోలీసులు, తిమురే సరిహద్దు అవుట్పోస్ట్లోని 9 మంది ఏపీఎఫ్ జవాన్లు ఇంకా సంప్రదింపులకు అందలేదు. టిబెట్ నుంచి ఉద్భవించే భోటే కోశి నది నేపాల్లోని త్రిశూలి నదిలో కలిసి, అనంతరం భారత్లోకి గండక్ నదిగా ప్రవహిస్తుంది. సరిహద్దుల్లో వరద ఉధృతి నేపథ్యంలో అధికార యంత్రాంగం రక్షణ చర్యలను ముమ్మరం చేసింది.ఇది కూడా చదవండి: ‘వాళ్లు బెస్ట్ సీఎంలా?’.. సీజేపీ చీఫ్పై పూనావాలా ఆగ్రహం


