-
మా ఇల్లు ఇండియా
-
పెట్టిన డబ్బుకు పదింతల వేల్యూ ఉన్న సినిమా
‘‘రోజూ 5 సినిమాలు చూసి నిద్రపోతాను. ఈ సినిమా చూసి చాలా స్ఫూర్తి పొందాను. ఇలాంటి కథను అల్లు అర్జున్గారు ఐడెంటిఫై చేశారు. అన్ ఇమాజినబుల్. ట్రైలర్, పోస్టర్లతో ఇంపాక్ట్ ఇచ్చాం. ఫైనల్గా సినిమాతో చాలా మంచి ఇంపాక్ట్ ఇచ్చాం. మలయాళ, తమిళ ప్రేక్షకులను కూడా బాగా ఆకట్టుకుంటోంది’’ అన్నారు నిర్మాత లగడపాటి శ్రీధర్. అల్లు అర్జున్, అనూ ఇమ్మాన్యూయేల్ జంటగా వక్కంతం వంశీ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘నా పేరు సూర్య–నా ఇల్లు ఇండియా’. నాగబాబు సమర్పణలో రామలక్ష్మీ సినీ క్రియేషన్స్ పతాకంపై లగడపాటి శిరీషా శ్రీధర్ నిర్మించారు. ‘బన్నీ’ వాసు సహ నిర్మాత. ఈ చిత్రం శుక్రవారం రిలీజ్ అయింది. ఈ సందర్భంగా శిరీషా శ్రీధర్ సినిమా విశేషాలు పంచుకున్నారు. శ్రీధర్ మాట్లాడుతూ – ‘‘కథ విన్నప్పుడు, ప్రొడక్షన్ చేస్తున్నప్పుడు హిట్ మూవీ అనుకునే చేశా. నా కన్నా ముందు ఆడియన్స్ చూడాలనుకున్నా. అభిమానులు సినిమా గురించి గొప్పగా చెబుతుంటే వెళ్లి చూశా. అన్బిలీవబుల్. ఈ కలియుగంలో దశాబ్దానికో మంచి కథ వస్తుంది. ఈ కథ అలాంటిదే. ఇల్లు శుభ్రం చేసినా, స్నానం చే సినా ఎంత శుభ్రంగా ఉంటుందో ఈ సినిమా చూసినప్పుడు మనసు అంత ప్రశాంతంగా అనిపిస్తుంది. పెట్టిన డబ్బుకు పదింతల వేల్యూ ఉన్న సినిమా ఇది. అల్లు అర్జున్గారి యాక్టింగ్కు తిరుగులేదు. ఈ సినిమా ఓ పేజీ కాదు మంచి పుస్తకం. మంచి విషయాన్ని పూసగుచ్చినట్టు చెప్పారు వక్కంతం వంశీ. మొదటిరోజు 45కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ‘బాహుబలి’ వేసిన పాత్లో మేమూ నడుస్తున్నాం. సోమవారం నుంచి సక్సెస్ టూర్ స్టార్ట్ చేస్తాం’’ అన్నారు. ‘‘పర్ఫెక్ట్ మూవీ అందించినందుకు గర్వంగా ఉంది. వర్క్ అంటే కమిట్మెంట్ ఉన్న సూపర్ స్టార్తో వర్క్ చేయడం ఆనందంగా ఉంది. దేశభక్తి సబ్జెక్ట్ను ఎంటర్టైనింగ్గా చెబితే ఎవ్వరైనా యాక్సెప్ట్ చేస్తారని నిరూపించింది ఈ సినిమా. ఓ స్టార్ హీరో రోల్ గురించి, ఫ్యాన్స్ గురించి ఆలోచించకుండా కథను నమ్మినప్పుడు ఇలాంటి సినిమాలు వస్తాయి. వంశీ యూనిక్ పాయింట్తో వచ్చారు. యూత్ అంతా బాగా కనెక్ట్ అవుతున్నారు’’ అన్నారు నిర్మాత శిరీషా. -
అందుకు బాధపడుతున్నా..!
‘‘సినిమా నిర్మాణానికి దూరంగా ఉంటున్న టైమ్లో అరవింద్గారు ‘నువ్వు నిర్మాతగా మళ్లీ సినిమా చేయాలి’ అన్నారు. నాకు అవసరమా అనిపించింది. బన్నీ కూడా ‘మీరు సినిమా చేయాలి’ అని అడగ్గానే ఆలోచించా. లగడపాటి శ్రీధర్గారితో ఇదివరకే వర్క్ చేశాను. అప్పటికే బన్నీ సినిమాకు కావల్సినవన్నీ రెడీ చేసుకున్నారు. సో.. నా పని తేలికైపోయింది. మళ్లీ సినిమాలు చేయాలనే ధైర్యం ఇచ్చింది మాత్రం అరవింద్గారే’’ అన్నారు నాగబాబు. అల్లు అర్జున్, అన్యూ ఇమ్మాన్యుయేల్ జంటగా వక్కంతం వంశీ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘నా పేరు సూర్య–నా ఇల్లు ఇండియా’. నాగబాబు సమర్పణలో లగడపాటి శిరీషా శ్రీధర్ నిర్మించారు. ‘బన్నీ’వాసు సహనిర్మాత. ఈ చిత్రం మే 4న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా నాగబాబు చెప్పిన విశేషాలు. ∙‘ఆరెంజ్’ సినిమాతో నిర్మాతగా వచ్చిన నష్టం కంటే చరణ్కు హిట్ ఇవ్వలేకపోయానని ఎక్కువగా బాధపడ్డాను. ‘మగధీర’ వంటి సూపర్ హిట్ తర్వాత హిట్ ఇవ్వలేదని ఫిల్మ్ మేకర్గా అన్ఫిట్ అని ఫీల్ అయ్యాను. అందుకే నిర్మాణానికి దూరంగా ఉండి సీరియల్స్, షోస్ చేస్తున్నాను. కొన్నిసార్లు అనిపిస్తుంది. ‘ఆరెంజ్’ ఇప్పుడు రిలీజ్ అయ్యుంటే హిట్ అయ్యేదేమో అని. ∙‘నా పేరు సూర్య – నా ఇల్లు ఇండియా’లో బన్నీ ఆర్మీ ఆఫీసర్గా కనిపిస్తాడు. ఫుల్ సీరియస్గా, నిబద్ధతతో ఉండే పాత్ర. తన సీరియస్నెస్ వల్ల కుడా కొంచెం కామెడీ క్రియేట్ అవుతుంది. దాసరిగారి దగ్గర దర్శకుడు వంశీ పనిచేసినప్పటినుంచి తెలుసు. మంచి ఎమోషన్స్తో ప్రేక్షకులకు సినిమాని కనెక్ట్ చేయించగలడు. తన తదుపరి సినిమా కూడా మా కాంపౌండ్లోనే ఉంటుంది. స్టార్ హీరోల సినిమాలు ప్లాన్ ప్రకారం జరుగుతుంటాయి. అప్పుడప్పుడు మాత్రమే నేను సెట్స్కి వెళ్లాను. అంతా ‘బన్నీ’వాసు చూసుకున్నాడు. సినిమా రిలీజ్ కాకముందే నెగటివ్ టాక్ ప్రచారం చేయడం బాధగా అనిపించింది. అరవింద్గారు, నేను బాగా హర్ట్ అయ్యాం. ∙నా కెరీర్లో ఇది బెస్ట్ ఫేజ్ అనొచ్చు. మా అబ్బాయి వరుణ్ సక్సెస్లో ఉన్నాడు. నిహారిక మంచి రోల్స్తో కెరీర్ ప్లాన్ చేసుకుంటోంది. నేను ‘జబర్దస్త్’ షో జడ్జిగా బిజీగా ఉన్నా. ఈ ఫేజ్ ఇలానే ఉండాలనుకుంటున్నా. వరుణ్తో సినిమా ప్లాన్ చేయలేదు. ఫ్యూచర్లో వాడితో సిని మా చేయొచ్చేమో. వరుణ్ ఇమేజ్ను క్యాష్ చేసుకోవాలనుకోవడం లేదు. వరుణ్ బయట ప్రొడ్యూసర్స్కి అందుబాటులో ఉండాలి. వరుణ్తో కలిసి యాక్ట్ చేయడం గురించి నిర్ణయించుకోలేదు. ∙రిలీజ్ అయిన మూడు వారాలకే సినిమా డిజిటల్ ఫ్లాట్ఫార్మ్స్లో రావడం వల్ల సినిమాకు ఇబ్బంది ఉండదు. మూడు వారాలకు ఆడియన్స్ అందరూ సినిమా చూసేస్తారు. ప్రస్తుతం సినిమాలకు త్రీ వీక్స్ మించి లైఫ్ ఉండటంలేదు కూడా. ∙ఇండస్ట్రీ న్యూస్ చానెల్స్ని బంద్ చేస్తోంది అని వినపడుతోంది. ఆ ఆలోచన మాకు లేదు. ఇండస్ట్రీకు ఎలాంటి మంచి పనులు చేయాలని డిస్కస్ చేసుకున్నాం. మా ఫ్యాన్స్ను అనవసరమైన విషయాల మీద రియాక్ట్ అవ్వొద్దని చెబుతున్నాం. ప్రతి ఒక్కరు పబ్లిసిటీ కోసం వాగి, ఆ తర్వాత మీ ఫ్యాన్స్ని కంట్రోల్ చేసుకొమ్మని సలహా ఇస్తున్నారు. అది ఎంతవరకు సమంజసమో వాళ్లకే తెలియాలి. ∙ఎన్టీఆర్–త్రివిక్రమ్ సినిమాల్లో ఓ కీ రోల్ చేస్తున్నా. విజయ్ దేవరకొండ హీరోగా పరుశురామ్ తీస్తున్న సినిమాలో కుడా యాక్ట్ చేస్తున్నాను. -
మీరు బ్రతకండి.. మమ్మల్ని బ్రతకనివ్వండి
‘‘చిరుత’ ఇంకా రిలీజ్ అవ్వలేదు. డాడీ బన్నీని పిలిచి అన్నారు. ‘రేయ్ మన ఫ్యామిలీకి డ్యాన్స్ వచ్చు అని ఒక పేరు ఉంది. చిన్నప్పటినుంచి నుంచి వీడు ఎక్కడా డ్యాన్స్ చేయలేదు. వీడికి డ్యాన్స్ చేయడం వచ్చా? లేక మన పరువు తీస్తాడా?’ అని అడిగారు. ‘నువ్వు మర్చిపో మామా. ధైర్యంగా ఉండు. నాకు ప్రైవేట్గా తెలుసు’ అని మా నాన్నకు నమ్మకం ఇచ్చాడు బన్నీ. అప్పటి నుంచి డాడీ నన్ను తిట్టడం మానేశారు’’ అన్నారు రామ్ చరణ్. అల్లు అర్జున్, అన్యూ ఇమ్మాన్యుయేల్ జంటగా వక్కంతం వంశీ దర్శకత్వం వహించిన చిత్రం ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’. నాగబాబు సమర్పణలో లగడపాటి శిరీషా శ్రీధర్ నిర్మించారు. ‘బన్నీ’ వాసు సహనిర్మాత. విశాల్శేఖర్ పాటలు స్వరపరిచారు. సినిమా మే 4న రిలీజ్ కానుంది. ఈ చిత్రం ప్రీరిలీజ్ వేడుకకు ముఖ్య అతిథిగా విచ్చేసిన రామ్ చరణ్ మాట్లాడుతూ ‘‘సినిమాల్లోకి రాకముందు బర్త్డే పార్టీల్లో నేనెక్కువ డ్యాన్స్ చేసేవాణ్ణి కాదు. మా డాడీ తిట్టేవారు. బన్నీ డ్యాన్స్ చూసి నేర్చుకోరా అని. బన్నీలో ఒక కసి ఉంటుంది. తను చేసిన గోన గన్నారెడ్డి చిన్న క్యారెక్టర్. తక్కువ సమయం అయినా ఎన్ని అవార్డ్స్ కొట్టాడో మీరే చూశారు. అదే గోన గన్నారెడ్డి రెండున్నర గంటలు ఉంటే ఎలా ఉంటుందో ఈ సినిమాలో చూస్తారు. దానికి ఇంకా ఎన్ని అవార్డ్స్, ఎంత మెప్పు పొందుతాడా అని ఎదురు చూస్తున్నాను. లాస్ట్ రెండేళ్లుగా క్రిటికల్ అప్రిషియేషన్ వచ్చిన సినిమాలు సూపర్ హిట్స్ అయ్యాయి. నా ‘రంగస్థలం’ కూడా. మన ఇండస్ట్రీ ప్రౌడ్ మూమెంట్లో ఉంది. దానికి మరో ఎగ్జాంపుల్ ‘నా పేరు సూర్య’ అవ్వాలి. నా ‘ఎవడు’ సినిమాకు రాసిన వంశీ ఈ సినిమా డైరెక్టర్. తన రైటింగ్ చాలా స్టైలిష్గా ఉంటుంది. ఈ సినిమా చూస్తుంటే ఇన్స్పైరింగ్ కాన్సెప్ట్లా ఉంది. నా బ్రదర్ బన్నీ చేసిన ఈ ఆర్మీ సినిమా సూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. మనకున్న హానెస్ట్ దర్శకుల్లో వంశీ ఉండాలని కోరుకుంటున్నాను. మామ (అల్లు అరవింద్) ఏదో ఒక కాంట్రవర్శీ లేకుండా మాట్లాడడు. కానీ ఆయన పెయిన్ని నేను అర్థం చేసుకోగలను. అవినీతి లేని ఇండస్ట్రీ ఏదైనా ఉందంటే అది ఫిల్మ్ ఇండస్ట్రీయే. ఇక్కడ అందరం కష్టపడతాం. యాక్టర్స్ ఉదయాన్నే లేస్తాం. జిమ్కి వెళ్తాం. మేకప్ వేసుకొని ఎండల్లో వానల్లో షూటింగ్ చేస్తాం. బన్నీకి ఎన్నో దెబ్బలున్నాయి. డ్యాన్స్, ఫైట్స్లో దెబ్బలు తగులుతుంటాయి. మహేశ్, తారక్, ప్రభాస్... మా అందరికీ దెబ్బలు తగులుతుంటాయి. ప్రభాస్కి రెండు సార్లు భుజానికి సర్జరీ అయింది. మా నాన్నగారికి, బాలకృష్ణగారికి కూడా భుజానికి సర్జరీ జరిగింది. ఒళ్లు హూనం చేసుకుంటాం. ఇందులో అవినీతి ఎక్కడైనా కనిపిస్తుందా? మీడియా కొన్నిసార్లు ఇష్టం వచ్చినట్టుగా రాస్తోంది. లాస్ట్ రెండు నెలలుగా జరిగిన వాటిని చూసినవాళ్లు ఎంటర్టైన్మెంట్గా తీసుకుంటారే తప్ప ఎవ్వరూ గుర్తుపెట్టుకోరు, నమ్మరు. మీరు (మీడియా) మాకు బిగ్గెస్ట్ సపోర్ట్ట్గా ఉండాలని కోరుకుంటున్నాం. మీరు బ్రతకండి హ్యాపీగా, మమ్మల్ని బ్రతకనివ్వండి హ్యాపీగా’’ అన్నారు. అల్లు అర్జున్ మాట్లాడుతూ ‘‘ఇండియన్ ఆర్మీకి థ్యాంక్స్. మీరు లేకపోతే ఈ స్థాయిలో మేము సినిమా తీసేవాళ్లం కాదు. ఈ కథను నా దగ్గరకు తీసుకొచ్చిన నల్లమలుపు బుజ్జిగారికి థ్యాంక్స్. ఒక స్టార్ డైరెక్టర్కు ఎంత ఖర్చుపెడతారో ఒక దర్శకుడు పరిచయం అవుతున్న ఈ సినిమాకు అంతే ఖర్చుపెట్టారు శ్రీధర్గారు. నాకు నచ్చిన వ్యక్తి నాగబాబుగారికి సినిమా చేసే స్థాయిని ప్రేక్షకులు నాకు ఇచ్చినందుకు థ్యాంక్స్. ఈ సినిమా సహనిర్మాత ‘బన్నీ’ వాసుకు థ్యాంక్స్. రేపు సినిమా సక్సెస్ అయితే.. వంద కారణాలు ఉంటే అవన్నీ డైరెక్టర్గారే. నేను చేసిందల్లా ఆయన్ను నమ్మడమే. ‘రంగస్థలం’ సినిమాతో ఈ స్థలం నాది అని ప్రూవ్ చేశావ్ చరణ్. అలాగే ‘భరత్ అనే నేను’ సక్సెస్ఫుల్గా రన్ అవుతోంది. అలాగే ‘నా పేరు సూర్య...’తో ఈ సమ్మర్ ఒక హ్యాట్రిక్ అవ్వాలని కోరుకుంటున్నాను’’ అన్నారు.‘‘కథ విన్నప్పటి నుంచి వంశీ మీద కాన్ఫిడెంట్గా ఉన్నాడు బన్నీ. ఈ మధ్య ఇండస్ట్రీలో మనసు కలిచి వేసే సంఘటనలు జరిగాయి. దానికి సంబంధించి కొన్ని నిర్ణయాలు తీసుకోవల్సి వచ్చింది. ఆ నిర్ణయాల వల్ల కొంతమంది ఈ సినిమాను తప్పుదోవ పట్టించడానికో, క్రిటిసైజ్ చేయడానికో ప్రయత్నం చేస్తారు. ఆ ప్రయత్నాన్ని దాటగలిగినవారు మీరే (ప్రేక్షకులు) ఈ స్క్రీన్ వెనకాలే కొన్ని సంఘటనలు జరిగాయి. ఒక స్టాండ్ తీసుకోవల్సి వచ్చింది. ఆ స్టాండ్ తీసుకోవడానికి నమ్మకం మీరందరు (ప్రేక్షకులు). సినిమా రషెస్ చుశాక అర్థం అయ్యింది. ఈ సినిమాలోని పాత్ర అర్జున్నే చేయాలని. నా మేనల్లుడు, నా కొడుకు ఫంక్షన్కు రావడం ఆనందంగా ఉంది’’ అన్నారు నిర్మాత అల్లు అరవింద్. ‘‘శ్రీధర్గారితో కలిసి ఈ సినిమా చేయి అని చేయించిన అరవింద్గారికి థ్యాంక్స్’’ అన్నారు నాగబాబు. ‘‘సినిమాల్లోకి వెళ్తా అంటే ఎవ్వరూ ప్రొత్సహించరు. కానీ మా ఇంట్లో ప్రోత్సహించారు. ఈరోజు నేనిలా నిలబడటానికి మా అమ్మగారు, నా భార్యే కారణం. పర్సనల్గా ఆర్మీ గురించి ఎప్పుడూ ఆలోచిస్తుంటా. బన్నీ ద్వారా వాళ్ల మీద సినిమా తీసే చాన్స్ వచ్చింది. ఇంత మంచి సినిమా ఇచ్చిన హీరో అల్లు అర్జున్, డైరెక్టర్ వక్కంతం వంశీలకు రుణపడి ఉంటాను. సినిమాకు కెప్టెన్ ఆఫ్ ది షిప్ బన్నీ. కొత్త డైరెక్టర్తో 100కోట్లు రిస్క్ చేయడం మామూలు విషయం కాదు’’ అన్నారు నిర్మాత శ్రీధర్. ‘‘ప్రతి సినిమాకు డబ్బు, పేరు వస్తుంది కానీ ఈ సినిమా ద్వారా గౌరవం కూడా వస్తుంది అనుకుంటున్నాను’’అన్నారు సహనిర్మాత ‘బన్నీ’ వాసు. ‘‘సినిమా డైరెక్టర్ ఎప్పుడవుతావురా? అన్న మా అమ్మానాన్నలు ఇక్కడ ఉన్నారు. అయ్యానమ్మా. సినిమా ఇండస్ట్రీకి నన్ను పరిచయం చేసిన దర్శకరత్న దాసరి నారాయణరావుగారికి కృతజ్ఙతలు. ఆయన లేరు. ఈ బాధలో కూడా ఆనందం ఏంటంటే.. ఆయన పుట్టినరోజు నాడు ఈ సినిమా రిలీజ్ అవుతుంది. మంచి సినిమా తీశాను అన్న తృప్తితోనే ఈ ఫంక్షన్లో నిల్చున్నాను’’ అన్నారు. ఈ వేడుకలో చిత్రబృందం పాల్గొన్నారు. -
ఇండస్ట్రీలో బెంచ్మార్క్గా నిలుస్తుంది
ఈ నెల 29న జరగనున్న మా ‘నా పేరు సూర్య–నా ఇల్లు ఇండియా’ ప్రీ–రిలీజ్ ఫంక్షన్కు ముఖ్య అతిథిగా రామ్చరణ్ రానుండటం ఆనందంగా ఉంది. ఈ ఫంక్షన్ను బిగ్ రేంజ్లో ప్లాన్ చేశాం. ఇటీవల జరిగిన ఆడియో ఫంక్షన్కు చిరంజీవిగారిని ఆహ్వానించాలని వెళ్లి కలిశాను. ‘‘సినిమా గురించి, బన్నీ కష్టం గురించి విన్నాను. బట్.. ఆడియో ఫంక్షన్కు రాలేను. అమెరికా వెళ్తున్నాను’’ అన్నారు. సినిమాకు మీ ఆశీర్వాదం కావాలి సర్ అంటే.. సెట్స్కు వచ్చారు చిరంజీవిగారు. టీమ్ అంతా హ్యాపీ ఫీలయ్యాం. ఆడియో ఫంక్షన్కు రాలేకపోతున్నానని ఆయన ఫీలయ్యారు’’ అన్నారు. ‘‘దేశం మనకేం చేసింది అన్నది కాదు.. దేశానికి మనం ఏం చేశాం అన్నది ముఖ్యం అనే పాయింట్తో ‘నా పేరు సూర్య– నా ఇల్లు ఇండియా’ ఉంటుంది. దేశానికి సేవ చేయాలనుకునే హీరోకి ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయనేది సినిమాలో ఆసక్తికరం. దేశానికి సేవ చేస్తే ఎలాంటి సంతృప్తి కలుగుతుంది అన్న విషయం ప్రేక్షకులకు అర్థం అవుతుంది. ‘రంగస్థలం, భరత్ అనే నేను’ సినిమాల రేంజ్లో మా సినిమా కూడా ఉంటుందని నా నమ్మకం’’ అన్నారు నిర్మాత లగడపాటి శ్రీధర్. అల్లు అర్జున్, అనూ ఇమ్మాన్యుయేల్ జంటగా కె. నాగబాబు సమర్పణలో రామలక్ష్మి సినీ క్రియేషన్స్ పతాకంపై లగడపాటి శిరీషా శ్రీధర్ నిర్మించిన చిత్రం ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’. ‘బన్నీ’ వాసు సహ నిర్మాత. మే 4న ఈ సినిమా రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా లగడపాటి మాట్లాడుతూ– ‘‘పదేళ్ల క్రితం మీతో సినిమా చేస్తానని బన్నీ (అల్లు అర్జున్) మాటిచ్చాడు. ఇప్పుడు ఇంత స్టార్డమ్ ఉన్నప్పుడు పిలిచి సినిమా చేశాడు. ఈ సినిమాలోని సూర్య క్యారెక్టర్ అల్లు అర్జున్కే సూట్ అవుతుంది. ఇండస్ట్రీలో ఈ సినిమా బెంచ్మార్క్గా నిలుస్తుందన్న నమ్మకం ఉంది. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో రిలీజ్ చేయాలనుకుంటున్నాం. హిందీలో డబ్ చేసే ఆలోచన ఉంది. నాగబాబుగారు బాగా çసహకరించారు. బన్నీ సినిమా కోసం ఎంతో కష్టపడ్డాడు. ఒకడు మారాడు అనే కంటే ఎలా మారాడు? అన్న విషయాన్ని ప్రేక్షకులు బాగా ఇంట్రెస్ట్గా చూస్తారు. దేశానికి మనం ఏం చేస్తే బాగుంటుంది అని కల కనే యువకుడి కథ ఇది. టైటిల్లోనే ‘నా ఇల్లు ఇండియా’ అనే మాట వాడాం అంటే సినిమా స్పాన్ను అర్థం చేసుకోవచ్చు. థియేటర్స్లో ప్రేక్షకులకు మంచి అనుభూతి కలుగుతుంది. ఈ సినిమాకు మ్యూజిక్ బిగ్ ఎస్సెట్ అవుతుంది. ముఖ్యంగా ‘లవర్ ఆల్సో.. ఫైటర్ ఆల్సో..’ సాంగ్ హాలీవుడ్ రేంజ్లో ఉంటుంది. ‘ఇరగ.. ఇరగ..’ సాంగ్కు కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్ మంచి స్టెప్స్ ఇచ్చారు. బన్నీ ఇరగదీశాడు. అనూ ఇమ్మాన్యుయేల్ బాగా నటించింది. డ్యాన్స్ కూడా అదరగొట్టింది. విశాల్–శేఖర్ మంచి సంగీతం ఇచ్చారు. సినిమా బాగా రావడంలో సహనిర్మాత ‘బన్నీ’ వాసు పాత్ర ఉంది. ప్రొడక్షన్ వైపు చాలా కష్టపడ్డారు. వరుసగా టాప్ హీరోలతో సినిమాలు చేయాలని ప్రయత్నిస్తున్నాను. మా అబ్బాయి (విక్రమ్) హీరోగా కష్టపడి పైకి రావాలనుకుంటున్నాను. ‘ఎవడి గోల వాడిది 2’ చేయాలని ఉంది. ‘స్టైల్ 2’ కథ చేయాలనుకుంటున్నాను. తమిళ సినిమా ‘గోలీసోడా’ని ‘ఎవడూ తక్కువ కాదు’ పేరుతో రిలీజ్ చేద్దాం అనుకుంటున్నాం’’ అన్నారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
బాహుబలి కేవలం 10 కోట్ల మంది మాత్రమే: రాజమౌళి కామెంట్స్
బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
తెలంగాణను అసమర్థులు ఏలుతున్నారు: కేసీఆర్
క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
నెల ముందే ప్రమోషన్.. ఇప్పుడు జాబ్ పోయింది: అగ్రరాజ్యంలో టెకీ ఆవేదన
జేక్ ఫ్రేజర్ విధ్వంసం.. కేవలం 19 బంతుల్లోనే! వీడియో వైరల్
ల్యాండ్ టైట్లింగ్ చట్టం సమగ్ర స్వరూపం ఇదే..
25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
ఈహెచ్టీని ఢీ కొట్టిన లారీ
తప్పక చదవండి
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement