-
పేదల మీద చంద్రబాబు శాడిజం..
-
అనిల్ లా ప్రతి ఎమ్మెల్యే ఉంటే... సీఎం జగన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
-
కూచిపూడి నాట్యాన్ని.. విశ్వవ్యాప్తం చేసిన మహనీయులు - 'పద్మభూషణ్ డాక్టర్ వెంపటి చిన సత్యం'
సాక్షి, పత్రికా ప్రకటన: మచిలీపట్నం అక్టోబర్ 15: పద్మభూషణ్ డాక్టర్ వెంపటి చిన సత్యం కూచిపూడి నాట్య సాంప్రదాయ పరిరక్షణకి, పునరుద్ధరణకి, ప్రాచుర్యానికి ఎంతో కృషి చేశారని మంత్రి రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, యువజన అభ్యుదయ శాఖ మంత్రివర్యులు జిల్లా ఇన్చార్జి మంత్రివర్యులు ఆర్కే రోజా కొనియాడారు. ఆదివారం కృష్ణాజిల్లా మొవ్వ మండలం కూచిపూడి గ్రామంలోని శ్రీ సిద్ధేంద్ర యోగి కళాక్షేత్రంలో రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ, జిల్లా యంత్రాంగం, సేవ్ కూచిపూడి ఆర్టిస్ట్, కూచిపూడి అకాడమీ చెన్నై, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, జయహో భారతీయం సంయుక్త ఆధ్వర్యంలో పద్మభూషణ్ అవార్డు గ్రహీత డాక్టర్ వెంపటి చిన సత్యం గారి జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను ఎంతగానో ఆలరించాయి. ముఖ్యంగా అక్షర, ఇమాంసి, అన్షికలు టెంపుల్ నృత్యం, కూచిపూడి ఆర్ట్ అకాడమీ ఆధ్వర్యంలో డాక్టర్ వెంపటి చినసత్యం మనవరాలు కామేశ్వరి బృందం చెన్నై వారి ఆధ్వర్యంలో మహిషాసుర మర్దిని నృత్యం ఎంతో అద్భుతంగా కమనీయంగా ప్రదర్శించారు. అలాగే నాలుగవ ప్రపంచ కూచిపూడి దినోత్సవం సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వెయ్యి మంది విద్యార్థులు డాక్టర్ వెంపటి చిన సత్యం రూపొందించిన బ్రహ్మాంజలి మహా బృంద నృత్యం ఆహుతులను మంత్రముగ్ధుల్ని చేసింది. తొలుత ఇంచార్జి మంత్రివర్యులు వేడుకలలో ముఖ్యఅతిథిగా పాల్గొని శ్రీ సిద్ధేంద్ర యోగి కళాక్షేత్రం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన డాక్టర్ వెంపటి చినసత్యం జీవిత విశేషాలను తెలిపే చిత్ర ప్రదర్శనను ప్రారంభించారు అనంతరం జ్యోతి ప్రకాశనం చేసి డాక్టర్ వెంపటి చినసత్యం వేడుకలను ప్రారంభించారు. అనంతరం రాష్ట్ర సృజనాత్మకత సాంస్కృతిక సమితి సీఈవో ఆర్ మల్లికార్జున రావు రూపొందించిన డాక్టర్ వెంపటి చినసత్యం చిత్రపటాన్ని మంత్రులు ఆవిష్కరించి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మంత్రివర్యులు ఆర్కే రోజా మాట్లాడుతూ మన సంస్కృతి, కళలను సాంప్రదాయాలను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.. డాక్టర్ వెంపటి చినసత్యం కూచిపూడి నాట్యాన్ని విశ్వవ్యాప్తం చేసిన మహనీయులని అన్నారు. ఈ వేడుకలతో కూచిపూడి ప్రాంతమంతా అంగరంగ వైభవంతో పండుగ వాతావరణం నెలకొంది అన్నారు. డాక్టర్ వెంపటి చినసత్యం కూచిపూడి గ్రామంలో పుట్టి ఆ గ్రామానికి పరిమితం కాకుండా కూచిపూడి నృత్యాన్ని ప్రపంచంలో మారుమోగేలా కృషి చేశారన్నారు. ఏ రాష్ట్రానికి వెళ్లిన, ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా ఏ కార్యక్రమంలోనైనా మొదట తెలుగు నేలను తెలుగు ఖ్యాతిని ప్రతిబింబించే విధంగా కూచిపూడి నృత్యంతో ప్రారంభిస్తారన్నారు. డాక్టర్ వెంపటి చిన సత్యం మరణించి 13 సంవత్సరాల అయినప్పటికీ వారి శిష్యులు ప్రదర్శించే హావభావాలు,, నృత్యంలో సజీవమై కనిపిస్తున్నారన్నారు. సినిమా పరిశ్రమలో కూడా వైజయంతి మాల, హేమమాలిని, జయలలిత, ప్రభ ,చంద్రకళ, మంజు భార్గవి వంటి ఎందరో నటీమణులు వారి వద్ద శిష్యరికం చేశారన్నారు. 2011లో 1800 మంది చిన్నారులతో ప్రదర్శించిన కూచిపూడి నృత్యం గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో నమోదయిందన్నారు.. తల్లిదండ్రులు తమ ఆడపిల్లలను కూచిపూడి నృత్యం నేర్చుకునేందుకు ప్రోత్సహించాలని తద్వారా వారికి వ్యాయామంతో పాటు ఆరోగ్యం కూడా పొందవచ్చు అన్నారు మంత్రి జోగి రమేష్ మాట్లాడుతూ డాక్టర్ వెంపటి చినసత్యం కూచిపూడి గ్రామంలో పుట్టి కూచిపూడి నాట్యాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన మహనీయులని ప్రశంసించారు. గతంలో విజయవాడ చెన్నై లో జరిగే వారి జయంతి వేడుకలను మంత్రి ఆర్కే రోజా చొరవతో ఈరోజు వారు జన్మించిన కూచిపూడి గ్రామంలోనే జరుపుకోవడం ఎంతో గొప్ప విషయం అన్నారు. కూచిపూడి నృత్యం వంటి కళారూపాలను మరిచిపోతున్న తరుణంలో డాక్టర్ వెంపటి చినసత్యం వారి శిష్య బృందం ప్రపంచవ్యాప్తంగా కూచిపూడి నృత్యానికి ప్రాచుర్యం కల్పిస్తూ ఆరాధిస్తుండడం వారిని వారి తల్లిదండ్రులు ప్రోత్సహించడం అభినందనీయమన్నారు. జిల్లా కలెక్టర్ పి రాజాబాబు మాట్లాడుతూ ప్రతి రాష్ట్రానికి ఏదో ఒక కళారూపం ముఖ్యంగా చెప్పుకుంటున్నామని, ఆ ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూచిపూడి నృత్యం, ఒరిస్సాకు ఒడిస్సి, ఉత్తరప్రదేశ్ కు కథాకళి, కేరళ కు మోహిని అట్టం వంటి కళారూపాలు ఎంతగానో ప్రాముఖ్యత సంతరించుకున్నాయన్నారు. మరుగున పడిపోతున్న కూచిపూడి నృత్యానికి డాక్టర్ వెంపటి చిన సత్యం జీవం పోసి విశ్వవ్యాప్త ప్రాచుర్యానికి ఎంతగానో కృషి చేశారన్నారు. వివిధ ప్రాంతాల్లోని నాట్యాచారులను, విద్యార్థులను ఒక చోట చేర్చి ఇలాంటి పెద్దయెత్తున వేడుకలు నిర్వహించడం గొప్ప విషయం అన్నారు. పామర్రు శాసనసభ్యులు కైలే అనిల్ కుమార్ మాట్లాడుతూ తాను ప్రాతినిధ్యం వహించే నియోజకవర్గం పరిధిలో మహానుభావులు డాక్టర్ వెంపటి చినసత్యం జన్మించిన కూచిపూడి గ్రామం ఉండటం వారి ద్వారా కూచిపూడి నృత్యం ప్రపంచానికి పరిచయం కావడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. అలాగే మన జాతీయ పతాకం రూపకర్త పింగళి వెంకయ్య గారు జన్మించిన ప్రాంతం బాట్ల పెనుమర్రు కూడా తన పరిధిలోనే ఉండటం సంతోషకర విషయం అన్నారు. శ్రీ సిద్ధేంద్ర యోగి కళాశాలను అన్ని విధాల అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రిని, మంత్రిని కోరుతున్నానన్నారు. రాష్ట్రంలో రెండు కళాశాలలు ఉన్నాయని తెలుగు విశ్వవిద్యాలయ ప్రాంగణాన్ని కూచిపూడి లో ఏర్పాటు చేయాలని కోరారు. ఈ సందర్భంగా ప్రముఖ నర్తకి కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డు గ్రహీత మంజు భార్గవికి డాక్టర్ వెంపటి చినసత్యం జయంతి పురస్కారాన్ని, రాష్ట్ర ప్రభుత్వం తరఫున రెండు లక్షల రూపాయల నగదు బహుమతిని మంత్రులు అతిథులు అందజేసి ఘనంగా సత్కరించారు. డాక్టర్ వెంపటి చినసత్యం జీవిత విశేషాలను తెలియజేసే పుస్తకాన్ని ఈ సందర్భంగా మంత్రులు అతిథులు ఆవిష్కరించారు. అలాగే శ్రీ సిద్ధేంద్ర యోగి కళాక్షేత్రం కూచిపూడి ప్రధానాచార్యులు కేంద్ర సంగీత నృత్య అకాడమీ అవార్డు గ్రహీత డాక్టర్ వేదాంతం రామలింగ శాస్త్రి గారికి సిద్ధేంద్ర యోగి పురస్కారం, నాట్యాచార్యులు మాధవ పెద్ది మూర్తికి వెంపటి చినసత్యం జీవిత సాఫల్య పురస్కారం, వేదాంతం రాదే శ్యామ్కు డాక్టర్ పద్మశ్రీ శోభా నాయుడు జీవిత సాఫల్య పురస్కారం, పార్వతీ రామచంద్రన్ కుమారి లంక అన్నపూర్ణ జీవిత సాఫల్య పురస్కారం, పటాన్ మొహిద్దిన్ ఖాన్ కు వెంపటి వెంకట్ సేవా పురస్కారాలను మంత్రులు అతిధులు అందజేసి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర సంగీత నాటక అకాడమీ సభ్యులు డాక్టర్ ఎస్పీ భారతి, రాష్ట్ర సృజనాత్మక సంస్కృతి సమితి చైర్పర్సన్ వంగపండు ఉష, అధికార బాషా సంఘం సభ్యులు డాక్టర్ డి.మస్తానమ్మ, రాష్ట్ర సృజనాత్మక సంస్కృతి సమితి ముఖ్య కార్య నిర్వహణ అధికారి ఆర్ మల్లికార్జున రావు, డిఆర్ఓ పి. వెంకటరమణ, ఉయ్యూరు ఆర్డిఓ విజయ్ కుమార్, డిఆర్డిఎడ్ డ్వామా పీడీలు పిఎస్ఆర్ ప్రసాదు, సూర్యనారాయణ, విద్యుత్ అధికారి భాస్కరరావు, తహసిల్దార్ ఆంజనేయ ప్రసాద్ వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన పలువురు కళాకారులు, వారి తల్లిదండ్రులు, కళాభిమానులు, గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. - జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి, కృష్ణాజిల్లా, మచిలీపట్నం వారిచే జారీ చేయబడినది. -
రెండు రకాలుగానూ శిక్ష తప్పదు!
స్కిల్ డెవలెప్మెంట్ కోర్సుల్లో విద్యార్థులు, ఉద్యోగార్థులకు నాణ్య మైన శిక్షణ ఇచ్చి ఉంటే కొన్ని లక్షల ఉద్యోగాలు వచ్చేవి. ఆ అవకాశాన్ని లేకుండా ‘స్కిల్ కుంభకోణాని’కి చంద్రబాబు పాల్పడటంతో లక్షల కుటుంబాలు శాశ్వతంగా నష్టపోయాయి. యువతకు చంద్రబాబు చేసిన అన్యాయం క్షమించరానిది. లక్షల మంది విద్యార్థుల భవిష్యత్ను చీకటిమయం చేసిన పాపం ఊరికే పోదు. పక్కా ఆధారాలతో ‘స్కిల్ కుంభకోణం’లో దొరికిపోవడంతో చంద్రబాబును ప్రభుత్వం చట్టం ముందు నిలబెట్టింది. 2014–19 మధ్య ఐదు సంవత్సరాల్లో కేవలం విద్యార్థుల జీవితాలనే కాకుండా రాష్ట్ర భవిష్యత్నూ సర్వనాశనం చేశారాయన. రాజధాని నుంచి ఫైబర్ గ్రిడ్ వరకు... ఆయన ప్రభుత్వం చేపట్టిన అన్ని కార్యక్రమాలూ, పథకాల్లో అవినీతి, ఆశ్రిత పక్ష పాతం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ప్రజల సొమ్మును అడ్డంగా దోచేసి దాచేసుకోవాలనే లక్ష్యంతో టీడీపీ ప్రభుత్వం పథకాలూ, కార్యక్రమాలూ చేపట్టి నట్లు తేటతెల్లం అవుతోంది. స్కిల్ కుంభకోణం కేవలం తీగ మాత్రమే. ఈ తీగను పట్టుకొని లాగితే చంద్రబాబు అవినీతి సామ్రాజ్యం కదులుతుంది. బాబు నిర్మించిన అవినీతి సామ్రాజ్యం కూలిపోయే రోజు ఎంతో దూరంలో లేదని ప్రజలు విశ్వాసంతో ఉన్నారు. న్యాయస్థానాల్లో శిక్ష పడకుండా బాబు తప్పించుకోలేరు. విద్యార్థుల భవిష్యత్ను ఫణంగా పెట్టి స్కిల్ కుంభకోణానికి పాల్పడిన కేసులో న్యాయస్థానం తప్పకుండా శిక్ష విధిస్తుందని విశ్వాసం ఇప్పుడు అందరిలోనూ ఉంది. ప్రజా కోర్టులోనూ శిక్ష తప్పదనే విషయాన్ని బాబు గుర్తించాలి. ఇప్పటి వరకు వ్యవస్థలను మేనేజ్ చేసే టక్కు టమార విద్య బాబును ఆదుకొంది. ప్రతి దానికీ ఎక్స్పైరీ డేట్ అనేది ఒకటి ఉన్నట్లే చంద్రబాబు గజకర్ణ గోకర్ణ విద్యకూ ఎక్స్పైరీ డేట్ ముగి సింది. అందుకే రూ. కోట్లు పుచ్చుకొనే బడా అడ్వొకేట్లను ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానాల్లో దించినా, కొమ్ములు తిరిగిన లాయర్లు తమ వాదనా పటిమను న్యాయస్థానాల్లో జడ్డి ముందు ప్రదర్శించినా చంద్రబాబును చట్టం ముందు నిలబెట్టకుండా అడ్డుకోవడం సాధ్యం కాలేదు. అద్భుత వాదనా పటిమ కనపరిచే సామర్థ్యం ఉన్న బడా లాయర్లు కూడా కేసు లోతుపాతుల్లోకి వెళ్లకుండా కేవలం సాంకేతిక పరమైన అంశాలకే పరిమితం కావడం చూస్తుంటే.. అవినీతి చేసి దొరికిపోయామనీ, లోతు పాతుల్లోకి వెళ్లకుండా సాంకేతిక అంశాల మీద బయట పడాలనేది చంద్రబాబు బృందం ఆలోచన అనీ చిన్న పిల్లలకూ తెలిసిపోతోంది. ఐదేళ్లు రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో నాశనం చేసినందుకు ప్రజా న్యాయస్థానంలో టీడీపీకి శిక్ష విధించడానికి ప్రజలు ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వంలో పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా తన 14 సంవత్సరాల పాలనలో కనీసం ఒక్కటంటే ఒక్కటి కూడా భారీ రిక్రూట్మెంట్ చేపట్టలేదు. ప్రాథమిక, సెకండరీ, ఇంటర్ విద్యను పూర్తిగా ప్రయివేటుకు కట్టబెట్టారు. విద్యా రంగంలో ‘చై–నా’ వేళ్లూనుకోవడానికి చంద్రబాబు అనుసరించిన విధానాలు కారణమయ్యాయి. ఫలితంగా విద్య వ్యాపార వస్తువుగా మారిపోవడం, పేద–మధ్య తరగతి ప్రజల రక్తాన్ని పీల్చేయడం మన కళ్లముందు కనిపించిన వాస్తవం. విశ్వ విద్యాలయాలనూ నాశనం చేసి నాణ్యత లేని చదువులతో పేదలకు తీరని అన్యాయం చేసిన బాబుకు ప్రజా కోర్టులో 2019లో ప్రజలు విధించిన శిక్షనే 2024 ఎన్నికల్లోనూ మరోసారి విధించనున్నారు. స్కిల్ కుంభకోణంలోనే కాదు మిగతా కుంభ కోణాల్లోనూ కోర్టులు విధించే శిక్షలు అనుభవించడమే చంద్రబాబు ముందున్న ఏకైక మార్గం. కైలే అనిల్కుమార్ వ్యాసకర్త పామర్రు ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు -
‘చంద్రబాబుకు దమ్ముంటే ఈ ఛాలెంజ్కు ఒప్పుకోవాలి’
సాక్షి, తాడేపల్లి: దళితుల్లో ఎవరు పుట్టాలని కోరుకుంటారని ప్రశ్నించిన చంద్రబాబు.. దళిత బాంధవుడు ఎలా అయ్యారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ ప్రశ్నించారు. గురువారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, చంద్రబాబును దళితులు నమ్మే పరిస్థితి లేదన్నారు. ‘‘దళితుల సంక్షేమం కోసం రూ.53 వేల కోట్లు ఖర్చు చేశాం.. గతంలో చంద్రబాబు దళితుల కోసం ఏం చేశారు. అంబ్కేదర్ స్ఫూర్తితో సీఎం జగన్ పాలన కొనసాగిస్తున్నారు. దళితులు ఏం పీక్కారన్న లోకేష్కు ప్రజలు బుద్ధి చెబుతారు. ఎస్సీ నియోజకవర్గాలలో అధిక భాగం ఎందుకు ఓడిపోయారో అర్థం చేసుకో చంద్రబాబు. 28 పథకాలు దళితుల కోసం తన హయాంలో పెట్టినట్లు చంద్రబాబు అబద్దాలు చెప్తున్నారు. జగన్ హయాంలో దళితులకు ఎంతో మేలు జరిగింది’’ అని అనిల్కుమార్ అన్నారు. ఎమ్మెల్సీ మొండితోక అరుణ్కుమార్ మాట్లాడుతూ, ‘‘చంద్రబాబు కొత్త అవతారం ఎత్తారు. దళితులకు ఎవరేం చేశారో అసెంబ్లీలో చర్చిద్దాం. దమ్ముంటే చంద్రబాబు అసెంబ్లీకి వస్తే చర్చిద్దాం. మా సవాల్ని స్వీకరించే దమ్ము చంద్రబాబుకు ఉందా?. దీనిపై రెండు రోజులు ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేయించటానికి మేము రెడీ. ఆలయ బోర్డులలో దళితులను నియమించాలని చంద్రబాబు కనీసంగా కూడా ఆలోచించలేదు. మా పేదపిల్లలు ఇంగ్లీషు మీడియంలో చదవకూడదా?. అలా చదివించాలని ఏనాడైనా ఆలోచించావా చంద్రబాబూ?’’ అంటూ ఎమ్మెల్సీ అరుణ్కుమార్ దుయ్యబట్టారు. చదవండి: పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖలపై సమీక్ష.. సీఎం జగన్ కీలక ఆదేశాలు ‘‘సీబీఎస్ఈ సిలబస్ పెట్టాలనీ, ట్యాబులు ఇవ్వాలనీ, స్కూల్స్ బాగు చేయించాలని ఏనాడైనా ఆలోచించారా?. 2 లక్షల కోట్లు పేదల ఖాతాలో వేస్తే అందులో అధిక భాగం లబ్ది పొందింది దళితులే. చంద్రబాబు, జగన్లలో ఎవరు మేలు చేశారో చర్చకు మేము సిద్దం. 28 పథకాలు తీసేశామని చంద్రబాబు చెప్తున్నారు. ఆ పథకాలు, వాటి ద్వారా లబ్ది పొందినవారి లిస్టు బయట పెట్టాలి. ఎక్కడకు వెళ్లినా ఓట్ల గురించే తప్ప.. పేదల అభివృద్ధి గురించి చంద్రబాబు ఏనాడూ మాట్లాడరు. రాజధానిలో అంబేద్కర్ విగ్రహం పెట్టలేక పారిపోయిన వ్యక్తి చంద్రబాబు. జగన్ 125 అడుగుల ఎత్తుతో విజయవాడ నడిబొడ్డున పెడుతున్నారు. అదీ చంద్రబాబు, సీఎం జగన్లకు వున్న తేడా. చంద్రబాబు హయాంలో ఒక్క ముస్లింకు కూడా మంత్రి పదవి ఇవ్వలేదు ఎందుకని?. ఇదేనా ముస్లింల మీద చంద్రబాబుకు ఉన్న ప్రేమ?’’ అని అరుణ్కుమార్ మండిపడ్డారు. చదవండి: ‘అవినాష్ను అనుమానించదగ్గ ఆధారాలు సీబీఐ దగ్గర లేవు’
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
కొంచెం ఇష్టం... కొంచెం కష్టం...
వరల్డ్కప్కు సెలక్ట్ చేయలేదు.. ఆ కసి మొత్తం చూపించేశాడు
ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్పై విపక్షాల రాద్ధాంతం అర్థరహితం
SRH vs RR: వారెవ్వా భువీ .. ఉత్కంఠ పోరులో ఎస్ఆర్హెచ్ విజయం
ఇంగ్లండ్ క్రికెట్లో తీవ్ర విషాదం.. యువ క్రికెటర్ మృతి
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (02-05-2024)
Swapna Kondamma: బుల్లితెర నటి సీమంతం.. ఎంతో సింపుల్గా ఇంట్లోనే.. (ఫోటోలు)
హైదరాబాద్ vs రాజస్థాన్ రాయల్స్.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)
నితీష్ ఊచకోత.. 8 సిక్స్లతో వీర విహారం! వీడియో వైరల్
RR vs SRH: చెలరేగిన నితీష్ కుమార్.. రాజస్తాన్ ముందు భారీ టార్గెట్
తప్పక చదవండి
- కాంగ్రెస్ నేత వ్యాఖ్యలపై మండిపడ్డ మమతా బెనర్జీ
- 'కుబేర' సినిమా నుంచి నాగార్జున ఫస్ట్ లుక్ గ్లింప్స్ రిలీజ్
- ఓపెనర్గా కోహ్లి.. రోహిత్ శర్మ ఏమన్నాడంటే?
- T20 WC: కోహ్లిపై విమర్శలు.. చీఫ్ సెలక్టర్ స్పందన ఇదే
- రజనీకాంత్ సినిమా మేకర్స్కు ఇళయరాజా నోటీసులు
- ఏపీలో 4.14 కోట్ల మంది ఓటర్లు: ఏపీ ఎన్నికల అధికారి ఎంకే మీనా
- ప్రజ్వల్ రేవణ్ణపై లుక్ అవుట్ నోటీసులు..
- ఉడుపి హోటల్స్ ఎందుకంత ప్రసిద్ధి చెందాయో తెలుసా..!
- పవన్కు పోతిన మహేష్ బహిరంగ లేఖ.. ఆన్సర్ ప్లీజ్!
- ఏపీకి మహా ప్రమాదకారిగా బాబు & కో
Advertisement