-
మందుకు బానిసయ్యా.. లేకుంటే కథ వేరేలా ఉండేది!
ప్రముఖ కవి, వక్త, స్క్రీన్ ప్లే రచయిత జావెద్ అక్తర్.. తన మాజీ భార్య హనీ ఇరానీ ఇప్పటికీ మంచి స్నేహితులు. విడాకులు తీసుకున్నంతమాత్రాన తాము శత్రువులుగా మారిపోలేదని, తనంటే ఇప్పటికీ ఎంతో గౌరవం అంటున్నాడు జావెద్. తాజాగా అతడు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. 'నేను హుందాగా, తెలివిగా వ్యవహరించి ఉంటే మా కథ వేరేలా ఉండది. కానీ ఈ వ్యసనమే (మందు తాగే అలవాటు) మా రిలేషన్ను ముక్కలు చేసింది. కూతురు జోయా, కుమారుడు ఫర్హాన్ అక్తర్లతో హనీ పదేళ్లు భరించింది.. ఈ తాగుడు వల్లే ఆమె చాలా అద్భుతమైన మనిషి. ఎంతో మంచి వ్యక్తి. తనపై నాకు ఇప్పటికీ అంతే గౌరవం ఉంది.. అది ఎప్పటికీ ఉంటుంది. అందుకే మేము ఇప్పటికీ బెస్ట్ ఫ్రెండ్స్గా కొనసాగుతున్నాము. మేము పెళ్లి చేసుకున్నా మొదటి పదేళ్లు నన్ను ఎలాగోలా భరించింది. కానీ తనకూ అనిపిస్తుంది కదా.. ఇలాంటి తాగుబోతు భర్తగా దొరికాడేంటి? అని! ఒకానొక రోజు మందు మానేద్దామని డిసైడయ్యాను. అప్పటినుంచి మళ్లీ దాని జోలికే పోలేదు' అని చెప్పుకొచ్చాడు. రెండో పెళ్లి కాగా జావెద్- హనీ 1972లో పెళ్లి చేసుకున్నారు. వీరికి ఫర్హాన్ అక్తర్, జోయా అక్తర్ అని ఇద్దరు పిల్లలు సంతానం. 1985లో జావెద్ దంపతులు విడాకులు తీసుకున్నారు. ఈ విడాకులు మంజూరవడానికి ముందే అతడు తన క్లోజ్ ఫ్రెండ్, నటి షబానా అజ్మీని పెళ్లాడాడు. ప్రస్తుతం ఇతడు లాహోర్ 1947 సినిమాకు పాటలు రాస్తున్నాడు. చదవండి: రెండు ఓటీటీల్లో హనుమాన్.. అక్కడ హిందీలో.. ఇక్కడ తెలుగులో! -
సిగ్గుండాలి అంటూ సందీప్ రెడ్డి వంగాపై విరుచుకుపడిన స్టార్ రైటర్
టాలీవుడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాపై ప్రముఖ స్క్రీన్ రైటర్ జావేద్ అక్తర్ మరోసారి కామెంట్లు చేశారు. యానిమల్ చిత్రాన్ని విజయవంతం చేసిన ప్రేక్షకులను గతంలో తప్పుబట్టిన జావేద్కు సందీప్ రెడ్డి వంగా కూడా కౌంటర్ ఇచ్చారు. జావేద్ అక్తర్ కుమారుడు ఫర్హాన్ నిర్మించిన మీర్జాపూర్ వెబ్ సిరీస్ను తెరపైకి తీసుకొచ్చి సందీప్ కూడా కడిగిపారేశారు. అంతా సద్దుమనిగింది అనుకుంటే తాజాగా మళ్లీ జావేద్ అక్తర్ ఇదే అంశంపై రియాక్ట్ అయ్యారు. సందీప్ రెడ్డి వంగాపై ఆయన పలు కామెంట్లు చేశారు. యానిమల్ చిత్రాన్ని తీసిన డైరెక్టర్ను తాను ఏమీ అనలేదని జావేద్ అక్తర్ క్లారిటీ ఇచ్చారు. అది రాజ్యాంగం అతనికి ఇచ్చిన హక్కు అని.. అయితే ప్రేక్షకుల గురించే తనకు ఆందోళన అని అక్తర్ పేర్కొన్నారు. 'నేను ఫిల్మ్ మేకర్ను ఏమాత్రం నిందించలేదు. ప్రజాస్వామ్య సమాజంలో ఒక యానిమల్ చిత్రమే కాదు.. అలాంటివి ఎన్నో సినిమాలు తీసే హక్కు అతనికి ఉంది. కానీ నా ఆందోళనంతా ప్రేక్షకుల గురించి మాత్రమే.. ఈ సమాజంలో పరిమితి మేరకు ఎలాంటి సినిమా అయినా చేసే హక్కు రాజ్యాంగం కల్పించింది. నేను యానిమల్ చిత్రాన్ని చూడలేదు. కొందరు మిత్రులు షేర్ చేసిన దానిని బట్టి యానిమల్ చిత్రంపై కామెంట్లు చేశాను.' అని జావేద్ అన్నారు. 'నా వ్యాఖ్యలకు సందీప్ రెడ్డి కూడా స్పందించడం నాకు గౌరవంగా అనిపించింది. నా 53 ఏళ్ల కెరీర్లో ఒక్క సినిమా, ఒక్క స్క్రిప్ట్, ఒక్క సీన్, ఒక్క డైలాగ్, ఒక్క పాటలో కూడా ఆయన అసభ్యత, తప్పును కనిపెట్టలేకపోయారు. ఇక చేసేది ఏమీ లేకపోవడంతో నా కుమారుడి ఆఫీస్ నిర్మించిన మీర్జాపూర్ వెబ్ సిరీస్ను పట్టుకున్నారు. అందులో ఫర్హాన్ నటించలేదు, డైరెక్ట్ చేయలేదు. రాయలేదు. కేవలం అతని కంపెనీ ఎక్సెల్ మీడియా ప్రొడ్యూస్ చేసింది. ఆ సంస్థ నుంచి చాలా సిరీస్లు వచ్చాయి. అందులో ఇదీ ఒకటి. దాన్నే అతడు పట్టుకున్నారు. దాని వల్ల ఎలాంటి ఉపయోగం లేదు. నా 53 ఏళ్ల కెరీర్లో ఒక్క తప్పు కూడా వెతకలేకపోయావా.. చేసేది ఏమీ లేక నా కుమారుడి దగ్గరకు పోయావా సందీప్.. ఇదీ సిగ్గుచేటు.' అని జావెద్ అక్తర్ ఘాటుగా స్పందించారు. గతంలో జావేద్ అక్తర్పై సందీప్ చేసిన కామెంట్లు యానిమల్ డైరెక్టర్ సందీప్ వంగాపై గతంలో ప్రముఖ రచయిత జావేద్ అక్తర్ పరోక్షంగా విమర్శించారు. యానిమల్ సినిమా చాలా ప్రమాదకరం అంటూ వ్యాఖ్యానించాడు. దీంతో సందీప్ వంగా ఓ ఇంటర్వ్యూలో ఇలా రియాక్ట్ అయ్యాడు. 'సలహాలు ఇవ్వాల్సింది నాకు కాదు. ముందుగా మీ కుమారుడు ఫర్హాన్ అక్తర్కు ఇవ్వాలి. మీ కుమారుడు నిర్మించిన మీర్జాపుర్ సిరీస్లో ప్రపంచంలో ఉన్న బూతులన్ని అందులోనే ఉన్నాయి. ఇప్పటికి కూడా నేను ఆ సిరీస్ను పూర్తిగా చూడలేదు కానీ కొన్ని సీన్స్ చూస్తేనే వాంతి కలిగినట్లు ఉంటుంది. కాబట్టి ముందుగా జావేద్అక్తర్ తన కుమారుడు నిర్మించే చిత్రాలపై శ్రద్ధ పెట్టడం మంచిది.' అని సందీప్ తెలిపాడు. -
బాలీవుడ్లో సందీప్ వంగా కాంట్రవర్సీ.. వాళ్లందరికీ ఒకేసారి కౌంటర్స్
రణ్బీర్ కపూర్ - సందీప్ వంగా కాంబినేషన్లో వచ్చిన 'యానిమల్' భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. బాక్సాఫీస్ వద్ద సుమారు రూ. 900 కోట్లు కలెక్ట్ చేసి ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రికార్డ్ క్రియేట్ చేసింది. కానీ ఈ చిత్రంపై బాలీవుడ్ నుంచి పలువురు ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా విమర్శలు చేశారు. దీంతో సందీప్ కూడా వారికి పలు ఇంటర్వ్యూలలో రివర్స్ ఎటాక్ కూడా చేస్తున్నారు. ఇప్పుడు బాలీవుడ్లో సందీప్ వంగా పేరు హాట్ టాపిక్గా మారిపోయింది. మీ కుమారుడి 'మీర్జాపుర్' కోసం సలహాలు ఇవ్వండి యానిమల్ డైరెక్టర్ సందీప్ వంగాపై గతంలో ప్రముఖ రచయిత జావేద్ అక్తర్ పరోక్షంగా విమర్శించారు. యానిమల్ సినిమా చాలా ప్రమాదకరం అంటూ వ్యాఖ్యానించాడు. దీంతో సందీప్ వంగా ఓ ఇంటర్వ్యూలో ఇలా రియాక్ట్ అయ్యాడు. 'సలహాలు ఇవ్వాల్సింది నాకు కాదు. ముందుగా ఆయన కుమారుడు జావేద్ కుమార్ ఫర్హాన్ అక్తర్కు ఇవ్వాలి. ఆయన కుమారుడు నిర్మించిన మీర్జాపుర్ సిరీస్లో ప్రపంచంలో ఉన్న బూతులన్ని అందులోనే ఉన్నాయి. ఇప్పటికి కూడా నేను ఆ సిరీస్ను పూర్తిగా చూడలేదు కానీ కొన్ని సీన్స్ చూస్తేనే వాంతి కలిగినట్లు ఉంటుంది. కాబట్టి ముందుగా జావేద్అక్తర్ తన కుమారుడు నిర్మించే చిత్రాలపై శ్రద్ధ పెట్టడం మంచిది.' అని సందీప్ తెలిపాడు. నీకు సరిపోయే పాత్ర ఉంటే ఇస్తా.. కంగనాకు కౌంటర్ బాలీవుడ్ హీరోయిన్ కంగనా కూడా యానిమల్ సినిమాపై విమర్శలు చేసింది. 'మహిళలను శృంగార వస్తువులుగా భావించి, బూట్లు నాకమని అడిగే హీరో చిత్రాలను ప్రేక్షకులు ప్రోత్సహిస్తున్నారు. మహిళా సాధికారత చిత్రాలను చేస్తున్న తనకు ఇది తీవ్రంగా నిరుత్సాహపరిచిందని ఆమె అన్నారు. దీంతో కంగనాపై కూడా సందీప్ రియాక్ట్ అయ్యాడు. 'కంగనా ఎలాంటి రివ్యూ ఇచ్చినా ఇబ్బంది లేదు. విమర్శించినా తప్పులేదు. నేను తీసే చిత్రాల్లో ఆమెకు సరిపోయే పాత్ర ఉంటే కచ్చితంగా స్టోరీ చెబుతాను.' అని సందీప్ అన్నారు. దీనిపై కంగనా కూడా మళ్లీ ఘాటుగానే తన ఇన్స్టాగ్రామ్ ద్వారా తెలిపింది. సినిమాను సమీక్షించడానికి, విమర్శించడానికి ఎంతో తేడా ఉంది. ముందుగా అది తెలుసుకోండి 'యానిమల్'పై నా రివ్యూ గురించి మీరు నవ్వుతూ మాట్లాడారు. ఇక్కడ అర్థం అవుతుంది నాపై ఉన్న గౌరవం ఏంటో అని. కానీ, మీ సినిమాల్లో నాకు ఎలాంటి పాత్రలు ఇవ్వకండి. ఒకవేళ మీరు ఇస్తే మీ ఆల్ఫా హీరోలు ఫెమినిస్ట్లు అవుతారు జాగ్రత్త. అది మీకే డేంజర్ కావచ్చు. కానీ సినీ ఇండస్ట్రీకి మీరు కావాలి, ఉండాలి' అంటూ కంగనా వ్యంగ్యంగానే సమాధానం ఇచ్చింది. నేను సందీప్ గురించి కామెంట్ చేయలేదు: ఆమిర్ ఖాన్ మాజీ భార్య యానిమల్ చిత్రంపై పరోక్షంగా బోల్డ్ కంటెంట్, స్త్రీల పట్ల ద్వేషం, వేధింపులను ప్రోత్సహించేలా ఉన్నాయని ఆమిర్ ఖాన్ మాజీ భార్య కిరణ్ రావు అన్నారు. అందుకు సందీప్ కూడా ముందుగా తన భర్త నటించిన దిల్ సినిమా చూడాలని వ్యాఖ్యానించాడు. దీంతో ఆమె మళ్లీ ఇలా రియాక్ట్ అయింది. 'నేను ప్రత్యేకంగా సందీప్ వంగా సినిమాల గురించి కామెంట్ చేయలేదు. కొన్ని చిత్రాల్లో స్త్రీలను అగౌవపరిచేలా సీన్స్ షూట్ చేస్తున్నారని అన్నాను. ఇదే విషయం గతంలో కూడా అనేక సార్లు చెప్పాను. మరి ఆయన్నే నేను అన్నట్లు ఎందుకు ఊహించుకున్నారో నాకు తెలియదు.' అని ఆమె వ్యాఖ్యానించారు. -
యానిమల్ వివాదం.. రచయితకు గడ్డి పెట్టిన మేకర్స్!
రణ్బీర్ కపూర్, రష్మిక జంటగా నటించిన సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన యానిమల్. డిసెంబర్ 1న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ను షేర్ చేసింది. దాదాపు రూ.800 కోట్ల పైగా వసూళ్లు సాధించి బ్లాక్బస్టర్గా నిలిచింది. అయితే ఈ మూవీ ఎంత హిట్ అయిందో.. అంతేస్థాయిలో విమర్శలకు గురైంది. ఆర్జీవీ లాంటి సంచలన డైరెక్టర్ ఈ చిత్రంపై ప్రశంసలు కురిపించారు. కానీ కొందరు మాత్రం సమాజంలో స్త్రీలను తక్కువ చేసి చూపేలా ఉందంటూ పలువురు మండిపడ్డారు. త తాజాగా యానిమల్ చిత్రంపై ప్రముఖ గీత రచయిత జావేద్ అక్తర్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సినిమాలు భారీ విజయాలు సాధించడానికి కారణమైన ప్రేక్షకులను ఆయన తప్పుబట్టారు. ఐదు జాతీయ అవార్డుల విన్నర్ అయిన జావేద్ అక్తర్ యానిమల్పై పరోక్షంగా కామెంట్స్ చేశారు. జావేద్ అక్తర్ మాట్లాడుతూ.. ఒక చిత్రంలో ఒక పురుషుడు.. స్త్రీని తన షూ నాకమని అడిగితే.. మరోక చిత్రంలో ఒక స్త్రీ ఆ హీరోను చెంపదెబ్బ కొడుతుంది. ఇలాంటి చిత్రాలను ప్రేక్షకులు ఎలా ఆదరిస్తారో అర్థం కావడం లేదని జావేద్ అక్తర్ అభిప్రాయపడ్డారు. ఇదీ ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదని అన్నారు. ఇది సమాజానికి ఎంతో ప్రమాదకరమని అభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే ఈ వివాదంపై యానిమల్ చిత్రబృందం స్పందించింది. జావేద్ అక్తర్ను ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేసింది. ట్వీట్లో రాస్తూ..'జోయా, రణ్వీర్ మధ్య జరిగిన ద్రోహాన్ని రచయిత అర్థం చేసుకోలేకపోతే.. మీ కళ అంతా ఒక పెద్ద అబద్ధం. ఒక స్త్రీని ప్రేమ పేరుతో ఒక వ్యక్తి మోసం చేస్తే నా షూ నాకండి అని అనవచ్చు. అప్పుడు మీరు దానిని స్త్రీవాదం అనే పేరుతో గొప్పగా చెప్పుకుంటారు. లింగ భేదమనే రాజకీయాల్లో ప్రేమకు విముక్తి కల్పించండి. అప్పడే వారిని ప్రేమికులు అంటారు. ప్రియురాలు మోసం చేసి.. అతనికి అబద్ధం చెప్పింది. అందుకే ప్రియుడు షూ నాకమని అన్నాడు' అంటూ రిప్లై ఇచ్చింది. అయితే యానిమల్ చిత్రంలో త్రిప్తి డిమ్రీని ఉద్దేశించి.. రణ్బీర్ కపూర్ ఈ విధంగా డైలాగ్ చెప్పారు. యానిమల్ చిత్రంలో రణబీర్ కపూర్, త్రిప్తి డిమ్రీ మధ్య ఈ సీన్ జరుగుతుంది. రణబీర్ కనుచూపుతో తన షూ నాకమని త్రిప్తి డిమ్రీకి చెప్పుతాడు. మరొకటి షాహిద్ కపూర్, కియారా అద్వానీ నటించిన కబీర్ సింగ్ చిత్రంలోనిది అందులో హీరోను కియారా చెంపదెబ్బ కొడుతుంది. మరొక సీన్లో హీరోయిన్పై బూతు పదాన్ని ఉపయోగిస్తూ హీరో చెంపదెబ్బ కొడుతాడు. ఇదే చిత్రం తెలుగులో అర్జున్రెడ్డిగా వచ్చిన విషయం తెలిసిందే. జావేద్ అక్తర్ టార్గెట్ చేసిన ఈ రెండు చిత్రాలను కూడా డైరెక్ట్ చేసింది సందీప్రెడ్డి వంగానే. Writer of your calibre cannot understand the betrayal of a lover (Between Zoya & Ranvijay) then all your art form is big FALSE 🙃 & If a woman (betrayed and fooled by a man in the name of love) would have said "lick my shoe" then you guys would have celebrated it by calling it… — Animal The Film (@AnimalTheFilm) January 7, 2024 -
యానిమల్లో ఆ సీన్ను తప్పుబట్టిన ప్రముఖ రచయిత
రణబీర్ కపూర్ నటించిన సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన యానిమల్ వంటి సినిమాల విజయంపై ప్రముఖ గీత రచయిత జావేద్ అక్తర్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సినిమాలు భారీ విజయాలు సాధించడానికి కారణమైన ప్రేక్షకులను జావేద్ నిందించారు. భారత ప్రముఖ గేయ రచయిత, ఐదు జాతీయ అవార్డుల విన్నర్ అయిన జావేద్ అక్తర్ యానిమల్ సినిమాపై పరోక్షంగా కామెంట్ చేశారు. ఔరంగాబాద్లో జరిగిన అజంతా ఎల్లోరా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో తన ప్రసంగంలో ప్రస్తుత చిత్రాలపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. రణ్బీర్ కపూర్, రష్మిక మందన్న, అనిల్ కపూర్, బాబీ డియోల్ నటించిన యానిమల్ చిత్రం గురించి నేరుగా ప్రస్తావించకుండానే ఆయన ఆందోళనను వ్యక్తం చేశారు. తాజాగా వచ్చిన ఒక చిత్రంలో ఒక పురుషుడు.. స్త్రీని తన షూ నాకమని అడిగితే.. మరోక చిత్రంలో ఒక స్త్రీ హీరోను చెంపదెబ్బ కొడుతుంది. ఇలాంటి చిత్రాలను ప్రేక్షకులు ఎలా ఆధరిస్తారో అర్థం కావడం లేదని జావేద్ అక్తర్ అభిప్రాయపడ్డారు. ఇదీ ఏ మాత్రం ఆమోదయోగ్యమనది కాదని ఆయన చెప్పారు. సమాజానికి ఇది ఎంతో ప్రమాదకరం అని ఆయన ఆందోళన చెందారు. యానిమల్ చిత్రంలో రణబీర్ కపూర్, త్రిప్తి డిమ్రీ మధ్య ఈ సీన్ జరుగుతుంది. రణబీర్ కనుచూపుతో తన షూ నాకమని త్రిప్తి డిమ్రీకి చెప్పుతాడు. మరొకటి షాహిద్ కపూర్, కియారా అద్వానీ నటించిన కబీర్ సింగ్ చిత్రంలోనిది అందులో హీరోను కియారా చెంపదెబ్బ కొడుతుంది. మరోక సీన్లో హీరోయిన్పై బూతు పదాన్ని ఉపయోగిస్తూ హీరో చెంపదెబ్బ కొడుతాడు. ఇదే చిత్రం తెలుగులో అర్జున్రెడ్డిగా వచ్చిన విషయం తెలిసిందే. జావేద్ అక్తర్ టార్గెట్ చేసిన ఈ రెండు చిత్రాలను కూడా డైరెక్ట్ చేసింది సందీప్రెడ్డి వంగా. పరోక్షంగా సందీప్ మీద ఆయన చేసిన వ్యాఖ్యలు బాలీవుడ్లో వైరల్ అవుతున్నాయి. గతంలో కూడా జావేద్ ఇలాంటే వ్యాఖ్యలే చేశారు. ఆనంద్ బక్షి రాసిన సాహిత్యంపై కూడా వివాదస్పద వ్యాఖ్యలే చేశారు. 90ల నాటి చిత్రం ఖల్ నాయక్ నుంచి 'చోలీ కే పీచే' పాట భారీ విజయాన్ని అందుకుంది. ఆ పాట లిరిక్స్తో పాటు అందులో మగవారి వస్త్రధారణ కూడా మహిళల మాదిరి ఉండటం ఆయన తప్పుబట్టారు. కానీ ప్రేక్షకుల అఖండ మద్దతుతో ఇలాంటివి మరిన్నీ వస్తున్నాయిని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రేక్షకులు ఎలాంటి సినిమాలు చూడాలి అనే విషయంలో కూడా బాధ్యత వహించాలి.. ఇలాంటి వాటిని మెచ్చుకుంటూ పోతే రాబోయే రోజుల్లో ఇలాంటి చిత్రాలే ఎక్కువ వస్తాయి. ఇప్పటికైనా ఇటువంటి చిత్రాలకు దూరంగా ఉండాలని జావేద్ అక్తర్ ఆందోళన వ్యక్తం చేశారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
స్వల్పంగా పెరిగిన పసిడి.. అదే బాటలో వెండి
అమెరికన్ల ఇంటి పేర్లు ఎలా ఉంటాయో తెలుసా..!
ఆస్ట్రేలియాలో కత్తిపోట్లకు బలైన భారతీయ విద్యార్థి..భూమి అమ్మి పైచదువులకు
కూతురితో కలిసి ప్రముఖ ఆలయాన్ని సందర్శించిన స్టార్ హీరోయిన్!
పూంచ్ ఉగ్రదాడి.. టెర్రరిస్టులపై రూ.20 లక్షల రివార్డు
AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా
పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల
పొన్నూరు లో పవన్ సభ అట్టర్ ఫ్లాప్ అంబటి మురళీకృష్ణ సెటైర్లు
16 ఏళ్లకే గర్భం ఆపై భర్త మోసం.. ఇప్పుడు స్టార్ హీరోకు అత్తగా..
చంద్రబాబు, కొడుకు పప్పు తుప్పు.. అనిల్ కుమార్ యాదవ్ స్పీచ్ కి దద్దరిల్లిన మాచెర్ల
తప్పక చదవండి
- ఆస్ట్రేలియాలో కత్తిపోట్లకు బలైన భారతీయ విద్యార్థి..భూమి అమ్మి పైచదువులకు
- పూంచ్ ఉగ్రదాడి.. టెర్రరిస్టులపై రూ.20 లక్షల రివార్డు
- పురందేశ్వరి.. అది వారిని అవమానించడమే: విజయసాయిరెడ్డి
- ప్రవీణ్తో బ్రేకప్.. తొలిసారి స్పందించిన ఫైమా
- గర్ల్ ఫ్రెండ్కో డైమండ్.. మీకో గుడ్ న్యూస్..!
- అచ్చా.. అలాగా?: కోహ్లిపై గావస్కర్ కామెంట్స్.. ఫ్యాన్స్ ఫైర్
- ‘ధనాధన్’ ధోని డకౌట్.. ప్రీతి జింటా రియాక్షన్ వైరల్
- పొమ్మనలేక పొగ పెడుతున్నారా..!
- రూటే సెపరేటు
- AnjiBabu: జంపింగ్ జపాంగ్ పార్టీలు మారడంలో దిట్ట
Advertisement