-
నేలపై జెండా.. ప్రధాని మోదీ ఏం చేశారంటే..
జోహన్నెస్బర్గ్లో ఇవాళ జరిగిన బ్రిక్స్ సమావేశం సందర్భంగా ఆసక్తికర సన్నివేశం ఒకటి చోటు చేసుకుంది. ప్రధాని నరేంద్ర మోదీ తన దేశభక్తిని చాటుకున్నారు. కింద ఉంచిన జాతీయ జెండాను గమనించి అప్రమత్తయ్యారు ఆయన. బ్రిక్స్ సమావేశాల సందర్భంగా.. ఇవాళ హాజరైన నేతలతో ఓ ఫొటోషూట్ జరిగింది. ప్రధాని నరేంద్ర మోదీ, దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామఫోసా వేదిక ఎక్కబోయారు. తమకు కేటాయించిన స్థానాల్లో నిల్చుని ఫొటోలు దిగాల్సి ఉంది. అయితే.. అక్కడ నేతలు ఎవరెక్కడ నిల్చోవాలనే గుర్తు కోసం ఆయా నేతలకు సంబంధించిన దేశాల జెండాల పేపర్ పీస్లను ఉంచారు. PM Narendra #Modi notices the Indian Tricolour on the ground (to denote standing position) during the group photo at #BRICS, makes sure to not step on it, picks it up, and keeps it with him. South African President Cyril Ramaphosa follows suit.#ModiInBRICS pic.twitter.com/pXCypilo4H — அகத்தியன் (@riverinerabbit) August 23, 2023 ఈ క్రమంలో వేదిక ఎక్కబోతూ.. అక్కడ జెండాను గమనించిన మోదీ.. దానిని తీసుకుని తన జాకెట్ జేబులో పెట్టుకున్నారు. మరోవైపు అప్పటికే తమ దేశపు జెండాపై అడుగేసిన దక్షిణాఫ్రికా అధ్యక్షుడు.. మోదీ చర్యను గమనించి అక్కడే ఉన్న సిబ్బందికి ఆ జెండాను అందించారు. -
ఖలీస్తానీ మద్ధతుదారుల దుశ్చర్య.. భారత్ కౌంటర్
లండన్లోని భారత హైకమిషనర్ వద్ద ఆదివారం జరిగిన పరిణామాలకు భారత్ తక్షణ కౌంటర్ ఇచ్చింది. పంజాబ్లో ఖలీస్తానీ సానుభూతిపరుడు అమృత్పాల్ సింగ్ అరెస్ట్కు నిరసనగా.. లండన్ హైకమిషనర్ ఆవరణలో భారత జాతీయ జెండాను ఖలీస్తానీ మద్దతుదారులు నిరసనలకు దిగారు. ఈ క్రమంలో భారత త్రివర్ణ పతాకాన్ని కిందకు లాగేయాలని యత్నించడం.. ఆ వెంటనే అధికారులు స్పందించడం, తదనంతరం భారీ జాతీయ జెండాను ఎగరేయడం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. లండన్ అల్డివిచ్ ఇండియా హౌజ్ బయట ఈ భారీ భారతీయ జాతీయ జెండాను ఎగరేయగా.. పలువురు ప్రశంసలు గుప్పిస్తున్నారు. బీజేపీ జాతీయ ప్రతినిధి జైవీర్ షెర్గిల్ ఈ పరిణామంపై ఝండా ఊంచా రహే హమారా అంటూ ట్విటర్లో పోస్ట్ ఉంచారు. భారత జెండాను అవమానించేలా వ్యవహరించిన వాళ్లపై యూకే ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. జాతి సంరక్షణకు, పలు రకాల సేవలు అందించిన ఖ్యాతి పంజాబ్కు, పంజాబీలకు ఉందని పేర్కొన్నారు ఆయన. “Jhanda Ooncha Rahe Hamara”- UK Govt must act against those miscreants who attempted to disrespect Indian Flag at High Commission,London.Punjab & Punjabis have a glorious track record of serving/protecting the Nation.Handful of jumping jacks sitting in UK do not represent Punjab. pic.twitter.com/TJrNAZcdmf — Jaiveer Shergill (@JaiveerShergill) March 20, 2023 ఇదిలా ఉంటే.. జాతీయ జెండాను కిందకు లాగేసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అదే సమయంలో భారత హైకమిషనర్ అధికారులు తక్షణం స్పందించారు. కౌంటర్గా ఖలీస్తానీ జెండాను విసిరేయడంపై.. పలువురు నెటిజన్స్ ప్రశసంలు గుప్పిస్తున్నారు. ఇక ఈ పరిణామంపై భారత విదేశాంగ శాఖ స్పందించింది. ఆదివారం అర్ధరాత్రి భారత్లోని బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ క్రిస్టియానా స్కాట్కు ఈ ఘటనపై వివరణ కోరుతూ సమన్లు జారీ చేసింది. ఇదిలా ఉంటే.. మరోవైపు యూకే మంత్రి తారీఖ్ అహ్మద్ ఈ ఘటనను ఖండిస్తూ ఓ ట్వీట్ చేశారు. Salute to the Brave Indian High Commission Official 🙏🇮🇳 He not only took back the Indian flag but stopped the extremist from installing the K-Flag.#UK #London pic.twitter.com/4X0DJQo9hV — Megh Updates 🚨™ (@MeghUpdates) March 19, 2023 ఇదీ చదవండి: ఒకేసారి.. 36 మంది భక్తుల గోల్డ్ చైన్లు మాయం -
‘ప్రధాని మోదీ వల్లే అది సాధ్యమైంది’
న్యూఢిల్లీ: ఆదివారం జమ్ము కశ్మీర్లో చోటుచేసుకున్న రాజకీయ పరిణామంపై బీజేపీ తీవ్రంగా స్పందించింది. కాంగ్రెస్ భారత్ జోడో యాత్రలో భాగంగా శ్రీనగర్ లాల్ చౌక్లో జాతీయ జెండా ఎగరేశారు ఆ పార్టీ కీలక నేత, ఎంపీ రాహుల్ గాంధీ. అయితే.. మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం వల్లే రాహుల్ గాంధీ అలా జెండా ఎగరేయడం సాధ్యమైందని బీజేపీ ఎంపీ రవిశంకర్ప్రసాద్ తెలిపారు. ‘అసలు రాహుల్ గాంధీ అంత ప్రశాంతంగా లాల్ చౌక్లో జెండా ఎలా ఎగరేయగలిగారు? ఆ పరిస్థితులకు కారణం ఆర్టికల్ 370 రద్దు కావడం. అది చేసింది ప్రధాని మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం. కాంగ్రెస్ హయాంలో కశ్మీర్ గడ్డపై ఉగ్రవాదం, ప్రజల భయాందోళనలు మాత్రమే కనిపించేవి. కానీ, ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల వల్ల అక్కడ శాంతిభద్రతలు అదుపులోకి వచ్చాయి. అధిక సంఖ్యలో పర్యాటకులు క్యూ కడుతున్నారు అని రవిశంకర్ వ్యాఖ్యానించారు. బీజేపీ ఎంపీ రాజ్యవర్థన్ రాథోడ్ సైతం ఇవే వ్యాఖ్యలు చేశారు. శ్రీనగర్ లాల్ చౌక్లో రాహుల్ గాంధీ గర్వంగా జాతీయ జెండాను ఎగరేశారు. అలాంటి పరిస్థితులు అక్కడ నెలకొనడానికి కారణం ప్రధాని మోదీ అని ఉద్ఘాటించారు. జమ్ము కశ్మీర్ బీజేపీ అధ్యక్షుడు రవీందర్ రైనా మాత్రం ఆ క్రెడిట్ను ప్రధాని మోదీతో పాటు హోం మంత్రి అమిత్ షాకు సైతం దక్కుతుందని పేర్కొన్నారు. ఏడు వసంతాల తర్వాత నెహ్రూ కుటుంబానికి చెందిన ఓ వ్యక్తి శ్రీనగర్ లాల్ చౌక్లో జెండా ఎగరేశాడు. ఈ ప్రాంతంలో ప్రశాంతత, సోదర భావం పెంపొందడానికి మోదీ, షాలే ముఖ్యకారకులు అని రైనా పేర్కొన్నారు. ఇదీ చదవండి: నేటితో భారత్ జోడో యాత్రకు ముగింపు -
భారత జెండాతో ఆఫ్రిది కూతురు.. నిజమేనన్న పాక్ మాజీ ఆల్రౌండర్
ఆసియా కప్-2022లో భాగంగా భారత్-పాక్ల మధ్య జరిగిన సూపర్-4 దశ మ్యాచ్ సందర్భంగా పాకిస్తాన్ మాజీ ఆల్రౌండర్ షాహిద్ అఫ్రిది చిన్ని కూతురు భారత జెండా ఊపుతూ కనిపించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్మీడియాలో వైరలవుతున్నాయి. ఈ విషయమై ఓ టీవీ ఇంటర్వ్యూ సందర్భంగా అఫ్రిదిని ప్రశ్నించగా అతను చెప్పిన సమాధానం విని అందరూ షాకయ్యారు. ఈ విషయంపై లైవ్లో జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు అఫ్రిది పెద్దగా నవ్వుతూ సమాధానం చెప్పడం అందరినీ ఆశ్చర్యపరిచింది. అవును నా కూతురు భారత జెండా పట్టుకుంది.. ఆ వీడియోలు నా దగ్గర కూడా ఉన్నాయి. పాపతో ఉన్న నా భార్య కూడా ఈ విషయాన్ని చెప్పింది. ఆ రోజు (భారత్-పాక్ మ్యాచ్ జరిగిన రోజు) స్టేడియంలో 90 శాతం మంది భారత అభిమానులు, కేవలం 10 శాతం మంది పాక్ ఫ్యాన్స్ ఉన్నారు. స్టేడియం వద్ద పాక్ జాతీయ జెండాలు దొరక్కపోవడంతో మా పాప భారత జెండాను పట్టుకుంది. ఫైనల్లో పాక్పై శ్రీలంక గెలిచిన అనంతరం గంభీర్ కూడా శ్రీలంక జెండా ఊపాడు. అలా చేసినంత మాత్రనా అతను శ్రీలంకన్ అయిపోయాడా.. లేక అతన్ని శ్రీలంక అభిమాని అని అనాలా..? అంటూ ఈ విషయాన్ని రచ్చ చేయవద్దని జర్నలిస్ట్ను కోరాడు. ఇందుకు సంబంధించిన వీడియో కూడా ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతుంది. కాగా, ఆసియా కప్లో భారత్, పాక్లు రెండు సందర్భాల్లో ఎదురెదురు పడగా.. గ్రూప్ దశలో టీమిండియా, సూపర్-4 దశలో పాక్లు గెలుపొందాయి. సూపర్-4 దశలో భారత్.. పాక్, శ్రీలంక చేతుల్లో వరుస పరాజయాలు ఎదుర్కోవడంతో ఫైనల్కు చేరకుండానే నిష్క్రమించింది. ఫైనల్లో శ్రీలంక, పాక్లు తలపడగా.. లంకేయులు పాక్ను మట్టికరిపించి ఆరో సారి ఆసియా ఛాంపియన్లుగా నిలిచారు. -
జాతీయ జెండాను ముట్టుకోని జై షా.. కారణం ఇదేనా..!
ఆసియా కప్ 2022లో భాగంగా నిన్న (ఆగస్ట్ 28) దాయాది పాక్తో జరిగిన హైఓల్టేజీ పోరులో టీమిండియా 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్లో రోహిత్ సేన.. పాక్ను మట్టికరిపించిన అనంతరం స్టేడియంలో తారసపడిన ఓ ఆసక్తికర పరిణామం ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. Why son of India's Home Minister not accepting the National flag? pic.twitter.com/ZSB0P56iLV — Maharashtra Congress (@INCMaharashtra) August 28, 2022 మ్యాచ్ చూసేందుకు వచ్చిన బీసీసీఐ కార్యదర్శి, కేంద్ర హోం మంత్రి అమిత్ షా తనయుడు జై షా వ్యవహరించిన తీరు అతని తండ్రి ప్రత్యర్ధులకు ఆయుధంగా మారింది. ఇంతకీ ఏం జరిగిందంటే.. చిరకాల ప్రత్యర్ధితో నిన్న జరిగిన రసవత్తర పోరులో టీమిండియా విజయానంతరం సంబురాలు అంబరాన్నంటాయి. స్టేడియంలోని ప్రేక్షకులు జాతీయ జెండాలు చేతబూని, సామూహికంగా వందేమాతరం గీతాన్ని ఆలపిస్తూ భారత దేశ ఖ్యాతి విశ్వమంతా తెలిసేలా ఎలుగెత్తి చాటారు. India Vs Pakistan Match highlights !! 🔥 Amith shah son Jay Shah just rejected India flag… 🔥Why Amit Shah's son Jay Shah doesn't want to celebrate India's win with the tricolour. Is he allergic towards Indian Flag?#IndiaVsPakistan #jayshah pic.twitter.com/I5ZrWGgtqp — Danasari Anasuya (Seethakka) (@seethakkaMLA) August 28, 2022 ఈ క్రమంలో స్టేడియంలోనే ఉన్న జై షాకు ఓ అభిమాని త్రివర్ణ పతాకాన్ని అందించే ప్రయత్నం చేశాడు. ఇందుకు జై షా నిరాకరిస్తూనే.. చప్పట్లు కొడుతూ విజయాన్ని ఆస్వాదించాడు. జై షా ఇలా ప్రవర్తించడం ప్రతి భారత అభిమానికి అగ్రహం తెప్పించింది. జై షా వ్యవహరించిన తీరును అతని తండ్రి ప్రత్యర్ధులు ఏకి పారేస్తున్నారు. కేంద్ర హోం మంత్రి తనయుడి దేశ భక్తి ఇదేనా అంటూ మాటల తూటాలు సంధిస్తున్నారు. ఈ పార్టీ, ఆ పార్టీ అన్న తేడా లేకుండా అందరూ బీజేపీని టార్గెట్ చేస్తున్నారు. Because he is president of Asian Cricket Council. And as per code of conduct, he has to show neutrality against all stake holders. https://t.co/3SuIl2lj4i — Facts (@BefittingFacts) August 29, 2022 అసలు కారణం ఇది! అయితే జై షా విమర్శించడాన్ని ఆయన ఆప్తులు మాత్రం తప్పుపడుతున్నారు. విషయం తెలుసుకోకుండా విమర్శలు చేయడం సరికాదని మండిపడుతున్నారు. జై షా కేవలం బీసీసీఐ సెక్రటరీ మాత్రమే కాదని.. ఆయన ఆసియా క్రికెట్ కౌన్సిల్కు అధ్యక్షుడు అన్న విషయం తెలుసుకుని మాట్లాడాలని.. కోడ్ ఆఫ్ కండక్ట్లో భాగంగానే అలా చేయాల్సి వచ్చిందని వివరణ ఇచ్చారు. అయితే ఈ వివరణతో సంతృప్తి చెందని కొందరు మాత్రం జై షాను, ఆయన తండ్రిని టార్గెట్ చేస్తూ విమర్శనాస్త్రాలు సంధిస్తూనే ఉన్నారు. చదవండి: గంభీర్ను ఎవరూ ఇష్టపడే వారు కాదన్న అఫ్రిది.. భజ్జీ రియాక్షన్పై ఫ్యాన్స్ ఫైర్
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఢిల్లీ బ్యాటర్లు ఊచ కోత.. రాజస్తాన్ ముందు భారీ టార్గెట్
రాజ్యాంగానికి కట్టుబడి ఉన్నాము: కాంగ్రెస్ నేత పవన్ ఖేరా
బాహుబలి కేవలం 10 కోట్ల మంది మాత్రమే: రాజమౌళి కామెంట్స్
బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
తెలంగాణను అసమర్థులు ఏలుతున్నారు: కేసీఆర్
క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
నెల ముందే ప్రమోషన్.. ఇప్పుడు జాబ్ పోయింది: అగ్రరాజ్యంలో టెకీ ఆవేదన
జేక్ ఫ్రేజర్ విధ్వంసం.. కేవలం 19 బంతుల్లోనే! వీడియో వైరల్
ల్యాండ్ టైట్లింగ్ చట్టం సమగ్ర స్వరూపం ఇదే..
తప్పక చదవండి
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement