-
ఫ్రాన్స్: ఇరాన్ కాన్సులేట్లో మానవ బాంబు కలకలం
ప్యారిస్: ఫ్రాన్స్ రాజధాని నగరం ప్యారిస్లోని ఇరాన్ రాయబార కార్యాలయంలో శుక్రవారం(ఏప్రిల్19) మానవ బాంబు కలకలం రేగింది. ఉదయం రాయబార కార్యాలయంలోకి ప్రవేశించిన ఓ వ్యక్తి తనను తాను పేల్చుకుంటానని బెదిరించాడు. అయితే అతడిని కార్యాలయం బయటికి తీసుకువచ్చిన పోలీసులు తొలుత తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో అతడి వద్ద ఎలాంటి పేలుడు పదార్థాలు లేవని వెల్లడైంది. అనంతరం అతడిని అరెస్టు చేశారు. ఈ ఘటనతో అప్రమత్తమైన పోలీసులు ఇరాన్ రాయబార కార్యాలయాన్ని పూర్తిగా చుట్టుముట్టారు. కాగా, ప్రస్తుతం ఇరాన్, ఇజ్రాయెల్ దేశాల మధ్య యుద్ధ వాతావారణం నెలకొన్న విషయం తెలిసిందే. ఇదీ చదవండి.. ఇరాన్లో భారీ పేలుళ్లు -
టీ హబ్లో ఫ్రాన్స్ కాన్సులేట్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబుతో ఫ్రాన్స్ కాన్సులేట్ జనరల్, బెంగళూరు కాన్సుల్ జనరల్ థెయిరి బెర్తెలోట్ బుధవారం సచివాలయంలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలు, అనువైన వాతావరణం తదితర అంశాలను మంత్రి శ్రీధర్బాబు కాన్సుల్ జనరల్ బెర్తెలోట్కు వివరించారు. రాష్ట్రంలో త్వరలో నిర్వహించనున్న ఆరి్టఫీషియల్ ఇంటెలిజెన్స్ గ్లోబల్ సమ్మిట్ కార్యక్రమ విశేషాలను పంచుకున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ది బెస్ట్ మ్యాన్ పవర్ ఇచ్చే రాష్ట్రంగా తెలంగాణ ఉంటుందని భరోసా ఇచ్చారు. ఫ్రాన్స్ కాన్సులేట్ హైదరాబాద్ కార్యాలయాన్ని త్వరలోనే టీ హబ్లో ప్రారంభించనున్నట్టు బెర్తెలోట్ మంత్రికి తెలిపారు. ఈ కార్యక్రమానికి ఫ్రాన్స్ ఇండియా అంబాసిడర్ రానున్నట్టు తెలిపిన ఆయన మంత్రి శ్రీధర్ బాబును ఆహా్వనించారు. భేటీలో ఐటీ, ఇండస్ట్రీస్ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ కూడా ఉన్నారు. త్వరలోనే రాష్ట్రంలో టెలి పెర్ఫార్మన్స్ సంస్థల ఏర్పాటు ఫ్రాన్స్కి చెందిన ప్రముఖ సంస్థ టెలి పెర్ఫార్మన్స్ ప్రతినిధులు మంత్రి డి శ్రీధర్ బాబుతో బుధవారం సచివాలయంలో సమావేశమయ్యారు. ఆ సంస్థ ఈనెల 5వ తేదీ నుంచి 8వ తేదీ వరకు ఐటీసీ కోహినూర్లో నిర్వహిస్తున్న ఇమ్మెన్సీవ్ ఈవెంట్కు అతిథిగా రావాలని ఆహా్వనించారు. దేశ వ్యాప్తంగా తమ సంస్థలో 90 వేల మంది ఉద్యోగులు, ప్రపంచ వ్యాప్తంగా 95 దేశాల్లో 5 లక్షల మందికి పైగా ఉద్యోగులు 300 పైగా భాషల్లో పనిచేస్తున్నారని మంత్రికి తెలిపారు. త్వరలోనే హైదరాబాద్తో పాటు ద్వితీయ శ్రేణి నగరాలుగా ఉన్న పలు జిల్లా కేంద్రాల్లో తమ సంస్థలను ఏర్పాటు చేసేందుకు ఆసక్తిగా ఉన్నామని కంపెనీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ మమతా లంబ మంత్రి శ్రీధర్బాబుకి వివరించారు. టెలీ పెర్ఫార్మన్స్ సంస్థ పెట్టుబడులకు, సంస్థ కార్యకలాపాలకు ప్రభుత్వం తరుపున అన్ని సహాయ సహకారాలు అందిస్తామని శ్రీధర్ బాబు హామీనిచ్చారు. సమావేశంలో కంపెనీ ప్రతినిధులు శివ, ఫణింధర్ నల్లబెల్లి, స్వాతి పాల్గొన్నారు. -
శాన్ఫ్రాన్సిస్కోలో భారత నూతన కాన్సులేట్ జనరల్గా తెలుగు వ్యక్తి!
అమెరికా... అందులోనూ సిలికాన్ వాలీ అంటే తెలుగు రాష్ట్రాల వారికి ఎంతో ఆసక్తి. ఐటీ ఇండస్ట్రీకి పెట్టింది పేరైన ఈ ప్రాంతానికి ఇప్పుడు భారత నూతన కాన్సులేట్ జనరల్గా తెలుగు వ్యక్తి నియమితులయ్యారు. అమెరికాలోని శాన్ఫ్రాన్సిస్కో కేంద్రంగా శ్రీకర్ రెడ్డి పని చేస్తారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని నల్గొండ జిల్లా యాదాద్రి మోత్కూరు మండలంలోని కొండగడప శ్రీకర్ రెడ్డి స్వస్థలం. కాకతీయ వర్సిటీ నుంచి మెడిసిన్ చదివిన శ్రీకర్ రెడ్డి.. యూపీఎస్సీ పరీక్ష రాసి ఐఎఫ్ఎస్కు ఎంపికయ్యారు. జర్మనీలోని బెర్లిన్లో పనిచేసిన శ్రీకర్రెడ్డి.. దిల్లీలోని ఫారిన్ అఫైర్స్లో కూడా సేవలందించారు. ప్రస్తుతం భారత్లో డిపార్ట్మెంట్ ఆఫ్ కామర్స్లో సంయుక్త కార్యదర్శిగా పనిచేస్తున్న డాక్టర్ శ్రీకర్ కె రెడ్డి (ఐఎఫ్ఎస్) శాన్ఫ్రాన్సిస్కోలో కాన్సులేట్ జనరల్గా బాధ్యతలు స్వీకరించారు. The Consulate General of India, San Francisco @CGISFO announces with pleasure, Dr. Srikar Reddy has assumed charge as the Consul General. pic.twitter.com/WW09HDiwPl — India in SF (@CGISFO) August 21, 2023 బాధ్యతలు స్వీకరించిన తర్వాత జరిగిన ఇండిపెండెన్స్ డే కార్యక్రమంలో శ్రీకర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన్ను సాక్షి టీవీ ప్రత్యేకంగా ఇంటర్వ్యూ చేసింది. "రెండు తెలుగు రాష్ట్రాల్లో పాస్ పోర్ట్ అధికారిగా పని చేశాను. ఇక్కడ ఇండిపెండెన్స్ డే సమయంలో శాన్ఫ్రాన్సిస్కోలో కాన్సుల్ జనరల్గా బాధ్యతలు స్వీకరించడాన్ని సంతోషంగా భావిస్తున్నాను. ఎంతో మంది తెలుగు వారు టెకీలుగా ఈ ప్రాంతంలో ఉన్నారు. భారత్, అమెరికా ప్రభుత్వాలు రెండు దేశాల మధ్య సంబంధాల మెరుగుదలకు ప్రయత్నించడం శుభదాయకం. అమెరికా వీసాల కోసం పెరుగుతున్న టైంలైన్ను ఇప్పటికే ఇక్కడి ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చాం. విద్యార్థుల డీపోర్టేషన్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకుని ఆ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని" శ్రీకర్ రెడ్డి తెలిపారు. ఈ విషయంపై డీజీపీ అంజనీ కుమార్ స్పందించారు. తెలంగాణకు చెందిన శ్రీకర్ రెడ్డి శాన్ ఫ్రాన్సిస్కోలో కాన్సుల్ జనరల్గా బాధ్యతలు స్వీకరించడం తమకెంతో గర్వంగా ఉందంటూ ఆయనకు అభినందనలు తెలిపారు. Srikar Reddy, IFS from Telangana, has been posted as CG of India at San Francisco, USA. He will be incharge of eight States there. We look forward to more trade and business promotion. Best wishes, Srikar. We are so proud of you.#TelanganaPolice pic.twitter.com/N5HOa4YTzE — DGP TELANGANA POLICE (@TelanganaDGP) July 12, 2023 (చదవండి: "మా తుఝే సలామ్" అని హోరెత్తిన లండన్ వీధులు) -
ప్రధాని ఫ్రాన్స్ పర్యటన.. మోదీ భారీ ప్రకటనలు..
ప్రధాని నరేంద్ర మోదీకి ఫ్రాన్స్ రాజధాని పారిస్లో రెడ్కార్పెట్ స్వాగతం లభించింది. రెండు రోజుల పర్యటన నిమిత్తం గురువారం ఆయన పారిస్ చేరుకోగా.. శుక్రవారం ఫ్రెంచ్ నేషనల్ డే వేడుకల్లో మోదీ ముఖ్య అతిథిగా పాల్గొంటారు. పర్యటనలో భాగంగా మోదీ సెయిన్ మ్యూజికల్ కళాప్రాంగణంలో ప్రవాస భారతీయ సమాజంతో మాట్లాడారు. ఈ మేరకు ఫ్రాన్స్లోని భారతీయులకు భారీ ప్రకటనలను చేశారు. అవి.. ► ఇకపై ఫ్రాన్స్లోనూ యూపీఐ సేవలు వినియోగించేలా ఒప్పందం చేసుకున్నట్లు ప్రధాని మోదీ చెప్పారు. ఈఫిల్ టవర్ నుంచే దీనిని ప్రారంభించినట్లు పేర్కొన్నారు. దీంతో ఫ్రాన్స్కు వెళ్లే పర్యటకులు రూపాయిల్లోనే చెల్లింపులు చేయొచ్చు. ► ఫ్రెంచ్ ప్రభుత్వం సహకారంతో మార్సెల్లీలో కొత్త కాన్సులెట్ను ఏర్పాటు చేయనున్నట్లు ప్రధాని మోదీ ప్రకటించారు. ► ఫ్రాన్స్లో మాస్టర్ డిగ్రీ చదువుకోవాలనుకునే భారతీయ విద్యార్థులకు ప్రధాని మోదీ తీపి కబురు చెప్పారు. ఇకపై ఫ్రాన్స్లో భారతీయ విద్యార్థులకు పోస్టు స్టడీ వీసాను ఐదేళ్లకు పొడిగించే విధంగా ఒప్పందం కుదిరినట్లు మోదీ చెప్పారు. ► తమిళ తత్వవేత్త తిరువళ్లువార్ విగ్రహాన్ని ఫ్రాన్స్లో ప్రతిష్టించనున్నట్లు ప్రధాని మోదీ తెలిపారు. కొన్ని వారాల్లోనే ఆ పని పూర్తి కానున్నట్లు చెప్పారు. ► భారతదేశానికి ఉజ్వల భవిష్యత్తు ఉందని పలు రేటింగ్ సంస్థలు చెప్పాయని మోదీ అన్నారు. పెట్టుబడులు పెట్టడానికి ఇండియా సరైన ప్రదేశం.. అవకాశాన్ని అందుపుచ్చుకోవాలని సంస్థలను ప్రధాని మోదీ కోరారు. ఇదీ చదవండి: ఫ్రాన్స్లో మోదీకి రెడ్కార్పెట్ -
పాక్కు చైనా షాక్.. కాన్సులర్ ఆఫీస్ క్లోజ్!
చైనా అనూహ్య నిర్ణయంతో పాక్కు షాక్ ఇచ్చింది. పాకిస్థాన్లోని కాన్సులర్ విభాగాన్ని(దౌత్యపరమైన) మూసేస్తున్నట్లు అక్కడి చైనా రాయబార కార్యాలయం ప్రకటించింది. పాక్లో ఉంటున్న చైనా పౌరులకు.. జాగ్రత్తగా ఉండాలని సూచించిన కొద్దిరోజులోనే చైనా ఈ చర్యకు పూనుకోవడం గమనార్హం. ఇక తదుపరి ప్రకటన వచ్చే వరకు మూసివేసే ఉంటుందని స్పష్టం చేసింది చైనా ఎంబసీ. ఈ మేరకు ఎంబీసీ వెబ్సైట్లో ప్రకటించింది. సాంకేతిక సమస్యల కారణంగా ఫిబ్రవరి 13, 2023 నుంచి తాత్కాలికంగా మూసివేస్తున్నామని ప్రకటనలో పేర్కొందే తప్ప.. అందుకు కారణాలేంటన్న దానిపై మాత్రం ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. అయితే.. పాక్ గడ్డపై చైనీయులను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న దాడులే ఇందుకు ప్రధాన కారణమని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పైగా ఈ మూసివేత శాశ్వతమనే సంకేతాలను అందిస్తోంది చైనా. వాస్తవానికి తాలిబన్ గ్రూప్తో పాక్ ప్రభుత్వం సంధి విరమించుకున్న తర్వాత ఏడాది నుంచే.. అక్కడ దాడులు పెరిగిపోయాయి. ముఖ్యంగా బీజింగ్ బెల్ట్ అండ్ రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్(బీఆర్ఐ)నే ప్రధాన లక్ష్యంగా చేసుకుని పాక్ ఎకనామిక్ కారిడర్(సీపెక్)లో పనిచేస్తునన్న చైనా పౌరులను లక్ష్యంగా చేసుకుని వివిధ తీవ్రవాద గ్రూపులు తరుచుగా దాడి చేస్తున్నాయి. ఈ పరిణామాలపై చైనా, పాక్పై తీవ్ర అసంతృప్తితో ఉంది. వరదల సమయంలోనూ ఈ కారణంతోనే పెద్దగా సాయం కూడా అందించలేదు చైనా. గత ఏప్రిల్లో ఒక మహిళా ఆత్మాహుతి బాంబర్ కరాచీలో ముగ్గురు చైనా టీచర్లను, వారి స్థానిక డ్రైవర్తో సహా హతమార్చిన సంగతి తెలిసిందే. కాగా, సీపెక్ అనేది చైనాను అరేబియా సముద్రాన్ని కలుపుతూ పాక్లోని రోడ్లు, రైల్వేలు, పైప్లైన్లు, ఓడరేవులకు సంబంధించిన 65 బిలియన్ డాలర్ల నెట్వర్క్. ఈ బీఆర్ఐ అనేది తన ఆర్థిక వ్యవస్థను ఆధునీకరించడానికి, విస్తరించడానికి సహాయపడుతుందని పాక్ భావిస్తోంది. (చదవండి: ఇదే భారత్ ఇమేజ్..బాధితులకు అండగా మన బీనా, ఆనంద్ మహీంద్రా ప్రశంసలు)
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నేడు ఎస్వీ డిగ్రీ కళాశాలకు ముగ్గురు కమిటీ సభ్యులరాక
No Headline
ఎన్నికల భారతం పుస్తకావిష్కరణ
వృత్తిదారుల మోములో ఆనందం...
ప్రతి సర్కిల్లో కంట్రోల్ రూం
హైదరాబాద్లో ఈదురుగాలులతో కూడిన భారీవర్షం (ఫొటోలు)
"పవన్ కళ్యాణ్ కు ఓటు వెయ్యం "..తేల్చి చెప్పిన పిఠాపురం టీడీపీ
రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలి
ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించాలి
‘మోసం చేసిన వారిపై చర్య తీసుకోవాలి’
తప్పక చదవండి
- ‘ఆర్య’ సినిమా 20 ఇయర్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
- లగ్జరీ కారు కొనుగోలు చేసిన బుల్లితెర నటి..!
- అవినీతి ‘కాలువ’
- పాతబస్తీలో పతంగేనా?
- నేడు ఏపీలో ప్రధాని ఎన్నికల ప్రచారం
- పిడుగులుపడి ఏడుగురు మృత్యువాత
- బీజేపీ ఖైదీగా శ్రీరాముడు
- Telangana: మరో రెండు రోజులు వానలు
- మండుటెండల్లోనూ నిండా ముంచే..రాష్ట్రవ్యాప్తంగా తడిసిన ధాన్యం
- Madakasira: లోకలా.. నాన్ లోకలా?
Advertisement