-
124 ఏళ్ల భవనం కూల్చివేతకు నోటీసు.. కోర్టును ఆశ్రయించిన యజమాని!
ముంబైలోని ‘సాత్ బంగ్లా’ అనే ప్రాంతం ఎంతో ప్రసిద్ధి చెందింది. సుమారు 124 సంవత్సరాల క్రితం ఇక్కడ ఏడు బంగ్లాలు నిర్మించారు. వాటిలో ఇప్పుడు రెండు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఇప్పుడు వాటిలో ఒకదానిని కూల్చివేసేందుకు బీఎంసీ సిద్ధమవుతోంది. దీంతో భవన యజమాని కోర్టును ఆశ్రయించారు. సముద్రతీరానికి దగ్గరలో నిర్మించిన ఈ బంగ్లాలో పలు గదులు, గ్లాస్ వర్క్తో కూడిన హాలు, ఇటాలియన్ మార్బుల్ ఫ్లోరింగ్లు, బసాల్ట్ స్టోన్ ఫ్లోరింగ్ ఉన్నాయి. ఈ బంగ్లాను ‘1900 ఏడీ’లో నిర్మించినట్లు ఆధారాలున్నాయి. ఈ భవనం చరిత్రకు ఆనవాలుగా నిలిచింది. కాగా గత ఫిబ్రవరి 29న రతన్ కుంజ్ పేరుతో ఉన్న ఈ భవనాన్ని కూల్చివేయనున్నట్లు బీఎంసీ దాని యజమానికి నోటీసు జారీ చేసింది. ఈ భవనం శిథిలావస్థలో ఉందని, కూలిపోయే అవకాశం ఉందని ఆ నోటీసులో పేర్కొంది. అయితే ఈ ఆస్తి సహ యజమానులు షాలు రాహుల్ బరార్తో పాటు అతని ఇద్దరు కుమారులు ఈ నోటీసు వెనుక కుట్ర ఉందని ఆరోపిస్తూ కోర్టును ఆశ్రయించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ ‘మా ఆడిట్, ఇన్టేక్ నివేదికలో ఈ ఆస్తిని భద్రంగా చూస్తామని పేర్కొన్నాం. భవనానికి మరమ్మతులు చేశాం. ఈ కూల్చివేత నోటీసు మాకు పెద్ద దెబ్బ లాంటిది. మా చివరి శ్వాస వరకూ ఈ బంగ్లాను కాపాడుకునేందుకు పోరాడుతాం’ అని పేర్కొన్నారు. ఒకప్పుడు ఈ బంగ్లాను ‘తలాటి బంగ్లా’ అని పిలిచేవారు. సొరాబ్జీ తలాటి పార్సీ కుటుంబం దీనికి ఈ పేరు పెట్టింది. 1896లో దేశంలో ప్లేగు వ్యాప్తి చెందుతున్న సమయంలో ఈ ‘ఏడు బంగ్లాలు’ నిర్మితమయ్యాయి. ఈ భవనం పూర్వ యజమానులు గ్వాలియర్ మహారాజా, కచ్ మహారాజా, దాదాభాయ్ నౌరోజీ, రుస్తమ్ మసాని, సొరాబ్జీ తలాటి, చైనాస్, ఖంబటాస్. ఇటువంటి వారసత్వ సంపదను కాపాడుకోవడం అవసరమని ఆ కుటుంబ సభ్యులు అంటున్నారు. దీనిని చారిత్రక భవనాలు జాబితాలో చేర్చాలని వారు కోరుతున్నారు. -
కోట్ల విలువైన బంగ్లాను కొనుగోలు చేసిన ప్రముఖ యూట్యూబర్!
ప్రముఖ యూట్యూబర్ కమ్ కమెడియన్ భువన్ బామ్ ఖరీదైన ఇంటిని కొనుగోలు చేశారు. గుజరాత్కు చెందిన భువన్ దేశ రాజధాని ఢిల్లీలో విలాసవంతమైన బంగ్లాను తీసుకున్నారు. యూట్యూబ్లో తన వీడియోలతో ఓవర్నైట్ స్టార్గా దాదాపు రూ. 11 కోట్లకు బంగ్లాను కొనుగోలు చేసినట్లు సమాచారం. ఢిల్లీలోని గ్రేటర్ కైలాష్ ప్రాంతంలో బంగ్లాను తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం బీబీ కి వైన్స్ అనే యూట్యూబ్ ఛానెల్ను నిర్వహిస్తున్నాడు. వడోదరకు చెందిన భువన్ బామ్ యూట్యూబ్లో వీడియోల ద్వారానే ఎక్కువగా గుర్తింపు తెచ్చుకున్నారు. 2015లో తన యూట్యూబ్ ఛానెల్ని ప్రారంభించగా.. 26.4 మిలియన్లకు పైగా సబ్స్క్రైబర్స్ కలిగి ఉన్నారు. అతని కంటెంట్ ప్రధానంగా హాస్య భరితమైన పాత్రల చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా కుటుంబం, స్నేహితులతో కలిసి కామెడీ కంటెంట్ను రూపొందిస్తుంటారు. అంతే కాకుండా భువన్ సంగీతంలోకి అడుగుపెట్టారు. ఇప్పటికే చాలా సాంగ్స్ కూడా రిలీజ్ చేశారు. అంతే కాకుండా దిండోరా, రాఫ్తా రాఫ్తా, తాజా ఖబర్ వంటి వెబ్ సిరీస్లలో కూడా నటించాడు. ఇటీవలే ప్రసిద్ధ జపనీస్ గేమ్ షో తకేషిస్ కాజిల్కు కామెంటర్గా వ్యవహరిస్తున్నారు. అయితే ఈ వార్తలపై భువన్ ఇంకా స్పందించలేదు. View this post on Instagram A post shared by Bhuvan Bam (@bhuvan.bam22) -
అమితాబ్ కూతురికి బహుమతిగా కోట్లు విలువ చేసే బంగ్లా!
నటనకు వయసుతో సంబంధం లేదని నిరూపిస్తున్నాడు బాలీవుడ్ బిగ్బీ అమితాబ్ బచ్చన్. 80 ఏళ్లు దాటినా కుర్రాళ్లకంటే హుషారుగా వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు. అంతేకాదు పాపులర్ టీవీ షో ‘కౌన్ బనేగా క్రోర్పతి’కి హోస్ట్గానూ వ్యవహరిస్తున్నాడు. ఇలా వృత్తిపరంగా ఎంత బిజీగా ఉన్నప్పటికీ.. ఫ్యామిలీకి మాత్రం దూరంగా ఉండలేరు బిగ్బీ. బాధ్యత గల తండ్రిగా ఇప్పటికీ తన పిల్లల బాగోగులను చూసుకుంటున్నారు. (చదవండి: పరశురామ్తో గొడవ..గతంలో జరిగింది ఇదే: బన్నీ వాసు) కొడుకుతో పాటు కూతురు శ్వేతా బచ్చన్పై కూడా అమితాబ్కి ఎనలేని ప్రేమ. పెళ్లి చేసి అత్తారింటికి పంపించినా.. ఇప్పటికీ ఆమెకు ఆర్థికంగా ఆదుకుంటూనే ఉంటాడు. తాజాగా తన కూతురుకి ఖరీదైన బహుమతిని అందించి, తండ్రి ప్రేమను చాటుకున్నాడు. తనకెంతో ఇష్టమైన జుహు బంగ్లా ‘ప్రతీక్ష’ను కూతురు శ్వేతా బచ్చన్కు గిఫ్ట్గా అందించారు. దీని విలువల దాదాపు 50 కోట్లకు పైగా ఉంటుందని అంచనా. (చదవండి: అన్నదమ్ముల మధ్య ఈగో, డబ్బు సమస్యలు ఉండొద్దు: మనోజ్) ముంబైలోని అంత్యంత ఖరీదైన జై జుహు ప్రాంతంలో అమితాబ్ బంగ్లా ‘ప్రతీక్ష’ ఉంది. ఈ బంగ్లా అంటే అమితాబ్కు చాలా ఇష్టం. తన పేరెంట్స్తో కలిసి అమితాబ్ ఇక్కడే ఉండేవాడు. అంతేకాదు అభిషేక్, ఐశ్వర్యల పెళ్లి కూడా ఇక్కడే జరిగింది. ఇది మొత్తం 674 చదరపు మీటర్లు, 890.47 చదరపు మీటర్ల విస్తీర్ణంలో రెండు ప్లాట్స్లో విస్తరించి ఉంది. అమితాబ్ ఫ్యామిలీ ప్రస్తుతం జుహులో ఉన్న జల్సా బంగ్లాలో నివసిస్తోంది. View this post on Instagram A post shared by S (@shwetabachchan) -
నోరు నొక్కేందుకే ఈ కుట్ర: భయపడుతూ కూచుంటే ఎలా?
న్యూఢిల్లీ: బాలీవుడ్నటి పరిణీతి చోప్రో భర్త, ఆప్ ఎంపీ, రాఘవ్ చద్దాకు ఊరట లభించింది. ఢిల్లీలోని ప్రభుత్వం బంగ్లాను ఖాళీ చేయాలన్న ట్రయల్ కోర్టు మధ్యంతర ఉత్తర్వులను ఢిల్లీ హైకోర్టు పక్కన పెట్టింది. అయితే ఏప్రిల్ ఆర్డర్ను రద్దు చేస్తూ అక్టోబర్ 5న ట్రయల్ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను రాఘవ్ చద్దా సవాలు చేయడంతో ఈ పరిణామం చోటుచేసుకుంది. దీంతో రాఘవ్ చద్దాకు భారీ ఊరట లభించింది. పాటియాలా హౌస్ కోర్టు ఆదేశాలను పక్కన పెడుతూ, రాఘవ్ చద్దా తన ప్రభుత్వ బంగ్లాలో ఉండవచ్చని, దానిని ఖాళీ చేయాల్సిన అవసరం లేదని ఢిల్లీ హైకోర్టు మంగళవారం తెలిపింది. ఏప్రిల్ 18న సిటీ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను జస్టిస్ అనుప్ జైరామ్ భంభానీతో కూడిన సింగిల్ బెంచ్ సమర్ధించింది. రాజ్యాంగ పరిరక్షణ కోసం పోరాటం ఈ తీర్పుపై స్పందించిన రాఘవ్ చద్దా ఎక్స్లో ఒక పోస్ట్ పెట్టారు. తన పోరాటం ఇల్లు లేదా దుకాణం గురించి రాజ్యంగ రక్షణ గురించి అని ట్వీట్ చేశారు. యువ ఎంపీగా తన నోరు నొక్కే ప్రయత్నంలో భాగంగా, రాజకీయ కక్షతోనే తన బంగ్లా కేటాయింపు రద్దు చేశారని విమర్శించారు.కోట్లాది మంది భారతీయుల తరపున మాట్లాడేవారిని, ప్రతిపక్షాలను ఉద్దేశ పూర్వకంగా టార్గెట్ చేశారని ధ్వజమెత్తారు. బీజేపీ నేతృత్వంలోని కేంద్రాన్ని విమర్శిస్తూ తాను పార్లమెంటులో రెండు ప్రసంగాలు చేశానని, తన తొలి ప్రసంగం తర్వాత తన అధికారిక వసతి రద్దు చేశారన్నారు.అలాగే రెండో ప్రసంగం తరువాత ఎంపీగా తన సభ్యత్వాన్ని సస్పెండ్ చేశారని పేర్కొన్నారు. నీతిగా, నిజాయితీగా మాట్లాడితే ఏమవుతుందో భయపడుతూంటే ఇక ఏ ఎంపీ పని చేయలేరంటూ తన ఎక్స్ పోస్ట్లో తెలిపారు. Ye makan ya dukan ki nahin, Samvidhan ko bachane ki ladhayi hai In the end, truth and justice have prevailed My statement on the Hon'ble Delhi High Court's ruling to set aside the unjust order to evict me from my official residence. pic.twitter.com/fA7BJ2zLYm — Raghav Chadha (@raghav_chadha) October 17, 2023 -
రూ.400 కోట్లకు అలనాటి మేటి హీరో బంగ్లా అమ్మకం: దాని స్థానంలో భారీ టవర్?
బాలీవుడ్ అలనాటి మేటి హీరో, దివంగత దేవానంద్కుచెందిన లగ్జరీ బంగ్లాను విక్రయించినట్టు మీడియాలో వార్తలుగుప్పుమన్నాయి. దేవానంద్ డ్రీమ్ హౌస్ ముంబైలోని జుహూ బంగ్లాని ఒక రియల్ ఎస్టేట్ కంపెనీకి భారీ మొత్తానికి రూ .400 కోట్లకు విక్రయించినట్టు తెలుస్తోంది. దాని స్థానంలో బహుళ అంతస్థుల భవనం నిర్మించబడుతుందనే వార్తలు హల్చల్ చేశాయి. అయితే ఇవన్నీ పుకార్లేనని తేలిపోయింది. ఈ రూమర్లపై దేవానంద్ మేనల్లుడు,నిర్మాత కేతన్ ఆనంద్ తాజాగా స్పందించారు. అలాంటి ఉద్దేశమేదీ లేదని, అవన్నీ తప్పుడు వార్తలని ఆయన ఖండించారు. దీనికి సంబంధించి దేవానంద్ కుమార్తె దేవీనా, ఇతర కుటుంబ సభ్యులతో మాట్లాడి ధృవీకరించుకున్నట్టు వెల్లడించారు. దాదాపు 40ఏళ్లపాటు దేవానంద్ తన భార్య కల్పనా కార్తీక్, పిల్లలు సునీల్ ఆనంద్ , దేవినా ఆనంద్లతో కలిసి గడిపారు. (భారీ తగ్గింపు: రూ. 48,900లకే ఐఫోన్ 15 దక్కించుకునే చాన్స్) అలాంటి ఇల్లును విక్రయించారని, డీల్ కూడా పూర్తయి పేపర్ వర్క్ జరుగుతోందని వార్తలొచ్చాయి. ప్రస్తుతం ఈ బంగ్లాను చూసుకోడానికి ఎవరూ లేని కారణంగా ముఖ్యంగా కొడుకు సునీల్ అమెరికాలోనూ, కూతురు దేవినా, తల్లి కల్పనాతో కలిసి ఊటీలో ఉంటోంది. అందుకే దీన్ని విక్రయించాలని నిర్ణయించుకున్నారు. దాదాపు అదే కారణంతో మహారాష్ట్రలోని పన్వెల్లో కొంత ఆస్తిని కూడా విక్రయించారని కథనాలొచ్చాయి. (వాట్సాప్ చానెల్: ప్రధాని మోదీ రికార్డ్..షాకింగ్ ఫాలోవర్లు) ఈ ప్రాంతంలోని ప్రముఖ పారిశ్రామికవేత్తలు, సినీ సెలబ్రిటీల బంగ్లాలు ఉన్న ప్రధాన ప్రదేశం కాబట్టి అంత దర పలికిందనీ, ఈప్లేస్లో 22 అంతస్తుల భారీ టవర్ను నిర్మించనున్నారని కూడా అంచనావేశారు. అంతేకాదు 10 సంవత్సరాల క్రితం ఆనంద్ స్టూడియో అమ్మినప్పుడు, ఆ డబ్బుతో మూడు అపార్ట్మెంట్లు కొని, ఒకటి సునీల్కు, మరొకటి దేవీనాక, మూడోది అతని భార్య కల్పనకు ఇచ్చారనీ జుహు బిల్డింగ్ అమ్మకం ద్వారా వచ్చిన సొమ్మును కూడా అలాగే పంచుకుంటారనేది కథనం.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
కాంగ్రెస్కు పాకిస్తాన్ మద్దతు ఉంది: అనురాగ్ ఠాకూర్
టాలీవుడ్ హీరో డ్రీమ్ ప్రాజెక్ట్.. రెబల్ స్టార్ ఎంట్రీ!
ఇరాన్ నుంచి పారిపోయి కొచ్చికి భారత మత్స్యకారులు
పాఠశాల నేపథ్యంలో వస్తోన్న సత్య.. ఆసక్తిగా ట్రైలర్!
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (06-05-2024)
Video: కేసీఆర్ బస్సును తనిఖీ చేసిన ఎన్నికల అధికారులు
'దేవర' షూటింగ్లో తేనెటీగల కలకలం.. 20 మందికి గాయాలు
ఎస్ఆర్హెచ్తో ముంబై కీలక పోరు.. కొత్త ప్లేయర్ ఎంట్రీ
వారితో భయంకరమైన అనుభవాలు ఎదుర్కొన్నా: హీరామండి నటి
కేజ్రీవాల్కు మరో షాక్.. ‘ఎల్జీ’ సంచలన నిర్ణయం
తప్పక చదవండి
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- సూపర్ మచ్చీ.. ఇలాంటి గ్రూపు డ్యాన్స్ మీరెపుడైనా చూశారా?
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- పూంచ్ ఉగ్రదాడి.. టెర్రరిస్టులపై రూ.20 లక్షల రివార్డు
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- ‘SRH కాదు.. పరుగుల విధ్వంసానికి మారు పేరు ఆ జట్టే’
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement