breaking news
Afghanistan Cricket Board (ACB)
-
సొంతగడ్డపై పర్యాటక జట్టుగా టీమిండియా!
టీమిండియా విచిత్ర పరిస్థితిని ఎదుర్కోనుంది. సొంతగడ్డ మీదే పర్యాటక జట్టుగా మ్యాచ్లు ఆడనుంది. అవును.. మీరు చదివింది కరెక్టే!.. ఇంతకీ సంగతి ఏమిటంటే.. అఫ్గానిస్తాన్కు స్వదేశంలో క్రికెట్ మ్యాచ్లు నిర్వహించే పరిస్థితులు లేవు.ఇప్పటికే పలు మ్యాచ్లు ఈ నేపథ్యంలో భారత్ అఫ్గాన్ క్రికెట్ బోర్డు (ACB)కు అండగా నిలుస్తోంది. భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) సహకారంతో ఏసీబీ భారత్లో ఆతిథ్య దేశంగా తమ మ్యాచ్లు నిర్వహించుకుంటోంది. డెహ్రాడూన్, గ్రేటర్ నోయిడా, లక్నోలను తమ హోంగ్రౌండ్లుగా గతంలో ఎంచుకుంది. అంతేకాదు.. న్యూజిలాండ్తో ఏకైక టెస్టుకు కూడా షెడ్యూల్ను ఖరారు చేసుకుంది. అయితే, ఒక్క బంతి పడకుండానే ఈ మ్యాచ్ రద్దై పోయింది. తాజాగా టీమిండియాకే భారత్లో ఆతిథ్యం ఇచ్చేందుకు అఫ్గాన్ సిద్ధమైనట్లు తెలుస్తోంది.ఢిల్లీలో అఫ్గాన్- భారత్ సిరీస్టీమిండియా- శ్రీలంక టెస్టు సిరీస్ ... ఆసియా క్రీడలు-2026 మధ్య విరామంలో టీమిండియా- అఫ్గానిస్తాన్ టీ20 సిరీస్ నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఆగష్టు 27 నుంచి భారత్- శ్రీలంక టెస్టు సిరీస్ మొదలుకానుండగా.. ఆసియా క్రీడలకు సెప్టెంబరు 24న తెర లేవనుంది.ఈ క్రమంలో సెప్టెంబరు 13 నుంచి టీమిండియాతో మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ ఆడేందుకు అఫ్గాన్ బోర్డు ప్రణాళిక రచించినట్లు సమాచారం. ఇందుకు ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదిక అని తెలుస్తోంది. ఈ మేరకు ఈఎస్పీఎన్క్రిక్ఇన్ఫో కథనం వెలువరించింది.గెలుపు బోణీఇదిలా ఉంటే.. ఇటీవలే అఫ్గాన్ జట్టు భారత్లో పర్యటించిన సంగతి తెలిసిందే. ఆతిథ్య టీమిండియాతో ఏకైక టెస్టులో ఓడిపోయిన అఫ్గాన్.. మూడు వన్డేల సిరీస్లో 0-3తో క్లీన్స్వీప్ అయింది. ఇదిలా ఉంటే.. టీ20 ప్రపంచకప్-2026లో చాంపియన్గా నిలిచిన తర్వాత విదేశీ పర్యటనలో భాగంగా తొలిసారి టీ20 సిరీస్ ఆడిన టీమిండియాకు చేదు అనుభవం ఎదురైంది.పసికూన ఐర్లాండ్ చేతిలో 2-0తో వైట్వాష్ అయిన శ్రేయస్ సేన.. ఆ తర్వాత ఇంగ్లండ్ చేతిలో 4-0తో క్లీన్స్వీప్ అయింది. తాజాగా జింబాబ్వే గడ్డ మీద గురువారం నాటి తొలి టీ20లో గెలిచి ఎట్టకేలకు.. ఏడు మ్యాచ్ల తర్వాత తొలి విజయం సాధించింది.చదవండి: విజయానికి క్రెడిట్ నాకు ఇవ్వొద్దు.. ఆ అర్హత లేదు: వైభవ్ -
కన్నీరుమున్నీరైన రషీద్ ఖాన్.. వీడియో వైరల్
అఫ్గానిస్తాన్ దిగ్గజ పేసర్ షాపూర్ జద్రాన్ అంత్యక్రియలు ముగిశాయి. బుధవారం కాబూల్లోని మరంజన్ హిల్ స్మశానవాటికలో జద్రాన్ అంత్యక్రియలు నిర్వహించారు. ఈ మాజీ ఫాస్ట్ బౌలర్కు తమ చివరి నివాళులు అర్పించేందుకు అఫ్గాన్ క్రికెటర్లతో పాటు ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ సందర్భంగా అఫ్గాన్ స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు. జద్రాన్ భౌతిక కాయానికి నివాళులర్పిస్తూ కన్నీరుమున్నీరయ్యాడు. అతడితో పాటు వికెట్ కీపర్-బ్యాటర్ రహ్మానుల్లా గుర్బాజ్, ఓపెనర్ ఇబ్రహీం జద్రాన్ సైతం కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను అఫ్గాన్ క్రికెట్ బోర్డు ఎక్స్లో షేర్ చేసింది.Rashid Khan broke down in tears as he bid a final farewell to his teammate and Afghanistan cricket legend Shapoor Zadran following his passing.😢🥺 pic.twitter.com/vF2DtNCXGl— 𝐑𝐮𝐬𝐡𝐢𝐢𝐢⁴⁵ (@rushiii_12) July 9, 2026కాగా 38 ఏళ్ల షాపూర్ జద్రాన్ హెమోఫాగోసైటిక్ లింఫోహిస్టియోసైటోసిస్ అనే అరుదైన వ్యాధితో ఢిల్లీలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో మంగళవారం(జూలై 7) కన్నుమూశారు. తన 39వ పుట్టినరోజుకు కేవలం ఒక్క రోజు ముందు షాపూర్ మరణించడం అఫ్గాన్ క్రికెట్లో తీవ్ర విషాదాన్ని నింపింది.The funeral prayer for the late Shapoor Zadran was offered this morning at 10:00 AM at Eidgah Mosque in Kabul, attended by current and former Afghanistan national team players, officials of the Afghanistan Cricket Board, members of his family, respected elders, and thousands of… pic.twitter.com/TcQCaEwlSA— Afghanistan Cricket Board (@ACBofficials) July 9, 2026అఫ్గాన్ క్రికెట్లో జద్రాన్ తనకంటూ ప్రత్యేక స్ధానాన్ని సంపాదించుకున్నాడు. 2009 నుంచి 2020 మధ్య కాలంలో అఫ్గాన్ తరపున 80 అంతర్జాతీయ మ్యాచ్లు ఆడి 80 వికెట్లు పడగొట్టాడు. -
38 ఏళ్ల వయసులో అఫ్గాన్ క్రికెటర్ కన్నుమూత
అఫ్గానిస్తాన్ మాజీ క్రికెటర్ షాపూర్ జద్రాన్ కన్నుమూశాడు. అఫ్గాన్ క్రికెట్ బోర్డు ఈ విషయాన్ని మంగళవారం ధ్రువీకరించింది. కాగా షాపూర్ జద్రాన్ గత కొంతకాలంగా అరుదైన వ్యాధితో బాధపడుతున్న విషయం విదితమే. వ్యాధి కారణంగా అతడి శరీరంలో తెల్ల రక్తకణాల సంఖ్య పూర్తిగా పడిపోయింది.ఈ క్రమంలో రోగనిరోధక వ్యవస్థ కూడా పూర్తిగా దెబ్బతినడంతో.. అఫ్గాన్ నుంచి భారత్కు తరలించి అత్యాధునికి చికిత్స అందిస్తున్నారు. గత కొన్నినెలలుగా న్యూ ఢిల్లీలోని ఆస్పత్రిలో ఉన్న షాపూర్ జద్రాన్ తాజాగా తుదిశ్వాస విడిచాడు. బుధవారమే అతడు 39వ వసంతంలో అడుగుపెట్టాల్సింది. అలాంటిది పుట్టినరోజుకు ఒకరోజు ముందుగానే అతడు మరణించడం కుటుంబాన్ని మరింత విషాదంలోకి నెట్టేసింది.ఆరడుగుల బౌలర్ఆరడుగుల రెండు అంగుళాల ఎత్తుతో.. జులపాల జుట్టుతో.. తనదైన శైలిలో బౌలింగ్ చేస్తూ చాలాకాలం అభిమానులను అలరించాడు షాపూర్ జద్రాన్. అఫ్గాన్ తరఫున 2009- 2020 మధ్య అంతర్జాతీయ క్రికెట్ ఆడాడు ఈ ఫాస్ట్ బౌలర్.ఇంటర్నేషనల్ కెరీర్లో 44 వన్డేలు, 36 టీ20 మ్యాచ్లు ఆడిన షాపూర్.. వన్డేల్లో 43, టీ20లలో 37 వికెట్లు కూల్చాడు. మూడుసార్లు టీ20 ప్రపంచకప్ జట్లలో భాగమయ్యాడు. అఫ్గాన్ క్రికెట్ నివాళిషాపూర్ జద్రాన్ మరణం పట్ల అఫ్గాన్ క్రికెట్ బోర్డు సంతాపం వ్యక్తం చేసింది. అఫ్గాన్ క్రికెట్ అభివృద్ధిలో అతడూ భాగమయ్యాడని.. చిన్న వయసులోనే అతడు కన్నుమూయడం కలచివేసిందని విచారం వ్యకతం చేసింది. షాపూర్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేసింది. అతడి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించింది. -
పరిస్థితి విషమం.. ఐసీయూలో మాజీ స్టార్ క్రికెటర్!
38 ఏళ్ల అఫ్గానిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షాపుర్ జద్రన్ చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. తెల్లరక్త కణాల సంఖ్య పడిపోవడంతో ప్రస్తుతం షాపుర్ జద్రన్ భారత్లోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో ఐసీయూలో ఉన్నాడు. తెల్లరక్త కణాల సంఖ్య చాలా తక్కువగా ఉండడంతో అతడి పరిస్థితి విషమంగానే ఉందని వైద్యులు పేర్కొన్నారు. మరో 18 గంటలు గడిస్తే కానీ షాపుర్ జద్రన్ ఆరోగ్య పరిస్థితి ఏంటనేది చెప్పలేమని వైద్యులు వెల్లడించారు. ప్రస్తుతం ఐసీయూలో చికిత్స పొందుతున్న షాపుర్ జద్రన్ త్వరగా కోలుకోవాలని అతని కుటుంబసభ్యులతో పాటు అఫ్గానిస్తాన్ క్రికెట్ అభిమానులు దేవుడిని ప్రార్థిస్తున్నారు. సోషల్మీడియాలో కూడా షాపుర్ జర్దన్ త్వరగా కోలుకోవాలంటూ ఆకాంక్షిస్తున్నారు. అయితే కొన్ని వారాల కిందటే తీవ్ర అనారోగ్యానికి గురైన షాపుర్ జద్రన్ చాలా రోజుల ఆసుపత్రిలోనే చికిత్స పొందాడు. ఇటీవలే డిశ్చార్జి అయిన అతడు మరోసారి ఆసుపత్రి పాలవ్వడం ఆందోళనకు గురి చేస్తోంది. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న షాపుర్ జద్రన్ ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకుంటూ భావోద్వేగానికి లోనయ్యాడు. జద్రన్ తనకు మంచి మిత్రుడని, ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. పాక్కు చెందిన మరో మాజీ క్రికెట్ షాహిద్ అఫ్రిది కూడా షాపుర్ జద్రన్ ఆరోగ్య పరిస్థితి విషయం తెలుసుకొని బాధపడ్డాడు. అతని కుటుంబసభ్యులతో మాట్లాడిన షాహిద్ అఫ్రిది తన చిరకాల మిత్రుడు షాపుర్ జద్రన్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు పేర్కొన్నాడు. క్రికెట్లో అఫ్గానిస్తాన్ ఎదుగుదలలో షాపుర్ జద్రన్ కీలక పాత్ర పోషించాడు. దశాబ్దానికి పైగా ఆఫ్గన్కు ప్రాతినిధ్యం వహించిన షాపుర్ జద్రన్ నిప్పులు చెరిగే బంతులతో ప్రపంచ మేటి బ్యాటర్లను వణికించాడు. స్టీవ్ స్మిత్, కేన్ విలియమ్సన్, డేవిడ్ వార్నర్ వంటి బ్యాటర్లను తన స్వింగ్ బౌలింగ్తో ముప్పతిప్పలు పెట్టి పెవిలియన్ చేర్చాడు. 2009లో స్కాట్లాండ్తో వన్డే మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిన షాపుర్ జద్రన్ అప్గానిస్తాన్ తరఫున 43 వన్డేల్లో 43 వికెట్లు, 32 టీ20ల్లో 27 వికెట్లు పడగొట్టాడు. అఫ్గానిస్తాన్ తరఫున మూడు టీ20 ప్రపంచకప్పుల్లో పాల్గొన్న షాపుర్ జద్రన్ 2015 వన్డే ప్రపంచకప్లో స్కాట్లాండ్పై విజయం సాధించి ఐసీసీ టోర్నీల్లో తొలి విజయాన్ని నమోదు చేసిన అఫ్గానిస్తాన్ జట్టులో సభ్యుడిగా ఉన్నాడు.Zardan brother is like a buddy to me. I am wishing him speedy recovery. Ameen🤲 pic.twitter.com/8oGPUVwHai— Umar Akmal (@Umar96Akmal) April 17, 2026చదవండి: స్టేడియంలో కనిపించని ప్రీతిజింటా.. అసలేమైంది? -
యుద్ధం ప్రభావం.. క్రికెట్ సిరీస్ రద్దు
పశ్చియాసియాలో జరుగుతున్న యుద్ధం ప్రభావం క్రికెట్కు కూడా తగిలింది. షెడ్యూల్ ప్రకారం మార్చి 13 నుంచి 25 వరకు శ్రీలంక, అఫ్గానిస్థాన్ల మధ్య దుబాయ్ వేదికగా వన్డే సిరీస్ ప్రారంభం కావాల్సి ఉంది. కానీ పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా విమానాల రాకపోకలపై నిషేధంతో సిరీస్ రద్దు అయినట్లు శ్రీలంక క్రికెట్ బోర్డు ఒక ప్రకటనలో తెలిపింది. కాగా షార్జా వేదికగా మార్చి 13 నుంచి అఫ్గానిస్థాన్, శ్రీలంక మధ్య మూడు టీ20లు, మార్చి 20, 22, 25 తేదీల్లో మూడు వన్డే మ్యాచ్లు జరగాల్సి ఉంది. కానీ ప్రస్తుతం పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఇప్పుడప్పుడే సిరీస్ నిర్వహించే అవకాశాల్లేవు. దీంతో సిరీస్ రద్దుకే మొగ్గు చూపుతున్నట్లు ఇరుజట్ల క్రికెట్ బోర్డులు నిర్ణయం తీసుకున్నాయి.ఇటీవలే ముగిసిన టీ20 ప్రపంచకప్లో ఈ రెండు జట్లు నిరాశ పరిచాయి. అఫ్గానిస్థాన్ గ్రూప్ దశలోనే ఇంటిబాట పట్టగా.. ఆతిథ్య హోదాలో సూపర్-8కు పరిమితం కావాల్సి వచ్చింది. పశ్చిమాసియాలో యుద్ధం మొదలై రెండు వారాలు గడుస్తున్నా ఇప్పటికీ అటు ఇరాన్, ఇటు ఇజ్రాయెల్, అమెరికాలు మాత్రం వెనక్కి తగ్గకుండా దాడులు చేసుకుంటూనే ఉన్నాయి. -
అఫ్గనిస్తాన్ కొత్త హెడ్కోచ్గా అతడే.. ఏసీబీ ప్రకటన
అఫ్గనిస్తాన్ క్రికెట్ జట్టుకు కొత్త హెడ్కోచ్ వచ్చాడు. తాజా టీ20 ప్రపంచకప్ వరకు అఫ్గన్ జట్టుకు ఇంగ్లండ్ మాజీ ప్లేయర్ జొనాథన్ ట్రాట్ కోచ్గా వ్యవహరించిన విషయం తెలిసిందే. అయితే, టోర్నీ అనంతరం అతడు పదవి నుంచి దిగిపోయాడు.ట్రాట్ స్థానంలోఈ క్రమంలో ట్రాట్ స్థానంలో కొత్త హెడ్ కోచ్గా రిచర్డ్ పైబస్ను నియమించినట్లు అఫ్గనిస్తాన్ క్రికెట్ బోర్డు (ACB) తెలిపింది. వచ్చే నెలలో శ్రీలంకతో జరగనున్న పరిమిత ఓవర్ల సిరీస్ నుంచి పైబస్ బాధ్యతలు చేపట్టనున్నట్లు వెల్లడించింది. ‘అఫ్గనిస్తాన్ జాతీయ జట్టుకు రిచర్డ్ పైబస్ను కొత్త హెడ్ కోచ్గా నియమించాం. శ్రీలంకతో సిరీస్ నుంచి అతడు జట్టుతో చేరతాడు’ అని ఏసీబీ పేర్కొంది. కోచ్గా మంచి రికార్డుఇక ఇంగ్లండ్కు చెందిన పైబస్ ఒకే ఒక్క లిస్ట్ ‘ఎ’ మ్యాచ్ ఆడాడు. అయితే, ఆటగాడిగా పెద్దగా అనుభవం లేకపోయినా... కోచ్గా మంచి రికార్డు ఉంది. పైబస్ 2013 నుంచి 2019 వరకు వెస్టిండీస్ జట్టుకు హెడ్ కోచ్గా వ్యవహరించాడు. అతడు విండీస్ డైరెక్టర్ ఆఫ్ క్రికెట్గా ఉన్న సమయంలోనే కరీబియన్ జట్లు పురుషుల, మహిళల, అండర్–19 వరల్డ్కప్ ట్రోఫీలు సాధించాయి. సూపర్-8 చేరకుండానేకాగా టీ20 ప్రపంచకప్-2026 టోర్నీలో గ్రూప్-డి నుంచి సౌతాఫ్రికా, న్యూజిలాండ్, యూఏఈ, కెనడాలతో తలపడ్డ అఫ్గనిస్తాన్.. నాలుగింటికి రెండే మ్యాచ్లు గెలిచింది. తద్వారా సూపర్-8 చేరకుండానే నిష్క్రమించింది. గత ఎడిషన్లో అఫ్గన్ జట్టు అనూహ్య రీతిలో సెమీస్ చేరిన సంగతి తెలిసిందే.చదవండి: T20 WC 2026: పాక్ జట్టులో కలకలం


