హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో జరిగిన హెచ్ఎస్బీసీ రగ్బీ ప్రీమియర్ లీగ్ (ఆర్పీఎల్) రెండో సీజన్ ఫైనల్స్లో హైదరాబాద్ హీరోస్ జట్టు అద్భుతమైన ప్రదర్శనతో ముంబై డ్రీమర్స్ను 41-17 స్కోరుతో చిత్తు చేసి చాంపియన్గా అవతరించింది.
ఆదివారం జరిగిన ఈ మెగా ఫైనల్ మ్యాచ్కు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ ఈవెంట్ హైదరాబాద్ను క్రీడా హబ్గా మార్చడంలో కీలక పాత్ర పోషించింది. జీఎంఆర్ గ్రూప్ కార్పొరేట్ చైర్మన్ కిరణ్ కుమార్ గ్రాంధి, మెగాస్టార్ చిరంజీవి, పీవీ సింధు, మృణాళ్ ఠాకూర్ వంటి ప్రముఖులు కూడా ముగింపు వేడుకలకు హాజరై ఈ క్రీడను మరింత ఆకర్షణీయం చేశారు.


