

ఆస్ట్రేలియా గడ్డపై భారత మహిళా క్రికెట్ జట్టు ఓపెనర్ స్మృతి మంధాన సెంచరీతో మెరిసింది

ఆసీస్తో బుధవారం నాటి మూడో వన్డేలో 109 బంతులు ఎదుర్కొని 14 ఫోర్లు, 1 సిక్సర్ సాయంతో శతకం బాదింది

ఈ నేపథ్యంలో స్మృతి మంధాన ప్రియుడు, బాలీవుడ్ మ్యూజిక్ కంపోజర్ పలాష్ ముచ్చల్ పుష్ప బీజీఎంతో ఆమె సెంచరీని సెలబ్రేట్ చేశాడు

ఇన్స్టా స్టోరీలో స్మృతి ఫొటోను షేర్ చేస్తూ పుష్ప బీజీఎం యాడ్ చేశాడు

ఇదిలా ఉంటే.. ఈ మ్యాచ్లో స్మృతి ఒంటరి పోరాటం వృథాగా పోయింది.

టాస్ ఓడి మొదట బ్యాటింగ్కు దిగిన ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 298 పరుగులు చేసింది.

లక్ష్య ఛేదనలో స్మృతి సెంచరీతో పోరాడినా.... మరోవైపు నుంచి ఆమెకు సరైన సహకారం లభించలేదు.

దీంతో భారత జట్టుకు ఆసీస్ చేతిలో ఓటమి తప్పలేదు

ఇక మూడు మ్యాచ్ల వన్డేల సిరీస్లో ఆసీస్ అన్నీ గెలిచి 3-0తో క్లీన్స్వీప్ చేయడం గమనార్హం.





