
2025-26 బడ్జెట్కు అంతా సిద్ధమైంది. ఈ ఉదయం బడ్జెట్ ప్రతులు పార్లమెంట్కు చేరుకున్నాయి. ఆర్థిక మంత్రిత్వ శాఖ కార్యాలయం నుంచి బడ్జెట్తో మంత్రి నిర్మలా సీతారామన్ రాష్ట్రపతి భవన్కు వెళ్లారు.

పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు రాష్ట్రపతి ఆమోదం లభించింది. ఈ సందర్భంగా 8వసారి బడ్జెట్ ప్రవేశపెడుతున్న నిర్మలమ్మకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము స్వీట్ తినిపించారు.

అనంతరం.. ఆమె పార్లమెంట్కు బయల్దేరారు. కేబినెట్ ఆమోదం లభించాక.. పార్లమెంట్లో బడ్జెట్ను నిర్మలా సీతారామన్ ప్రవేశపెడతారు.


















