
ఆషాఢ మాసం వచ్చిందంటే చాలు హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లోని భక్తులందరూ గోల్కొండ జగదాంబిక,సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారితో సహా ఈ 6 దేవాలయాలను తప్పక సందర్శిస్తారు.

ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో తొలి గురువారం లేదా తొలి ఆదివారం నాడు గోల్కొండ కోటలోని జగదాంబిక ఆలయం నుంచే బోనాల సంబురాలు ప్రారంభమవుతాయి.

శ్రీ ఉజ్జయిని మహాంకాళి అమ్మవారి దేవస్థానం సికింద్రాబాద్లోని రాంగోపాల్ పోలీస్స్టేషన్ సమీపంలో ఉంటుంది. బోనాల సంబురాల్లో ఈ దేవాలయానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు.

జంట నగరాల్లో కట్ట మైసమ్మ ఆలయాలు చాలా ఉన్నాయి. అయితే అన్నింటికంటే శ్రీ కనకాల కట్ట మైసమ్మ ఆలయానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. హైదరాబాద్లో ట్యాంక్ బండ్ నిర్మించే సమయంలో కార్మికుల సంక్షేమం కోసం ఈ ఆలయాన్ని నిర్మించారట.

పాతబస్తీలోని ప్రముఖ అమ్మవారి దేవాలయాల్లో దర్బార్ మైసమ్మ గుడికి ఎంతో ప్రత్యేకత ఉంది. ఇక్కడ కూడా ప్రతి సంవత్సరం బోనాల సంబురాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు.

హైదరాబాద్లోని అమీర్పేట సమీపంలో ఉండే బల్కంపేటలోని ఎల్లమ్మ పోచమ్మ ఆలయంలోనూ శ్రీ ‘రేణుకా ఎల్లమ్మ’ దేవస్థానంలో బోనం సంబురాలు ఘనంగా జరుగుతాయి.

లాల్ దర్వాజా మహంకాళి ఆలయం హైదరాబాద్ లోని పాతబస్తీలో ఉంది.

తెలంగాణ సంస్కృతి సంప్రదాయాల్లో ప్రత్యేకంగా నిలిచే పండగల్లో బోనాలు ఒకటి. అలాంటిది ఆషాఢ బోనాల జాతరను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. ఈ నెల 26 నుంచి జులై 24 వరకు జరగనున్న బోనాల పండగ కోసం నగరంలోని ప్రధాన ఆలయాలు అందంగా ముస్తాబు అవుతున్నాయి. భక్తులు తప్పకుండా సందర్శించిన ఈ ఆలయాలు, వాటి ముస్తాబు చిత్రాలను చూసేయండి.









