తమిళనాడు : సీఎం అంటే కేవలం కుర్చీ కాదు... సమాజానికి సందేశం ఇచ్చే నాయకుడని మరోసారి నిరూపించారు తమిళనాడు సీఎం జోసెఫ్ విజయ్ (Tamil Nadu Chief Minister Joseph Vijay)
ప్రపంచ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా శుక్రవారం చెన్నై మరీనా బీచ్లో నిర్వహించిన అవగాహన మారథాన్లో తమిళనాడు సీఎం విజయ్ స్వయంగా పాల్గొన్నారు. (Start Run Stop Drugs)
"స్పోర్ట్స్ ఎంచుకో.. డ్రగ్స్కు దూరంగా ఉండు" అనే సందేశంతో వేలాది మంది యువతతో కలిసి దాదాపు 20 నిమిషాల పాటు పరుగెత్తి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
తమిళనాడు చరిత్రలో తొలిసారిగా ఓ ముఖ్యమంత్రి ప్రజల మధ్యలో ఇంతసేపు మారథాన్లో పాల్గొనడం చర్చనీయాంశమైంది.
సీఎం విజయ్తో కలిసి పరుగెత్తేందుకు యువత, అభిమానులు పెద్దఎత్తున తరలివచ్చారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి.


