
నాగార్జునసాగర్ : సాగర్ వద్ద కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతుంది. 18 ఏళ్ల తర్వాత జూలై మాసంలో 26 రేడియల్ క్రస్ట్గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేయడం ఇదే మొదటిసారి.

సాగర్ ప్రాజెక్టు గేట్లు ఎత్తుతారని ఆయా మాధ్య మాల ద్వారా తెలుసుకున్న పర్యాటకులు మంగళవారం సాగర్ కు భారీగా తరలివచ్చారు.

ప్రాజెక్టు పరిసరాల్లో సెల్ఫీలు దిగుతూ సందడి చేశారు.

క్రస్ట్ గేట్ల నుంచి నీరు కిందకు దుమికే దృశ్యాలను తమ మొబైల్ కెమెరాల్లో బంధించారు.

























