
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందించనున్న గద్దర్ ఫిల్మ్ అవార్డులకి (Gaddar Film Awards) వేదిక ఖరారు అయింది

రాష్ట్ర ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ దిల్రాజు (Dil Raju) ఏర్పాట్లకు ప్రణాళికను రెడీ చేస్తున్నారు

సుమారు 14 ఏళ్ల తర్వాత ప్రభుత్వం ఇస్తున్న ఈ పురస్కారాల ఎంపిక కోసం జ్యూరీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే

జ్యూరీ ఛైర్మన్గా ప్రముఖ నటి జయసుధ (Jayasudha)తో పాటుగా 15మంది సభ్యులను ప్రభుత్వం ఏర్పాటు చేసింది

ఈమేరకు తాజాగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, దిల్రాజు, జయసుధ మీడియాతో మాట్లాడారు

జూన్ 14న హెచ్ఐసీసీ వేదికగా గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డుల ప్రదానోత్సవం కార్యక్రమం ఉంటుందని వారు ప్రకటించారు







